Home Blog Page 8506

తెలంగాణ బాగుంది… కానీ రాజధానే!

 

గత కొద్ది రోజులుగా తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టడంతో రాష్ట్ర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో రాజధానిలో కోవిద్ కేసులు తగ్గక పోవడం కొంత ఆందోళనకరంగా ఉంది. నిన్న ఒక్కరోజే మరో 22 కొత్త కేసులు నమోదయ్యాయి. దింతో మొత్తం బాధితుల సంఖ్య 1038కి పెరిగింది.ఈ మహమ్మారికి రాష్ట్రంలో మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోవడంతో మృతుల సంఖ్య 28కి చేరింది.తాజాగా నమోదైన అన్ని కేసులు కూడా హైదరాబాద్‌ పరిధిలోనివే కావడం ఆందోళన కలిగిస్తోంది. గత కొద్ది రోజుల నుంచి కూడా రాజధానిలోనే బాధితులు పెరుగుతున్నారు. తాజా కేసుల్లో మార్కెట్లో పనిచేస్తున్న వారి ద్వారా పలువురికి వ్యాప్తి చెందినట్లుగా గుర్తించారు. మలక్‌పేటగంజ్‌లో పనిచేస్తున్న పహాడీషరీఫ్‌, జల్పల్లికి చెందిన ఇద్దరు వ్యక్తుల ద్వారా మార్కెట్లో మరో మూడు షాపుల యజమానులకు ఈ వైరస్‌ సోకింది. తద్వారా వారి కుటుంబసభ్యులకూ కొవిడ్‌ వ్యాప్తి చెందడంతో వారందరినీ ఐసోలేషన్‌ లో ఉంచారు.మలక్‌ పేటగంజ్‌, పహాడీషరీఫ్‌ లను కంటెయిన్‌ మెంటు ప్రాంతాలుగా ప్రకటించారు.

మరోవైపు కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల పట్ల కేంద్ర అంతర్‌ మంత్రిత్వ శాఖ బృందం (ఐఎంసీటీ) సంతృప్తి వ్యక్తంచేసింది. రాష్ట్రంలో పర్యటిస్తున్న ఆ బృందం కేంద్ర హోంశాఖకు నివేదిక ఇచ్చింది. క్షేత్రస్థాయిలో నెలకొన్న పరిస్థితులు, కొన్ని లోపాల గురించి అందులో పేర్కొంది.

సుక్కు తెలంగాణా నేపథ్యంలో సినిమా నిజమే


`ఆర్యా` సినిమా తో మొదలైన సుకుమార్ జర్నీ తెలుగు చిత్రాల్లో ఒక కొత్త వరవడి కి నాంది పలికింది . సినిమా, సినిమాకి జానర్ మారుస్తూ సుకుమార్ చేసే ప్రయోగాలు ప్రేక్షకులకు బాగానే కనెక్ట్ అవుతున్నాయి . “100 % లవ్ , నాన్నకు ప్రేమతో , రంగస్థలం ” వంటి చిత్రాలు విభిన్నతకు పెద్ద పీట వేయడమే గాక ఘం విజయం కూడా సాధించాయి. ఇక మహేష్ బాబు హీరో గా తీసిన ` వన్ నేనొక్కడినే `ఆర్ధికంగా ఫెయిల్ అయినా విమర్శకుల ప్రశంసలు దక్కించు కొంది. హాలీ వుడ్ తరహా మేకింగ్ తో సుకుమార్ అందర్నీ ఆశ్చర్య పరచడం జరిగింది.

మరోసారి రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లను ప్రకటించిన కేంద్రం

ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తీస్తున్న ” పుష్ప ” చిత్రం పాన్ ఇండియా మూవీగా రెడీ అవుతోంది. గంధపు చెట్ల స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందే ఈ చిత్రం సుకుమార్ కెరీర్ లో మరో విభిన్న చిత్రం కాబోతుంది. అయితే ఈ సినిమాకి ముందు మహేష్ బాబు తో సినిమా చేద్దామనుకున్న సుకుమార్ తెలంగాణ సాయుధ పోరాట నేపధ్యం లో ఓ విభిన్న కథని రెడీ చేసాడట… కానీ మహేష్ బాబు కి ఆ కథ సూట్ అవ్వదని అనిపించి ఇపుడు తీస్తున్న `పుష్ప ` సినిమా కథ చెబితే మహేష్ బాబు కి నచ్చలేదట దాంతో ఈ సినిమాని బన్నీ తో తెరకెక్కిస్తున్నాడు .

టీఆర్ఎస్ నేతలపై బీజేపీ ఎంపీ అవినీతి ఆరోపణలు


కరోనాను అరికట్టడంలో కేసీఆర్ ప్రభుత్వం వైఫల్యం చెందిన్నట్లు తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ఎండగడుతూ ఉంటె, ఆ పార్టీకి చెందిన నిజామాబాదు ఎంపీ డి అరవింద్ టీఆర్ఎస్ నేతలపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేశారు.

ధాన్యం కొనుగోళ్లలో టీఆర్ఎస్ నేతలు అక్రమాలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. రైస్ మిల్లర్లతో కుమ్ముక్కై రైతులను దోచుకుంటున్నారని దుయ్యబట్టారు. కడ్త పేరుతో 5కిలోల తరుగు తీస్తూ రైతులకు తీవ్రమైన అన్యాయం చేస్తున్నట్లు మండిపడ్డారు.

సరిహద్దు జిల్లాలకు కేసీఆర్ హెచ్చరిక!

కష్టపడి పంట పండించిన రైతు పంట అమ్ముకునేందుకు తెలంగాణాలో నానా అవస్థలు పడుతున్నారని అరవింద్ ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రం నిధులిస్తున్నా రాష్ట్రం వాటిని సరిగా ఉపయోగించుకోవడం లేదని విమర్శించారు. ధాన్యం కొనుగోలు చెసి భారత ఆహార సంస్థ గోదాంలకు పంపటం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి చేతకావటం లేదని ఎద్దేవా చేశారు.

కేంద్రం ఇచ్చే నిధుల విషయంలో మంత్రి ప్రశాంత్ రెడ్డికి కనీస అవగాహన లేదని అరవింద్ ధ్వజమెత్తారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు అవస్థలు పడుతుంటే మంత్రి ప్రశాంత్ మాత్రం కేసీఆర్ భజన చేస్తున్నాడని దుయ్యబట్టారు.

మరోసారి రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లను ప్రకటించిన కేంద్రం

ఐటి రంగానికి, పరిశ్రమలకు సాయం చేస్తామన్న మంత్రి కేటీఆర్ కి రైతు సమస్యలు కనపడటం లేదా? అని అరవింద్ ప్రశ్నించారు. మద్దతు దర కావాలని రాష్ట్రం ప్రతిపాదనలు పంపితే పసుపుకి మంచి మద్దతు ధర ఇచ్చేం దుకు కేంద్రం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.

