Homeఎంటర్టైన్మెంట్YS Bharathi- Sarkaru Vaari Paata: మహేష్ సినిమా పై జగన్ సతీమణి ప్రశంసలు

YS Bharathi- Sarkaru Vaari Paata: మహేష్ సినిమా పై జగన్ సతీమణి ప్రశంసలు

YS Bharathi- Sarkaru Vaari Paata: ‘సర్కారు వారి పాట’ సినిమాని చూడటానికి అభిమానులే కాదు, ప్రముఖులు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. సినిమా చూశాక, తమ అభిప్రాయాలను కూడా వెల్లడిస్తున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన సతీమణి భారతితో కలిసి ఈ సినిమాని వీక్షించారు. సినిమా చూసిన అనంతరం భారతి మీడియాతో మాట్లాడుతూ.. మహేష్ సినిమా పై ప్రశంసలు కురిపించారు. ఈ సందర్భంగా భారతి షాకింగ్ కామెంట్స్ చేశారు.

YS Bharathi- Sarkaru Vaari Paata
Bharathi, JAGAN

మహేష్ బాబు సినిమాలంటే తనకు చాలా ఇష్టమని, మహేష్ సినిమాలను తప్పకుండా చూస్తూ ఉంటాను అని భారతి తెలియజేశారు. ఇక సర్కారు వారి పాట సినిమా గురించి చెబుతూ.. ‘ఈ చిత్రాన్ని నేను ఇప్పుడే చూడటం జరిగింది. ఫ్యామిలీ ఆడియన్స్ ను ఈ సినిమా చాలా బాగా ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా డబ్బు విషయంలో ప్రస్తావించిన అంశాలు, అలాగే మహేష్ బాబు యాక్షన్ అద్భుతంగా అనిపించింది. ఈ సినిమా నాకు చాలా బాగా నచ్చింది’ అంటూ మహేష్ సినిమాపై జగన్ సతీమణి ప్రశంసలు కురిపించారు.

Also Read: AP Housing Scheme: ఆ మొత్తంతో ఇల్లు కట్టలేం.. తేల్చిచెబుతున్న లబ్ధిదారులు

అలాగే, ఈ సినిమాలో ఓ డైలాగ్ తనకు చాలా బాగా నచ్చింది అని, భారతి కామెంట్ చేయడం విశేషం. ఎన్నికలకు ముందు జగన్, తన ప్రచారంలో ‘నేను విన్నాను నేను ఉన్నాను’ అనే డైలాగ్ ను బాగా వాడారు. ఈ డైలాగ్ అప్పట్లో బాగా ఫేమస్ అయ్యింది. ఇదే డైలాగ్ ను ఈ సినిమాలో మహేష్ చేత చెప్పించాడు పరశురామ్. ఈ సినిమాలో ఈ డైలాగ్ తనకు చాలా బాగా నచ్చిందని భారతి తెలిపారు. ప్రస్తుతం సర్కారు పై జగన్ సతీమణి భారతి చెప్పిన రివ్యూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

YS Bharathi- Sarkaru Vaari Paata
YS JAGAN, Bharathi

ఇక ‘సర్కారు వారి పాట’ చిత్రానికి రూ.120 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. కాబట్టి.. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.120.5 కోట్ల వరకు షేర్ ను కలెక్ట్ చేయాలి. అయితే, నిన్నటి నుంచి కలెక్షన్స్ భారీగా పడిపోయాయి. కాబట్టి ఏ రకంగా చూసుకున్నా.. ఈ సినిమాకి 35 కోట్ల వరకు నష్టాలు తప్పేలా లేవు.

Also Read:Nivetha pethuraj: ఛాన్స్ లు రాకపోతే ఆ పనే చేస్తా.. హీరోయిన్ కన్నీళ్లు
Recommended Videos

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.
RELATED ARTICLES

Most Popular