Home Blog Page 8415

ఈఎస్‌ఐ స్కాం.. భుజాలు తడుముకుంటున్న s/o పితాని!


ఇఎస్ఐ స్కామ్ లో మాజీ మంత్రి కుమారుడు, ఆయన పీఎస్ హైకోర్టు లో బెయిల్ పిటీషన్ దాఖలు చేయడం ఇప్పుడు చర్చకు దారితీసింది. అసలు స్కామ్ జరగలేదని, స్కామ్ తో మంత్రులకు సంబంధం లేదని టీడీపీ నేతలు రకరకాల వాదనలు వినిపించారు. తాజాగా మాజీ మంత్రి పితాని సత్యనారాయణ కుమారుడు, వ్యక్తి గత కార్యదర్శి బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం వెనుక ఉన్న కారణాలు ఏమిటనే విషయం ఇప్పుడు అందరిని వేధిస్తోంది. ఏ తప్పు చేయకపోతే బెయిల్ ఎందుకు దాఖలు చేశారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఒక్కసారిగా మారిన కేరళ రాజకీయం

ఇఎస్ఐ స్కామ్ లో అచ్చెన్నాయుడు, అధికారులతోపాటు మాజీ మంత్రి పితాని సత్యనారాయణ కుమారుడు సురేష్ ను అరెస్టు చేస్తారని వాదనలు వినిపించాయి. అయితే అచ్చెన్నాయుడు తప్ప ఇతర రాజకీయ నాయకుల పేర్లు చార్జిషీట్ లో లేవని అప్పట్లో ఏసీబీ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం పితాని సురేష్, మాజీ మంత్రి వ్యక్తిగత కార్యదర్శి మురళీమోహన్ లు ఇఎస్ఐ స్కామ్ కు సంబంధించి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో విచారించిన హైకోర్టు తీర్పును రిజర్వు చేసింది.

చంద్రబాబు 2018లో మంత్రి వర్గ విస్తరణ చేపట్టిన సమయంలో అచ్చెన్నాయుడు వద్ద ఉన్న కార్మిక శాఖను పితాని సత్యనారాయణకు అప్పగించారు. అచ్చెన్నాయుడు వద్ద ప్రారంభమైన ఈ కుంభకోనాన్ని తరువాత మంత్రి పితాని ఆధ్వర్యంలో ఆయన కుమారుడు, పీఎస్ జోక్యంతో ముందుకు నడిపించారనేది స్పష్టం అవుతుందని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. అయితే ఈ కేసులో నాకు, నా కుటుంబ సభ్యులకు ఎటువంటి సంబంధం లేదని మాజీ మంత్రి పితాని గతంలో వెల్లడించారు.

కేసీఆర్ చరిష్మాకు.. కరోనా చెక్ పెట్టిందా?

ఇఎస్ఐ స్కామ్ విచారణలో భాగంగా మరి కొందరు టీడీపీ నేతల పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. అచ్చెన్నాయుడు అరెస్ట్ సమయంలో మాజీ సీఎం చంద్రబాబు తనయుడు మాజీ మంత్రి నారా లోకేష్ హస్తం ఉందనే ఆరోపణలు వచ్చాయి. అచ్చెన్నాయుడు విచారణలో లోకేష్ పేరు ప్రస్తావించకపోవడంతో ప్రస్తుతానికి బయట పడ్డా భవిష్యత్తులో లోకేష్ కు ఇబ్బందులు తప్పవనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇదే పరిస్థితి తలెత్తితే లోకేష్ ముందస్తు బైయిల్ కు అప్లయ్ చేయాల్సి వస్తుంది. భవిష్యత్తు లో ఈ కేసు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే.

‘పాజిటీవ్’ కేసుల్లో తెలంగాణ టాప్.. కానీ?


తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు రోజుకు రోజుకు పెరిపోతున్నాయి. గడిచిన వారంరోజులుగా కేసుల గతంలో కంటే రెట్టింపు సంఖ్యలో నమోదవుతున్నాయి. దేశంలో ఇప్పటివరకు మహారాష్ట్ర, ఢిల్లీ రాష్ట్రాలు పాజిటివ్ కేసుల్లో ముందంజలో ఉండేవి. ప్రస్తుతం తెలంగాణ ఆ రాష్ట్రాలను వెనక్కి నెట్టి పాజిటివ్ రేటులో టాప్ ప్లేసులో కొనసాగుతోంది. జులై 8నాటికి రాష్ట్రంలో పాజిటివ్ రేటు 21.91శాతం నమోదైంది. ఇది జాతీయ పాజిటివ్ రేటు(7.14 శాతం)తో పోలిస్తే మూడింతలు అధికంగా నమోదుకావడం ఆందోళనకు గురిచేస్తోంది. అయితే మరణాల రేటు తెలంగాణ తగ్గటం ఊరటనిచ్చే అంశంగా కన్పిస్తుంది. కొద్దిరోజుల క్రితం వరకు తెలంగాణ మరణాల రేటు 2.14శాతంగా ఉండగా ప్రస్తుతం 1.10శాతానికి తగ్గింది.

ఒక్కసారిగా మారిన కేరళ రాజకీయం

తెలంగాణలో మార్చి 2న తొలి కరోనా కేసు నమోదుకాగా ప్రస్తుతం ఆ సంఖ్య 30వేలకు చేరువలో ఉంది. గడిచిన పదిరోజుల్లోనే కేసుల సంఖ్య రెట్టింపు సంఖ్యలో నమోదయ్యాయి. రాష్ట్రంలో జూన్ 29నుంచి జులై 8 మధ్య 52,163మందికి కరోనా టెస్టులు నిర్వహించగా 15,117మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. అంటే కేవలం పదిరోజుల్లో రాష్ట్రంలో కరోనా కేసులు రెట్టింపు అయినట్లు తెలుస్తోంది. దీంతో వైరస్ తెలంగాణలో ఏమేరకు విజృంభిస్తుందో అర్థం చేసుకోవచ్చు.

మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే తెలంగాణలో టెస్టుల సంఖ్య తక్కువగా చేస్తున్నారు. టెస్టులు ఎక్కువగా చేస్తే ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. తెలంగాణలో జూలై 9న నాటికి 1,40,755 టెస్టులు చేశారు. మన పక్కా రాష్ట్రం ఏపీ కరోనా టెస్టుల సంఖ్యలో దేశంలోనే అగ్రస్థానంలో ఉండగా తెలంగాణ చివరి స్థానంలో ఉండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేరళలో 2.96 లక్షలు, ఒడిశా 3.02లక్షలు, ఛత్తీస్‌గఢ్ 1.91లక్షలు, జార్ఖండ్ 1.61లక్షల టెస్టులతో మనకంటే మెరుగ్గా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ లెక్కల ద్వారా వెల్లడవుతోంది.

కేసీఆర్ చరిష్మాకు.. కరోనా చెక్ పెట్టిందా?