లాక్ డౌన్ తో పేద ప్రజలకు ఇబ్బంది కలగొద్దనే ఉద్దేశ్యంతో కేంద్రం 5 కిలోల బియ్యం, కిలో కంది పప్పు పేదలకు పంపిణీ చెస్తోందని ఆయన తెలిపారు.

తెలంగాణ ప్రభుత్వం దృష్టి అంతా ఇక పాతబస్తీ వైపే!


గత కొద్దీ రోజులుగా తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతూ వస్తున్నప్పటికీ గ్రేటర్ హైదరాబాద్ లో, ముఖ్యంగా పాతబస్తీలో పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో ప్రభుత్వం ఆందోళన చెందుతున్నది. కొత్త కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతున్నప్పటికీ పాతబస్తీలో పరిస్థితులు అదుపులోకి రావడం లేదు.

కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టిన గ్రేటర్ హైదరాబాద్ లోని పలు ప్రాంతాలను క్రమంగా కంటైన్‌మెంట్ జోన్లు నుంచి ఎత్తివేసి ఇక పాతబస్తీపై దృష్టి సారించాలని వైద్యాధికారులు నిర్ణయించుకున్నారు.

రెడ్ జోన్ లో ఐదు జిల్లాలు..!

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వైరస్ ఉధృతిని బట్టి 141 కంటైన్‌మెంటు జోన్లుగా విభజించారు. వాటిలో మర్కజ్ వెళ్లిన నివసించే ప్రాంతాలను రెడ్‌జోన్‌గా చేసి ఆ ప్రాంతాల వారు, ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా రహదారులపై 8మీటర్ల ఎత్తులో బారికేడ్లు ఏర్పాటు చేశారు.

జీహెచ్‌ఎంసీ, వైద్యశాఖ, పోలీసు అధికారులు ఇంటింటికి తిరిగి అనుమానితులు కనిపిస్తే వెంటనే గాంధీ ఆసుపత్రికి తరలించడం, చుట్టుపక్కల వారిని హోం క్వారంన్‌లో టైఉంచి ప్రతిరోజు కరోనా పరీక్షలు నిర్వహించడం చేస్తున్నారు.

గత రెండు వారాలకు పైగా కాలం నుంచి అధికారులు కంటైన్‌మెంట్ ప్రాంతాలను పెద్ద ఎత్తున జల్లెడ పట్టడంతో ఇప్పటి వరకు గ్రేటర్ పరిధిలో 542 కేసులు నమోదయ్యాయి. అందులో పాతబస్తీ ప్రాంతాలకు చెందిన వారే ఎక్కువ ఉన్నాయి.

మరోసారి రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లను ప్రకటించిన కేంద్రం

ప్రస్తుతం10 రోజులుగా ఒక కేసు నమోదు కానీ ప్రాంతాలను గుర్తించి కంటైన్‌మెంట్ జోన్లుగా తొలగించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటి వరకు 65 వరకు శివారు ప్రాంతాలను కంటైన్‌మెంట్ జోన్లు నుంచి ఎత్తివేశారు. త్వరలో మరో 25 జోన్లు కూడా ఎత్తివేసేందుకు అధికారులు కసరత్తు చేశారు.

వీటిని తొలగిస్తే పాతబస్తీలోని రెడ్ జోన్లపై ప్రత్యేక దృష్టి సారించి కరోనా వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకునేందుకు చర్యలు చేబడుతున్నారు. అందుచేత ఈ నెలాఖరు వరకు హైదరాబాద్ లో లాక్ డౌన్ ఎత్తివేసే అవకాశాలు కనిపించడం లేదు.

కరోనా తగ్గుముఖం పట్టిన ప్రాంతాల్లో కఠినంగా లాక్‌డౌన్ విధించడం ద్వారా సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, కేసులు నమోదుకానీ జోన్లకు లాక్‌డౌన్ నుంచి కొంత ఉపశమనం కలిగిస్తామని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు.

మరోసారి రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లను ప్రకటించిన కేంద్రం


దేశంలో కరోనా ఎఫెక్ట్ తో కేంద్రం లాక్డౌన్ ప్రకటించిన సంగతి తెల్సిందే. తొలివిడుత లాక్డౌన్ ఏప్రిల్ 14తో ముగిస్తుందగా మరోసారి లాక్డౌన్ పొడగించింది. ఈ లాక్డౌన్ మే3వరకు కొనసాగనుంది. ఈ మేరకు లాక్డౌన్ ముగుస్తుండటంతో కేంద్రంగా మరోసారి రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లను ప్రకటించింది. దేశంలోని మొత్తం 733 జిల్లాల పరిస్థితిని అంచనా వేసి రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లుగా విభజించింది. లాక్డౌన్ ముగిశాక కూడా కొన్ని జోన్లలో కేంద్రం కఠిన నిబంధనలు అమలు చేసేందుకు సిద్ధమవుతోంది.

ఏపీలో 1403 కు చేరుకున్న కేసులు… ఇళ్లలోనే చికిత్స

దేశంలో కరోనా కొత్త జోన్లను కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. దేశంలో 130జిల్లాలు రెడ్ జోన్లలో, 284జిల్లాలు ఆరెంజ్ జోన్లలో, 319జిల్లాలు గ్రీన్ జోన్లలో ఉన్నట్లు ప్రకటించింది. అత్యధికంగా ఉత్తరప్రదేశ్లో 19 జిల్లాలు రెడ్ జోన్లో ఉన్నాయి. ఆ తర్వాత మహారాష్ట్రలో 14 జిల్లాలు, తమిళనాడులో 12, ఢిల్లీలో 11, బెంగాల్ లో 10 జిల్లాలు ఉన్నారు. ఇక తెలుగు రాష్ట్రాలైన ఏపీలో ఐదు జిల్లాలు రెడ్ జోన్లలో ఉండగా, తెలంగాణలో ఆరు జిల్లాలు రెడ్ జోన్లలో ఉన్నాయి. కరోనా కేసుల తీవ్రతను బట్టి రెడ్, ఆరెంజ్, గ్రీన్ జిల్లాలుగా విభజించినట్లు కేంద్ర హోం శాఖ కార్యదర్శి ప్రతీ సుడాన్ తెలిపారు. అదేవిధంగా రాష్ట్రాల విజ్ఞప్తి మేరకు జోన్లలో కొన్ని మార్పులు చేసినట్లు ఆయన తెలిపారు.

