
ఇఎస్ఐ స్కామ్ లో మాజీ మంత్రి కుమారుడు, ఆయన పీఎస్ హైకోర్టు లో బెయిల్ పిటీషన్ దాఖలు చేయడం ఇప్పుడు చర్చకు దారితీసింది. అసలు స్కామ్ జరగలేదని, స్కామ్ తో మంత్రులకు సంబంధం లేదని టీడీపీ నేతలు రకరకాల వాదనలు వినిపించారు. తాజాగా మాజీ మంత్రి పితాని సత్యనారాయణ కుమారుడు, వ్యక్తి గత కార్యదర్శి బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం వెనుక ఉన్న కారణాలు ఏమిటనే విషయం ఇప్పుడు అందరిని వేధిస్తోంది. ఏ తప్పు చేయకపోతే బెయిల్ ఎందుకు దాఖలు చేశారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఇఎస్ఐ స్కామ్ లో అచ్చెన్నాయుడు, అధికారులతోపాటు మాజీ మంత్రి పితాని సత్యనారాయణ కుమారుడు సురేష్ ను అరెస్టు చేస్తారని వాదనలు వినిపించాయి. అయితే అచ్చెన్నాయుడు తప్ప ఇతర రాజకీయ నాయకుల పేర్లు చార్జిషీట్ లో లేవని అప్పట్లో ఏసీబీ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం పితాని సురేష్, మాజీ మంత్రి వ్యక్తిగత కార్యదర్శి మురళీమోహన్ లు ఇఎస్ఐ స్కామ్ కు సంబంధించి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో విచారించిన హైకోర్టు తీర్పును రిజర్వు చేసింది.
చంద్రబాబు 2018లో మంత్రి వర్గ విస్తరణ చేపట్టిన సమయంలో అచ్చెన్నాయుడు వద్ద ఉన్న కార్మిక శాఖను పితాని సత్యనారాయణకు అప్పగించారు. అచ్చెన్నాయుడు వద్ద ప్రారంభమైన ఈ కుంభకోనాన్ని తరువాత మంత్రి పితాని ఆధ్వర్యంలో ఆయన కుమారుడు, పీఎస్ జోక్యంతో ముందుకు నడిపించారనేది స్పష్టం అవుతుందని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. అయితే ఈ కేసులో నాకు, నా కుటుంబ సభ్యులకు ఎటువంటి సంబంధం లేదని మాజీ మంత్రి పితాని గతంలో వెల్లడించారు.
కేసీఆర్ చరిష్మాకు.. కరోనా చెక్ పెట్టిందా?
ఇఎస్ఐ స్కామ్ విచారణలో భాగంగా మరి కొందరు టీడీపీ నేతల పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. అచ్చెన్నాయుడు అరెస్ట్ సమయంలో మాజీ సీఎం చంద్రబాబు తనయుడు మాజీ మంత్రి నారా లోకేష్ హస్తం ఉందనే ఆరోపణలు వచ్చాయి. అచ్చెన్నాయుడు విచారణలో లోకేష్ పేరు ప్రస్తావించకపోవడంతో ప్రస్తుతానికి బయట పడ్డా భవిష్యత్తులో లోకేష్ కు ఇబ్బందులు తప్పవనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇదే పరిస్థితి తలెత్తితే లోకేష్ ముందస్తు బైయిల్ కు అప్లయ్ చేయాల్సి వస్తుంది. భవిష్యత్తు లో ఈ కేసు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే.



ఉన్నత చదువులు చదివి మంచి మంచి జాబులు చేస్తూ.. లక్షలు గడించి, విలాసవంతమైన బ్రతుకు, జీవితాన్ని రంగుల మయం చేసుకోవాలనే ఆలోచన, తల్లిదండ్రులకు వృధాప్యంలో తోడు నీడగా ఉండాలని.. కోటి ఆశలతో, ఆశయాలతో విదేశాలకు వెళ్లిన యువత పరిస్థితి ఇప్పుడు చాలా దారుణంగా మారింది. వారి విదేశీ చదువుల కోసం లక్షల లక్షలు అప్పులు చేసినా తల్లిదండ్రుల స్థితి ఇప్పుడు అంధకారంగా మారింది.
కరోనా వైరస్ గురించి ఒక వార్త హల్ చల్ చేస్తోంది. మరో రెండేళ్లపాటు కరోనాతో సహజీవనం చేయాల్సి ఉంటుందని చెప్పిన అధికారులకు శాస్త్రవేత్తలు ఆశ్చర్యపడే ప్రకటన చేశారు. శాస్త్రవేత్తలు చేస్తున్న ప్రయోగాల్లో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా గాలి ద్వారా కూడా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందని చెప్పారు. దీంతో కరోనాకి కళ్ళెం వేయడం ఇక కష్టమే అనుకున్నారు. అయితే కొందరు శాస్త్రవేత్తలు మాత్రం కరోనా కాలపరిమితిని డిసైడ్ చేశారు. వారి ప్రయోగ ఫలితాల ప్రకారం మరో రెండు నెలల్లోనే కరోనా క్షీణ దశకు చేరుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.




కరోనా మహమ్మారి ని ఎదుర్కోవటంలో కేరళ ప్రభుత్వం బాగా పనిచేసిందని భారత ప్రభుత్వం తో పాటు అంతర్జాతీయ సంస్థలు కూడా కితాబిచ్చాయి. కేరళ ముఖ్యమంత్రి , ఆరోగ్యశాఖ మంత్రి కి ఈ సందర్భంగా మంచిపేరొచ్చింది. దీనితో కేరళ వామపక్ష ప్రభుత్వానికి డోకాలేదని ఈసారి సంప్రదాయానికి భిన్నంగా వచ్చే ఎన్నికల్లోనూ వామపక్ష ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని డంకా బజాయించి చెప్పారు పరిశీలకులు. రాజకీయాల్లో ఏ రోజు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. ఇప్పుడు మొత్తం సీన్ మారింది. ఎక్కడ కదిలించినా దొంగ బంగారం కేసే అందరి నోళ్ళలో నానుతుంది. మామూలుగా అయితే అది ఎప్పటిలాగే పేపర్లలో ఒక వార్తలాగా వుండేది. కానీ దాని మూలాలు ముఖ్యమంత్రి కార్యాలయం లో ఉండటంతో ఇది సంచలన వార్త అయ్యింది.


















