
దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించి నేటికి 68 రోజులవుతోంది. మే 31తో ఇది ముగియబోతోంది. ఈ నేపథ్యంలో కేంద్రం లాక్డౌన్ 5.0కు సంబంధించిన ప్రణాళికల్లో పడింది. ఈ మేరకు రోడ్ మ్యాప్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈసారి మాల్స్, రెస్టారెంట్లు తిరిగి తెరవడానికి , పరిమితులను తగ్గించడానికి వీలుగా కేంద్రం సన్నాహాలు చేస్తోంది. కంటైన్మెంట్ జోన్లలో మాత్రమే లాక్ డౌన్ కొనసాగేలా కొత్త నిబంధనలు విధించనున్నట్లు తెలుస్తోంది.
మే 31న ప్రధాని మోడీ మన్ కీబీత్ కార్యాక్రమం నిర్వహిస్తున్నారు. ఇందులో ఈసారి మరికొన్ని సడలింపులు .. కీలక నిర్ణయాల దిశగా ఆలోచిస్తున్నట్టు సమాచారం.
లాక్ డౌన్ 5.0లో ప్రధానంగా దేశంలోని 11 నగరాలపైనే దృష్టి సారించబోతున్నారట.. ఈ 11 నగరాల్లోనే దేశవ్యాప్తంగా 70శాతం కేసులు వెలుగుచూస్తున్న దృష్ట్యా ఇక్కడే లాక్ డౌన్ ను పటిష్టంగా అమలు చేయాలని మోడీ ప్రణాళిక రెడీ చేస్తున్నట్టు తెలుస్తోంది.
జూన్ 1 నుంచి మొదలయ్యే లాక్ డౌన్ 5.0లో ముఖ్యంగా ఢిల్లీ, ముంబై, బెంగళూరు, పుణే, థానే, ఇండోర్, చెన్నై, అహ్మదాబాద్, జైపూర్, సూరత్, కోల్ కతా నగరాల్లో కరోనా కట్టడిపై ఫోకస్ చేయనున్నారని తెలిసింది. దేశవ్యాప్తంగా నమోదైన 1.51 లక్షల కేసుల్లో కేవలం ముంబై, ఢిల్లీ, ఫుణే, కోల్ కతా, అహ్మదాబాద్ లలోనే 60శాతం కేసులు నమోదయ్యాయి. ఈ నగరాల్లోనే నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టనుంది.
దేశవ్యాప్తంగా మొత్తం కరోనా కేసుల్లో 80శాతం నమోదవుతున్న 30 మున్సిపల్ కార్పొరేషన్లతో కూడిన జాబితాను కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే సిద్ధం చేసిందని.. ఈసారి అక్కడ గట్టిగా లాక్ డౌన్ విధించి దేశమంతా భారీ సడలింపులు ఇస్తుందని సమాచారం.
ప్రధానంగా ఈ లాక్డౌన్ 5.0లో దేవాలయాలు, మసీదులు, చర్చీలు తెరుచుకునేందుకు అనుమతించే ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. ప్రార్థనా స్థలాల్లో భారీగా ప్రజలు గుమిగూడడం నిషేధిస్తూ నిబంధనలు పాటించేలా అనుమతించేందుకు కేంద్రం మొగ్గుచూపే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రార్థనా స్థలాలకు జూన్ 1 నుంచి అనుమతించాలని కర్ణాటక ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఇక లాక్డౌన్ 5.0లో జిమ్ లకు కూడా అనుమతించేందుకు కేంద్రం రెడీ అవుతోంది. అయితే కంటైన్మెంట్ జోన్లు మినహా అన్ని చోట్ల జిమ్ లు తిరిగి ప్రారంభం కాబోతున్నాయి. ప్రతీ ఒక్కరు మాస్క్ , భౌతిక దూరంతో ఇవన్నీ నడవనున్నాయి.
ఢిల్లీ ఇతర మెట్రోలను ప్రారంభించే యోచనలో కేంద్రం ఉంది. మార్కెట్లు తెరవడంతోపాటు మతపరమైన ప్రార్థనాలయాలు కూడా తెరువనున్నట్టు తెలుస్తోంది. విద్యాసంస్థలు కనీసం 10 రోజులు మాత్రమే తెరువాలని కేంద్రం ప్లాన్ చేస్తోందని సమాచారం. కంటైన్ మెంట్ జోన్లలో మాత్రం నిబంధనలు కఠినతరం చేయాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది.
జూన్ 1 నుంచి కరోనా ప్రబలే కంటైన్ మెంట్ జోన్ల నిర్ణయాధికారం అక్కడి మున్సిపల్ కార్పొరేషన్లకు కేంద్రం కట్టబెడుతోంది. కొత్త మార్గదర్శకాలు 70శాతం కేసులు దేశంలో నమోదవుతున్న 13 నగరాల్లో మరింత కఠినంగా రూపొందిస్తున్నారు. ముంబై, చెన్నై, ఢిల్లీ, అహ్మదాబాద్, థానే, ఫుణే, హైదరాబాద్, కోల్ కతా, మరియు దాని పక్కనే ఉన్న హౌరా, ఇండోర్, జైపూర్ , జోద్ పూర్, చెంగల్పట్టు , తిరువల్లూరు. ఈ నగరాల్లో దేశంలోనే మూడు నగరాలు ఉన్న రాష్ట్రం మహారాష్ట్ర. ఈ నగరాల్లో కేంద్రం కఠినమైన చర్యల దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది.
