Home Blog Page 8594

మాచర్లలో టిడిపి నేతలపై హత్యాయత్నం!

స్థానికసంస్థల ఎన్నికల సందర్భంగా అధికార పక్షపు హింసాయుత దాడులు మితిమీరిపోతున్నాయి. బుధవారం ఇద్దరు టిడిపి నేతలపై మాచర్లలో వైసిపి కార్యకర్తలు దారుణంగా దాడి చేశారు. తమపై హత్యాయత్నం జరిపారని టిడిపి నేతలు బోండా ఉమామహేశ్వరరావు, బుద్ధా వెంకన్నలు ఆరోపించారు.

వారు ప్రయాణం చేస్తున్న కార్లపై మారణాయుధాలతో దాడి జరిపి, అద్దాలు పగులగొట్టి, వారిని బైటకు లాగి దాడి చేసే ప్రయత్నం చేశారు. ఒక్క చోటనే కాకుండా వారు ఎక్కడికి వెడితే అక్కడకు వెంటాడి దాడి జరిపారు. కనీసం నాలుగు చోట్ల దాడులు జరిపారు. ఇంతలో మాచర్ల డిఎస్పీ వారిని ఇతర మార్గాల ద్వారా ఆ ప్రాంతం నుండి పంపివేశారు. డ్రైవర్ అప్రమత్తంగా ఉంటూ, జనం నుండి తప్పించుకొంటూ తమను తీసుకు వెళ్లడం వల్లననే తామిద్దరం బతికి బైట పడ్డామని బోండా ఉమా చెప్పారు.

మంగళవారం టిడిపి అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా దాడులు జరపడంతో, ఫిర్యాదు చేయడానికి ముందు రోజు రాత్రి మాచర్ల పోలీసులకు ఫోన్ చేసి వెడితే, పోలీసులు ఇచ్చిన సమాచారంతోనే తమను కారంపూడి నుండి వెంటాడుతూ దాడికి పాల్పడరని బోండా ఉమా విమర్శించారు. తమను ముక్కలు, ముక్కలుగా నరకడం కోసం విఫలయత్నం చేసారని ఆరోపించారు. తాము వస్తున్నట్లు పోలీసులకు తప్ప మరెవ్వరికీ తెలియదని, అలాంటప్పుడు ఏ విధంగా పధకం ప్రకారం తమను వెంబడించి, దాడులు జరిపారని ప్రశ్నించారు.

వైసీపీ నేతలు రాక్షసులను మరిపిస్తున్నారని టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబునాయుడు మండిపడ్డారు. మాచర్లలో బోండా ఉమ కారుపై దాడులకు తెగబడ్డారనిమండిపడ్డారు. మనుషులు ఉన్నా కారుపై దాడి చేశారని పేర్కొన్నారు. వైసీపీ నేతలు రాక్షసులను మరిపిస్తున్నారని టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు మండిపడ్డారు. మాచర్లలో బోండా ఉమ కారుపై దాడులకు తెగబడ్డారన్నారు. మనుషులు ఉన్నా కారుపై దాడి చేశారని పేర్కొన్నారు.

మాచర్ల ఘటనపై డీజీపీ, ఎన్నికల సంఘానికి టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు లేఖ రాశారు. బోండా ఉమ, బుద్దా వెంకన్నపై హత్యాయత్నం జరిగిందని పేర్కొన్నారు. శాంతిభద్రతలు సరిగా లేనందువల్లే ఈ ఘటన జరిగిందని లేఖలో పేర్కొన్నారు. పోలీసుల్లో ఓ వర్గం అధికార పార్టీకి తొత్తుల్లా వ్యవహరిస్తోందని తెలిపారు. దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది బలవంతుడిదే రాజ్యం అన్న చందాలు అయింది ప్రతిపక్ష నేతల పై అధికార పార్టీకి చెందిన వారు దాడులకు తెగబడుతున్నట్లు ఆందోళన వ్యక్తం అవుతున్నది. స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రతిపక్షాలకు చెందిన వారు నామినేషన్లు వేయడానికి భయపడుతున్నారు నామినేషన్లు వేసే వారిపై కూడా దాడులు చేస్తున్నట్లు ప్రసారమాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ బీహార్ రాష్ట్రాన్ని మించిపోయిందని ప్రతిపక్షాల విమర్శలు గుప్పిస్తున్నాయి.

కాగా, అనంతపూర్ జిల్లా బత్తులపల్లి మండలం ఓబులాపురంలో వైసీపీ శ్రేణుల దాడికి పాల్పడ్డాయి. టీడీపీ అభ్యర్థి చెన్నకేశవులుపై దాడి చేసి నామినేషన్‌ పత్రాలు చించివేశారు. చిన్నమండెంలో టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థిని వైసీపీ అడ్డుకుంది. టీడీపీ అభ్యర్థి నామినేషన్ పత్రాలను వైసీపీ వర్గీయులు చించివేశారు.

మరోవైపు నెల్లూరు జిల్లాలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఆత్మకూరు మండలం పడకండ్లలో టీడీపీ అభ్యర్థిని వైసీపీ నేతలు భయబ్రాంతులకు గురి చేశారు. టీడీపీ అభ్యర్థి రాజేశ్వరిని నామినేషన్‌ వేయనీకుండా ప్రయత్నాలు చేశారు. గుట్కా అమ్ముతున్నారన్న అనుమానంతో రాజేశ్వరి కుమారుడిని అరెస్ట్ చేశారు.

