Home Blog Page 8596

సాన బుచ్చిబాబు ..శానా తెలివైనోడు

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ తేజ్ త్వరలో తెలుగు తెరఫై అరంగేట్రం చేయ‌బోతున్నాడు.ఉప్పెన పేరుకి తగ్గట్టు ఈ సినిమా ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేపుతోంది. ఈ అచ్చ తెలుగు చిత్రానికి సాన బుచ్చిబాబు ద‌ర్శ‌కుడు. అతనికిది దర్శకుడిగా తొలి చిత్రం. అయినప్పటికీ ఇంకా తొలి సినిమా విడుద‌ల కాక ముందే సాన బుచ్చిబాబు పేరు టాలీవుడ్లో చ‌ర్చ‌నీయాంశం అవుతోంది. అగ్ర ద‌ర్శ‌కుడు సుకుమార్ ద‌గ్గ‌ర చాలా ఏళ్ల పాటు శిష్య‌రికం చేసిన బుచ్చిబాబు..ఉప్పెన సినిమాతో దర్శ‌కుడిగా తన సత్తా చాటేందుకు రెడీ అయ్యాడు..

వైష్ణ‌వ్ తేజ్ హీరోగా తెరంగేట్రం చేస్తున్న ఈ చిత్రం లో నిత్యా శెట్టి అనే కొత్త‌మ్మాయి హీరోయిన్‌గా అరంగేట్రం చేస్తోంది..ఈ సినిమా మొద‌లైన‌పుడు ఎవరికీ పెద్ద అంచనాలు లేవు. కానీ.. ఇప్పుడు మంచి క్రేజ్ క‌నిపిస్తోంది. ఇందుక్కార‌ణం మొద‌ట్నుంచి చాలా ఆస‌క్తిక‌రంగా క‌నిపిస్తున్న ప్రోమోలే. ఉప్పెన అనే టైటిల్ పెట్టి దాన్ని డిజైన్ చేసిన తీరుతోనే బుచ్చిబాబు సక్సెస్ అయ్యాడు.ఆ .త‌ర్వాత హీరో హీరోయిన్ల ప్రి లుక్ పోస్ట‌ర్ల‌తో అందర్నీ ఆశ్చర్య పరిచాడు.

ఈ చిత్రం యొక్క ప్ర‌తి పోస్ట‌ర్ ప్రేక్ష‌కుల‌కు పాజిటివ్ ఫీల్ ఇస్తోంది. ఇక నీ క‌న్ను నీలి స‌ముద్రం అంటూ తొలి పాట వ‌చ్చాక ఉప్పెనపై అంచ‌నాలు ఒక్క‌సారిగా పెరిగిపోయాయి. ఆ పాట ఇన్‌స్టంట్ హిట్ట‌యింది. అందులో విజువ‌ల్స్ చాలా ఆహ్లాద‌క‌రంగా అనిపించాయి. తాజాగా రిలీజ్ చేసిన ధ‌క్ ధ‌క్ ధ‌క్ పాట‌లో ప్ర‌తి షాట్‌, ప్ర‌తి విజువ‌ల్ ద‌ర్శ‌కుడి అభిరుచిని చాటుతోంది.సంగీత సంచలనం దేవిశ్రీ ప్రసాద్ త‌న మొనాట‌న‌స్ ట్యూన్స్ అన్నీ ప‌క్క‌న పెట్టి స‌హ‌జ శ‌బ్దాల్ని ఉప‌యోగించుకుంటూ ఈ పాట‌ను ట్యూన్ చేసాడు. దానికి తోడు చ‌క్క‌టి లిరిక్స్, విజువ‌ల్స్ అన్నీ తోడై ఈ పాటని ఇన్ స్టాన్ట్ హిట్ చేశాయి.

మొత్తం మీద సాన బుచ్చిబాబు ఒక ప్రేమ కావ్యాన్ని ఆవిష్క‌రించే ప్ర‌య‌త్నం చేశాడ‌ని పిస్తోంది ఇప్ప‌టిదాకా వ‌చ్చిన ప్రోమోల్ని చూస్తే. హీరో, హీరోయిన్ లపై ఇప్పుడే ఓ అంచ‌నాకు రాలేం కానీ..దర్శకుడిగా త‌న అభిరుచిని చాటు కున్నాడు సాన బుచ్చిబాబు. ఈ ఊహాగానాలన్నిటికి తెర పడాలంటే ఏప్రిల్ 2 వ తారీకు దాకా మనం ఆగాలి.
First impression is best impression

ఆ నిపుణుల‌తో రూపొందనున్న రానా విరాటప‌ర్వం!

రానా, సాయిప‌ల్ల‌వి జంట‌గా వేణు ఊడుగుల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న రొమాంటిక్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ ‘విరాట‌ప‌ర్వం’‌. ఈ చిత్రాన్ని డి. సురేష్ బాబు, సుధాక‌ర్ చెరుకూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తుది ద‌శ‌కు చేరుకున్న ఈ సినిమాకి సంబంధించిన చివ‌రి షెడ్యూల్ త్వ‌ర‌లో ప్రారంభం కానుంది. కాగా, పిరియాడిక్ ఫిల్మ్ గా తెర‌కెక్కుతున్న ఈ సినిమా కోసం హాలీవుడ్ సాంకేతిక నిపుణులు ప‌నిచేస్తున్నారు. హాలీవుడ్ కెమెరామ్యాన్ డానీ సాంచెజ్ లోపెజ్ ఈ చిత్రానికి ఛాయాగ్ర‌హ‌ణం అందిస్తుండ‌గా… హాలీవుడ్ స్టంట్ డైరెక్ట‌ర్ స్టీఫెన్ రిచెర్ పోరాట‌ఘ‌ట్టాల‌కు యాక్ష‌న్ కొరియోగ్ర‌ఫీ స‌మ‌కూర్చుతుండ‌డం విశేషం. ఈ రెండు అంశాలు కూడా సినిమాకి ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ అవుతాయ‌ని చిత్ర వ‌ర్గాల స‌మాచారం.

‘రాధే’లో అదరగొట్టిన ప్రభాస్!

యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ తాజాగా రాధాకృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో నటిస్తున్నాడు. ఈమూవీలో ప్రభాస్ కు జోడీగా పూజా హెగ్డే నటిస్తుంది. బాలీవుడ్ నటి భాగ్యశ్రీ ప్రభాస్ తల్లిగా నటిస్తుంది. తాజాగా ఈ మూవీ షెడ్యూల్ యూర‌ప్‌లో జ‌రుగుతుంది. దీనిలో భాగంగా ఇంట‌ర్నేష‌న‌ల్ టెక్నీషియ‌న్స్ ఆధ్వర్యంలో ప్రభాస్ ఓ ఛేజింగ్ సీన్ చేసినట్లు సమాచారం. ఈ యాక్షన్ సన్నివేశంలో ప్రభాస్ నటన అద్భుతంగా ఉండబోతుందని సమాచారం. ఈ మూవీకి ‘రాధే’ అని టైటిల్ పరిశీలనలో ఉంది.

కరోనా వైరస్ కారణంగా విదేశాల్లో సినిమాల్లో షూటింగ్ లు వాయిదా పడుతూ వస్తున్నాయి. అయితే ప్రభాస్ చిత్రం త్వరోలనే యూర‌ప్‌లో లాంగ్ షెడ్యూల్ షూటింగ్ చేసేందుకు ప్లాన్ చేసింది. త్వరలో చిత్రబృందం యూరోప్ వెళ్లనుందని చిత్ర నిర్మాణ సంస్థ యువీ క్రియేష‌న్స్ పేర్కొంది. గోపీకృష్ణామూవీస్‌, యువీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్స్‌పై అత్యంత భారీ బడ్జెట్ తో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. 2020 ద‌స‌రా సెలవుల్లో సినిమాను విడుదల చేసేందుకు చిత్రబృందం సన్నహాలు చేస్తుంది.

ఈ మూవీ పూర్తికాగానే ప్రభాస్ దర్శకుడు నాగ్ అశ్విన్ మూవీలో నటించనున్నాడు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన ప్రకటనను దర్శకుడు అనౌన్స్ చేశారు. వైజయంతీ మూవీస్ బ్యానర్లో ఈ మూవీని భారీ బడ్జెట్లో తెరకెక్కించనున్నారు. సైంటిఫిక్ కథాంశంతో ఈ మూవీని నాగ్ అశ్విన్ తెరకెక్కించబోతున్నాడు. ప్రభాస్ ఇందులో సూపర్ హీరో తరహా క్యారెక్టర్లో నటిస్తాడని ప్రచారం జరుగుతుంది.

బిజినెస్ స్టార్ చేసిన ‘జెర్సీ’ భామ

‘జెర్సీ’ చిత్రంలో హీరోయిన్ నటించిన శ్రద్ధా శ్రీనాథ్ కొత్త జర్నీ ప్రారంభించింది. సినిమాల్లో బిజీగా ఉంటూనే మరో రంగంలో సత్తా చాటేందుకు సిద్ధమైంది. ‘పెర్ సే’ పేరుతో ఒక ఫుడ్ సెంటర్ ను ప్రారంభించింది. చెన్నైలో తన స్నేహితులతో కలిసి స‌లాడ్‌, కేఫ్ అన్నీ క‌లిసిన ఓ మాల్‌ను లాంచ్ చేసింది. శ్రద్ధాదాస్ ఈ విష‌యాన్ని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకుంది.

‘పెర్ సె’ ఫుడ్ సెంట‌ర్ గురించి శద్ధాదాస్ మాట్లాడుతూ ‘చెన్నైలో సలాడ్ బార్, కేఫ్‌ను లాంచ్ చేయడం సంతోషంగా ఉందని చెప్పింది. ‘పెర్ సె’ రెస్టారెంట్ కంటే చిన్న‌ది.. కేఫ్ కంటే పెద్ద‌దని.. అందులో మంచి ఫుడ్ ఐటమ్స్ దొరుకుతాయని చెప్పింది. తన జర్నీలో ఫుడ్తో మంచి అనుబంధం ఉందని పేర్కొంది. తాను క్లీన్‌, హెల్దీ లైఫ్ స్టైల్‌ను గ‌డ‌ప‌టానికి ఇష్ట‌ప‌డ‌తానని, అందుకే పెర్ సె నా హృద‌యానికి చాలా ద‌గ్గ‌రైందని ‘జెర్సీ’ భామ పేర్కొంది.

‘జెర్సీ’లో సారా క్యారెక్టర్లో శ్రద్ధాదాస్ నటించి మెప్పించింది. నాని జోడీగా ఆకట్టుకుంది. సారా పాత్రలో శ్రద్ధాదాస్ నటనకు యువత ఫిదా అయ్యారు. కన్నడకు చెందిన ఈ బ్యూటీ కన్నడంతోపాటు తెలుగు, తమిళంలో బీజీగా స్టార్ గా మారింది. ప్ర‌స్తుతం తెలుగులో ‘కృష్ణ అండ్ హిజ్ లీల‌’, త‌మిళంలో విశాల్ ‘చ‌క్ర‌’లోనూ న‌టిస్తుంది. కొత్త వ్యాపారం షూరు చేసిన శ్రద్ధాదాస్ కు అభిమానులు బెస్ట్ విషెష్ చెబుతున్నారు.

‘ఉప్పెన’ నుండి ధక్ ధక్ ధక్ సాంగ్ రిలీజ్

మెగా ఫ్యామిలీ నుంచి వస్తున్న కొత్త హీరో వైష్ణవ్ తేజ్ తొలి చిత్రం ‘ఉప్పెన’. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. మరోపక్క చిన్నగా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టింది చిత్రయూనిట్. దీనిలో భాగంగానే ఈ సినిమాకు సంబంధించిన పాటలు ఒక్కోటి విడుదల చేస్తున్నారు.

ఈ క్రమంలో మొదటి పాటగా విడుదల చేసిన నీ కన్ను నీలి సముద్రం అనే పాట ఇప్పటికే పది మిలియన్ల వ్యూస్ దక్కించుకుని యూ ట్యూబ్ ని షేక్ చేస్తోంది.చాలా రోజుల తరువాత దేవిశ్రీ ప్రసాద్‌ మార్క్‌కి తగ్గ సాంగ్ చేసాడనే చెప్పాలి. ఇప్పుడు తాజాగా ఉప్పెన మూవీ బృందం నువ్వూ నేను ఎదురైతే ధక్..ధక్..ధక్.. అనే పాటను రిలీజ్ చేశారు.

 

విశాఖ మునిసిపల్ ఎన్నికలలో జగన్ వెనుకడుగు!