తెలంగాణలో ప్రతీ పదిలక్షల మందిలో 3,430మందికి కోవిడ్ టెస్టులు చేస్తుండగా పాజిటివ్ రేటు 21.91శాతంగా నమోదవుతోంది. దేశంలో అత్యధిక కరోనా కేసులు ఉన్న మహారాష్ట్రలో ప్రతీ మిలియన్ జనాభాలో 9,564మంది టెస్టులు చేస్తుండగా పాజిటివ్ రేటు18.73గా నమోదవుతోంది. ఢిల్లీలో పది లక్షల మందిలో 35,993మందికి టెస్టులు చేస్తుండగా 14.94శాతంగా ఉంది. ఏపీలో పది లక్షల మందిలో 20,498మందికి టెస్టులు చేస్తుండటా పాజిటివ్ రేటు 2.8 శాతంగా నమోదవుతోంది. తెలంగాణలో రోజుకు సగటున 1800కిపైగా కేసులు నమోదవుతూ పాజిటివ్ రేటులో దేశంలోనే టాప్ ప్లేసులోకి చేరుకుంది.

కరోనా కేసులు రాష్ట్రంలో వేగంగా రెట్టింపు అవుతున్నప్పటికీ తెలంగాణవాసులకు ఒక అంశం ఊరటనిస్తోంది. జాతీయ స్థాయి మరణాల రేటుతో పోల్చుకుంటే తెలంగాణలో చాలా తక్కువగా నమోదవుతున్నాయి. జాతీయ స్థాయిలో కరోనా మరణాల రేటు 3.02శాతం ఉండగా రాష్ట్రంలో 1.10శాతంగా ఉంది. కొద్దిరోజుల క్రితం వరకు 2.14 శాతంగా ఉన్న మరణాల రేటు ప్రస్తుతం 1.10శాతానికి తగ్గించడంలో ప్రభుత్వ యంత్రాంగం సఫలమైంది. అయితే ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపడుతున్నప్పటికీ కేసులు సంఖ్య పెరిగిపోతుండంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

రాష్ట్రంలో కేసుల సంఖ్య కేవలం తొమ్మిదిరోజుల వ్యవధిలో రెట్టింపు అవుతుండటం గమనార్హం. సీఎం కేసీఆర్ ఇప్పటికైనా కరోనా కట్టడికి మరిన్ని కఠిన చర్యలు తీసుకోవాలని పెద్దఎత్తున డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. దీంతో సీఎం కేసీఆర్ ఎలాంటి చర్యలు తీసుకుంటారనే ఆసక్తి అందరిలో నెలకొంది.

ఇక చాల్లే.. విదేశీ చదువులు ఇంటికి రండి!

ఉన్నత చదువులు చదివి మంచి మంచి జాబులు చేస్తూ.. లక్షలు గడించి, విలాసవంతమైన బ్రతుకు, జీవితాన్ని రంగుల మయం చేసుకోవాలనే ఆలోచన, తల్లిదండ్రులకు వృధాప్యంలో తోడు నీడగా ఉండాలని.. కోటి ఆశలతో, ఆశయాలతో విదేశాలకు వెళ్లిన యువత పరిస్థితి ఇప్పుడు చాలా దారుణంగా మారింది. వారి విదేశీ చదువుల కోసం లక్షల లక్షలు అప్పులు చేసినా తల్లిదండ్రుల స్థితి ఇప్పుడు అంధకారంగా మారింది.

అయితే పై చదువుల కోసం విదేశాల్లో ఇరుక్కుపోయిన తెలుగు విద్యార్థులను ఆదుకునేందుకు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్రభుత్వం నడుం బిగించింది. ఆ విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు వీలుగా అమెరికాలోని ఏపీ ఓవర్సీస్‌ ఎడ్యుకేషన్‌ విభాగాన్ని అప్రమత్తం చేసింది. ఏపీ సీఎంఓ అధికారులు ఇప్పటికే ఓవర్సిస్‌ విభాగం కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ కుమార్‌ అన్నవరపుతో అక్కడి పరిస్థితిపై చ‌ర్చించారు.  ఆన్‌ లైన్‌ కోర్సులు అభ్యసిస్తున్న ఇతర దేశాల విద్యార్థులు దేశాన్ని విడిచి వెళ్లిపోవాలంటూ అమెరికా ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలతో తెలుగు విద్యార్థుల్లోనూ అయోమ‌య స్థితి నెల‌కొంది.

కరోనా వైరస్‌ నేపథ్యంలో అమెరికాలోని యూనివర్సిటీలు ముందు జాగ్రత్తగా తమ కోర్సులను పూర్తిగా ఆన్‌ లైన్‌ మోడ్‌ లోకి మార్పు చేశాయి. ఈ తరుణంలో ఇతర దేశాల విద్యార్థులు వారి వారి దేశాలకు వెళ్లి పోవాలని యునైటెడ్‌ స్టేట్స్‌ ఇమ్మిగ్రేషన్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ (ఐసీఈ) ఇటీవల ఒక ప్రకటన చేసింది. సెప్టెంబర్‌ నుంచి ప్రారంభం అయ్యే వచ్చే విద్యా సంవత్సరం వరకు వీరికి సమయం ఇచ్చింది.

అమెరికాలో తెలుగు విద్యార్థులు 47 వేల మంది చదువుతుండగా, ఆంధ్రప్రదేశ్‌ కు చెందిన వారు 26 వేల మంది ఉన్నారు. వీరి పరిస్థితిని గమనించిన రాష్ట్ర ప్రభుత్వం వెంటనే యూఎస్‌లోని ఏపీ ఓవర్సీస్‌ ఎడ్యుకేషన్‌ విభాగాన్ని వారికి అండగా ఉండాలని ఆదేశించింది.  జార్జియాటెక్, క్లెమ్స్‌న్‌ స్టేట్‌ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్‌ టెక్సాస్‌ ఆస్టిన్, టెక్సాస్‌ ఏ అండ్‌ ఎం కాలేజీ స్టేషన్, లూసియానా స్టేట్‌ యూనివర్సిటీ, సదరన్‌ ఏ అండ్‌ ఎం యూనివర్సిటీ అలబామా, లామర్‌ వర్సిటీ, డ్యూక్‌ వర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్‌ సౌత్‌ ఫ్లోరిడా, ఎమోరీ వర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్‌ వెస్ట్‌ జార్జియా, జార్జియా స్టేట్‌ యూనివర్సిటీ, టెన్నెస్సీ టెక్‌ వర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్‌ నార్త్‌ టెక్సాస్‌ డెంటన్, యూనివర్సిటీ ఆఫ్‌ కార్పస్‌ క్రిస్టి, కింగ్స్‌విల్లే వర్సిటీ తదితరాల్లో తెలుగు విద్యార్థులు ఎక్కువగా ఉన్నారు.

యూఎస్‌ లోని వివిధ వర్సిటీల్లో చదువుతున్న ఇతర దేశాల విద్యార్థులు

దేశం                     విద్యార్థులు
చైనా                      3,69,548
ఇండియా             2,02,014
సౌత్‌కొరియా         52,250
సౌదీ అరేబియా   37,080
కెనడా                   26,112
వియత్నాం          24,392
తైవాన్‌                   23,369
జపాన్‌                   18,105

రెండేళ్ళు సహజీవనం అన్నారుగా.. ఇంతలోనే, ఏంటి ఇలా?