వైఎస్ వివేకా హత్యకేసులో జగన్ కు షాక్..

మాజీ మంత్రి వైఎస్సార్‌సీపీ నాయకులు వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. దానితో సిబిఐ దర్యాప్తు జరుగకుండా తీవ్రంగా ప్రయత్నం చేసిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఎదురు దెబ్బ తగిలిన్నట్లు అయింది. వీలైనంత త్వరగా కేసు విచారణ పూర్తి చేయాలని సీబీఐని హైకోర్టు ఆదేశించింది.

భార్య సౌభాగ్యమ్మ, కూతురు సునీత పిటిషన్లను కోర్టు విచారించింది. మొత్తం నాలుగు పిటిషన్లను విచారించిన అనంతరం కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. హత్య జరిగి ఏడాది అవుతున్నా దర్యాప్తులో పురోగతి లేదని కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. కేసు దర్యాప్తులో సమయం కీలకం కాబట్టి సీబీఐకి అప్పగిస్తున్నట్లు కోర్టు తెలిపింది.

కాగా, గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు సిబిఐ దరీఫతు కోర్టు కోర్టుకు వెళ్లిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పిటిషన్‌ ఉపసంహరించుకున్న ప్రభావం దర్యాప్తుపై ఉండకూడదని కోర్టు స్పష్టం చేసింది. కడప జిల్లాలోని పులివెందుల నుంచి దర్యాప్తు ప్రారంభించాలని కోర్టు ఆదేశించింది.

ఏడాది పాటు సిట్‌ విచారణ జరిపినా ఏమీ తేల్చలేకపోయిందని కోర్టు పేర్కొంది. కేసులో అంతర్‌రాష్ట్ర నిందితులు ఉండే అవకాశం ఉందని కోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. 2019, మార్చి 15న వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురైన విషయం విదితమే.

జగన్ ప్రభుత్వం పలుసార్లు దర్యాప్తు చేస్తున్న అధికారులు మారుస్తూ రావడంతో స్వయంగా వివేకానంద రెడ్డి భార్య, కుమార్తె దర్యాప్తు జరుగుతున్న తీరుపట్ల అనుమానాలు వ్యక్తం చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. ముఖ్యమంత్రి తండ్రి వై ఎస్ రాజశేఖరరెడ్డికి రాజశేఖరరెడ్డి స్వయంగా తమ్ముడు. గతంలో కడప ఎంపీగా, పులివెందుల ఎమ్యెల్యేగా పనిచేశారు.

బీజేపీలో చేరగానే సింథియాకు రాజ్యసభ సీట్

కాంగ్రెస్‌ మాజీ నాయకులు జ్యోతిరాధిత్య సింధియా భారతీయ జనతా పార్టీలో చేరడం, వెంటనే ఆయనకు మధ్యప్రదేశ్ నుండి పార్టీ రాజ్యసభ సీట్ కేటాయించడం బుధవారం చకచకా జరిగిపోయాయి. బీజేపీ అధ్యక్షుడు జయప్రకాశ్‌ నడ్డా సమక్షంలో సింధియా పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా సింధియాకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. సింధియాకు పార్టీ ప్రాథమిక సభ్యత్వం అందజేశారు. బీజేపీ రాజమాత విజయరాజే సింధియా కుటుంబానికి చెందిన జ్యోతిరాదిత్య సింధియా సొంతగూటికి రావడం సంతోషంగా ఉందని జేపీ నడ్డా స్వాగతం పలికారు.

సీనియర్‌ నేత జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్‌ పార్టీని మంగళవారం వీడిన విషయం విదితమే. తన తండ్రి మాధవరావు సింధియా జయంతిరోజే ఆయన కాంగ్రెస్‌ను వీడారు. పార్టీలో 18 ఏండ్ల ప్రస్థానానికి ముగింపు పలికారు.

మరోవైపు బెంగళూరులోని రిసార్ట్‌లో ఉన్న సింధియా అనుకూల వర్గం ఎమ్మెల్యేలు 22 మంది సైతం తమ శాసన సభ్యత్వాలకు రాజీనామా చేశారు. ఇందులో ఆరుగురు మంత్రులు ఉన్నారు. దీంతో కమల్‌నాథ్‌ ప్రభుత్వం మైనార్టీలో పడింది.

బీజేపీలోకి తనను తీసుకున్నందుకు ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలకు సింధియా కృతజ్ఞతలు తెలిపారు. తన జీవితాన్ని రెండు ఘటనలు మలుపు తిప్పాయని, తండ్రి మరణం జీవితాన్ని మలుపు తిప్పిందని, ఆయన 75వ జయంతి మరోసారి తనకు కొత్త జీవితాన్ని ప్రసాదించిందని చెప్పారు.

2020, మార్చి 10న సరికొత్త నిర్ణయం తీసుకున్నాను అని చెబుతూ నాయకుడికి జనసేన చేయడమే లక్ష్యంగా ఉండాలని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ పార్టీలో కొత్త ఆలోచనలు స్వీకరించే పరిస్థితి లేదని, ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ప్రజలకు సేవ చేసే అదృష్టం బీజేపీ కల్పించిందని చెబుతూ మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం యువతకు ఉపాధి కల్పనలో విఫలమైందని ద్వజమెత్తారు.