పరిపాలన రాజధానిగా విశాఖపట్నంను ప్రకటించి, మొత్తం ప్రభుత్వ పాలనా యంత్రాంగాన్ని ఇక్కడకు తీసుకు రావడం ద్వారా ఉత్తరాంధ్ర ప్రజల అభిమానం చూరగొనాలని ప్రయత్నం చేస్తున్న ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి విశాఖపట్నంలో మునిసిపల్ ఎన్నికలు జరపడం పట్ల వెనుకడుగు వేయడం రాజకీయ వర్గాలలో విస్మయం కలిగిస్తున్నది.

విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సర్వసన్నాహాలు చేసినప్పటికీ గెలుపు పట్ల అనుమానం రావడంతోనే చివరి క్షణంలో సాంకేతిక సాకులు చూపుతూ ఎన్నికలను వాయిదా వేసిన్నట్లు కనిపిస్తున్నది. గత అసెంబ్లీ ఎన్నికలలో నగరంలోని నాలుగు అసెంబ్లీ స్థానాలను టిడిపి గెలుచుకోవడంతో అధికార పక్షంలో ఒకింత ఓటమి భయం వ్యక్తం అవుతున్నది.

పరిపాలనా రాజధానిగా విశాఖను ప్రకటించిన నేపథ్యంలో మేయర్‌ పీఠం దక్కించుకోవడాన్ని ప్రతిష్టాత్మకంగా భావించడంతో ఒకవేళ ఏదైనా తేడా జరిగితే పరువు పోతుందనే ఆందోళన ఆ పార్టీలో వ్యక్తమవుతున్నది. పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటు, ఎన్నికల సామగ్రి తరలింపు, రిటర్నింగ్‌ అధికారుల నియామకం, శిక్షణ, వార్డుల రిజర్వేషన్ల ఖరారు వంటి ప్రక్రియలన్నీ పూర్తయిన తర్వాత ఎన్నికలు వాయిదా పడటం గమనార్హం.

ఎట్లాగైనా విశాఖపట్నం నగర పాలిక సంస్థపై పార్టీ జెండాను ఎగురవేయడం కోసం విడిగా ఎన్నికలు జరిపితే సర్వ శక్త్యుక్తులను ధారపోయవచ్చనే ఆలోచనలో ఉన్నారు. నగరంలో పార్టీ పరిస్థితి కూడా అంతంత మాత్రంగా ఉండడంతో ఇప్పుడు ఎన్నికలు జరిగితే గెలుపుఅనుమానంతో ఉన్నట్లు తెలుస్తున్నది. ఈ లోగా టిడిపి నుండి మరొకొందరు బలమైన నాయకులను సహితం ఆకర్షింప వచ్చని భావిస్తున్నారు.

పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి మొదటి నుండి విశాఖపట్నంపై ప్రత్యేక ద్రుష్టి సారిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని స్థానిక సంస్థలతోపాటు ఎన్నికలు జరిపితే జీవీఎంసీపై ప్రత్యేక దృష్టిసారించేందుకు అవకాశం వుండదని అధికార పార్టీ నేతలు భావిస్తున్నారు.

ప్రస్తుతం శివారు ప్రాంత ఎమ్మెల్యేలంతా ఎవరికి వారు తమ పరిధిలోని ఎంపీటీసీ, జడ్పీటీసీ, పంచాయతీ ఎన్నికల్లో తలమునకలై వుంటారని, అందువల్ల ఇలాంటి సమయంలో కాకుండా జీవీఎంసీకి ప్రత్యేకంగా ఎన్నికలు నిర్వహిస్తే జిల్లాలోని ఇతర ఎమ్మెల్యేలతోపాటు ఇతర జిల్లాల మంత్రులను కూడా తీసుకుచ్చి జీవీఎంసీలో పాగా వేసేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తున్నది.

ఫ్యామిలీతో ఎన్టీఆర్ హోలీ సెలబ్రేషన్స్..

https://www.instagram.com/p/B9imwRwDYEI/

క‌రోనా భ‌యం వ‌ల‌న హోలీ హంగామా కాస్త త‌గ్గిన‌ప్ప‌టికీ, కొన్ని చోట్ల మాత్రం ఈ వేడుక‌లు ఘ‌నంగానే జరుగుతున్నాయి. కొంద‌రు నిన్న హోలీని జ‌రుపుకోగా, మ‌రి కొంద‌రు నేడు జ‌రుపుకుంటున్నారు. ఈ సందర్భంగా సినీ సెలబ్రిటీలు… హోలీ శుభాకాంక్షలు చెబుతున్నారు.

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ త‌న ఫ్యామిలీతో క‌లిసి హోలీ వేడుక జ‌రుపుకున్నాడు. భార్య ల‌క్ష్మీ ప్ర‌ణ‌తి, కుమారులు అభ‌య్ రామ్‌, భార్గ‌వ్ రామ్‌ల‌తో క‌లిసి ఉన్న ఫొటోను షేర్ చేస్తూ అంద‌రికీ హోలీ విషెస్ తెలిపారు తార‌క్‌. ఫ్యామిలీ స‌భ్యులు అంద‌రు ఇలా ఒకే ఫ్రేములో క‌నిపించ‌డం చూసిన ఫ్యాన్స్ ఆనందానికి హ‌ద్దులు లేకుండా పోయాయి. ప్ర‌స్తుతం ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చిత్రంతో బిజీగా ఉన్న సంగ‌తి మనకు తెలిసిందే.

కాంగ్రెస్ కు హ్యాండిచ్చిన జ్యోతిరాదిత్య సింథియా

మధ్యప్రదేశ్‌లో నిమిషానిమిషానికి రాజకీయం మారుతోంది. మధ్యప్రదేశ్‌లోని ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు జ్యోతిరాదిత్య సింథియా ఆ పార్టీకి రాజీనామా చేయడం సంచలనంగా మారింది. 18 ఏళ్లుగా కాంగ్రెస్ సభ్యుడిగా ఉన్న తాను ప్రస్తుతం పార్టీని వీడాల్సిన సమయం వచ్చిందని తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖను కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి ట్వీటర్లో పంపారు. ఆ తర్వాత నేరుగా ఆయన ప్రధాని నివాసానికి వెళ్లడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.

మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వానికి కూల్చేందుకు మోడీ-అమిషాలు జ్యోతిరాదిత్యతో చర్చించినట్లు తెలుస్తోంది. జ్యోతిరాదిత్య వెంట కొంతమంది ఎమ్మెల్యేలు నడిచేందుకు సిద్ధంగా ఉన్నారు. 16 మంది ఎమ్మెల్యేలతో ఆయన బీజేపీలో చేరుతారనే ప్రచారం జరుగుతుంది. కొద్ది సేపటి క్రితమే ఆయన ప్రధాని మోదీ నివాసానికి వెళ్లడం ఈ ప్రచారానికి బలాన్ని చేకూరుస్తుంది. అయితే ఆయన పార్టీకి రాజీనామా చేయడానికి ముందే సోనియాగాంధీ ఆదేశంతో కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. సింథియాను రాజ్యసభకు పంపుతామని బుజ్జగించే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. అయితే వీరిమధ్య చర్చలు విఫలమైనట్లు సమాచారం.

దీంతో కాంగ్రెస్ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని జ్యోతిరాదిత్య సింగ్ ను కాంగ్రెస్ అధిష్టానం బహిష్కరించింది. అయితే అంతకముందే జ్యోతిరాదిత్య సింగ్ పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం అమిషాతో కలిసి మోడీ నివాసానికి వెళ్లారు. దీనిపై కాంగ్రెస్ నాయకులు స్పందిస్తూ మధ్యప్రదేశ్‌లో తమ ప్రభుత్వానికి వచ్చిన ఢోకాలేదని చెబుతుంది.

జ్యోతి ఆదిత్యా కాంగ్రెస్ పార్టీకి హ్యండ్ ఇవ్వడంతో అధిష్టానం దిద్దుబాటు చర్యలు చేపడుతుంది. 16మంది ఎమ్మెల్యేలు సింథియా వెంట నడుస్తుండటంతో మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీలో పడనుంది. తాజా పరిణామాలతో బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతుండగా కాంగ్రెస్ పార్టీలో భయాందోళన కలిగిస్తోంది. ఈ సంక్షోభాన్ని కాంగ్రెస్ పార్టీ ఎలా ఎదుర్కొంటుందో చూడాలి మరీ.

ప‌వ‌న్ డ‌బుల్ ధ‌మాకా.. రికార్డు రిపీట్ చేస్తాడా..?

వేస‌వికి విడుద‌ల కాబోతున్న ‘వ‌కీల్ సాబ్’ తో రీ-ఎంట్రీ ఇస్తున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్. ఇదే ఏడాది మ‌రో సినిమాతో అలరించనున్నాడు. క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ పిరియాడిక్ ఫిల్మ్ దీపావ‌ళి కానుక‌గా సంద‌డి చేయ‌నుంద‌ని స‌మాచారం.అయితే 2020లో ప‌వ‌న్ డ‌బుల్ ధ‌మాకా ఇవ్వ‌బోతున్నాడ‌న్న‌మాట‌.

ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమిటంటే ప‌వ‌న్ త‌న కెరీర్ లో ఇప్ప‌టివ‌ర‌కు నాలుగు సార్లు డ‌బుల్ ధ‌మాకా ఇచ్చిన సంవ‌త్స‌రాలు ఉన్నాయి. 1998లో ‘సుస్వాగతం’, ‘తొలిప్రేమ‌’, 2006లో ‘బంగారం’, ‘అన్న‌వ‌రం’, 2011లో ‘తీన్ మార్’, ‘పంజా’, 2012లో ‘గ‌బ్బ‌ర్ సింగ్’, ‘కెమెరామెన్ గంగ‌తో రాంబాబు’. ఇలా నాలుగుసార్లు డ‌బుల్ ధ‌మాకా ఇచ్చాడు ప‌వ‌న్. 8 ఏళ్ళ త‌రువాత మ‌ళ్ళీ ఈ సంవత్సరంలో రెండేసి సినిమాల‌తో రాబోతున్నాడు. 1998లో రెండు బ్లాక్ బ‌స్ట‌ర్స్ చూసిన ప‌వ‌న్.. 22 ఏళ్ళ అనంత‌రం అదే మ్యాజిక్ ని రిపీట్ చేస్తాడేమో చూడాలి.

యస్ బ్యాంక్ కు ప్రియాంక గాంధీకి సంబంధం ఏంటీ?

యస్ బ్యాంక్ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడంతో భారతీయ రిజర్వు బ్యాంక్ రంగంలోకి దిగింది. యస్ బ్యాంక్ కార్యకలాపాలపై ఆంక్షలు విధించింది. ఈ బ్యాంకు బోర్డును ఆర్బీఐ 30రోజులపాటు సస్పెండ్ చేసింది. విత్ డ్రాలను 50వేలకు మించి చేయరాదని ఆంక్షలు ఉండటంతో ఈ బ్యాంకులు డబ్బులు దాచుకున్న ఖాతాదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇది ప్రయివేట్ బ్యాంక్ కావడం, వడ్డీలు ఎక్కువగా ఇస్తుండటం, మనీ దాచుకున్న వారి వివరాలను గోప్యంగా ఉంచడంతో యస్ బ్యాంకులో ఇబ్బడిముబ్బడిగా ఖతాదారులు పెరిగిపోయారు. ఇందులో ఎక్కవుగా సెలబ్రెటీలు, ధనవంతులకు చెందిన వారి ఖాతాలే ఎక్కువగా ఉండటం విశేషం.

యస్ బ్యాంకులో నెలకొన్న సంక్షోభం నేపథ్యంలో రాణా కపూర్, ఆయన కుటుంబ సభ్యులు, ఇతరులపై సీబీఐ, ఈడీ దర్యాప్తు జరుపుతోంది. ఇందులో భాగంగా రాణా కపూర్ కు చెందిన రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ చిత్రాలను ఈడీ స్వాధీనం చేసుకుందని సమాచారం. 2010సంవత్సరంలో రాజీవ్ గాంధీ చిత్రాన్ని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ తన చేత బలవంతంగా 2కోట్లకు విక్రయించారని ఈడీకి స్టేట్ మెంట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. నాటి యూపీయే ప్రభుత్వం తనపై ఒత్తిడితోనే తన కుటుంబ సభ్యుల ఇష్టానికి వ్యతిరేకంగా ఈ చిత్రాలను కొనుగోలు చేసినట్లు ఆయన చెప్పినట్లు సమాచారం.