కరోనా వైరస్ గురించి ఒక వార్త హల్ చల్ చేస్తోంది. మరో రెండేళ్లపాటు కరోనాతో సహజీవనం చేయాల్సి ఉంటుందని చెప్పిన అధికారులకు శాస్త్రవేత్తలు ఆశ్చర్యపడే ప్రకటన చేశారు. శాస్త్రవేత్తలు చేస్తున్న ప్రయోగాల్లో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా గాలి ద్వారా కూడా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందని చెప్పారు. దీంతో కరోనాకి కళ్ళెం వేయడం ఇక కష్టమే అనుకున్నారు. అయితే కొందరు శాస్త్రవేత్తలు మాత్రం కరోనా కాలపరిమితిని డిసైడ్ చేశారు. వారి ప్రయోగ ఫలితాల ప్రకారం మరో రెండు నెలల్లోనే కరోనా క్షీణ దశకు చేరుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఇతర దేశాలతో పోలిస్తే భారత్ లో కరోనా క్షీణిస్తోందని శాస్త్రవేత్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కొందరు శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేసి త్వరలో భారత్ తో పాటు ఇతర దేశాల్లో కూడా వైరస్ అంతమవుతుందని అభిప్రాయపడుతున్నారు.ఇటాలియన్ అంటువ్యాధుల స్పెషలిస్ట్ మేటియో బసెట్టి వైరస్ రోజురోజుకు బలహీనపడుతోందని… ఇదే పరిస్థితి కొనసాగితే వ్యాక్సిన్ లేకుండానే వైరస్ అంతమవుతుందని అభిప్రాయం వ్యక్తం చేశాడు. గతంతో పోలిస్తే కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోందని…. సెప్టెంబర్ 19 నాటికి వైరస్ పూర్తిగా అంతమవుతుందని పలు జర్నల్స్ లో కథనాలు ప్రచురితమవుతున్నాయి.

ఎన్నికల తర్వాత కథ అంటూ.. ‘పవర్ స్టార్’ ఫస్ట్‌లుక్


సెన్సేషనల్‌ డైరెక్టర్ రామ్‌ గోపాల్‌ వర్మ ఫుల్‌ ఫామ్‌లో ఉన్నాడు. కరోనా టైమ్‌లో తెగ కష్టపడుతున్నాడు. లాక్‌డౌన్‌లో మెయిన్‌ స్ట్రీమ్‌ సినిమాలు, షూటింగ్స్‌, థియేటర్లు ఆగిపోగా.. రాము మాత్రం డిజిటల్‌ మీడియాలో దూసుకెళ్తున్నాడు. వరుస పెట్టి సినిమాలు అనౌన్స్‌ చేస్తూ… రోజుల వ్యవధిలో షూటింగ్స్‌ పూర్తి చేస్తూ..నెట్‌లో రిలీజ్‌ చేస్తూ తెగ సంపాదిస్తున్నాడు. సోషల్‌ మీడియాను ఓ రేంజ్‌లో వాడేసుకుంటూ పైసా ఖర్చు లేకుండా తన మూవీస్‌ను ప్రమోట్‌ చేసుకుంటున్నాడు. కరోనాపై ఓ సినిమా తీస్తున్న ఆర్జీవీ.. ఇప్పటికే ‘క్లైమాక్స్‌’ ‘నగ్నం’ మూవీస్‌ను తన ఆర్జీవీ వరల్డ్‌ థియేటర్లో రిలీజ్‌ చేశాడు. మరో అర డజను చిత్రాలను అనౌన్స్‌ చేశాడు. అందులో ఒకటి ‘పవర్ స్టార్’ మూవీ. అచ్చం పవన్‌ కళ్యాణ్‌ను పోలిన ఓ వ్యక్తిని హీరోగా పెట్టి ఈ మూవీ తీస్తున్న ఆర్జీవీ మరో వివాదానికి తెర లేపాడు. రాము నేరుగా చెప్పకపోయినా పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ పొలిటికల్‌ లైఫ్‌ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టు అర్థమవుతోంది.

ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్ తో పాటు పలు ఫొటోలను ఆర్జీవీ ఈ రోజు సోషల్‌ మీడియాలో రిలీజ్‌ చేశాడు. ఎన్నికల తర్వాత కథ అనే ట్యాగ్‌లైన్‌తో పాటు టైటిల్‌ మధ్య గాజు గ్లాసును కూడా ఉంచాడు. మొన్నటి ఎన్నికల్లో ఇది జనసేన ఎన్నికల గుర్తు కావడం విశేషం. హీరో దిగాలుగా కూర్చొని ఆలోచిస్తున్న ఫొటోతో ఫస్ట్‌ లుక్‌ రివీల్‌ చేసిన వర్మ.. ఆపై, ఇద్దరు అన్నదమ్ములు అంటూ చిరంజీవి, పవన్‌ కల్యాణ్‌ను పోలి ఉన్న నటుల ఫొటోలను పోస్ట్ చేశాడు. ‘పవర్ స్టార్’ తెల్లటి కుర్తాలో ఉన్న మరో ఫొటో రిలీజ్‌ చేశాడు. కొద్దిసేపటికే… కళ్ల జోడు, ఓ చేతిలో కాఫీ కప్పు, మరో చేతిలో పుస్తకం, మెడలో ఎర్ర కండువా వేసుకున్న ప్రధాన పాత్ర ధారి ఓ మహిళను చూస్తున్న పోస్టర్ను రిలీజ్‌ చేశాడు. దీనికి ‘ఫ్రెంచ్‌ ఆరిజిన్‌కి చెందిన పుస్తకం పాపిలాన్‌ చదువుతున్న సినిమా లీడ్‌ క్యారెక్టర్తో ఇండియన్‌ శారీ కట్టుకున్న ఓ రష్యన్‌ మహిళ. గోడపై అర్జెంటీనియన్‌ లెజెండ్‌ చేగువేరా ఫొటో ఉంది’ అది రాము ట్వీట్‌ చేశాడు. ఆపై, ఓ డైరెక్టర్తో హీరో మాట్లాడుతుండగా, ఇద్దరి మధ్య గొడవ జరిగిన సందర్భంలోది అంటూ మరో రెండు ఫొటోలు షేర్ చేశాడు. ఇందులో డైరెక్టర్ పాత్ర త్రివిక్రమ్‌ను పోలి ఉంది. అయితే, తన సినిమాలో చూపించే క్యారెక్టర్లు.. నిజ జీవితంలోని కొందరు వ్యక్తులను పోలి ఉంటే అది యాదృచ్ఛికమే అని, అవే నిజమని నమ్మొద్దని ఆర్జీవీ ట్వీట్‌ చేశాడు. ఈ మూవీపై కొందరు అనవసరమైన రద్ధాంతం చేసే ప్రయత్నం చేస్తున్నారని, సినిమాలో ఏ ఒక్క క్యారెక్టర్ను కూడా తక్కువగా, కించ పరిచేలా చూపించనని దేవుడి మీద ప్రమాణం చేస్తున్నానని చెప్పాడు. కాగా, ఈ చిత్రాన్ని కూడా ఆర్జీవీ థియేటర్ వరల్డ్‌లో విడుదల చేస్తానని ప్రకటించాడు.