యువతను కాంగ్రెస్ పార్టీ విస్మరించిందని, ఆ పార్టీలో యువత నిర్లక్ష్యానికి గురవుతోందని పేర్కొన్నారు. దీంతో దేశానికి యువత సేవలు అందించలేక పోతోందని చెప్పారు. కమల్‌నాథ్ ప్రభుత్వం అవినీతికి కొమ్ము కాస్తోందని ఆరోపించారు. 2019లో ఎవరూ ఊహించని అద్భుతమైన తీర్పు ప్రజలు బీజేపికి ఇచ్చారని చెబుతూ ప్రధాని మోదీ చేతుల్లో దేశం సురక్షితంగా ఉందని సింధియా నిశ్చితాభిప్రాయం వ్యక్తం చేశారు.

‘రొమాంటిక్’ భామతో బన్నీ ‘ఆహా’

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ తాజా చిత్రం ‘అలవైకుంఠపురములో’ బాక్సాఫీస్ రికార్డు సృష్టించింది. నాన్ బాహుబలి రికార్డును ‘అలవైకుంఠపురములో’ నమోదు చేసుకుంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఈ వచ్చిన ‘అలవైకుంఠపురములో’ బన్నీ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచింది. ఈ మూవీ హిట్టుతో అల్లు అర్జున్ ఫుల్ జోష్ తో వరుస మూవీలను చేస్తున్నాడు. అల్లు అర్జున్ తాజా ‘ఆహా’ కోసం ఓ యాడ్ చేయబోతున్నాడు. ఇందులో బన్నీకి జోడీగా ‘రొమాంటిక్’ భామ కేతికాశర్మ నటిస్తోంది.

అల్లు అర‌వింద్ అమెజాన్ ప్రైమ్‌, నెట్‌ఫ్లిక్స్‌ల‌కు ధీటుగా ‘ఆహా’ పేరుతో ఓటీటీ ప్లాట్ ఫామ్‌ని ప్రారంభించారు. దీనికి త్రివిక్ర‌మ్ ఓ యాడ్‌ చేస్తున్నాడు. ఈ యాడ్ షూటింగ్‌ బుధవారం నుంచి ప్రారంభం కానుంది. 10రోజుల పాటు ఈ యాడ్ ను షూట్ చేస్తారని సమాచారం. ఈ యాడ్లో అల్లు అర్జున్ కు జోడీ కేతికాశ‌ర్మ న‌టిస్తోంది. పూరి జగన్మాథ్ తనయుడు ఆకాష్ హీరోగా న‌టిస్తున్న ‘రొమాంటిక్‌’ మూవీ ద్వారా కేతికా శ‌ర్మ తెలుగు ప్రేక్షకులకు పరిచమవుతోంది.

అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ఈ మూవీలో నటిస్తున్నాడు. బన్నీకి జోడగా రష్మిక మందనా ఎంపికైంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ మూవీని నిర్మిస్తుంది. డీఎస్పీ సంగీతాన్ని అందిస్తున్నాడు. ‘అలవైకుంఠపురములో’ హిట్టు తర్వాత బన్నీ మరోసారి త్రివిక్రమ్ యాడ్ కోసం కలిసి పని చేస్తుండటం గమనార్హం.

30 Rojullo Preminchadam Ela Movie Press Meet

రవితేజానా మజాకా

మాస్ మహారాజా రవితేజకి సినిమా రంగంలో ఆదరణ ఇంకా తగ్గలేదు. రవితేజ నటించిన సినిమాలకు ఇంకా మంచి మార్కెట్ వస్తూనే ఉంది. ఒకప్పుడు రవితేజ సినిమా అంటే….ప్లాప్ సినిమాకి కూడా బయ్యర్స్ కొన్నదానికి 10 శాతం వరకూ లాభాలు వచ్చేవి. అదే హిట్ టాక్ వస్తే ఆ లాభం 25 శాతం పైనే ఉండేది. అందుకే రవితేజను మినిమం గ్యారంటీ హీరో అనే వారు అయితే ఆ తరువాత వరుస హిట్లు రావడం తో పాటు … మార్కెట్ కూడా పెరగడంతో రెమ్యూనరేషన్ పెంచేసాడు.

దీంతో బిజినెస్ అనుకున్న స్థాయిలో అవ్వకపోవడం జరిగింది.. ఫలితంగా ‘టచ్ చేసి చూడు’ ‘నేల టిక్కెట్’ ‘అమర్ అక్బర్ ఆంటోని’ ‘డిస్కో రాజా’ వంటి చిత్రాలు డిజాస్టర్లు అయ్యాయి. అయితే ఇప్పుడు మళ్ళీ రవితేజ పాత పద్దతికి వచ్చేసాడు. రెమ్యూనరేషన్ తగ్గించుకున్నాడు… తక్కువ బడ్జెట్ లో సినిమాని పూర్తి చేయమని నిర్మాతలకి ఒకటికి రెండు సార్లు చెబుతున్నాడు. అలా తన తరువాతి చిత్రం ‘క్రాక్’ విషయంలో ఇదే ఫార్ములా అప్లై చేసాడు. ‘ఠాగూర్’ మధు నిర్మాణంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి గోపీచంద్ మలినేని దర్శకుడు. మే 8న విడుదల కాబోతున్న ఈ చిత్రానికి తెలుగురాష్ట్రాల్లో బిజినెస్ కూడా పూర్తయి పోయిందని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని నైజాం లో 6.30 కోట్లు , సీడెడ్ లో 3.33 కోట్లు , ఆంధ్ర లో 8.50 కోట్లు వెచ్చించి బయ్యర్లు కొన్నట్లు తెలుస్తోంది