రాజీవ్ గాంధీ పెయింటింగ్‌‌ను ఎం.ఎఫ్. హుస్సేన్ చిత్రీకరించారు. కాంగ్రెస్ పార్టీ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా దీనిని 1985లో రాజీవ్ గాంధీకి ఎం.ఎస్. హుస్సేన్ బహూకరించారు. ఈ పెయింటింగ్ నే యస్ బ్యాంక్ వ్యవస్థాపకుడు రాణా కపూర్ 2010లో కొనుగోలు చేశారు. తాజా బ్యాంకు సంక్షోభం నేపథ్యంలో రాజీవ్ గాంధీ పెయిటింగ్ వ్యవహారం బయటికి వచ్చింది. తనకు ఇష్టంలేకుండా బలవంతంగా ప్రియాంక గాంధీ విక్రయించారని రాణా కపూర్ చెప్పడంతో ఈ వ్యవహారం కాస్తా రాజకీయంగా దూమారం రేపుతోంది. ఇప్పటికే ఈ బ్యాంక్ వ్యవహారంలో పెద్ద మొత్తంలో ఎగవేసిన వ్యవహారంలో అనిల్ అంబానీ, ఎస్ఎల్ గ్రూప్ అధినేత సుభాష్ చంద్ర పేర్లు ప్రముఖంగా విన్పిస్తున్నాయి. తాజాగా ఈ వ్యవహరంలోకి ప్రియాంక గాంధీ పేరుచేర్చడంతో ఇది రాజకీయరంగు పులుముకుంటుంది.

ఇదిలా ఉండగా మరో వారం రోజుల్లో బ్యాంకు కార్యకలాపాలు సాధారణ స్థితికి చేరుకుంటాయని బ్యాంక్ ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఖాతాదారులు తమ సొమ్మును విత్‌డ్రా చేసుకోవడంపై విధించిన ఆంక్షలను కూడా త్వరలోనే తొలిగిపోతాయని చెబుతున్నారు. ఇప్పటికే యస్ బ్యాంక్ పై ఆంక్షల నేపథ్యంలో ఖాతాదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఖాతాదారుల మనీకి కేంద్రం ప్రభుత్వం పూచీకత్తుగా ఉంటామని ప్రకటిస్తున్నప్పటికీ ఖాతాదారులు మాత్రం బెంబేలెత్తిపోతున్నారు. యస్ బ్యాంక్ వ్యవహారం రోజురోజుకు ఓ కీలక మలుపు తిరుగుతుండటం ఆసక్తిని రేపుతోంది.

ఏచూరి రాజ్యసభ ఆశలకు సిపిఎం చెక్!

పార్టీ నీయమవళిని కాలదన్ని కాంగ్రెస్ తో చేతులు కలిపి మరోసారి రాజ్యసభకు వెళ్ళడానికి ప్రయత్నం చేసిన సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆశలకు సొంత పార్టీయే కళ్లెం వేసింది. అందుకు పార్టీ రాజ్యాంగం ఒప్పుకోదని, అందుకు తాము సిద్ధంగా లేమని పార్టీ అత్యున్నత మండలి అయిన పొలిట్ బ్యూరో నిర్మొహమాటంగా తేల్చి చెప్పింది.

సొంతంగా పార్టీకి బలం లేక పోయినా పశ్చిమ బెంగాల్ నుండి ఆయనను రాజ్యసభకు పంపాలని పార్టీలో ఒక వర్గం చేసిన ప్రయత్నాలకు ఫిబ్రవరి 6 న జరిగిన పార్టీ అత్యున్నత విధాయక నిర్ణయాత్మక మండలి అయిన పొలిట్ బ్యూరో తిప్పి కొట్టింది. కేరళ వర్గం నేతలు డామినేట్ చేస్తున్న పొలిట్ బ్యూరో ఏచూరికి నామినేట్‌ను ఒప్పుకోలేదు.

ఈ సందర్భంగా రెండు అభ్యంతరాలు తెరపైకి వచ్చాయి. మొదటగా ఇప్పటి వరకు పార్టీలో రెండు సార్లకు మించి ఎవ్వైర్ని రాజ్యసభకు పంపలేదు. ఇప్పటికే రెండు సార్లు ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. అదీ గాక పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నవారెవ్వరు ఇప్పటి వరకు రాజ్యసభ సభ్యత్వం పొందలేదు. ఈ నిబంధనలను తోసిరాజేసి రాజ్యసభకు వెళ్లాలన్న ఆయన ప్ప్రయత్నం సాగిన్నట్లు లేదు.

మరోవంక పార్టీకి సొంతంగా బలం లేని పశ్చిమ బెంగాల్ నుండి
కాంగ్రెస్ మద్దతుతో రాజ్యసభకు వెళ్లే ప్రయత్నాన్ని పార్టీ తప్పుబట్టింది. విరుద్ధ భావజాలమున్న పార్టీల మద్దతును తీసుకోవడం ఏమాత్రం సరికాదని హెచ్చరించింది.

అటు తృణమూల్‌ను, బీజేపీని రాజ్యసభలో తట్టుకోవాలంటే ఏచూరీని మూడోసారి కూడా రాజ్యసభకు నామినేట్ చేయాల్సిందేనని కాంగ్రెస్ లో ఒక వర్గం కూడా తీవ్రంగా ప్రయత్నం చేయడం గమనార్హం. గతంలో ఒక సారి కూడా కాంగ్రెస్ ఈ విషయమై తీవ్ర ప్రయత్నం చేసినా, పార్టీ నాయకత్వం ఒప్పుకోక పోవడం గమనార్హం.

Sonarika Bhadoria Hot Photos

Shraddha Das Glamorous Pics

బెంగాల్ పై రంగంలోకి దిగుతున్న మోదీ

ఇప్పటి వరకు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వ్యూహరచన విషయంలో అమిత్ షా, ఇతర నేతలు కీలకంగా వ్యవహరిస్తూ ఉండేవారు. కానీ వరుసగా ఒకొక్క రాష్ట్రంలో ఎదురవుతున్న పరాజయాల దృష్ట్యా పశ్చిమబెంగాల్‌లో ఈ ఏడాదిలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బిజెపి ప్రచార వ్యూహన్ని రూపొందించడంలో ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా రంగంలోకి దిగుతున్నట్లు కనిపిస్తున్నది.

