Homeఆధ్యాత్మికంRakhi Purnima 2024: రాఖీ పౌర్ణమి రోజు అద్భుతం.. ఈ నాలుగు రాశుల వారికి అదనపు...

Rakhi Purnima 2024: రాఖీ పౌర్ణమి రోజు అద్భుతం.. ఈ నాలుగు రాశుల వారికి అదనపు పండుగ.. ఏం చేసినా విజయమే..

Rakhi Purnima 2024: శ్రావణ మాసంతో పండుగల సీజన్ ప్రారంభం అవుతుంది. ఈనెలలో నాగుల పంచమి తరువాత వచ్చే పౌర్ణమిరోజు జరుపుకునేది రాఖీ పండుగ. అన్నా చెల్లెల్ల అనుబంధాన్ని తెలియజేస్తూ జరుపుకునే ఈ వేడుక కోసం చెల్లెళ్లు ఎదురుచూస్తు ఉంటారు. దూర ప్రాంతాల్లో ఉన్న చెల్లెళ్లు రాఖీ పండుగ రోజు సోదరులను కలుసుకునేందుకు వస్తుంటారు. అయితే రాఖీ పండుగ పౌర్ణమి రోజు వస్తుంంటుంది. కానీ ఈసారి వచ్చే పౌర్ణమి సాధరణమైంది కాదు. ఈరోజు బ్లూ మూన్ ఏర్పడబోతుంది. అంటే చంద్రుడు ఈరోజు అత్యంత ప్రకాశవంతగా కనిపిస్తుంటాడు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ బ్లూ మూన్ సందర్భంగా చంద్రుడు మకర రాశి నుంచి కుంభ రాశిలోకి ప్రవేశించనున్నాడు. దీంతో నాలుగు రాశుల వారిపై ప్రభావం ఉండనుంది. ఇప్పటి నుంచి ఆ రాశులు కలిగిన జీవితాలు మారబోతున్నాయి. ఇంతకీ ఆ రాశులు ఏవో తెలుసుకుందాం..

బ్లూమూన్ సందర్భంగా చంద్రుడు కుంభ రాశిలోకి ప్రశేశిస్తాడు. దీంతో మేష రాశి వారిపై ప్రభావం పడనుంది. ఈ రాశి వారికి ఇన్ని రోజులు ఉన్న కష్టాలు తొలగిపోతాయి. అనుకోకుండా ఆదాయం వస్తుంది. శ్రమ లేకుండా కొన్ని పనులు పూర్తవుతాయి. అదనంగా డబ్బు వచ్చి చేరుతుంది. కోర్టు కేసులు ఉంటే పరిష్కారం అవుతాయి. ఆస్తి వివాదాల నుంచి బయటపడుతారు. ఉద్యోగులు ప్రమోషన్లు పొందుతారు. వ్యాపారులు కొత్త పెట్టుబడులు పెట్టినట్లయితే వాటికి లాభాలు వస్తాయి.

రాఖీ పౌర్ణమి ప్రభావం ధనుస్సు రాశిపై పడనుంది. దీంతో ఈ రాశి వారు ఏ పని చేపట్టినా విజయమే వరిస్తుంది. ముఖ్యంగా వ్యాపారులకు అనుకూల సమయం. ప్రతీ పెట్టుబడి లాభదాయకమే. ఉద్యోగులు అదనపు ఆదాయం పొందుతారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. పెండింగ్ పనులు పూర్తి చేస్తారు. ఇంతకాలం కష్టాల్లో కూరుకుపోయిన వారు బయటపడుతారు.

మకర రాశిపై రాఖీ పౌర్ణమి ప్రభావం పడుతుంది. దీంతో దీర్ధకాలికంగా ఉన్న సమస్యలు తొలగిపోతాయి. అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. అదనంగా డబ్బు వచ్చి చేరుతుంది. కుటుంబంతో సంతోషంగా ఉంటారు. వ్యాపారులకు జీవిత భాగస్వామి మద్దతు ఉంటుంది. ఉద్యోగులు విహార యాత్రలకు ప్లాన్ చేస్తారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. అనుకోని అదృష్టం వచ్చి చేరుతుంది.

బ్లూ మూన్ సందర్భంగా కుంభ రాశి వారి జీవితాల్లో కొన్ని మార్పులు చోటు చేసుకోనున్నాయి. వీరు ఆర్థికంగా పుంజుకుంటారు. పెండింగ్ సమస్యలు పూర్తి చేస్తారు. దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం పొందుతారు. వ్యాపారులు ఎటువంటి పెట్టుబడులు పెట్టినా లాభాలు అధికంగానే వస్తాయి. వద్దన్నా డబ్బు వచ్చి చేరుతుంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.
RELATED ARTICLES

Most Popular