ఓవర్సీస్ మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా లెక్కలు తెలియాల్సి ఉంది. అవి తక్కువలో తక్కువ 2 కోట్లు అనుకున్నా… 20 కోట్ల పైనే ఈ చిత్రం బిజినెస్ చేసినట్టు అనుకోవాలి. రవితేజ గత నాలుగు సినిమాలు కనీసం 10 కోట్ల షేర్ ను కూడా రాబట్టలేకపోయినా ‘క్రాక్’ చిత్రానికి ఈ స్థాయిలో బిజినెస్ జరగడం ఆశ్చర్యం కలిగించే విషయం. గతంలో దర్శకుడు గోపీచంద్ మలినేని రవితేజ తో ‘డాన్ శీను’ ‘బలుపు’ వంటి సూపర్ హిట్ సినిమాలు తీయడం అవి డిస్ట్రిబ్యూటర్లకి మంచి లాభాల్ని అందించడం జరిగింది..
Confidence is strength

‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో ముగ్గురు భామలతో రానా రోమాన్స్

దర్శకుడు రాజమౌళి తాజాగా తెరకెక్కిస్తున్న మూవీ ‘ఆర్ఆర్ఆర్’. ‘బహుబలి’ సిరీస్ లతో రాజమౌళి సినిమాలకు ప్రపంచ వ్యాప్తంగా ఫుల్ డిమాండ్ నెలకొంది. భారీ తారాగాణంతో, భారీ బడ్జెట్ తో ‘ఆర్ఆర్ఆర్’ మూవీ తెరకెక్కుతుంది. మెగా పవర్ స్టార్ రాంచరణ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తుండటంతో ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. రాంచరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో, జూనియర్ ఎన్టీఆర్ కొమురంభీం పాత్రల్లో నటిస్తున్నారు.

‘ఆర్ఆర్ఆర్’ టైటిల్ తోనే రానా త్వరలో మనముందుకు రాబోతున్నారు. తేజ దర్శకత్వంలో రానా ‘ఆర్ఆర్ఆర్’(రాక్షస రాజ్యంలో రావణసూరుడు’ మూవీలో నటించనున్నాడు. ఈ మూవీకి సంబంధించి ప్రస్తుతం ఓ న్యూస్ వైరల్ అవుతోంది. ‘ఆర్ఆర్ఆర్’లో రానా పాత్ర నెగెటివ్ పాత్రలో నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ముగ్గురు భామలతో రానా రొమాన్స్ చేయనున్నాడని తెలుస్తోంది. ‘నేనే రాజు నేనే మంత్రి’లో రానాకు జోడీగా నటించిన కాజల్ అగర్వాల్ ఒక హీరోయిన్ ఒక హీరోయిన్ కాగా, మరో ఇద్దరు హీరోయిన్స్ ఎవరనేది తెలియాల్సి ఉందని అంటున్నారు.

‘ప్రస్తుతం రానా ప్రస్తుతం ‘అరణ్య’ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీకి సంబంధించిన టీజర్, పోస్టర్లు ఇప్పటికే ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ‘అరణ్య’లో రానా మావాటివాడిగా నటుస్తున్నాడు. ఈ మూవీతోపాటు ‘విరాటపర్వం’ మూవీ చేస్తున్నారు. కాగా ‘అరణ్య’ మూవీ వచ్చే నెలలో విడుదల చేసేందుకు చిత్రబృందం రిలీజ్ చేసేందుకు సన్నహాలు చేస్తుంది.

మరో ట్రైన్ ఫైట్ కి రెడీ

తెలుగు సినిమాల్లో ట్రైన్ ఫైట్ కి ఉన్న ఇంపార్టెన్స్ అంతా ఇంతా కాదు. తెలుగు సినిమాల వరకు ట్రైన్ ఫైట్ ఉన్న సినిమాలు అన్ని సూపర్ హిట్ అయ్యాయి. 50 ఏళ్ళక్రితం వచ్చిన అదృష్టవంతులు సినిమా నుండి రీసెంట్ గా వచ్చిన సరిలేరు నీకెవ్వరూ చిత్రం దాకా ట్రైన్ ఫైట్ ఉన్న సినిమాలు అన్ని హిట్ అయ్యాయి. ఆ సెంటిమెంట్ ని దృష్టిలో పెట్టుకొని రాబోయే ఒక సినిమాలో ట్రైన్ ఫైట్ పెడుతున్నారు.