ముందుగా పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఆ రాష్త్రానికి చెందిన పార్టీ ఎంపీలు, ఇతర ముఖ్యనేతలతో విడివిడిగా సమాలోచనలు జరుపుతూ, ఒకొక్క లోక్ సభ నియోజకవర్గ పరిధికి సంబంధించి సవివరంగా సమాలోచనలు జరుపుతున్నారు. అక్కడి రాజకీయ పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

ఒక పక్క బడ్జెట్ సమావేశాలు జరగుతుండగా మరోవంక ఆ రాష్ట్ర బిజెపి ఎంపిల్లో ఒక్కొక్క ఎంపితో వేర్వేరుగా చర్చిస్తున్నారు. తమ ప్రభుత్వ పథకాలపై పేరుప్రతిష్టలు తెచ్చే అభిప్రాయాలను సేకరిస్తున్నారు. వీటన్నిటినీ సమీకరించి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారానికి దిగాలన్నదే ప్రధాని అభిప్రాయంగా కనిపిస్తున్నది.

2019 లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 42 స్థానాల్లో బిజెపి 18 స్థానాలను చేజిక్కించుకోవడం తెలిసిందే. అదే ఊపులో మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని గద్దెదించి, బిజెపిని అధికారమలోకి తీసుకు రావాలని పట్టుదలతో ఉన్నారు. హిందుత్వ వాదం ఆధారంగా మైనార్టీ అనుకూల తృణమూల్ వైఖరిని ఎండగట్టడమే కాకుండా, రాష్ట్ర ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపి రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకోవాలన్నది బిజెపి లక్షంగా పెట్టుకుంది.

ఈ నేపథ్యంలో ప్రతి ఎంపిని కలుసుకుని రాజకీయ, అబివృద్ధి అంశాలపై వారితో చర్చించాలని మోడీ నిర్ణయించినట్టు పశ్చిమబెంగాల్ బిజెపి అధ్యక్షుడు దిలీప్‌ఘోష్ చెప్పారు. ఎన్నికల్లో గెలవాలంటే ఏది అవరసరం అని ఆరా తీస్తున్నారని చెబుతున్నారు.

మరోవంక, ఏప్రిల్ తరువాత ప్రతి నెల మూడుసార్లయినా రాష్ట్రంలో పర్యటిస్తానని అమిత్‌షా హామీ ఇచ్చారని ఘోష్ చెప్పారు. వచ్చే సంవత్సరం కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, అసోం రాష్ట్రాలతోపాటు పశ్చిమబెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

యస్‌ బ్యాంక్‌ సంక్షోభంతో ఇబ్బందుల్లో ఏపీ ఆర్టీసీ!

దేశవ్యాప్తంగా కలకలం రేపిన యస్‌ బ్యాంక్‌ వ్యవహారం ఏపీలో ఆర్టీసీని సహితం చిక్కులలో పడవేసింది. అధిక వడ్డీలకు ఆశపడి ఆ బ్యాంకులో దాచుకున్న రూ 240 కోట్ల మేరకు ప్రస్తుతం బ్యాంకులో నెలకొన్న సంక్షోభం కారణంగా చిక్కుకు పోవడంతో రోజువారీ ఖర్చులకు సహితం ఇబ్బంది పడవలసిన పరిస్థితి ఏర్పడింది.

ప్రతి నెలా ఓవర్ డ్రాఫ్ట్ తో గాని జీతాలు చెల్లించలేని దుస్థితిలో ఉన్న ఆర్టీసీకి గత జనవరి నుండి రాష్ట్ర ప్రభుతం ఉద్యోగుల జీతాలు చెల్లిస్తూ ఉండడంతో కొంత ఉపశమనం కలిగింది. దానితో రోజువారీ రాబడులను బ్యాంకులో దాచుకొంటున్నారు.

రోజువారి చెల్లింపుల్లో భాగంగా సోమవారం ఉదయం బ్యాంకుకు వెళ్లిన అధికారులకు బ్యాంకు సిబ్బంది ఇచ్చిన సమాధానం తో దిమ్మతిరిగింది. ‘మీ అకౌంట్‌ నుంచి 50వేల రూపాయలకు మించి తీసుకోవడం సాధ్యం కాదు’ అని చెప్పడంతో అధికారులు ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తెచ్చారు. డీజిల్‌ కొనుగోలుకు డబ్బులు ఎలా సర్దుబాటు చేయాలన్న ఆందోళన వారిలో మొదలైంది.

జనవరి నెలకు సంబంధించిన జీతం ప్రభుత్వం ఆర్టీసీకి ఫిబ్రవరిలో చెల్లించింది. ఈ డబ్బుల్లో నుంచి రూ.120 కోట్లు యస్‌ బ్యాంకులోని ఆర్టీసీ ఖాతా లో జమ అయింది. దీంతోపాటు రోజువారీ కలెక్షన్ల డబ్బులు రూ.80కోట్లు ఏ రోజుకు ఆరోజు డిపాజిట్‌ చేశారు. సిబ్బంది జీతాల నుంచి రికవరీ చేసిన మరో రూ 40 కోట్లను కూడా ఇదే బ్యాంకులోని పీఎఫ్‌ ఖాతాకు బదిలీ చేశారు.

దీంతో మార్చి మొదటి వారం ముగిసే నాటికి మొత్తం రూ.240 కోట్లు యస్‌ బ్యాంకులో నిల్వఉంది. ఈ పరిస్థితుల్లో బ్యాంకు ఆర్థిక ఇబ్బందుల్లో పడటం, ఖాతాదారులు ఏటీఎంలకు క్యూ కట్టడంతో పరిస్థితి చేయిదాటి పోయింది.

ఎస్‌బీఐ లాంటి బ్యాంకులు డిపాజిట్లకు తప్ప కరెంట్‌ అకౌంట్లకు వడ్డీ చెల్లించవు. యస్‌ బ్యాంకు అధికారులు ఆర్టీసీ అధికారులను సంప్రదించి కరెంట్‌ అకౌంట్‌ తమవద్ద ప్రారంభించాలని, రోజువారీ వడ్డీ చెల్లిస్తామని, అది కూడా 6.25శాతం ఇస్తామని ఆశ పెట్టడంతో వందల కోట్ల రూపాయలు అకౌంట్లో జమ చేశారు. ఇప్పుడు అసలుకే ముప్పు రావడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు.