హిట్లున్నా ఆచి తూచి అడుగులేస్తున్న యంగ్ హీరో


ప్రస్తుతం తెలుగు సినిమా అంతా యూత్ మయమే అవుతోంది. యువ హీరోలు , యువ దర్శకులు కొత్త కొత్త ప్రయోగాలతో ముందుకు వస్తున్నారు. పెళ్లి చూపులు చిత్రంతో మొదలైన యువ కెరటాల వెల్లువ ఆ తరవాత “అర్జున్ రెడ్డి , ఆర్ ఎక్స్ 100 , మహానటి , బ్రోచేవారెవరురా , ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ “వంటి చిన్న చిత్రాలు , వినూత్న ప్రయోగాలతో వెండితెర పై దర్శనమిచ్చి విజయాన్ని అందుకొన్నాయి. ఆ క్రమంలో విజయ్ దేవరకొండ, కార్తికేయ , శ్రీ విష్ణు , నవీన్ పోలిశెట్టి వంటి యువ హీరోలు వెలుగులోకి వచ్చారు.

సరిహద్దు జిల్లాలకు కేసీఆర్ హెచ్చరిక!

అలా తొలి ప్ర‌య‌త్నంలోనే మంచి హిట్ సొంతం చేసుకున్న హీరోల్లో ఒకడు న‌వీన్ పోలిశెట్టి. ” ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ ” సినిమాతో ఒక్క‌సారిగా ఇండ‌స్ట్రీలో నవీన్ పోలిశెట్టి పేరు మారుమోగి పోయింది.. అతడి కామెడీ టైమింగ్‌కి చాలామంది ఫ్యాన్స్‌గా మారిపోయారు. ముఖ్యంగా యూత్‌లో న‌వీన్ పోలిశెట్టి క్రేజ్ అమాతం పెరిగిపోయింది. కాగా నవీన్ లేటెస్ట్‌గా “జాతిరత్నాలు” అనే కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్ సినిమా చేశాడు. .స్వప్న సినిమా బ్యానర్ ఫై దర్శకుడు నాగ్ అశ్విన్ నిర్మాతగా , అనుదీప్ కె. వి. దర్శకుడిగా నిర్మాణం జరుపుకున్న ఈ చిత్రం లాక్‌డౌన్ ముగియగానే థియేటర్స్‌కి రానుంది.

రెడ్ జోన్ లో ఐదు జిల్లాలు..!

ఇక “జాతిరత్నాలు ” సినిమా హిట్ అయితే తన రేంజ్ మారిపోతుంది అని నవీన్ పోలిశెట్టి దృడంగా నమ్ముతున్నాడు. ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ సినిమా తరవాత హిందీలో చేసిన ” చిచోరే ” చిత్రం తో మరో సూపర్ హిట్ అందుకొన్న నవీన్ పోలిశెట్టి రాబోయే ప్రోజెక్టుల విషయం లో చాలా జాగ్రత్తలు తీసుకొంటున్నాడు.

ఇక బాల‌య్యబాబు , బోయ‌పాటి కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న చిత్రంలో తాను ఓ ముఖ్యమైన పాత్రను పోషిస్తున్న‌ట్లు వార్తల పై నవీన్ స్పందిస్తూ ఆ సినిమాలో నేను చేయనున్నట్టు వస్తున్న వార్తల్లో ఎంతమాత్రం నిజం లేద‌ని.. అదంతా కేవలం పుకారు మాత్రమే అని క్లారిటీ ఇచ్చేశాడు.

తెలుగు రాష్ట్రాల్లో రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లు..

దేశంలో లాక్ డౌన్ ముగిస్తుండటంతో కేంద్రం కొత్తగా రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లను ప్రకటించింది. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్యను బట్టి కేంద్రం రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లను ప్రకటించింది. ఎక్కువగా కేసులు నమోదైన జిల్లాలు రెడ్ జోన్, తక్కువ కేసులు నమోదైన జిల్లాలను ఆరెంజ్ జోన్లుగా, అసలు కేసులు నమోదుకానీ జిల్లాలను గ్రీన్ జోన్లుగా కేంద్రం ప్రకటించింది. తెలంగాణలో 6జిల్లాలు రెడ్ జోన్లలో, 18జిల్లాలు ఆరెంజ్ జోన్లలో, 9జిల్లాలు గ్రీన్ జోన్లు ఉన్నాయి. ఏపీలో 5జిల్లాలు రెడ్ జోన్లలో, 7జిల్లాలు ఆరెంజ్, ఒక జిల్లా గ్రీన్ జోన్లో ఉన్నాయి.

సరిహద్దు జిల్లాలకు కేసీఆర్ హెచ్చరిక!

తెలంగాణలో..
రెడ్ జోన్లు(6): హైదరాబాద్, రంగారెడ్డి, సూర్యపేట, వికారాబాద్, మేడ్చల్, వరంగ్ అర్బన్
ఆరెంజ్ జోన్లు(18): నిజామాబాద్, జోగులాంబ గద్వాల, నిర్మల్, నల్లొండ, ఆదిలాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, ఆసిఫాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, జగిత్యాల, సిరిసిల్ల, భూపాలపల్లి, మెదక్, జనగాం, నారాయణపేట్, మంచిర్యాల
గ్రీన్ జోన్లు(9): వరంగల్ రూరల్, ములుగు, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, సిద్దిపేట, వనపర్తి, యాదాద్రి భువనగిరి, పెద్దపల్లి, నాగర్ కర్నూల్.

మరోసారి రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లను ప్రకటించిన కేంద్రం

ఆంధ్రప్రదేశ్ లో..
రెడ్ జోన్లు(5): కర్నూల్, గుంటూరు, కృష్ణా, నెల్లూరు, చిత్తూరు
ఆరెంజ్ జోన్లు(7): తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కడప, అనంతపురం, శ్రీకాకుళం, ప్రకాశం, విశాఖ
గ్రీన్ జోన్లు(1): విజయనగరం

ఏపీలో 1403 కు చేరుకున్న కేసులు… ఇళ్లలోనే చికిత్స


గత పది రోజులుగా రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రెట్టింపు కావడం, మొత్తం కేసులు 1400కు దాటడం, ఎక్కడా వైరస్ తగ్గుముఖం సూచనలు కనిపించక పోతూ ఉండడంతో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైనది. మరింత వేగంగా చికిత్స అందించేందుకు పలు చెర్యలు చేపడుతున్నది.

కరోనా లక్షణాలు ఉండి, 50 ఏళ్ల లోపు వయస్సు గలవారికి తమ ఇళ్లలోనే చికిత్స పొందే సదుపాయాన్ని కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయమై రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మార్గదర్శకాలు రూపొందించింది. అయితే ఇతరత్రా ఆరోగ్య సమస్యలు లేని వారికి మాత్రమే, వైద్యుల సిఫార్సుతో అటువంటి సదుపాయం కల్పిస్తామని స్పష్టం చేశారు.

తెల్ల ఏనుగులా… ఈ సలహాదారులు?