యాక్షన్ హీరో గోపీచంద్ హీరోగా మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా సంపత్ నంది దర్శకత్వంలో వస్తున్న స్పోర్ట్స్ బేస్డ్ సినిమా ” సిటీమార్ ” చిత్రం లో ఈ ఆక్షన్ సీన్స్ ఉండ బోతున్నాయి. ప్రస్తుతం గోపీచంద్ పై ఈ ట్రైన్ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నాడు సపంత్ నంది. సెకెండ్ హాఫ్ లో వచ్చే ఈ ట్రైన్ సన్నివేశాలు పూర్తి యాక్షన్ తో సాగుతాయంట….కాగా ఈ సన్నివేశాలు సినిమాలోనే హైలైట్ గా నిలుస్తాయట…. విశేషం ఏమిటంటే హీరో గోపీచంద్ తో పాటు హీరోయిన్ తమన్నా కూడా ఈ షూట్ లో పాల్గొన్నట్లు తెలుస్తోంది.

ఇక ఈ సినిమాలో గోపీచంద్ ఆంధ్రా కబడ్డీ జట్టుకి కోచ్ గా నటిస్తున్నాడు. కాగా తమన్నా తెలంగాణ ఫీమేల్ కబడ్డీ జట్టు కి కోచ్ గా నటిస్తోంది. ‘యు టర్న్’లాంటి సూపర్ హిట్ చిత్రాన్ని అందించిన శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గోపీచంద్ – సంపత్ నంది కాంబినేషన్ లో వచ్చిన ” గౌతమ్ నంద ” చిత్రం పరాజయం అయిన దరిమిలా ఈ సారి ఎలాగైనా గోపిచంద్ కి మంచి హిట్ ఇవ్వాలని దర్శకుడు సంపత్ నంది పట్టుదలగా ఉన్నాడు. అందుకోసమే రిస్క్ అయినా ట్రైన్ సీన్స్ తీస్తున్నాడు.
Who dares win the race

షాకింగ్ న్యూస్.. వైద్య ఆరోగ్య శాఖ మంత్రికి కరోనా..

చైనాలో సోకిన కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచ దేశాలను వణికిస్తుంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా లక్షకుపైగా కరోనా కేసులు నమోదవ్వగా 3వేలకుపైగా మృత్యువాత పడ్డారు. ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది. కరోనాపై తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయా దేశాల ప్రతినిధులకు ఆదేశాలు జారీ చేసింది. తాజాగా బ్రిటన్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి నాడిన్ డోరీస్‌కు కరోనా వైరస్ సోకినట్లు తెలుస్తోంది. ఆమెకు వైద్యపరీక్షలు నిర్వహించగా కరోనావైరస్ పాజిటివ్ అని తేలింది. వైద్యుల సలహాపై ఇంట్లోనే ఐసోలేషన్ గదిలో ఉంటున్నానని నాడిన్ డోరీస్ ఒక ప్రకటన విడుదల చేశారు.

యూకేలో 380కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా సోకి ఆరుగురు చనిపోయినట్లు సమాచారం. కరోనా సోకిన మంత్రి డోరీస్ గతంలో స్టేట్ ఫర్ హెల్త్ అండ్ సోషల్ కేర్ పార్లమెంటరీ అండర్ సెక్రటరీగాను పనిచేశారు. అయితే యూకేలో కరోనా సోకిన తొలి ప్రజాప్రతినిధిగా డోరీస్ కావడం గమనార్హం. ఈ సందర్భంగా డోరిస్ మాట్లాడుతూ కరోనాపై తాను చేయించుకున్న పరీక్షల్లో పాజిటివ్ వచ్చిందని చెప్పింది. ప్రస్తుతం వైద్యుల సలహా మేరకు ఇంట్లోనే స్వయం ఐసోలేషన్ గదిలో ఉండి చికిత్స పొందుతున్నట్లు తెలిపారు.

ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా తాజాగా ఇండియాకు చేరింది. దీంతో భారతీయులు బెంబేలెత్తిపోతున్నారు. కేరళలోలో 30కిపైగా కరోనా కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. కేంద్ర ప్రభుత్వం కరోనా నివారణ కోసం ఇప్పటికే ప్రత్యేకంగా 100కోట్లు కేటాయించింది. అదేవిధంగా ఆయా రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వాలు ముందస్తు చర్యలు తీసుకుంటున్నాయి. కరోనా ఎఫెక్ట్ తో రవాణా వ్యవస్థ పూర్తి స్తంభించిపోతుంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

తెలుగులో అమృత అయ్యర్ కి రెండు

ఒక సినిమా సూపర్ హిట్ అయితే ఆ సినిమాలో నటించిన వారందరికీ ఏదో రకమైన గుర్తింపు వస్తుంది. ఇతర చిత్రాల్లో అవకాశాలు బాగానే వస్తాయి. అలా ఒక తమిళ అమ్మాయికి తెలుగు సినిమాల్లో అవకాశాలు వెతుక్కొంటూ వస్తున్నాయి.

తమిళ్ స్టార్ హీరో విజయ్ గత ఏడాది బిగిల్ అనే బ్లాక్ బస్టర్ హిట్ సినిమా చేసాడు. తెలుగులో ఈ చిత్రం విజిల్ పేరుతో విడుదలయ్యింది.ఇక్కడ కూడా బాగానే ఆడింది. ఇక ఈ మూవీలో లేడీ ఫుట్ బాల్ ప్లేయర్స్ గా నటించిన అమ్మాయిలలో కొందరు హీరోయిన్స్ గా ఇతర భాషల చిత్రాల్లో అవకాశాలు దక్కించుకుంటున్నారు. వారిలో అమృత అయ్యర్ ఒకరు. అమృత అయ్యర్ ఇప్పటికే యాంకర్ ప్రదీప్ హీరోగా పరిచయమవుతున్న 30రోజుల్లో ప్రేమించడం ఎలా? చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది.

