FIFA World Cup Revenue: ఈ ప్రపంచంలో అత్యంత ప్రజాధరణ పొందిన క్రీడలలో ఫుట్ బాల్ ముందు వరుసలో ఉంటుంది. దీనిని ప్రపంచంలో మెజారిటీ దేశాలు ఆడుతూ ఉంటాయి. అంతర్జాతీయ ఫుట్ బాల్ సమాఖ్య ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి ప్రపంచ కప్ నిర్వహిస్తూ ఉంటుంది. ఇందులో చాలావరకు దేశాలు పాల్గొంటాయి. ప్లేయర్లు నువ్వా నేనా తల పడుతూ ఉంటారు.
ప్రసార హక్కులు.. టోర్నీ నిర్వహణ.. టికెట్ల అమ్మకం.. ఇతర మార్గాల ద్వారా ఫుట్బాల్ సమాఖ్యకు భారీగా ఆదాయం వస్తూ ఉంటుంది. అయితే ఈసారి 6000 కోట్లకు మించి ప్రైజ్ మనీ ప్రకటించింది ఫిఫా. క్రిస్టియానో రోనాల్డో.. లియోనెల్ మెస్సి వంటి వారు ఈసారి చివరి టోర్నీ ఆడారు. వారికి చివరి ప్రపంచ కప్ కావడంతో ఈసారి మ్యాచ్ లను వీక్షించడానికి అభిమానులు భారీ సంఖ్యలో మైదానాలకు తరలివచ్చారు. తరలి రావడమే కాదు.. ఆదాయాన్ని కూడా సమకూర్చి పెట్టారు.
2022 లో జరిగిన ఫుట్బాల్ కప్ కంటే ఈసారి భారీగా ఆదాయం వచ్చింది. ఈ సంవత్సరం టికెట్ల అమ్మకాలు అద్భుతంగా జరిగాయి. టికెట్ ధరల్లో కూడా చాలా వ్యత్యాసం ఉండడంతో ఆదాయం భారీగా వచ్చింది. ఓ నివేదిక ప్రకారం 2026 లో 87 వేల కోట్ల ఆదాయం సమకూరింది. టికెట్ల అమ్మకాలు.. ప్రకటనల ద్వారానే 9 బిలియన్ డాలర్ల ఆదాయం వచ్చింది. ఇది ప్రపంచంలో ఇప్పటివరకు ఏ క్రీడా పోటీకి అయినా ఇదే అత్యధిక ఆదాయం.
ఈసారి మూడు దేశాలు సంయుక్తంగా ఫుట్బాల్ కప్ కు ఆతిథ్యం ఇచ్చాయి. అంతకుమించి అనే స్థాయిలో స్టేడియాలను రూపొందించాయి. మ్యాచ్లు కూడా నువ్వా నేనా అన్నట్టుగా సాగాయి. ఒకవేళ స్పెయిన్ జట్టు గనుక ఓడిపోయి ఉండి ఉంటే.. ఫుట్బాల్ నిర్వాహక కమిటీకి మరింత ఆదాయం వచ్చి ఉండేదేమో. ఈ స్థాయిలో ఆదాయం వస్తుందని ముందుగానే ఫుట్బాల్ నిర్వాహక కమిటీ అంచనా వేసింది. వచ్చిన ఆదాయాన్ని ఫుట్బాల్ విస్తరణకు ఉపయోగిస్తామని నిర్వాహక కమిటీ ప్రకటించింది. అయితే వచ్చే సీజన్లో ఈ స్థాయిలో టికెట్ అమ్మకాలు జరిగే అవకాశం లేదని విశ్లేషకులు చెబుతున్నారు. మెస్సి.. రోనాల్డో వంటి వారు చాలామంది అభిమానులను సంపాదించుకున్నారని.. వీరి చివరి టోర్నీ కావడంతో చాలామంది ప్రేక్షకులు మైదానాలకు వచ్చారు. అందువల్లే ఈ స్థాయిలో ఆదాయం సమకూరిందని నివేదికలు చెబుతున్నాయి.