-నరేశ్ ఎన్నం
బాలయ్య నోటిదురుసు.. టీడీపీకి భారీ నష్టమా?
రాజకీయాల్లో హత్యలుండవు.. ఆత్మహత్యలే ఉంటాయని చాలా గొప్ప సామెత ఉంది. ఇప్పుడు దాన్ని అక్షరాల నిజం చేసుకుంటున్నారు మన అగ్రహీరో, టీడీపీ ఎమ్మెల్యే బాలయ్య అని టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతోందట… 151మంది ఎమ్మెల్యేలతో గెలిచి అఖండ మెజార్టీ సాధించిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ వచ్చే ఎన్నికల నాటికి మరింత బలంగా తయారవుతున్నాడు. ఆయనను ఆపడం ఒక్క చంద్రబాబుతో అయ్యే పని కాదు. లోకేష్ అంత బలంగా లేడు. ఈ నేపథ్యంలో విడిపోయిన టీడీపీ, జనసేన ఒక్కటవ్వాలని చూస్తున్న వేళ బాలయ్య మాటలు ఇప్పుడు ఆ రెండు పార్టీల మధ్య చిచ్చుపెట్టాయని విశ్లేషకులు చెబుతున్నారు.
*బాబు-పవన్ దోస్తీ దిశగా..
ఏపీలో విడిపోయి పోటీచేసి దారుణంగా దెబ్బతిన్న చంద్రబాబు, పవన్ లు దోస్తీ దిశగా అడుగులు వేస్తున్నారు. పవన్ ఇప్పటికే బీజేపీతో కలిసిపోగా.. వచ్చే ఎన్నికల నాటికి టీడీపీని కలుపుకుపోయి త్రిముఖ పార్టీలు కలిసి పోటీచేసి జగన్ ను ఓడించాలని చంద్రబాబు ప్లాన్ చేస్తున్నట్టు ఆ పార్టీలో ప్రచారం సాగుతోంది. అలాంటి పొత్తుకు ఇప్పుడు బాలయ్య వ్యాఖ్యలు శరాఘాతంగా మారాయంటున్నారు.. జనసేనతో సంబంధాలు బాలయ్య వ్యాఖ్యలతో దెబ్బతిన్నాయన్న చర్చ టీడీపీలో సాగుతోంది.
*బంధంపై నిప్పులు పోసిన బాలయ్య
తెలంగాణ ప్రభుత్వంతో సినిమాల షూటింగ్ లు, థియేటర్స్ ఓపెనింగ్ కు తనను పిలవలేదని.. భూములు పంచుకుంటున్నారని బాలయ్య సినీ పెద్దలపై చేసిన కామెంట్స్ దుమారం రేపాయి. దీనిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు ఘాటు స్పందించి బాలయ్యను ‘మూసుకొని కూర్చో.. నువ్వు జస్ట్ హీరోవి’ అని కౌంటర్ ఇచ్చాడు. దీంతో దగ్గరవుదామనుకున్న జనసేన-టీడీపీ బంధానికి బాలయ్య అడ్డుగా మారాడు. బాలయ్య స్వయాన టీడీపీ అధినేత చంద్రబాబు బావమరిదే కాకుండా టీడీపీ ఎమ్మెల్యే. సో బాలయ్య నోటి దురుసు అంతిమంగా జనసేనతో సంబంధాల దిశగా అడుగులు వేస్తున్న టీడీపీకి, చంద్రబాబుకు పెద్ద ఎదురుదెబ్బగా మారిందని టీడీపీ వర్గాలు వాపోతున్నాయి.
*ఏకాకి అవుతోన్న బాలయ్య
ఇక బాలయ్య నోటిదురుసు కేవలం జనసేనతో సంబంధాలనే కాదు.. తెలంగాణ ప్రభుత్వాన్ని, టాలీవుడ్ సినీ పరిశ్రమను కూడా కెలికినట్టు అయ్యింది. దీంతో ఇప్పుడు అందరూ దూరమయ్యే చాన్స్ కనిపిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం ఊరుకునే అవకాశాలు లేవు. బాలయ్య వ్యాపారాలు, సినిమాలకు అనుమతుల విషయంలో మోకాలడ్డే అవకాశాలున్నాయి. ఇటు సినీ పెద్దలు సైతం బాలయ్యను ఏకాకిని చేసే అవకాశాలున్నాయంటున్నారు. మొత్తంగా బాలయ్య నోటి నుంచి వచ్చిన విమర్శలు టీడీపీకి తీవ్ర నష్టం తేగా.. బాలయ్యను సినీ ఇండస్ట్రీలో ఏకాకిని చేశాయనే చెప్పాలి.
-నరేశ్ ఎన్నం