ఇటీవల నాగ శౌర్య హీరోగా ఓ నూతన చిత్రం ప్రారంభమైంది. నిర్మాత మహేష్ కోనేరు నిర్మిస్తున్న ఈ చిత్రానికి నూతన దర్శకుడు రాజా కొలుసు దర్శకత్వం వహించ బోతున్నాడు.. యాక్షన్ అండ్ రొమాంటిక్ డ్రామాగా రానున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా అమృత అయ్యర్ ని తీసుకున్నారు. త్వరలో ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది
Ability is off little without an opportunity

స్పీడ్ పెంచిన పవన్ కళ్యాణ్

రాజకీయ రంగం లో పూర్తి సమయం కేటాయించాలి అనుకొన్న పవన్ కళ్యాణ్ మళ్ళీ అనివార్య పరిస్థితుల్లో సినిమా రంగానికి వచ్చాడు. వచ్చిందే తడవుగా వరుసబెట్టి సినిమాలు చేస్తున్నాడు. ఆ క్రమంలో పవన్ కళ్యాణ్ మునుపెన్నడూ లేని విధంగా జెట్ స్పీడ్ వేగంతో సినిమాలు చేస్తున్నాడు. ఇంతకుముందు ఒక సినిమా కోసం కనీసం ఆరేడు నెలలు వెచ్చించే పవన్ కళ్యాణ్ తాజాగా నటిస్తున్న ‘వకీల్ సాబ్’ చిత్రాన్ని మాత్రం చాలా తక్కువ సమయం లో కంప్లీట్ చేసేందుకు సిద్దమయ్యాడు. ఇప్పటికే 80 శాతం టాకీ పార్ట్, ఫైట్స్ పూర్తి చేయడం జరిగింది. ఇక మిగిలిందల్లా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్, ఒక ఫైట్ మాత్రమే. ఈ ఫ్లాష్ బ్యాక్ ట్రాక్లో పవన్ సరసన శృతి హాసన్ నటిస్తుందని వార్తలు వచ్చినా ఇంకా ఫైనల్ కాలేదు. ఒకవేళ శృతి హాసన్ నటించడం కుదరక పొతే మరో హీరోయిన్ ఇలియానా ని ప్రత్యామ్నాయం గా అనుకొంటున్నారు.సినీ యూనిట్ ….

ఒకసారి హీరోయిన్ ఎవరనేది ఖరారైతే ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ తో పాటు బాలన్స్ ఉన్న చివరి ఫైట్ ఒకే షెడ్యూల్లో ఫినిష్ చేస్తారని తెలుస్తోంది..ఏతా వాతా పవన్ కళ్యాణ్ రెండు నెలల్లోనే సినిమా కంప్లీట్ చేయనున్నాడు. ప్రస్తుతం క్రిష్ చిత్రం షూటింగ్లో ఉన్న పవన్ కళ్యాణ్ ఆ చిత్రాన్ని కూడా ‘వకీల్ సాబ్’ తరహాలోనే వేగంగా కంప్లీట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. .ఈ స్పీడ్ చూస్తే 2020 లో పవన్ కళ్యాణ్ నుండి రెండు సినిమాలు గ్యారంటీగా విడుదలయ్యేలా ఉన్నాయి. ఆ లెక్కన వచ్చే ఎలక్షన్స్ లోపు పవన్ కళ్యాణ్ ఏడు లేదా ఎనిమిది సినిమాలు ప్రేక్షకుల ముందుకి తీసుకు రానున్నాడు.
Early bird catch the warms

https://www.youtube.com/watch?v=FShKzhs1NdI

ఏపీలో తొలి కరోనా కేసు నెల్లూరులో ?

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌కి పాకింది. ఏపీలోని నెల్లూరు జిల్లా యువకుడికి కరోనా పాజిటివ్‌గా వచ్చింది. ఈ విషయం రాష్ట్ర వ్యాప్తంగా అలజడి సృష్టిస్తోంది.

ఈ మధ్యే ఇటలీ నుంచి వచ్చిన యువకుడికి కరోనా ఉన్నట్లు తేలింది. దాంతో ఆ యువకుడు నివసించే ప్రాంతమైన చిన్న బజార్‌లో అధికారులు హైఅలర్ట్ ప్రకటించారు. ఆ ఏరియాను శుభ్రం చేసేందేకు శానిటరీ డిపార్ట్‌మెంట్ సమాయత్తమవుతుంది.

వెంటనే ఆ యువకుడిని ఐసోలేషన్ వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారు. కరోనా సోకివ వ్యక్తి ఇటలీ నుంచి వచ్చన తర్వాత ఎవరెవరితో తిరిగాడో వారందరి సమాచారం కోసం అధికారులు ప్రయత్నిస్తున్నారు.

కాగా.. అదే ప్రాంతానికి చెందిన మరో వ్యక్తికి కరోనా లక్షణాలు బయటపడ్డాయి. దాంతో అతన్ని కూడా ఐసోలేషన్ వార్డులో ఉంచి పరీక్షలు నిర్వహిస్తున్నారు.

