
గత కొద్ది రోజులుగా తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టడంతో రాష్ట్ర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో రాజధానిలో కోవిద్ కేసులు తగ్గక పోవడం కొంత ఆందోళనకరంగా ఉంది. నిన్న ఒక్కరోజే మరో 22 కొత్త కేసులు నమోదయ్యాయి. దింతో మొత్తం బాధితుల సంఖ్య 1038కి పెరిగింది.ఈ మహమ్మారికి రాష్ట్రంలో మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోవడంతో మృతుల సంఖ్య 28కి చేరింది.తాజాగా నమోదైన అన్ని కేసులు కూడా హైదరాబాద్ పరిధిలోనివే కావడం ఆందోళన కలిగిస్తోంది. గత కొద్ది రోజుల నుంచి కూడా రాజధానిలోనే బాధితులు పెరుగుతున్నారు. తాజా కేసుల్లో మార్కెట్లో పనిచేస్తున్న వారి ద్వారా పలువురికి వ్యాప్తి చెందినట్లుగా గుర్తించారు. మలక్పేటగంజ్లో పనిచేస్తున్న పహాడీషరీఫ్, జల్పల్లికి చెందిన ఇద్దరు వ్యక్తుల ద్వారా మార్కెట్లో మరో మూడు షాపుల యజమానులకు ఈ వైరస్ సోకింది. తద్వారా వారి కుటుంబసభ్యులకూ కొవిడ్ వ్యాప్తి చెందడంతో వారందరినీ ఐసోలేషన్ లో ఉంచారు.మలక్ పేటగంజ్, పహాడీషరీఫ్ లను కంటెయిన్ మెంటు ప్రాంతాలుగా ప్రకటించారు.
మరోవైపు కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల పట్ల కేంద్ర అంతర్ మంత్రిత్వ శాఖ బృందం (ఐఎంసీటీ) సంతృప్తి వ్యక్తంచేసింది. రాష్ట్రంలో పర్యటిస్తున్న ఆ బృందం కేంద్ర హోంశాఖకు నివేదిక ఇచ్చింది. క్షేత్రస్థాయిలో నెలకొన్న పరిస్థితులు, కొన్ని లోపాల గురించి అందులో పేర్కొంది.




















2007 లో `లక్ష్మి కళ్యాణం’ చిత్రం తో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన కాజల్ అగర్వాల్ తన పదమూడేళ్ల సినీ ప్రయాణం చాలా బాగా చేసిందనే చెప్పాలి. ఇంకా చెప్పాలంటే ఇప్పటికీ హీరోయిన్ గా కొనసాగుతూనే ఉండటం అభినందనీయం. ప్రస్తుతం పలు పెద్ద సినిమా ఆఫర్లను అందు కొంటూ ముందుకు సాగుతోంది . ప్రస్తుతం ‘ముంబై సాగా’ అనే మల్టీ స్టారర్ హిందీ సినిమా తో పాటు , కమల్ హాసన్ ప్రెస్టీజియస్ మూవీ `ఇండియన్ 2’ చిత్రం , ` హే సినామికా’ , `పారిస్ పారిస్ ` అనే తమిళ చిత్రంలో కూడా నటిస్తోంది. అలాగే తెలుగులో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘ఆచార్య’లో కూడా కథానాయికగా అవకాశం దక్కించుకుంది. అవన్నీ అలావుంటే ఇపుడు మరో భారీ చిత్రం కూడా కాజల్ ని వరించినట్టు తెలుస్తోంది .










