spot_img
Homeజాతీయ వార్తలుEmployees: ఉద్యోగులు కదులుతున్నారు.. మళ్లీ ఊపు

Employees: ఉద్యోగులు కదులుతున్నారు.. మళ్లీ ఊపు

Employees: ప్రపంచాన్ని ఛిన్నాభిన్నం చేసిన కరోనాతో వివిధ రంగాలు కుదేలయ్యాయి. వైరస్ ప్రభావం ఐటీశాఖ పైనే భారీగా పడింది. కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఐటీ కంపెనీలో తమ ఉద్యోగులను ఇళ్ల నుంచే పనిచేయాలని చెప్పారు. దీంతో ఏడాదిన్నరగా ఐటీ ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం చేస్తున్నారు. ఇటీవల కరోనా కేసులు తగ్గుతున్న దృష్ట్యా ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులను ఆఫీసులకు రప్పించేందుకు ప్రణాళికలు వేస్తున్నారు. టీసీఎస్, హెచ్ సీఎల్, ఇన్ఫోసిస్ వంటి కంపెనీలు తిరిగి ఉద్యోగులను తమ కంపెనీలకు రప్పిస్తున్నాయి. అయితే కంపెనీలకు వచ్చే ఉద్యోగులకు వ్యాక్సినేషన్, ఆర్టీపీసీఆర్ నెగెటివ్ సర్టిఫికెట్ తప్పనిసరి చేస్తున్నాయి.

IT Emplyees
IT Emplyees

ప్రపంచ దేశాలతో పోటీపడుతున్న భారత్ కూడా ఐటీ రంగంలో దూసుకుపోతుంది. దేశంలో వివిధ ఐటీ కంపెనీలు కరోనా కారణంగా వర్క్ ఫ్రం హోం ను ప్రకటించాయి. లాక్టౌన్ కారణంగా మూతపడిన కంపెనీలు ఆ తరువాత సడలింపులో భాగంగా పనిని మొదలు పెట్టినా పరిమితంగానే కొనసాగిస్తున్నాయి. అయితే ఐటీ కంపెనీల్లో ఉద్యోగులు ఎక్కువగా ఉండడంతో పాటు ఏసీ వాతావరణంలో పనిచేయాల్సి ఉంటుంది. అందువల్ల కరోనా వ్యాప్తికి అవకాశం ఉందని భావించారు. దీంతో దాదాపు అన్ని కంపెనీలు వర్క్ ఫ్రం హోం ను ప్రకటించారు. దీంతో చాలా మంది ఉద్యోగులు ఇంటినుంచే పనిచేస్తున్నారు.

ఏడాదిన్నరగా ఉద్యోగులు ఇంటినుంచే పనిచేసినా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా ఉద్యోగులు ఇంట్లో పనిచేయడం వల్ల కుటుంబ సభ్యులు ఇబ్బంది పడ్డట్లు తెలిసింది. వర్క్ ఫ్రం హోం వల్ల తాము చాలా కష్టాలు ఎదుర్కొంటున్నామని కొందరు గృహిణులు పేర్కొన్నారు. ఇటీవల ఓ మహిళ తన భర్తను వెంటనే కార్యాలయానికి రప్పించాలని, తనకు సపర్యలు చేయడం నావల్ల కాదని తన గోడు వెల్లబోసుకుంది. ఇక ఉద్యోగులు సైతం ఇంట్లో వాతావరణంలో పనిచేయడం ఇబ్బందిగా మారిందని ఫీలవుతున్నారు.

ఈనేపథ్యంలో కంపెనీలు సైతం తమ ఉద్యోగులు కళ్లెదుటే లేకపోవడం వల్ల చాలా పనులు పెండింగ్ లో ఉన్నాయని భావిస్తున్నారు. దీంతో వర్క్ ఫ్రం హోంకు స్వస్తి చెప్పి ఉద్యోగులను కార్యాలయాలకు రప్పించేందుకు ప్రణాళిక వేస్తున్నారు. అయితే ఉద్యోగులు కార్యాలయాలకు రావాలంటే కంపెనీలు కొన్ని నిబంధనలను పెడుతున్నాయి. ముఖ్యంగా కరోనా పరీక్ష చేయించుకున్న నెగెటివ్ ధృవ పత్రం తప్పనిసరి చేశారు. మరోవైపు వ్యాక్సినేషన్ పూర్తి కావాలని సూచిస్తున్నారు. అయితే వ్యాక్సిన్ వేసుకోని వారు ఇప్పటికైనా మొదటి డోసు వేసుకోవాలని కంపెనీలు సూచిస్తున్నాయి.