పైగా, అటువంటి వారి నివాసం కోవిడ్ ఆసుపత్రికి సమీపంలో ఉండాలని, ఇంట్లో ప్రత్యేక వసతులు ఉండాలని కూడా తెలిపింది. అప్పుడు మాత్రమే 14 రోజుల పాటు స్వీయ నిర్బంధంలో ఉండే అవకాశం కల్పిస్తారు.

ముఖ్యంగా, కర్నూలు, గుంటూరు, కృష్ణా జిల్లాల్లోనే అత్యధిక కేసులు నమోదు అవుతూ ఉండడం అధికారులకు ఆందోళన కలిగిస్తున్నది. గురువారం నాటికి మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1403కు చేరింది.

జిల్లాల వారీగా… కర్నూలులో 386, గుంటూరులో 287, కృష్ణాలో 246, నెల్లూరులో 84, చిత్తూరులో 80, కడపలో 73, అనంతపురంలో 61, ప్రకాశంలో 60, పశ్చిమగోదావరిలో 56, తూర్పుగోదావరిలో 42, విశాఖలో 23, శ్రీకాకుళంలో 5 కేసుల నమోదు అయ్యాయి.

బాబూ సీబీఐ విచారణకు సిద్ధమా?

కాగా, నరసరావుపేట లో కరోనా కేసులు 106కు చేరుకోవడంలో కలెక్టర్ ఆనంద్ కుమార్ పట్టణంలోని రెడ్‌జోన్‌ ప్రాంతాలతో పాటు వరవకట్ట ప్రాంతంలో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. ఈ నెల 3వ తేదీ వరకు నరసరావుపేటలో సంపూర్ణ లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నట్లు ప్రకటించారు.

మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో 75శాతం కేసుల్లో కరోనా లక్షణాలు బయటపడలేదు. ఇప్పటి వరకు ఉన్న 1403 కేసుల్లో 1050 కేసుల్లో లక్షణాలు కనిపించలేదు. వీరి ద్వారానే కరోనవైరస్ వ్యాప్తి చెందింది. వీరంతా 60 ఏళ్ల లోపువారుగా ప్రభుత్వం గుర్తించింది.

అలాగే 20-40ఏళ్ల లోపువారు 44-45 శాతం ఉన్నట్లు అంచనా వేస్తోంది. కరోనా కట్టడికి భూతిక దూరం పాటించడమే పరిష్కారం అని నిర్ధారించింది. రాష్ట్రంలో కరోనా పరీక్షలు లక్షకు చేరువలో ఉన్నాయి. రాష్ట్రంలో ఇన్ఫెక్షన్ రేటు 1.4శాతం తగ్గింది.

ఇలా ఉండగా విజయవాడ – గుంటూరు ల మధ్య రాకపోకలను నిషేధించారు. గుంటూరు జిల్లా వైపు నుంచి విజయవాడ వెళ్లేందుకు ఉన్న ఒక్కేఒక్క మార్గమైన కనకదుర్గ వారధిపై ఈ అంసుఖాలు విధించారు.

కరోనా నేపధ్యంలో జిల్లాలు మారకూడదని వాహనదారులకు ఆదేశాలు జారీ చేస్తూ మణిపాల్ హాస్పిటల్ వద్ద ఫ్లెక్సీ ఏర్పాటుచేశారు. అయితే అత్యవసర వాహనాలను, జిల్లా ఉన్నత అధికారులు జారీ చేసిన ప్రత్యేక పాసులు ఉన్న వాహనాలకు మాత్రమే అనుమతి ఇస్తామని తాడేపల్లి పోలీసులు తెలిపారు.

సరిహద్దు జిల్లాలకు కేసీఆర్ హెచ్చరిక!

తెలంగాణ ప్రజలెవరూ ఇతర రాష్ట్రాలకు వెళ్లకుండా కేసీఆర్ సర్కార్ సరిహద్దు జిల్లాలకు కీలక అదేశాలు జారీ చేసింది. ఏపీ, మహారాష్ట్ర లకు వెళ్లకుండా సర్కార్ నిషేధం విధించింది. కరోనా వ్యాధి తీవ్రత నేపథ్యంలో సరిహద్దు జిల్లాలలో నివసిస్తున్న పౌరులకు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.

ఆంధ్ర, మహారాష్ట్రాలలో అధిక సంఖ్యలో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అవుతున్నందున ఈ నిర్ణయం తీసుకుంది. వైద్యం, అత్యవసర పనులకు కూడా ఆయా వెళ్లడానికి వీలు లేదని సరిహద్దుల్లోని ప్రాంతాల ప్రజలను ఆదేశించింది. నిర్ణయ అమలుకు పోలీసు బలగాలను పెంచింది. భద్రతను కట్టుదిట్టం చేసింది. కర్నూలులో కరోనా కేసులు ఎక్కువగా ఉండడం.. తెలంగాణలోని గద్వాల, మహబూబ్‌ నగర్‌ జిల్లాల ప్రజలు అక్కడికి వెళుతున్న నేపథ్యంలో రాకపోకలను నిషేధించింది. అలాగే ఖమ్మం, నల్గొండ జిల్లాల వాళ్లు కూడా కృష్ణ విజయవాడ, గుంటూరు వైపు వెళ్లడానికి వీలు లేకుండా ప్రభుత్వం భద్రతను పెంచింది.

బాబూ సీబీఐ విచారణకు సిద్ధమా?


ఆరోపణలు పక్కన పెట్టి మీ ఆస్తులు, నా ఆస్తులపై సీబీఐ విచారణ కోరుతూ లేఖలు రాద్దాం చంద్రబాబు అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయ సాయిరెడ్డి సవాల్ విసిరారు. కచ్చితంగా విచారణ జరిగేలా చూద్దాం. రెడీనా అంటూ ట్వీట్ చేశారు. లేని పక్షంలో చందాలూ దందాలూ అంటూ తనపై ఆరోపణలు మానుకోవాలని అన్నారు.

తెల్ల ఏనుగులా… ఈ సలహాదారులు?

శవ రాజకీయాల కోసం చంద్రబాబుకు రాష్ట్రంలో మరణ మృదంగం మోగుతుండాలని పేర్కొన్నారు. కరోనా మరణాలు రాష్ట్రంలో 2 శాతం మాత్రమే ఉండటంతో బాబుకు దిక్కుతోచడం లేదన్నారు. అందుకనే కరోనా లెక్కలు దాస్తున్నారని బురద కుమ్మరించడానికీ సిగ్గుపడటం లేదని తెలిపారు. 2 లక్షల టెస్టింగ్ కిట్లను కొరియా నుంచి కొన్నది దేశం మొత్తం మీద ఒక్క ఆంధ్రానే అని ఇలాంటివి చంద్రబాబుకు కనిపించవని పేర్కొన్నారు.