టీటీడీ అధికారుల అర్థంలేని లాజిక్!

Ttd

తిరుమలలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో చిత్తూరు జిల్లా వ్యాప్తంగా 18 మున్సిపాలిటీలు, మండలాల్లో పలు వార్డులు, గ్రామాలను కంటైన్మెంట్ జోన్లుగా జిల్లా యంత్రాంగం ప్రకటించింది. తిరుపతి మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 46కు పైగా కంటైన్మెంట్ జోన్లను నిర్ణయించారు.

అయితే, తిరుమల ఆధ్యాత్మిక క్షేత్రమే తప్ప ప్రజలు నివసించే ప్రదేశం కాదని, కరోనాపాజిటివ్ వచ్చిన వారంతా తిరుపతిలో నివాసం ఉండేవారే తప్ప తిరుమలలో ఉండేవారు కాదని.. అలాంటప్పుడు తిరుమలను కంటైన్మెంట్ జోన్‌ గా ఎలా ప్రకటిస్తారని టీటీడీ అధికారులు అర్థం లేని లాజిక్ వ్యాఖ్యలు చేస్తున్నారు.

మరోవైపు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న తరుణంలో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే ర్యాపిడ్ పరీక్షలను నిర్వహిస్తున్నారు. అయితే అవి లక్ష్యానికి తగ్గట్టుగా జరగడం లేదని, అందులో యాత్రికుల సంఖ్య చాలా తక్కువగా ఉందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పరీక్షలు వేగవంతం చేయాలని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాలు ఆదేశాలు జారీ చేశారు.

“టీటీడీ సిబ్బందికి కరోనా పరీక్షలు పెంచాలి. ముమ్మరంగా చేయాలి. అవసరం ఉన్న వారికి, అనుమానితులకు పరీక్షలు చేయాలి. దానికి తగ్గట్టుగా ట్రూనాట్ మిషన్లను కూడా కొనుగోలు చేయాలని ఆదేశించాం. ఇక ఉద్యోగుల భద్రత ముఖ్యం. వారికి సమస్యలు రాకుండా చూడడానికి ఉద్యోగుల క్యాంటీన్ లో వ్యాధి నిరోధక శక్తిని పెంచే ఆహారం అందించాలని నిర్ణయించాం. ఉద్యోగుల భద్రతపై తగిన శ్రద్ధ పెడుతున్నాం. ఇళ్లకు వెళ్లిన సిబ్బంది వివరాలు కూడా సేకరిస్తున్నాం. వారి ఆరోగ్య పరస్థితిపై ఆరా తీస్తున్నాం” అంటూ ఈవో తెలిపారు.

కరోనావైర‌స్‌ లాక్‌ డౌన్‌ కారణంగా 82 రోజుల పాటు నిలిచిపోయిన దర్శనాలకు గత నెలలో తిరుమల తిరుపతి దేవస్థానం అనుమతిచ్చింది. నాటి నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు నిత్యం దర్శనాలకు వస్తున్నారు. భక్తులతో పాటుగా సిబ్బంది కూడా తగిన జాగ్రత్తలు తీసుకునేలా టీటీడీ ఆదేశాలు ఇచ్చింది. అందుకు అనుగుణంగా ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేసింది. అయినప్పటికీ తిరుమలలో పెరుగుతున్న కరోనావైరస్ పాజిటివ్ కేసులు కలవరం కలిగిస్తున్నాయి.

ఒక్క తిరుమలలోనే ఇప్పటికి 80 మందికిపైగా పాజిటివ్‌ గా తేలారు. దిగువన తిరుపతిలో కేసుల సంఖ్య వేగంగా పెరుగుతుండడం, వారిలో టీటీడీ సిబ్బంది కూడా పెద్ద సంఖ్యలో ఉండడంతో కలవరం మొదలయ్యింది. ఈ నేపథ్యంలో ఉద్యోగుల రక్షణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని టీటీడీ నిర్ణయించింది. ఉద్యోగుల భద్రతకు ఢోకా లేకుండా పరీక్షలు పెంచి, రోగనిరోధక శక్తికి అవసరమైన ఆహారం కూడా అందించాలని టీటీడీ అధికారులు నిర్ణయించారు.

ఒక్కసారిగా మారిన కేరళ రాజకీయం

కరోనా మహమ్మారి ని ఎదుర్కోవటంలో కేరళ ప్రభుత్వం బాగా పనిచేసిందని భారత ప్రభుత్వం తో పాటు అంతర్జాతీయ సంస్థలు కూడా కితాబిచ్చాయి. కేరళ ముఖ్యమంత్రి , ఆరోగ్యశాఖ మంత్రి కి ఈ సందర్భంగా మంచిపేరొచ్చింది. దీనితో కేరళ వామపక్ష ప్రభుత్వానికి డోకాలేదని ఈసారి సంప్రదాయానికి భిన్నంగా వచ్చే ఎన్నికల్లోనూ వామపక్ష ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని డంకా బజాయించి చెప్పారు పరిశీలకులు. రాజకీయాల్లో ఏ రోజు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. ఇప్పుడు మొత్తం సీన్ మారింది. ఎక్కడ కదిలించినా దొంగ బంగారం కేసే అందరి నోళ్ళలో నానుతుంది. మామూలుగా అయితే అది ఎప్పటిలాగే పేపర్లలో ఒక వార్తలాగా వుండేది. కానీ దాని మూలాలు ముఖ్యమంత్రి కార్యాలయం లో ఉండటంతో ఇది సంచలన వార్త అయ్యింది.