మరోపక్క కరోనా భయంతో రంగనాథస్వామి రథోత్సవాన్ని కూడా ఆపేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. అయితే రథోత్సవం ఆపడం మంచిది కాదని.. కనీసం తూర్పుమాడ వీధులలోనైనా ఈ ఉత్సవాన్ని జరపాలని పండితులు నిర్ణయించారు.

ఇలా ఉండగా, ఇటీవల ఇటలీ నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా వైరస్‌(కోవిడ్‌ 19) నిర్ధారణ కాలేదని నెల్లూరు ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్‌ తెలిపారు. ఆ వ్యక్తి శాంపిల్స్ సేకరించి వైద్య పరీక్షలకు పంపామని తెలిపారు. ప్రస్తుతం వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని, కరోనా ఉందని తేలితే వైద్యం అందిస్తామని తెలిపారు.

Prema Pipasi Movie Release Press Meet Photos

115 దేశాల్లో కరోనా… 4,300 మంది మృతి

చైనాలో పుట్టిక కరోనా వైరస్ ప్రపంచంలోని 115 దేశాల్లో విస్తరించగా 4,300 మంది మృతి చెందారు. కరోనా బాధితుల సంఖ్య లక్షా 18వేలకు చేరింది. ఈయూ దేశాలన్నింటికీ విస్తరించిన కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తుండటంపై ఇటలీలో జన సంచారంపై అక్కడి ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఇటలీలో ఎవరైన ఆంక్షలను ఉల్లంఘిస్తే శిక్ష వేస్తామంటూ ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది.

ఇకపోతే.. దేశవ్యాప్తంగా నిన్నకి వరకు 14 కేసులు నమోదు కాగా.. ఇప్పటికి వరకు కరోనా వైరస్ బాధితుల సంఖ్య 61కి చేరింది. కేరళలో 14 కేసుులు, కర్ణాట, మహారాష్ట్రలో 3 చొప్పున కొత్త కేసులు నమోదు కాగా.. మన దేశంలో ఇప్పటి వరకు 56 కేసులు నిర్ధారణ అయినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

కేంద్రం కరోనా వైరస్ దృష్ట్యా ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్ దేశస్థుల రాకపై ఆంక్షలు విధిస్తూ.. రెగ్యులర్, ఈ- వీసాలను రద్దు చేసింది. చైనా, ఇటలీ, ఇరాన్, దక్షిణ కొరియా, జపాన్, ఫ్రాన్స్, స్పెయిన్, జర్మనీ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని సూచించింది.

అమెరికాలో కరోనా మృతుల సంఖ్య 24కు చేరగా.. ట్రంప్ కు కరోనా ఉందన్న వార్తలపై వైట్ హౌస్ స్పందించి ట్రంప్ ఎలాంటి వైద్య పరీక్షలు చేయించుకోలేదన్న అధికారులు క్లారిటీ ఇచ్చారు.

కాగా, ఈ మహమ్మారి దెబ్బకు ప్రపంచ వార్షిక జీడీపీ అంచనాలు 2.5 శాతం దిగువకు పడిపోయాయి. ఆర్థిక వ్యవస్థకు ఈ ఏడాది రూ.148 లక్షల కోట్ల (2 ట్రిలియన్‌ డాలర్లు) వరకు నష్టం వాటిల్లవచ్చని ఐక్యరాజ్య సమితి (యూఎన్‌) నిపుణుల అంచనా.

‘ఈ ఏడాది ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 2 శాతం మందగమనాన్ని మనం చూస్తామనిపిస్తున్నది’ అని ఐక్యరాజ్య సమితి వాణిజ్య, అభివృద్ధి విభాగంలో ప్రపంచీకరణ, అభివృద్ధి వ్యూహాల శాఖ డైరెక్టర్‌ రిచర్డ్‌ కోజుల్‌-రైట్‌ తెలిపారు.

భారత్‌కు 348 మిలియన్‌ డాలర్ల (రూ.2,569 కోట్లు) నష్టం రావచ్చని అంచనా వేస్తున్నది. అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల ఆర్థిక వ్యవస్థల్నీ కరోనా కుదిపేస్తుండటం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పతనానికి సూచికేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు .

నామినేషన్‌ను అడ్డుకుంటే తీవ్రంగా పరిగణిస్తాం

రాష్ట్రంలో సమర్ధమైన పోలీసు యంత్రాంగం ఉందని.. ఫిర్యాదులను స్వీకరించేందుకు అధికారులను నియమించామని ఎన్నికల కమిషనర్‌ రమేశ్‌ వెల్లడించారు. ఎవరైనా నామినేషన్‌ను అడ్డుకుంటే తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరించారు.

పోటీచేసే అభ్యర్థులకు ఉద్దేశపూర్వకంగా అడ్డంకులు సృష్టించవద్దని ఆయన రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేశారు. ఎన్నికలను స్వేచ్ఛగా, పూర్తి పారదర్శకంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. పోటీ చేసే అభ్యర్తులకు ఉద్దేశపూర్వకంగా అడ్డంకులు సృష్టించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారన్న సమాచారంతో చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమోటోగా సంబంధించిన వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చెయ్యడం జరిగిందని తెలిపారు.