మరో భారీ చిత్రం లో కాజల్

2007 లో `లక్ష్మి కళ్యాణం’ చిత్రం తో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన కాజల్ అగర్వాల్ తన పదమూడేళ్ల సినీ ప్రయాణం చాలా బాగా చేసిందనే చెప్పాలి. ఇంకా చెప్పాలంటే ఇప్పటికీ హీరోయిన్ గా కొనసాగుతూనే ఉండటం అభినందనీయం. ప్రస్తుతం పలు పెద్ద సినిమా ఆఫర్లను అందు కొంటూ ముందుకు సాగుతోంది . ప్రస్తుతం ‘ముంబై సాగా’ అనే మల్టీ స్టారర్ హిందీ సినిమా తో పాటు , కమల్ హాసన్ ప్రెస్టీజియస్ మూవీ `ఇండియన్ 2’ చిత్రం , ` హే సినామికా’ , `పారిస్ పారిస్ ` అనే తమిళ చిత్రంలో కూడా నటిస్తోంది. అలాగే తెలుగులో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘ఆచార్య’లో కూడా కథానాయికగా అవకాశం దక్కించుకుంది. అవన్నీ అలావుంటే ఇపుడు మరో భారీ చిత్రం కూడా కాజల్ ని వరించినట్టు తెలుస్తోంది .

వైరల్ అవుతున్న రిషీ కపూర్ చివరి వీడియో

తమిళ స్టార్ హీరో ఇళయ దళపతి విజయ్ నటించే తదుపరి చిత్రం లో కాజల్ హీరోయిన్ గా నాలుగో సారి నటించే ఛాన్స్ దక్కించు కోబోతుంది . త్వరలో మురుగదాస్ దర్శకత్వంలో విజయ్ ‘తుపాకి 2’ చిత్రం చేయాలను కొంటున్నాడు. కాగా ఇందులో కథానాయికగా కాజల్ నటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇంతకు ముందు వచ్చిన ‘తుపాకి’ చిత్రం లో కాజల్ హీరోయిన్ కనుక రెండో భాగం లో కూడా ఆమెనే రిపీట్ చేయాలని మురుగదాస్ అనుకొంటున్నాడట …ప్రస్తుతం చర్చలు నడుస్తున్నాయని, త్వరలోనే అఫీషియల్ సమాచారం రాబోతుంది . గతంలో కాజల్, విజయ్ కాంబోలో ” తుపాకీ , ‘మెర్సల్, జిల్లా” అనే మూడు చిత్రాలు రాగా మూడూ కూడా సూపర్ హిట్ అయ్యాయి .

తెల్ల ఏనుగులా… ఈ సలహాదారులు?


వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన అనంతరం అభివృద్ధి పనుల కంటే సంక్షేమ పథకాలకే ప్రాధాన్యత ఇచ్చి అమలు చేస్తోంది. ‘కరోనా’ ప్రభావంతో ఖజానాకు 20 శాతం ఆదాయం కూడా లభించని ప్రస్తుత సమయంలోను ఉద్యోగుల జీతాల్లో 50 శాతం కోత విధించిన ప్రభుత్వం సంక్షేమ పథకాలు మాత్రం కోన సాగిస్తోంది. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ. వేల కోట్లు ఖర్చు చేస్తున్నా ఆ స్థాయిలో క్రెడిట్ రాబట్టుకోలేక పోతోంది. మరోవైపు జగన్ నిర్ణయాలు, వివిధ అంశాలపై ఆయన వైఖరి ప్రజల ఆలోచనలకు పూర్తి భిన్నంగా ఉంటున్నాయి.

నేటి నుంచే ఏపీలో పెన్షన్ల పంపిణీ!

జగన్ సీఎంగా భాద్యతలు చేపట్టిన అనంతరం ఇబ్బడిముబ్బడిగా ప్రభుత్వ సలహాదార్లను నియమించారు. అంతేకాకుండా వీరిలో కొందరికి కేబినెట్‌ హోదా ఇచ్చారు. నెలకు రూ.75 వేల నుంచి 3.80 లక్షల వరకూ జీతభత్యాలు చెల్లిస్తున్నారు. వీరిలో సీఎం సలహాదారులుగా ఆరుగురు ఉండగా, వివిధ శాఖలకు సలహాదారులుగా మొత్తం 35 మంది వరకూ నియమించారు. సలహాదారుల్లో విశ్రాంత ఐఏఎస్ లు, సీనియర్ జర్నలిస్టులు, ఆయా రంగాలకు చెందిన నిపుణులు ఉన్నారు. ఈ సలహాదారుల సేవలను ప్రభుత్వం ఎంతమేరకు వినియోగించుకుంటుదనే సందేహం కలుగుతోంది.

కరోనా వైరస్ విషయంలో సీఎం జగన్ మొదటి నుంచి చేస్తున్న వాదనలు పూర్తిగా వాస్తవానికి భిన్నంగా ఉన్నాయి. ఇది కేవలం జ్వరం లాంటిదేనని, పారాశిట్మల్ టాబ్లెట్ వేస్తే తగ్గిపోయిందని చేసిన కామెంట్ నీటికి సోషల్ మీడియాలో విమర్శలు, సెటైర్లు వస్తున్నాయి. తాజాగా కరోనా తో కలిసి జీవించాల్సి ఉంటుదనటపైనా ఇదే పరిస్థితి ఉంది. మాటలలో తడబడటానికి అవకాశం ఉంటుంది దీనిని ప్రజలు పెద్దగా పట్టించుకోరు. విధానమే విరుద్ధంగా ఉండటం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ప్రపంచమంతా ఒక విధంగా ఉంటే సీఎం జగన్ విధానం అందుకు విరుద్ధంగా ఉంది.

ఇంగ్లీషు మీడియంకే ఓటు..!

స్థానిక సంస్థలకు ఎన్నికల వాయిదా విషయంలో మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏ ఉద్దేశ్యంతో నిర్ణయం తీసుకున్నా ఫలితం ప్రభుత్వానికి, ప్రజలకు ఎంతో మేలు చేసిందనే చెప్పాలి. మార్చి 21, 24 తేదీన రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే రాష్ట్రంలో కరోనా కేసులు జాతీయ స్థాయిని దాటిపోయేవి, ఇదే జరిగుంటే ప్రజల్లో ప్రభుత్వంపై విశ్వాసం లేకుండాపోయే పరిస్థితి నెలకొనేది. పరోక్షంగా ప్రభుత్వానికి మేలు చేసిన రమేష్ కుమార్ ఇంత అత్యవసరంగా తొలగించడం వివాదంగా మారింది. అదే సమయంలో లాక్ డౌన్ లోను కనగరాజ్ ను రాష్ట్రానికి రప్పించడం అంతే వివాదంగా మారింది.