కేరళ లో యు ఎ ఇ దౌత్య కార్యాలయం వుంది. గల్ఫ్ దేశాల్లో మలయాళీలు చాలా ఎక్కువమంది పనిచేస్తున్నారు. దానివలన కేరళ కి వచ్చే విదేశీ నిధులు కూడా పెద్ద మొత్తం లోనే వున్నాయి. అందుకే అక్కడ యు ఎ ఇ దౌత్య కార్యాలయం పెట్టింది. అంతవరకూ బాగానే వుంది. కాకపోతే ఇప్పుడు ఈ పేరు దొంగ బంగారం తో ముడి పడింది. సహజంగా దౌత్య వర్గాలకు సంబందించిన కార్గో బ్యాగేజి కస్టమ్స్ అధికారులు చెక్ చేయరు. చేయాలంటే వాళ్ళ అనుమతితోనే చేస్తారు. ఈ సదుపాయాన్ని అంతకుముందు అందులో పనిచేసిన స్వప్న సురేష్ చాలా తెలివిగా వుపయోగించుకుంది. అంతకుముందు తను అందులో పనిచేయటంతో దౌత్య మార్గాల్లో కస్టమ్స్ తనిఖీ ఉండదని తెలియటంతో దాన్నే ఇప్పుడు తెలివిగా తన దొంగ బంగారం తరలించటానికి వాడుకుంది. స్వప్న సురేష్ చాలా తెలివైన, చురుకైన అమ్మాయి. ఎక్కడపనిచేసినా అక్కడ అధికారులతో చనువు పెంచుకోగలదు. మొదట్లో విమానాశ్రయం లో పనిచేసినా , తర్వాత యు ఎ ఇ దౌత్య కార్యాలయంలో పనిచేసినా, ఆ తర్వాత కేరళ ప్రభుత్వం లో పని సంపాదించినా తన తెలివితేటలు, మాటకారితనంతో సాధించుకోగలిగింది. ఆవిడ స్పేస్ పార్క్ లో వుద్యోగం కేరళ ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శి శివశంకర్ ద్వారానే సంపాదించిందంటే తన పలుకుబడిని అర్ధం చేసుకోవాలి. గత కొన్ని సంవత్సరాల్లో సిపిఎం నాయకులు, ఎమ్యెల్యేలు, మంత్రులతో పరిచయాలు పెంచుకోగలిగింది. ఆ సంబంధాలే ఇప్పుడు ఉపయోగపడ్డాయి.

మలయాళీ సినిమా యాక్టర్లు దుబాయ్ వెళ్లి వచ్చేటప్పుడు వాళ్ళతో ఈ దొంగ బంగారం పంపించటం చాలా రోజులనుంచి జరుగుతుంది. ఎవరైనా పట్టుకుంటే స్వప్న సురేష్ తనకున్న రాజకీయ పలుకుబడితో విడిపించేది. సిపిఎం నాయకులతో, ముఖ్యమంత్రి కార్యాలయం తో ఏర్పడిన సంబంధాలు తెలివిగా ఉపయోగించటం మొదలుపెట్టింది. ఇది ఇటీవల ఓ గ్యాంగ్ సినిమా యాక్టర్ ని బెదిరించటం తో ఆ కేసుని విచారిస్తుంటే ఈ దొంగ బంగారం వ్యవహారం బయటపడింది. కొచ్చి పోలీసులు కేసుని కస్టమ్స్ శాఖకు తెలిపారు. అది మెల్లి మెల్లిగా ముఖ్యమంత్రి కార్యాలయం దాకా లింకులు ఉండటంతో సంచలన మయ్యింది. చివరకు జరిగిన నష్టాన్ని పూడ్చుకోవటం కోసం ముఖ్యమంత్రి పిన్నరాయి విజయన్ ప్రధాన కార్యదర్శి శివశంకర్ ని తప్పించటం జరిగింది. అయినా అప్పటికే జరగాల్సిన డామేజి జరిగిపోయింది. స్వప్న సురేష్ కాల్ రికార్డు లో ఎంతోమంది మంత్రులు, సిపిఎం నాయకులు, అధికారులు ఉండటంతో ఈ మకిలీ వ్యవహారం లో ప్రభుత్వం, సిపిఎం పార్టీ ప్రతిష్ట దెబ్బతింది. ప్రతిపక్ష పార్టీలు పిన్నరాయి విజయన్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. దీనివెనక ఇంకా ఎంతమంది వున్నారోనని జనం అనుకుంటున్నారు. ప్రజల ఒత్తిడి మేరకు కేసు దర్యాప్తు కోసం కేంద్రానికి రాయటం , కేంద్రం కేసును జాతీయ దర్యాప్తు సంస్థకు అప్పగించటం చక చకా జరిగిపోయాయి. ఒక్క పదిరోజుల్లో కేరళ రాజకీయ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. మంచి గుడ్ విల్ లో వున్న ప్రభుత్వం ఒక్కసారి సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన పరిస్థితుల్లోకి మారిపోయింది. ఇది కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యు డి ఎఫ్ కి ఏ మేరకు లాభిస్తుందో చూడాలి.

టిక్ టాక్ స్థానం కోసం వివిధ యాప్ ల హడావుడి!

Tik tok
టిక్‌ టాక్‌ సహా 59 చైనీస్ యాప్‌ లపై భారత ప్రభుత్వం నిషేధం విధించిన తర్వాత టిక్‌ టాక్‌ పై ఆధారపడ్డ లక్షల మంది క్రియేటర్లు దిక్కుతోచని స్థితిలోకి వెళ్లిపోయారు. భారత్‌ లో టిక్‌ టాక్ స్థానాన్ని భర్తీ చేసే రేసులోకి ఇన్‌స్టాగ్రామ్ కూడా దిగింది. షార్ట్ వీడియోల షేరింగ్ కోసం ‘రీల్స్’ అనే ఓ కొత్త ఫీచర్‌ ను తీసుకువచ్చింది. టిక్‌ టాక్ తరహాలో 15 సెకన్లలోపు నిడివి ఉండే వీడియోలను ఈ రీల్స్‌ ఫీచర్ ద్వారా ఇన్‌స్టాగ్రామ్‌ లో పెట్టొచ్చు.

షార్ట్ వీడియో షేరింగ్ యాప్‌ ల కేటగిరిలో టిక్‌ టాక్ స్థాయికి తగ్గ యాప్‌ లు ఏవీ లేకపోవడంతో ఒక రకమైన శూన్యత ఏర్పడింది. ఇదే సమయంలో చింగారీ, రొపోసో లాంటి దేశీయ షార్ట్ వీడియో షేరింగ్ సేవలు అందించే యాప్‌ లు తెరపైకి వచ్చాయి. వాటికి వినియోగదారులు వేగంగా పెరుగుతూ వచ్చారు. కానీ, సేవల నాణ్యత గురించి ఫిర్యాదులు వచ్చాయి.

ఒక్కసారిగా పెరిగిన వినియోగదారుల భారాన్ని తట్టుకుని, సంతృప్తికరంగా సేవలు అందించేందుకు ఆ యాప్‌ లు శ్రమిస్తున్నాయి. ఇప్పుడు ఇన్‌స్ట్రాగ్రామ్ లాంటి ఓ పెద్ద యాప్ షార్ట్ వీడియో విభాగంలోకి అడుగుపెట్టడంతో పరిస్థితులు ఆసక్తికరంగా మారాయి.

యోగి బాటలో కేసీఆర్?

Kcr

Kcr
యూపీలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతుండటంతో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మరోసారి రాష్ట్రంలో లాక్‌ డౌన్ విధించేందుకు సిద్ధమైంది. తెలంగాణలో కేసీఆర్ సర్కార్ కూడా లాక్ డౌన్ పై కీలక నిర్ణయం తీసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. గత 13 రోజులుగా కనిపించకుండా ఫామ్ హౌజ్ కే పరితమైన కేసీఆర్ అక్కడనుండి పాలన కొనసాగించే సూచనలు కనిపోయిస్తున్నాయి. కరోనా కేసులు కూడా రోజు రోజుకి పెరగడంతో రాష్ట్రంలో లాక్ డౌన్ కి ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.