భారత్లో పనిచేస్తున్న ఐటీ కంపెనీల్లో ఇప్పటికే చాలా మంది ఉద్యోగులు వ్యాక్సిన్ పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. టీసీఎస్ ఉద్యోగుల్లో 70 శాతం మంది వ్యాక్సినేషన్ చేయించుకున్నారు. 95 శాతం మంది మొదటి డోసు వేసుకున్ారు. అయితే వీరంతా స్పెషల్ డ్రైవ్ లో వ్యాక్సిన్ వేసుకున్నారు. రాను రాను కంపెనీలు వ్యాక్సినేషన్ తప్పని సరి చేయడంతో వీరంతా వ్యాక్సిన్ వేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పడే వంద శాతం ఉద్యోగులును అనుమతించేది లేదని అంటున్నారు. మరికొన్ని రోజులు కరోనా కేసులు ఇలాగే ఉంటే ఈ ఏడాది చివరి వరకు వంద శాతం ఉద్యోగులను కంపెనీలకు రప్పిస్తామని కంపెనీ యజమానులు అంటున్నారు.

ఇన్ఫోసిస్ లాంటి కంపెనీలు హైబ్రిడ్ వర్క్ మోడల్ వైపు చూస్తున్నామని అంటున్నారు. కరోనా మహ్మారి సమయంలో హైబ్రిడ్ వర్క్ మోడల్ పాపులర్ అయింది. అంటే కరోనా తీవ్రత కాస్త తగ్గిన నేపథ్యంలో వారానికి రెండు సార్లు కార్యాలయాలకు రప్పిస్తున్నారు. ఈ విధానం 18 నెలలుగా సాగుతోంది. ఇక హెచ్ సీఎల్ లాంటి కంపెనీల్లో కేవలం సీనియర్ ఉద్యోగులను మాత్రమే కార్యాయాలకు రప్పిస్తున్నారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Dharmendra Pradhan : ఇది విద్యార్థుల విజయం ప్రజాస్వామ్య విజయం

Dharmendra Pradhan : ప్రజాస్వామ్యంలో ప్రజల స్వరం, ముఖ్యంగా యువత గొంతు, పాలకులను నిర్ణయాలు మార్చుకునేలా చేయగలదని మరోసారి రుజువైంది. దేశవ్యాప్తంగా నీట్ పరీక్షల నిర్వహణపై వ్యక్తమైన అసంతృప్తి, వరుసగా ప్రశ్నాపత్రాల లీకేజీ...
OnePlus N6x

OnePlus N6x: ఒక్కసారి చార్జింగ్ చేస్తే 2.5 రోజుల బ్యాటరీ బ్యాకప్.. ధర రూ.20 వేల లోపే..

OnePlus N6x: ప్రస్తుత కాలంలో మొబైల్ వాడకం పెరిగిపోయింది.దీంతో బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ కావాలని వినియోగదారులు కోరుకుంటున్నారు. వీరికి అనుగుణంగా కొన్ని కంపెనీలు ప్రత్యేకంగా బ్యాటరీ బ్యాకప్ విషయంలో ఫోకస్ పెడుతున్నారు. ఇప్పటి...
POCO M8 Power

POCO M8 Power: కొత్త ఫోన్ వస్తుందని పోస్టర్ రిలీజ్ చేసిన కంపెనీ.. ఇది ఎలా ఉంటుందంటే..

POCO M8 Power: కొత్త ఫోన్ కొనాలని ఎదురుచూసేవారికి POCO కంపెనీ గుడ్ న్యూస్ తెలిపింది. అద్భుతమైన కెమెరాతో పాటు భారీ బ్యాటరీ బ్యాకప్, స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్ కలిగిన ఈ...
Honda CB500

Honda CB500: రాయల్ ఎన్ ఫీల్డ్ కు గట్టి పోటీ ఇచ్చే బైక్ ఇది..

Honda CB500: ఇప్పటి వరకు స్టైలిష్ తో పాటు స్పీడ్ బైక్ అనగానే ఎక్కువగా Royal Enfield గురించే మాట్లాడుకునేవారు. కానీ ఈ కంపెనీకి పోటీ ఇచ్చేందుకు చాలా కంపెనీలు రకరకాల...
Social Companionship

Social Companionship: మీకు ఓ తోడు కావాలా.. గంటకు ఇంత.. కొత్త ట్రెండ్

Social Companionship: సాటి మనిషి పక్కన ఉంటే మాట్లాడే అవకాశం లేదు. మాట్లాడాలి అని కూడా అనుకోవడం లేదు. కుటుంబ సభ్యుల మధ్య కూడా ఇటువంటి దూరమే కొనసాగుతోంది. స్మార్ట్ ఫోన్ మొత్తం...
Oktelugu Epaper