రాజధాని వికేంద్రీకరణకు సిద్ధమై చిన్న రాష్ట్రంలో మూడు రాజధానులు ఏర్పాటు జగన్ రాష్ట్ర ప్రజలపైగా రుద్దుతున్నారనేది వాస్తవం. టీడీపీని దెబ్బతీయడానికి అమరావతిని నిర్వీర్యం చేయాలనేది ఇందులో రాజకీయ వ్యహం. అమరావతి రైతుల సంగతి పక్కన పెడితే మూడు రాజదానుల వల్ల రాష్ట్ర ప్రజలకు మేలు మాత్రం ఏమీ లేదనేది వాస్తవం.

ఇలా చెప్పుకుంటూ పోతే జగన్ నిర్ణయాలపై ప్రజావ్యతిరేకత ఎక్కువగా ఉంటుంది. త్వరలో వైసీపీ సభ్యుల సంఖ్య పెరగనున్న సమయంలో శాసన మండలి రద్దు నిర్ణయం. సి.ఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం తొలగింపు విధానం, కరోనా నేపథ్యంలో పెన్షనర్ ల జీతంలో కోత ఇలా ఎన్నో ఉన్నాయి.

ముఖ్యమంత్రి సలహాదారులు ఆయనకు ఎటువంటి సలహాలు, సూచనలు చేస్తున్నారు అనే అంశం ప్రశ్నార్థకంగా మారింది. ఐఏఎస్, వివిధ రంగాలకు చెందిన నిపుణులు సలహాదారులుగా ఉన్నా సీఎం ఇటువంటి నిర్ణయాలు, విధానాలను ఎందుకు అవలంభిస్తున్నారు అర్ధం కాని పరిస్థితి నెలకొంది. ముఖ్యమంత్రి చెప్పినట్లుగానే సలహాదారులు సలహాలు, సూచనలు ఇవ్వాలి తప్ప వారి అభిప్రాయాలను సీఎంకు వివరించే అవకాశం ఇవ్వరనే వాదనలు వినిపిస్తున్నాయి. విననప్పుడు రూ. కోట్లు చెల్లించి ఇంతమంది సలహాదారులను నియమించుకోవడం వారికి ఉపాధి కల్పించేందుకేనా అన్న సందేహం కలుగుతుంది.

మద్యం తాగితే కరోనా రాదట!

మద్యం తాగడం వల్ల కరోనా వైరస్ కి చెక్ పెట్టొచ్చని కాంగ్రెస్ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు చేశారు. కాబట్టి కరోనా కట్టడి చర్యల్లో భాగంగా మద్యం షాపులను తెరవాలని రాజస్తాన్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే భరత్‌ సింగ్‌ కుందన్‌ పూర్‌ స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని ఉటంకిస్తూ.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌ కు లేఖ రాశారు.

ఆ లేఖలో ఇంకా ఏముందంటే..”వైరస్‌ క్రిములను నిర్మూలించేందుకు ఆల్కహాల్‌ తో చేతులు శుభ్రం చేసుకుంటున్నప్పుడు గొంతులో తిష్టవేసే.. వైరస్‌ క్రిముల్ని చంపేందుకు మద్య వాడొచ్చుకదా, అలాగే మద్యం అమ్ముతూ స్వయం ఉపాధి పొందే వారికి, ప్రభుత్వానికి ఇదొక ఒక మంచి అవకాశం. మార్కెట్‌ లో మద్యానికి చాలా డిమాండ్ ఉంది. లాక్‌ డౌన్‌ నిషేధ సమయంలో ప్రభుత్వ ఆదాయం తీవ్రంగా దెబ్బతింటోంది. మద్యానికి బానిసైనవారి ఆరోగ్యం కూడా ప్రభావితం అవుతోంది. మద్యం అమ్మకాలకు కేంద్రం అనుమతించదు. అందువల్ల దానిపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది’అని ఎమ్మెల్యే లేఖలో పేర్కొన్నారు.

దేశవ్యాప్త లాక్‌ డౌన్‌ నేపథ్యంలో కఠినమైన ఆంక్షలు అమలవుతున్నాయి. అయితే, మద్యం షాపులను మూసేయడంతో.. మందు బాబులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే భరత్‌ సింగ్‌ తన లేఖలో ప్రస్తావించారు.

శేఖర్ కమ్ముల ఏంటి ఇలా మారాడు


ఆహ్లాదకర చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రస్ శేఖర్ కమ్ముల. ఆయన దర్శకత్వంలో వచ్చిన చిత్రాలన్నీ కుటుంబ సమేతంగా చూడతగ్గ ఆణిముత్యాలే… ఆయ‌న దర్శకత్వంలో తెరకెక్కిన “ఆనంద్‌, గోదావ‌రి, హ్యాపీడేస్‌, లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్, ఫిదా ” వంటి సినిమాల‌ను అచ్చ తెలుగు తనానికి ఆనవాళ్లు .వాటిని మ‌నం అంత సుల‌భంగా మ‌ర‌చిపోలేం. ఇక ఆయ‌న దర్శకత్వం వహించిన గ‌త చిత్రం ” ఫిదా “గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. సెన్సేష‌న‌ల్ హిట్‌ సాధించిన ఈ చిత్రంలో మధ్య తరగతి వారి మనస్తత్వాలను దర్శకుడు ఆవిష్కరించిన తీరు అమోఘం. ప్రస్తుతం శేఖర్ కమ్ముల నాగ‌చైత‌న్య‌, సాయిప‌ల్ల‌వి కాంబినేష‌న్‌లో “ల‌వ్‌స్టోరీ” అనే ప్రేమ‌క‌థా చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది. క‌రోనా సమస్య లేకుండా ఉంటే ఈ పాటికి సినిమా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చుండేది.

చిరంజీవి రాజకీయాలపై తమ్ముడి షాకింగ్ కామెంట్

ఇక ఈ చిత్రం తరవాత శేఖ‌ర్ క‌మ్ముల తన రొటీన్‌ జానర్ కి భిన్నంగా వెళ్లాల‌నుకుంటున్నాడ‌ట‌. ప్రేమ కథా చిత్రాల స్థానంలో ఒక థ్రిల్ల‌ర్ సినిమాను తెర‌కెక్కించాలని అనుకొంటున్నాడట….. గ‌తంలో ` కహాని ` హిందీ సినిమాని తెలుగులో `అనామిక ` పేరుతో తెర‌కెక్కించి నప్పటికీ సత్పలితం రాలేదు. దరిమిలా శేఖ‌ర్ క‌మ్ముల థ్రిల్ల‌ర్ జోన‌ర్‌లో సినిమా తీస్తున్నానంటే అందరూ ఆశ్చర్య పోతున్నారు . లాక్ డౌన్ ఎత్తి వేయగానే ఈ సినిమా గురించి పూర్తి వివరాలు బయటికి రానున్నాయి .

మే నెలలో మరింత జాగ్రత్త!

కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో కేంద్రం విధించిన రెండో విడత లాక్‌ డౌన్‌ గడువు మే 3 దగ్గర పడుతోంది. అయితే దేశంలో ఇంకా కరోనా కేసుల సంఖ్య కొనసాగుతూనే ఉంది. రోజుకు దాదాపు వెయ్యికి పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. మరోవైపు డిశ్చార్జి అవుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఇదే సమయంలో గత కొన్ని రోజులుగా కొత్త కేసులు నమోదు కాని జిల్లాల సంఖ్య కూడా గణనీయంగా ఉందని కేంద్రం చెబుతోంది. ఈ నేపథ్యంలో రెండో విడత లాక్‌ డౌన్‌ మరో రెండు రోజుల్లో ముగియనుంది. దీనికి సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీ మే 2న ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో కరోనాపై దేశం సాగిస్తున్న యుద్ధంలో ఈ మే నెల కీలకం కానుందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. ఇప్పటికే రోజురోజుకు పెరుగుతున్న కేసులతో కరోనా సామూహిక వ్యాప్తి దశకు చేరుకోవడమా లేదా ప్రభుత్వం చేపట్టే కట్టుదిట్టమైన చర్యలతో వేగం నెమ్మదించడమా అన్నది మే నెలలో తేలే అవకాశం ఉందని వారు చెబుతున్నారు.
కరోనా హాట్‌స్పాట్లుగా ఉన్న ప్రాంతాల్లో నియంత్రణా చర్యలను మరింత ప్రణాళికాబద్ధంగా రూపొందించాల్సిన అవసరం ఉందని, దీంతో పాటుగా గ్రీన్‌ జోన్లలో ఆంక్షల సడలింపు ఇచ్చేట్లు అయితే ఆయా ప్రాంతాలపై కూడా నిరంతర పర్యవేక్షణ ఉండాలని వైద్య నిపుణలు అభిప్రాయపడ్డారు. మే నెల పూర్తి వరకూ రైల్వేలు, విమానాలు, అంతరాష్ట్ర బస్సు సర్వీసులు, మాల్స్‌, షాపింగ్‌ కాంప్లెక్స్‌లు, మతపరమైన కార్యక్రమాలు, తదితరాలను
అనుమతించకూడదని సూచించారు. కరోనాపై పోరును కొనసాగించడంతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవడం కూడా ముఖ్యమని ప్రధాని మోడీ సోమవారం పలురాష్ట్రాల ముఖ్యమంత్రులతో నిర్వహించిన సమావేశంలో పేర్కొన్న విషయం తెలిసిందే. ఇదే సమయంలో మే 3 తర్వాత కూడా కొన్ని సేవలు, రంగాలకు ఆంక్షలతో కూడిన అనుమతులతో లాక్‌ డౌన్‌ కొనసాగే అవకాశం ఉందని కేంద్రం సూచనాప్రాయంగా చెప్పింది.

భారత్‌ లో ఇటీవలనే మరణాల సంఖ్య వెయ్యి దాటగా, ఆయా దేశా ల్లో ఇప్పటికే వేల సంఖ్యలో చనిపోయారు.కాబట్టి అమెరికా, ఇటలీ, యుకె, ఫ్రాన్స్‌, స్పెయిన్‌, బెల్జియం వంటి దేశాలతో పోల్చుకుంటే కేసుల సంఖ్యతో పాటు మరణాల రేటులో కూడా తక్కువగా ఉంది. కేసుల రెట్టింపు రేటు కూడా తగ్గిందని భారత ప్రభుత్వం పేర్కొంది. మొదట్లో 3 రోజులుగా ఉన్న రెట్టింపు రేటు, ప్రస్తుతానికి 10కి పెరిగిందని తెలిపింది.

దేశంలో గత 15 రోజుల కాలంలో కరోనా హాట్‌ స్పాట్‌ జిల్లాలు 170 నుంచి 129కు తగ్గాయని, కానీ ఇదే సమయంలో ఇన్ఫెక్షన్‌ రహిత జిల్లాలు లేదా గ్రీన్‌జోన్‌ ప్రాంతాలు కూడా 325 నుంచి 307కు తగ్గాయని అధికారిక వర్గాల సమాచారం. నాన్‌ హాట్‌స్పాట్‌(ఆరంజ్‌ జోన్‌) జిల్లాల సంఖ్య 207 నుంచి 297కు పెరిగింది. దింతో లాక్‌ డౌన్‌ ను కొనసాగించడమే మంచిదనేది అర్థమౌతుంది

‘ఎమ్ఎస్‌ఎమ్ఈ’లకు శుభవార్త..!


ఆర్థిక సమస్యలు, కరోనా ఇబ్బందులు చుట్టుముట్టినా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. పారిశ్రామిక రంగ ఆర్థిక పరిపుష్ఠికి అవసరమైన చర్యలకు సీఎం శ్రీకారం చుట్టారు.

పరిశ్రమలలో పని చేసే కార్మికులను కోవిడ్‌ –19 ప్రభావం నుంచి కాపాడేందుకు అవసరమైన ముందస్తు చర్యలను చేపడతున్న ప్రభుత్వం ఈ క్రమంలో ప్రోత్సాహకాలు, బకాయిలు, విద్యుత్ ఛార్జీల వంటి కీలక అంశాలన్నింటిలో పరిశ్రమలకు ఉపశమనం కలిగించే నిర్ణయాలతో రాష్ట్ర పారిశ్రామిక రంగం ఉత్తేజంతో తిరిగి పట్టాలకెక్కించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం కీలక సమీక్ష నిర్వహించిన అనంతరం సమీక్షా సమావేశంలోని ఇందుకు సంభవించిన నిర్ణయాలు తీసుకున్నారు.

నేటి నుంచే ఏపీలో పెన్షన్ల పంపిణీ!

ఎమ్ఎస్ఎమ్ఈలకు భరోసానిచ్చే కచ్చితమైన ఆర్థికరక్షణ ప్రణాళిక అమలుకు ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవడం మంచిపరిణామమని మంత్రి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. గత ఐదేళ్లలోనూ చెల్లించని ప్రోత్సాహకాల బకాయిలను చెల్లించే నిర్ణయం తీసుకుని ప్రభుత్వం ఎమ్ఎస్ఎమ్ఈలకు ఉపశమనమిచ్చే నిర్ణయం తీసుకుంది. 2014–15 నుంచి 2018-2019 మధ్యకాలంలో మొత్తం ఎమ్ఎస్ఎమ్ఈ ప్రోత్సాహక బకాయిలు రూ. 828 కోట్లు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2019–20 ఎంఎస్‌ఈలకు (అప్‌లోడ్‌ చేసిన వివరాల ప్రకారం) బకాయిలు రూ. 77 కోట్లు కలిపి మొత్తంగా రూ.905 కోట్లను మే, జూన్‌ నెలలో ఎంఎస్‌ఎంఈలకు ఇస్తామని సీఎం ప్రకటించారు. విడతల వారీగా మే నెలలో సగం, జూన్‌ నెలలో మరో సగం చెల్లించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ఇంగ్లీషు మీడియంకే ఓటు..!