యూపీలో రేపు రాత్రి 10 గంటల నుంచి జులై 13 ఉదయం 5 గంటలకు 55 గంటల పాటు రాష్ట్రవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలు చేయాలని నిర్ణయించింది. ఇక అన్‌లాక్ 2 తరువాత దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న విధంగానే యూపీలో కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 1188 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 31156కు చేరింది. యాక్టివ్ కేసుల సంఖ్య 9980 ఉండగా.. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 20331గా ఉంది. కరోనా కారణంగా రాష్ట్రంలో ఇప్పటివరకు 845 మంది చనిపోయారు.

దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అనేక రాష్ట్రాలు ఈ రకమైన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. కొన్ని రాష్ట్రాలు కంటైన్‌ మెంట్ జోన్లలో లాక్‌ డౌన్ నిబంధనలు అమలు చేస్తుండగా… మరికొన్ని రాష్ట్రాలు పట్టణాలు, నగరాల్లో కొన్ని రోజుాల పాటు లాక్‌డౌన్ అమలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే రాష్ట్రం మొత్తం రెండు రోజులకు పైగా లాక్‌ డౌన్ అమలు చేయాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

సద్దుమనుగుతున్న సరిహద్దు వివాదం!

China

గాల్వాన్ లోయ ఘటన తరువాత భారత్ చైనా దేశాల మద్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది.  ఇటీవలే ఇరు దేశాల మధ్య చర్చలు జరిగాయి.  ఈ చర్చల్లో కొంతమేర ఫలితం కనిపించింది.  చైనా మూడు కిలోమీటర్ల మేర వెనక్కి వెళ్ళగా, భారత్ బలగాలు 1.5 కిలోమీటర్ల మేర వెనక్కి వచ్చాయి.  అయితే, చైనాను నమ్మడానికి వీలు లేదని నిపుణులు అంటున్నారు.  జూన్ 6 వ తేదీన ఇరు దేశాల సైనికాధికారుల మధ్య చర్చలు జరిగినప్పటికీ, జూన్ 15 వ తేదీన చైనా దొంగదెబ్బ కొట్టింది. అయితే వివాదాస్పద చైనా-భారత్ సరిహద్దులకు చెందిన పశ్చిమ సెక్టార్‌ లో పరిస్థితి మెరుగుపడుతోందని చైనా గురువారం ప్రకటించింది.

వాస్తవాధీన రేఖ వెంబడి గత కొన్ని దశాబ్దాలలో ఎన్నడూ లేని విధంగా రెండు దేశాలకు చెందిన సైనిక బలగాల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్న దరిమిలా ఉభయ సేనలు వెనక్కు మరలిన నేపథ్యంలో చైనా ఈ ప్రకటన చేయడం గమనార్హం. చర్చల ప్రక్రియ కొనసాగింపులో భాగంగా భారత్-చైనా సరిహద్దు వ్యవహారాలపై ఏర్పడిన సంప్రదింపులు, సమన్వయ కార్యాచరణ యంత్రాంగం(డబ్లుఎంసిసి) ఆధ్వర్యంలో భారత్‌తో మరో విడత చర్చలు జరుపుతామని చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ వెల్లడించింది.

కమాండర్ స్థాయి చర్చలలో కుదిరిన ఏకాభిప్రాయం మేరకు లడఖ్‌లోని గల్వాన్ లోయ, ఇతర ఎల్‌ఎసి ప్రాంతాల నుంచి భారత్-చైనా సేనల ఉపసంహరణకు పటిష్టమైన చర్యలు చేపట్టినట్లు విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి జో లిజియన్ గురువారం విలేకరుల సమావేశంలో తెలిపారు. సరిహద్దుల వెంబడి పరిస్థితి నిలకడగా, మెరుగుపడుతూ ఉందని ఆయన చెప్పారు. డబ్యుఎంసిసి సమావేశాలతో సహా సైనిక, దౌత్యపరమైన విధానాల ద్వారా ఉభయ పక్షాల మధ్య చర్చలు, సమాచార మార్పిడి కొనసాగుతుందని ఆయన తెలిపారు. అయితే, చైనా బలగాలు, ఆయుధ సామగ్రి ఉపసంహరణ విధివిధానాలను ఆయన వివరించలేదు. కాగా, సరిహద్దుల వద్ద ఉద్రిక్తతలను తగ్గించడానికి రెండు దేశాల మధ్య కుదిరిన ఏకాభిప్రాయాన్ని అమలు చేయడంలో భారత్ తమతో కలసి పనిచేయగలదని ఆశిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

బొత్సకు నేను బినామీని కాదు..


నటుడు నిర్మాత బండ్ల గణేష్ వ్యాఖ్యలు ఎప్పుడూ సంచలనమే. ఆయన సీరియస్ గా కామెంట్ చేసినా, దాని భావం జనాలకు సిల్లీగా తోస్తుంది. సాధారణ కమెడియన్ గా ప్రస్థానం మొదలుపెట్టిన బండ్ల గణేష్, స్టార్ హీరోలతో సినిమాలు నిర్మించే స్థాయికి ఎదిగారు. ఈ విషయం అనేక అనుమానాలకు దారి తీసింది. ఈయన కనీసం స్టార్ కమెడియన్ కూడా కాదు, కోట్లు ఖర్చుపెట్టి సినిమాలు తీయగల నిర్మాత ఎలా అయ్యాడు అని అందరూ అనుకున్నారు . ఈ నేపథ్యంలోనే ఓ వర్షన్ బయటికి వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో వివిధ శాఖలలో మంత్రిగా పనిచేసిన బొత్స సత్యనారాయణ బినామీనే ఈ బండ్ల గణేష్ అన్న వాదన బయటికి వచ్చింది. లిక్కర్ కింగ్ గా పేరున్న బొత్స సత్యనారాయణ బ్లాక్ మనీని వైట్ గా మార్చడానికి కమెడియన్ బండ్ల గణేష్ ని నిర్మాతను చేశాడని విపరీతమైన ప్రచారం జరిగింది.

ఆ మహిళ చేసిన పనికి ఐపీఎస్ ఫిదా

తాజా ఇంటర్వ్యూలో ఈ కథనాలపై నిర్మాత బండ్ల గణేష్ స్పందించారు. మంత్రి బొత్స సత్యనారాయణ బినామీగా నాపై పడ్డ ముద్ర నన్ను బాగా బాధ పెట్టిందని గణేష్ చెప్పారు. బొత్స సత్యనారాయణతో 20ఏళ్లకు పైగా అనుబంధం ఉంది అన్నారు. మాగంటి బాబు ద్వారా నాకు బొత్స పరిచయం అయ్యారు. అలా జరిగిన పరిచయం మామధ్య అన్నదమ్ముల బంధంలా బలపడింది అన్నారు. ఐతే అందరూ అనుకుంటున్నట్లు ఆయన ఆస్థులకు నేను బినామీ కాదని గణేష్ కుండ బద్దలు కొట్టారు. ఇక సినిమా పరిశ్రమలో సంపాదించారా, పౌల్ట్రీ పరిశ్రమల ద్వారా సంపాదించారా అన్న ప్రశ్నకు ఆయన నిర్మొహమాటంగా సినిమాల ద్వారా చాల సంపాదించానని చెప్పారు.