టిడిపితో వామపక్షాల పొత్తుకు సిపిఎం మోకాలడ్డు!

వైసిపి ప్రజాకంటక పరిపాలనను నిరసిస్తూ రెండు వామపక్షాలు టిడిపితో కలసి ప్రస్తుతం జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీ చేయాలని సిపిఐ చేస్తున్న ప్రయత్నాలకు సిపిఎం మోకాలడ్డుతున్నది. ఈ విషయమై టిడిపి అధినేత చంద్రబాబునాయుడును ఇప్పటికే సిపిఐ నేతలు రామకృష్ణ, ముప్పాళ్ల నాగేశ్వరరావు తదితరులు కలిసి సమాలోచనలు జరిపారు.

సిపిఎం తో కలసి చర్చలు జరిపిన తర్వాత మూడు పార్టీల నాయకులు కలసి పొత్తు గురించి ప్రకటన చేస్తారని సిపిఐ నాయకులూ ప్రకటన కూడా చేశారు. కానీ ఇంతలో తాము టీడీపీ, వైసిపికి సమదూరంలో ఉంటామని సిపిఏం రాష్ట్ర కార్యదర్శి పి మధు ప్రకటించడం ద్వారా టిడిపితో వామపక్షాల పొత్తుకు విముఖత వ్యక్తం చేశారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో టిడిపి, వైసిపితో పొత్తు ఉండబోదని స్పష్టం చేస్తూ వామపక్షాలు, ఆమ్‌ ఆద్మీ పార్టీ, దళిత, గిరిజన, మైనార్టీ సంఘాలు కలిసి పోటీ చేయనున్నట్లు మధు ప్రకటించారు. దానితో సిపిఐ ఒంటరిగా టిడిపితో పొత్తు పెట్టుకొంటుందా, లేదా సిపిఎం తో కలసి ఉనికి లేని పార్టీలు, సంఘాలతో చేతులు కలుపుతుందా చూడవలసి ఉంది.

2019 ఎన్నికలలో సహితం ఉభయ కమ్యూనిస్టులం కలసి జనసేనతో పొత్తు పెట్టుకుందామని సిపిఐ ప్రతిపాదిస్తే సిపిఎం విముఖత వ్యక్తం చేసింది. వైసిపి నేత విజయసాయిరెడ్డితో ఉన్న బంధుత్వంతో ఆ పార్టీతో పొత్తుకు మధు సిద్దపడిపోయారు. అయితే ఎన్నికలు దగ్గరకు వచ్చే సరికి జగన్ బిజెపితో లోపాయికారి అవగాహనకు వచ్చారని గ్రహించి, విధిలేని పరిష్టితులలో చివరిలో జనసేనతో పొత్తుకు సిద్దపడవలసి వచ్చింది. అయితే ఆ పొత్తు ఆశించిన ఫలితం ఇవ్వలేదు.

ఆంధ్రా స్థానిక ఎన్నికల్లో రెండో స్థానానికే పోటీ

ఆంధ్రాలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగింది. ఒకేసారి పంచాయతీ, మునిసిపల్ ఎన్నికలు నిర్వహించటం ఎన్నికల కమిటీకి కత్తిమీదసాములాంటిదే. అలాగే రాజకీయపార్టీలకు కూడా. జగన్ ప్రభుత్వపు ఈ 9 నెలల పనితీరుపై దీన్ని ప్రజా తీర్పుగా చెప్పొచ్చు. అలాగే ఇది గత 9 నెలల చంద్రబాబు నాయుడి రాజకీయ కార్యకలాపాలపై కూడా తీర్పే. జగన్ అధికారం లోకి వచ్చిన వెంటనే చంద్రబాబు నాయుడు వ్యతిరేక కార్యకలాపాలు మొదలుపెట్టటం వ్యూహాత్మక తప్పిదం. ఏ ప్రభుత్వానికైనా కనీసం ఒక సంవత్సరం టైమివ్వాలి. ఆ తర్వాత మాట్లాడితే జనం వింటారు. అంతేగానీ ఓడిపోయిన వెంటనే కొత్త ప్రభుత్వం తప్పిదాలను వెతకటం మొదలుపెడితే జనం హర్షించరు. ఇది జనం తరఫున మాట్లాడినట్లు ఉండదు. అక్కసు పట్టలేక మాట్లాడినట్లు వుంటుంది. కాకపోతే మీడియా అండచూసుకొని ముందుగానే రోడ్డునపడటం తప్పుడు సంకేతాలు ఇచ్చినట్లయింది. ఇంత హైప్ కి తీసుకెళ్లి ఎన్నికల్లో చతికల పడితే వచ్చే నాలుగు సంవత్సరాల్లో ఏమి మాట్లాడినా ప్రజల్లో విశ్వసనీయత ఉండదు. చంద్రబాబునాయుడు రాజకీయ అనుభవం ఈ మాత్రం అర్ధంచేసుకోవటానికి ఉపయోగపడలేదంటే కెసిఆర్ చెప్పినట్లు ఎక్కడో నాయకత్వ లక్షణం కొరవడిందనిపిస్తుంది. నాయకుడికి కావాల్సింది అనుచరుల ఆవేశంతో తాను నడవటం కాదు తన దూరదృష్టితో పార్టీని నడపటం. మీడియా అండతో ప్రజల అభిప్రాయాల్ని మలచటం పాత పద్దతి. ప్రజలు చాలా ముందున్నారు. ఏది రైట్ ఏది రాంగ్ వాళ్లకు వాళ్ళే నిర్ణయించుకుంటున్నారు. 21వ శతాబ్దపు ఆలోచనలను ఆకళింపు చేసుకోకుండా పాత పద్దతిలోనే రాజకీయాలు నడపటం కష్టం. మొత్తమ్మీద చూస్తే చంద్రబాబు నాయుడు వ్యూహం బెడిసికొట్టిందనే చెప్పాలి.