ఎమ్ఎస్‌ఎమ్ఈల మినిమం కరెంటు డిమాండ్‌ ఛార్జీల రద్దుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్, మే, జూన్‌.. ఈ మూడు నెలల కాలంలో ఎమ్ఎస్ఎమ్ఈలకు పవర్‌ డిమాండ్‌ ఛార్జీలు రూ. 188 కోట్లు మాఫీ చేయనున్నామన్నారు. మిగిలిన పరిశ్రమలకు మూడు నెలల (ఏప్రిల్, మే, జూన్‌ )కరెంటు మినిమం డిమాండ్‌ ఛార్జీల చెల్లింపులో వాయిదాలకు అనుమతించామన్నారు. ఈ రెండు నిర్ణయాల కారణంగా 72,531 సూక్ష్మ పరిశ్రమలకూ, 24,252 చిన్న తరహా పరిశ్రమలకూ, 645 మధ్య పరిశ్రమలకూ మొత్తంగా 97, 428 ఎమ్ఎస్‌ఎమ్ఈలకు మేలు జరగనుంది. తద్వారా వాటిల్లో పనిచేసే 9,68,269 మందికి ఉపాధి విషయంలో కొంత వరకూ ఇబ్బందులు తొలగుతాయి. ప్రస్తుతం ఎమ్ఎస్‌ఎమ్ఈలు తమ కార్యకలాపాలను పునరుద్ధరించుకోవడానికి వీలుగా, ఆర్థిక వనరుల సమీకరణలో తోడ్పాటు అందించడానికి ప్రభుత్వం బ్యాంకులకు గ్యారంటీ ఇస్తూ సబ్సిడీతో ఒప్పందం కుదుర్చుకుని, రూ.200 కోట్లు సమకూర్చుకుని, వాటిని వర్కింగ్‌ కేపిటల్‌గా సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలకు అందించాలని నిర్ణయించారు. అతితక్కువ వడ్డీకింద ఈ వర్కింగ్‌ కేపిటల్‌ సమకూర్చాలని సమావేశంలో నిర్ణయం.

వస్త్ర పరిశ్రమల ప్రోత్సాహకాలకు సంబంధించిన రూ.1088 కోట్ల బకాయిలను చెల్లించేందుకు కూడా త్వరలో నిర్ణయం తీసుకొనున్నారు. కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు వచ్చాక టెక్ట్స్‌టైల్‌ సహా ఇతర పరిశ్రమలను ఆదుకోవడానికి తీసుకోవాల్సిన మరిన్ని చర్యలు చేపట్టనున్నారు. వస్త్ర పరిశ్రమలు సహా, భారీ, అతిపెద్ద పరిశ్రమలకు 3నెలల ( ఏప్రిల్, మే, జూన్‌ నెలల) మినిమమం డిమాండ్‌ ఛార్జీల చెల్లింపును వాయిదా వేయాలని నిర్ణయించారు. వీటికి ఎలాంటి అపరాధరుసుము, అదనపు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఈ భారాన్ని పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది.

ఇంగ్లీష్ మీడియం కే ఓటు..!


రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మాధ్యమం ప్రవేశపెట్టాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి తల్లిదండ్రులు అనుకూలంగా ఉన్నారని విద్యా శాఖ అధికారులు తెలిపారు. ఈమేరకు తమ ఐఛ్చికాన్ని తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి తమ అంగీకారాన్ని తెలియజేశారన్నారు. 96.17 శాతం మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇంగ్లీషు మాధ్యమమే కావాలంటూ స్పష్టం చేసినట్లు పేర్కొన్నారు.

చిరంజీవి రాజకీయాలపై తమ్ముడి షాకింగ్ కామెంట్

విద్యారంగంలో పెద్ద ఎత్తున సంస్కరణలు తీసుకురావడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, దీంట్లో భాగంగా నాడు – నేడు కార్యక్రమాల ద్వారా ప్రభుత్వ పాఠశాలలు, విద్యా సంస్థల్లో మౌలిక సదుపాయాలను గణనీయ స్థాయిలో అభివృద్ధిచేయడానికి కార్యక్రమాలు ప్రారంభించిందన్నారు. ప్రపంచస్థాయి పరిజ్ఞానాన్ని అందించడానికి, అంతర్జాతీయంగా ఉన్న పోటీ వాతావరణాన్ని తట్టుకుని నిలబడి ఉన్నతస్థాయి చేరుకోవడానికి పాఠశాలల్లో ఇంగ్లీషు మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించింనట్లు తెలిపారు. ఇటీవల హైకోర్టు తీర్పు నేపథ్యంలో ప్రస్తుత 2019 – 2020 విద్యాసంవత్సరంలో 1 నుంచి 5వ తరగతి వరకూ చదువుతున్న తల్లిదండ్రుల అభిప్రాయాలను తెలుసుకునేందుకుగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. క్షేత్రస్థాయిలో వారి అభిప్రాయాలను లిఖితపూర్వకంగా తీసుకుంది. 3 ఆప్షన్లతో కూడిన ప్రత్యేక ఫార్మాట్‌ను వాలంటీర్ల ద్వారా తల్లిదండ్రులకు చేరవేశారు. ఇంగ్లిషు మీడియంలో బోధిస్తూ, తెలుగు తప్పనిసరి సబ్జెక్టు, తెలుగు మీడియం, ఇతర భాషా మీడియం ఈ మూడు ఆప్షన్లపై తల్లిదండ్రులు, స్వేచ్ఛగా టిక్‌చేసి, సంతకాలు చేసి ప్రభుత్వానికి పంపించారు.

నేటి నుంచే ఏపీలో పెన్షన్ల పంపిణీ!

ఈ విద్యా సంవత్సరంలో 1 నుంచి 5వ తరగతి వరకూ 17,87,035 మంది విద్యార్థులు ఉంటే.. 17,85,669 మంది తమ ఐచ్ఛికాన్ని తెలియజేస్తూ సంతకాలు చేసి ప్రభుత్వానికి పంపగా… ఇందులో మొదటి ఐచ్ఛికాన్ని టిక్‌ చేస్తూ, తమ అంగీకారం తెలుపుతూ 96.17శాతం మంది తల్లిదండ్రులు ఇంగ్లీషు మీడియంలో బోధనకే ఓటు వేశారని చెప్పారు. తెలుగు మీడియంను కోరుకున్నవారు 3.05 శాతం మంది, ఇతర భాషా మీడియం కోరుకున్న వారు 0.78 శాతం ఉన్నారని తెలిపారు.ఏప్రిల్‌ 29 వరకు వచ్చిన వివరాల ప్రకారం ఈ గణాంకాలు నమోదయ్యాయని అధికారులు తెలిపారు.