ఈనాడు, ఆంధ్రజ్యోతిని వదలని జగన్!

పరోక్షంగా ఆయన బొత్స ఆస్థులతో నాకు ఎటువంటి సంబంధం లేదని, నేను పరిశ్రమల ద్వారా సినిమా ద్వారా డబ్బులు సంపాదించి ఎదిగాను అని తెలిపారు. ఇక గణేష్ కోవిడ్ బారిన పడిన సమయంలో బొత్స సత్యనారాయణ రోజూ పోను చేసి యోగక్షేమాలు అడిగారని ఆయన చెప్పడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. బినామీ కాబట్టే ఆస్థులపై బెంగతో బొత్స సత్యనారాయణ ఆయన ఆరోగ్యం పట్ల వాకబు చేశారని కొందరు అంటున్నారు. 2015 లో కాంగ్రెస్ నుండి వైసీపీ లో చేరిన బొత్స మున్సిపల్ శాఖా మంత్రిగా ఉన్నారు. బొత్స వైసీపీ మంత్రి అయిన తరువాత ఒక్కసారి కూడా కలవలేదు అన్నారు బండ్ల గణేష్. ఇక వీరిద్దరి మధ్య బినామీ బంధంలో ఉందో లేదో వారికే తెలియాలి.

జగన్ ఇమేజ్ ని దెబ్బతీస్తున్న అధికారుల చేతివాటం


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై యస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన కార్యక్రమం ఇళ్ల స్థలాల పంపిణీ. రాష్ట్రంలో సొంతిల్లు లేని ప్రతి పేదవాడికి లభ్ది చేకూర్చేలా సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. గ్రామ సచివాలయాల ద్వారా అర్హుల నుండి అప్లికేషన్స్ తీసుకొని అధికారుల పర్యవేక్షణలో పారదర్శంగా ఈ పథకం అమలు జరగాలని జగన్ ఉద్దేశించారు. ఇప్పటికే ఈ ప్రక్రియ పూర్తి కాగా నిన్న వై యస్ ఆర్ జయంతి సందర్భంగా ఇళ్ల స్థలాల పంపిణీ జరగాల్సివుంది. న్యాయపరమైన ఇబ్బందుల కారణంగా ఈ కార్యక్రమానికి బ్రేక్ పడింది.

ఈనాడు, ఆంధ్రజ్యోతిని వదలని జగన్!

ఐతే ఇళ్ల స్థలాల అర్హుల జాబితాను రూపొందించడంలో పారదర్శకత లేదని, అధికారులు చిత్త శుద్దితో పనిచేయడం లేదన్న విమర్శ గట్టిగా వినిపిస్తుంది. గ్రామ సచివాలయాలలో వి ఆర్ ఓ స్థాయి అధికారులనుండి…మండల స్థాయి అధికారులు వరకు అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు వస్తున్నాయి. అర్హత లేకున్నా లంచాలు ఇచ్చినవారికి లేదా పైరవీలు నడిపిన వారికి ఇళ్ల స్థలాలు కేటాయించారని సమాచారం. వాస్తవంగా ఇళ్లు లేని పేదవారికి ఈ జాబితాలలో చోటు లభించలేదట. 50శాతానికి పైగా అనర్హుల పేర్లు జాబితాలలో చోటు చేసుకున్నాయట. మరో ప్రక్క టీడీపీ నేతలు తమ వైసీపీ కార్యకర్తలకు ఇళ్ల పట్టాలు పంచే కార్యక్రమం మినహా, ఇది మరోటి కాదని విమర్శిస్తుండగా…అధికారుల చేతివాటం జగన్ ఇమేజ్ ని దెబ్బతీస్తుంది.

ఆ మహిళ చేసిన పనికి ఐపీఎస్ ఫిదా

ఇళ్ళు ఉన్న వారు , ఆర్థిక స్థోమత కలిగినవారి పేర్లు అర్హుల జాబితాలో చూసి, నిజంగా ఇల్లు లేనివారు తీవ్ర ఆగ్రహానికి గురవుతున్నారు. దీనిపై ప్రజలే తీవ్ర విమర్శలు చేయడంతో పాటు గ్రామ సచివాలయాల ముందు నిరసలకు దిగుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజా శ్రేయస్సు కోసం చేపట్టిన మంచి పని పక్కదారి పట్టి జగన్ పట్ల చెడ్డ అభిప్రాయం ప్రజలలో కలిగేలా చేస్తుంది. సీఎం జగన్ ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన వాలంటీర్ వ్యవస్థను ఉపయోగించుకొని అర్హులను గుర్తించడంతో పాటు, అనర్హులను తొలగిస్తే పధకం లక్ష్యం నెరవేరుతుంది. లేని పక్షంలో ప్రజల్లో జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకత రావడం ఖాయం.

కేసీఆర్ చరిష్మాకు.. కరోనా చెక్ పెట్టిందా?


తెలంగాణ రాష్ట్రంలో తిరుగులేని నాయకుడిగా కేసీఆర్ ఎదిగారు. ప్రత్యేక రాష్ట్రం సాధించి సీఎంగా ప్రజలను మన్నలను పొందారు. ముందస్తు ఎన్నికలతో ప్రజల ముందుకెళ్లి విజయఢంకా మోగించి రెండోసారి అధికారంలోకి వచ్చారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ ఎదురొచ్చే నాయకుడు విపక్షాలు ఎంతవెతికినా మచ్చుకు ఒక్కరు కూడా కన్పించరు. ప్రతిపక్షాలన్ని మూకుమ్మడికి ప్రభుత్వంపై దాడిచేసిన సీఎం కేసీఆర్ ఒక్కమాటతో చెక్ పెట్టిన సందర్భాలెన్నో ఉన్నాయి.

తెలంగాణ సీఎం కేసీఆర్ చరిష్మా.. రాజకీయ చతురతను ఇతర రాష్ట్రాల సీఎంలు, కేంద్రమంత్రులు ఆమోఘం అంటూ ప్రశంసించిన ఘటనలు అనేక ఉన్నాయి. కేసీఆర్ పథకాలను ఇతర రాష్ట్రాల సీఎంలు ఆదర్శంగా తీసుకొని ఆయా రాష్ట్రాల్లోనూ అమలు చేశారు. అంతలా కేసీఆర్ ఆయన చరిష్మాను జాతీయ స్థాయిలోనూ చాటారు. అయితే ఇదంతా కరోనాకు ముందుమాట. ఇప్పుడు తెలంగాణలో పరిస్థితులన్నీ మారిపోయాయి. కరోనాను తొలినాళ్లలో కట్టడి చేస్తూ అందరిచేత శభాష్ అనిపించుకున్న కేసీఆర్ నేడు ఆ మహమ్మరికి భయపడి ఫౌంహౌజ్ లో దాక్కున్నారనే విమర్శలను మూటగట్టుకుంటున్నారు.