ఇప్పుడు పోటీ జగన్ కి చంద్రబాబు నాయుడుకి కాదు. నా అంచనా ప్రకారం జగన్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల తరహాలో ఈ ఎన్నికల్లోనూ పూర్తి ఆధిక్యత ప్రదర్శించటం ఖాయం. ఇది చంద్రబాబు నాయుడుకి పెద్ద దెబ్బే. దీనితో క్యాడర్ లో నైరాశ్యం అలుముకోకుండా చూసుకోవాలి. వాస్తవానికి ఇప్పుడు పోటీ రెండో స్థానానికి. బీజేపీ-జనసేన కూటమి మొదటిసారి ఎన్నికలబరిలో పరీక్షించుకోబోతుంది. ఈ కూటమి నిజంగానే ఎన్నికల్లో సీరియస్ ప్లేయరా? ఇది ఇప్పుడు అందరి మనస్సులో తొలుస్తున్న ప్రశ్న. కాకపోతే ఈ 9 నెలల కాలంలో బీజేపీ-జనసేన మూడో ప్రత్యామ్నాయంగా ఎదగలేకపోయింది. అందుకు ప్రధానకారణం జనసేన తెలుగుదేశం బి టీం అని వైస్సార్సీపీ జనంలో తీసుకెళ్లిన ప్రచారం ఇంకా ప్రజల్లో అలానే ఉందని అనిపిస్తుంది. దాన్ని ప్రజల మనసుల్లోంచి తొలగించటానికి ఈ 9 నెలల్లో ఎటువంటి ప్రయత్నమూ చేసినట్లు కనబడలేదు. కాకపోగా తెలుగుదేశం బాటలోనే ఇంకొంచెం ముందుకు ప్రయాణం చేసినట్లు జనం అనుకొనే అవకాశాలు మెండుగా వున్నాయి. జనసేన కు అర్జంటుగా ఒక స్ట్రాటెజిస్ట్ కావాలి. ఆ కొరత ప్రస్ఫుటంగా కనబడుతుంది. ఇక బీజేపీ విషయాన్ని కొస్తే రాష్ట్ర పార్టీలో వర్తమాన రాజకీయాలపై ఎవరి ధోరణి వారిదిలాగే కనబడుతుంది. పాత నాయకులకు, కొత్తగా వచ్చిన నాయకులకు ఎక్కడా పొసుగుతున్నట్లుగాలేదు. ముఖ్యంగా రాజధాని విషయంపై ఇరువర్గాల్లో తీవ్ర విభేదాలు ఉన్నట్లు ప్రతిఒక్కరికి అర్ధమవుతుంది. ఇదీ ఈ రెండు పార్టీల పరిస్థితి. ఈ నేపథ్యంతో ఒక కూటమిగా ఏర్పడటమైతే జరిగిందిగానీ ఇంతవరకు ఎటువంటి రాజకీయ కార్యకలాపాలూ మొదలుకాలేదు. అటువంటప్పుడు ఎన్నికల్లో ఏమి ప్రభావం చూపిస్తుంది? ఈ లోపల పవన్ కళ్యాణ్ సినిమా షూటింగులో బిజీ అయిపోయాడు. సినిమాల్లో నటించటం తప్పుకాదుగానీ టైమింగ్ కరెక్టు కాదేమోననిపిస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలో వస్తాయని అందరికీ తెలుసు. ఈ ఎన్నికల తర్వాత దాదాపు 4 సంవత్సరాలు ఎటువంటి ఎన్నికలూ లేవు. కాబట్టి ఈ ఎన్నికల తర్వాత సినిమా షూటింగులు పెట్టుకోనుంటే బాగుండేది.

ఎన్నిచెప్పినా తెలుగుదేశం కి క్యాడర్ వుంది. ఎన్టీఆర్ పుణ్యమా అని తెలుగు ప్రజల్లో తెలుగుదేశానికి ఇప్పటికీ కొంత క్రేజ్ వుంది. రాష్టం విడిపోయిన తర్వాత ఆంధ్రాలో ఆ వారసత్వం కొనసాగుతుంది. తన స్వార్ధం కోసం తన నమ్మినబంటుల్ని బీజేపీ లోకి పంపించినా ఇప్పటికీ ప్రతి గ్రామంలో పార్టీ క్యాడర్ వుంది. అదే బీజేపీ-జనసేన కూటమికి ఆ క్యాడర్ లేదు. బీజేపీ కి ఎంతో కొంత పట్టణ ప్రాంతాల్లో వున్నా అది ఎన్నికల్లో గెలవటానికి సరిపోదు. జనసేనకు పవన్ కళ్యాణ్ క్రేజ్ వున్నా ఇంకా అది పూర్తిస్థాయిలో ప్రజల్లో స్థానం సంపాదించలేదు. కాబట్టి ప్రస్తుతానికి ఈ ఎన్నికల్లో రెండో పార్టీగా తెలుగుదేశమే ఉంటుంది. అయితే వైస్సార్సీపీ కి చాలా దూరంలో ఉంటుంది. బీజేపీ-జనసేన ఈ ఎన్నికలతో నిమిత్తం లేకుండా వచ్చే నాలుగు సంవత్సరాలు జనంలో పనిచేస్తే ప్రత్యామ్నాయ రాజకీయ కూటమిగా ఎదిగే అవకాశముంది. అయితే ఇది ఈ రెండు పార్టీల వుమ్మడి కార్యకలాపాలపై ఆధారపడివుంటుంది. ప్రస్తుతానికి ఈ ఎన్నికల్లో ఈ కూటమి అవకాశాలు తక్కువే. అదీకాక ఇంత తక్కువ టైములో అటు పంచాయతీ ఇటు పట్టణ , నగర ఎన్నికలూ ఎదుర్కొనే సాధన సంపత్తి ఈ కూటమికి లేదనే చెప్పాలి. ఈ సారికి దూరంగానైనా రెండో స్థానం తెలుగుదేశమే కైవసం చేసుకుంటుంది. పవన్ అభిమానులకు ఇది వినటానికి ఇబ్బందిగావున్నా జరగబోయేది ఇదే. ఈ ఎన్నికల ఫలితాలు ఒకవైపే ఉంటాయి. దీనితో చంద్రబాబు నాయుడు , తనకు మద్దతిచ్చే మీడియా నోళ్లు కొన్నాళ్ళు మూతబడతాయి. అదే సమయం లో రాజధాని సమస్య కూడా బలహీన పడుతుంది. జాతీయ మీడియా ఇప్పటంత ప్రచారం కూడా ఇకనుంచి కల్పించక పోవచ్చు. జగన్ ఎత్తుగడ కూడా ఇదే. ఒకదెబ్బకు రెండు పిట్టలు. ఇదీ ఆంధ్ర స్థానిక ఎన్నికల ముఖచిత్రం.