చిత్తూరు జిల్లా సదుం మండలంలో జరిగిన ఘటనపై కేసు నమోదు చేశామని రమేశ్‌ వెల్లడించారు. నియమావళిని ఉల్లంఘించినట్టు ఎక్కడా ఫిర్యాదులు రాలేదని చెబుతూ చిత్తూరు జిల్లా ఘటన తమ దృష్టికి వచ్చినదని చెప్పారు. ఎన్నికల సమయంలో ఎవరు ఇబ్బంది కలిగించినా తీవ్రంగా పరిగణిస్తామని స్పష్టం చేశారు.

సిబ్బందికి కొరత లేదని.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని భరోసా ఇచ్ఛారు. ఈ సందర్భంగా తెలంగాణ నుంచి తమకు సహకారం ఉందని రమేశ్‌ తెలిపారు.

ఏపీలో నమోదైన తొలి కరోనా కేసు

చైనాలో సోకిన కరోనా ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తుంది. తాజాగా ఈ కరోనా వైరస్ ఇండియాకు చేరింది. ఇప్పటికే కేరళ, ఢిల్లీ, తెలంగాణ రాష్ట్రాల్లో కరోనా కేసులు నమోదయ్యాయి. కేరళలో ఇప్పటివరకు 30పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదుగా ఇందులో కొంతమంది రికవరీ అయ్యారు. కేరళలో కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తుండగా ఇప్పటికే కేరళ ప్రభుత్వం తగు చర్యలు చేపట్టింది. అలాగే తెలంగాణ ఒక కరోనా కేసు నమోదుకాగా ఆ వ్యక్తి పూర్తిగా రికవరీ కావడంతో తెలంగాణలో కొంత ఊరట కలిగింది. అయినప్పటికీ ప్రభుత్వం ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటుంది.

తాజాగా ఏపీలోకి కరోనా ఎంట్రీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఏపీలోని నెల్లూరు జిల్లా వాసిసి కరోనా సోకినట్లు వైద్యులు అనుమానిస్తున్నారు. ఇటలీలో నివాసం ఉండే ఈ యువకుడు 14రోజుల క్రితం నెల్లూరుకు వచ్చాడు. ఢిల్లీ, చైన్నె విమానశ్రయాల్లో యువకుడికి పరీక్షలు నిర్వహించారు. అయితే ఆ పరీక్షల్లో కరోనా పాజిటివ్ రాలేదు.
తాజాగా ఈ యువకుడికి కరోనా లక్షణాలు ఉన్నాయని వైద్యులు అనుమానిస్తున్నారు.

ఈ వ్యక్తి శాంపిల్స్ ఫుణే ల్యాబ్ కు పంపారు. బుధవారం సాయంత్రం నాటికి ఈ వ్యక్తికి కరోనా సోకింది.. లేనిది స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ కరోనా పాజిటివ్ వస్తే ఏపీలో ఇదే తొలిసారి కరోనా కేసు అవుతుంది. కరోనా సోకిందనే సమాచారంలో ఏపీలో భయాందోళన నెలకొంది. దీంతో ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపడుతుంది.

ఉగాదికి ప్రభాస్ సర్ ప్రైజ్ గిఫ్ట్

యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ తాజాగా రాధాకృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో నటిస్తున్నాడు. ఈమూవీలో ప్రభాస్ కు జోడీగా పూజా హెగ్డే నటిస్తుంది. బాలీవుడ్ నటి భాగ్యశ్రీ ప్రభాస్ తల్లిగా నటిస్తుంది. తాజాగా ఈ మూవీ షెడ్యూల్ యూర‌ప్‌లో జ‌రుగుతుంది. దీనిలో భాగంగా ఇంట‌ర్నేష‌న‌ల్ టెక్నీషియ‌న్స్ ఆధ్వర్యంలో ప్రభాస్ ఓ ఛేజింగ్ సీన్ చేసినట్లు సమాచారం. తాజా ఈ మూవీకి సంబంధించి ఒక ఇంట్రస్టింగ్ న్యూస్ బయటికి వచ్చింది.

ప్రభాస్ 20వ మూవీ ఫ‌స్ట్ లుక్‌ను ఉగాది సందర్భంగా మార్చి 25న విడుద‌ల చేయ‌నున్నట్లు సమాచారం. ఒకేసారి రెండు పోస్ట‌ర్స్‌ను విడుద‌ల చేయాల‌ని చిత్రయూనిట్ భావిస్తుంది. ఈ చిత్రం ప్ర‌స్తుతం జార్జియాలో షూటింగ్ జ‌రుపుకుంటోంది. గోపీకృష్ణామూవీస్‌, యువీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్స్‌పై అత్యంత భారీ బడ్జెట్ తో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. 2020 ద‌స‌రా సెలవుల్లో సినిమాను విడుదల చేసేందుకు చిత్రబృందం సన్నహాలు చేస్తుంది.

ఈ మూవీ పూర్తికాగానే ప్రభాస్ దర్శకుడు నాగ్ అశ్విన్ మూవీలో నటించనున్నాడు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన ప్రకటనను దర్శకుడు అనౌన్స్ చేశారు. వైజయంతీ మూవీస్ బ్యానర్లో భారీ బడ్జెట్లో ఈ మూవీని నిర్మించనున్నారు. సైంటిఫిక్ కథాంశంతో ఈ మూవీని నాగ్ అశ్విన్ తెరకెక్కించబోతున్నాడు.