కరోనా టైంలో రేవంత్ కు ఛాన్స్ దొరికిందా?

సీఎం అధికారిక నివాసం ప్రగతిభవన్లో 30మంది కరోనా పాజిటివ్ రావడంతో ఈ విమర్శలు ఇంకా ఎక్కువయ్యారు. ఆయన క్యాబినెట్లోని మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు కరోనా బారినపడటం.. వారంతా ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకోవడంపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాన్యులకు గాంధీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తుండగా అధికార పార్టీ నేతలకు మాత్రం ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారనే సంకేతాలను విపక్షాలు ప్రజల్లోకి తీసుకెళ్లగలిగాయి. దీంతో సీఎం కేసీఆర్ గ్రాఫ్ క్రమంగా పడిపోతూ వస్తోంది.

కరోనా రాష్ట్రంలోకి ఎంట్రీ ఇచ్చే సమయంలో సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా చేసిన వ్యాఖ్యలను ప్రతిపక్షాలు గుర్తుచేస్తున్నాయి. తెలంగాణ వాతావారణంలో కరోనా వైరస్ బ్రతకదని.. జ్వరం.. జలుబులకు వేసుకొనే పారాసిటామాల్ ట్యాబ్లెట్ సరిపోతుందని.. టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులంతా మాస్కులు ధరించకుండానే పనులు చేస్తామంటూ చెప్పారు. కేసీఆర్ కరోనాపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ప్రతీరోజు వేలల్లో కరోనా కేసులు పెరిగిపోతున్నాయని ప్రతిపక్షాలు విమర్శలను గుప్పిస్తున్నాయి.

ఓ జర్నలిస్టు ఆవేదన.. కన్నీళ్లు పెట్టకమానరు

లాక్డౌన్ సమయంలో ప్రతీసారి మీడియా ముందుకు వచ్చే ప్రజలకు అవగాహన కల్పించే కేసీఆర్ కొద్దిరోజులుగా బయట ఎక్కడ కన్పించడం లేదని విపక్షాలు ఎద్దేవా చేస్తున్నాయి. చివరగా హరితహరం కార్యక్రమంలో కేసీఆర్ కన్పించారని నాటి నుంచి సీఎం అజ్ఞాతంలోకి వెళ్లారని చెబుతున్నాయి. కరోనాను అరికట్టాల్సిన సీఎం ఫౌంహౌజ్ లో ఉండటాన్ని తప్పుబడుతున్నారు. అయితే దీనిపై టీఆర్ఎస్ నేతలు ఎదురుదాడికి దిగుతుండటం గమనార్హం. దీంతో ప్రభుత్వం కరోనాపై చేతులేత్తేసిందా? అనే సందేహాల్లో ప్రజల్లో కలుగుతున్నాయి.

తెలంగాణ సచివాలయం భవనం కూల్చివేత కూడా కేసీఆర్ కు వ్యతిరేకంగా మారింది. కరోనా విజృంభిస్తున్న వేళ పాత సచివాలయాన్ని కోవిడ్ ఆస్పత్రిగా మార్చాలని విపక్షాలు, ప్రజాసంఘాలు డిమాండ్ చేశాయి. దీనిని ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకుండా సచివాలయాన్ని కూల్చివేసింది. కేసీఆర్ తీరుపై ప్రజల్లోకి వ్యతిరేక సంకేతాలు వెళ్లినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు తెలంగాణలో ఎదురులేకుండా దూసుకెళుతున్న కేసీఆర్ కు కరోనా సడెన్ బ్రేక్ వేసినట్లు కన్పిస్తుంది. సీఎం కేసీఆర్ కరోనా విమర్శల నుంచి ఏవిధంగా బయటపడుతారో వేచి చూడాల్సిందే..!

అక్కడ మాస్కులను తింటున్నారు..!


కరోనా కాలంలో మాస్కు అనే పదం ట్రెండింగ్ గా మారింది. మనిషికి ఒంటి మీద బట్టలు ఎలాగో.. మూతికి మాస్కు కూడా అనేలా పరిస్థితులు మారిపోయాయి. దేశంలో కరోనా కేసులు రోజుకు రోజుకు పెరిగిపోతుండటంతో ప్రజలు మాస్కుల్లేకుండా బయటికి వెళ్లాలంటే జంకుతున్నారు. ఈ మహ్మమరిపై మరింత అవగాహన కలిగించే ఓ రెస్టారెంట్ యజమాని చేసిన ప్రయత్నాన్ని ప్రతీఒక్కరు అభినందిస్తున్నారు.

ఈనాడు, ఆంధ్రజ్యోతిని వదలని జగన్!

మధురైకి చెందిన ఓ రెస్టారెంట్ యజమాని కరోనా ట్రెండ్ తగ్గట్టుగా వినూత్నంగా ఆలోచించాడు. ప్రస్తుత పరిస్థితుల్లో మాస్కులు ధరించడం ఎంత ముఖ్యమో తెలిసేలా తన రెస్టారెంట్లో మెనూను సిద్ధం చేశాడు. రుచికరమైన పరోటాలను మాస్కుల రూపంలో కస్టమర్లకు అందిస్తూ ఆకట్టుకుంటున్నాడు. మాస్కుల పరోటాతోపాటు కరోనా రవ్వదోశ, కరోనా బోండాలను కస్టమర్లకు వడ్డిస్తూ కోవిడ్-19పై అవగాహన కల్పిస్తున్నాడు.

ఈ రెస్టారెంట్లోని పరోటా మాస్కులకు ఫుల్ గిరాకీ పెరిగింది. నిజమైన మాస్కులను పోలివున్న మాస్కులను చూస్తూ కస్టమర్లు లోట్టలేసుకుంటూ తింటున్నాడు. పరోటాపై పిండికాలి.. అక్కడక్కడ ఏర్పడిన మచ్చలు సరికొత్త డిజైన్ లా కనబడుతూ చూపరులను ఆకట్టుకున్నాయి. ఒక్కో పరోట ధర రూ.50గా నిర్ణయించి కస్టమర్లకు అందిస్తున్నాడు. ధర కొంచెం ఎక్కువైనప్పటికీ కస్టమర్లు మాత్రం మాస్కు పరోటాలను ఇష్టంగా తింటున్నారు.

ఆ మహిళ చేసిన పనికి ఐపీఎస్ ఫిదా

కరోనాపై అవగాహన పెంచేలా ఈ పరోటా మాస్కులను తయారు చేసినట్లు సదరు రెస్టారెంట్ యజమాని చెబుతున్నాడు. వీటికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తుండటంపై సంతోషం వ్యక్తం చేశాడు. ప్రతీఒక్కరు మాస్కుధరించడంతోపాటు భౌతిక దూరం పాటిస్తూ.. కరోనాను తరిమికొట్టాలనే సందేశాలను పరోటాల ద్వారా ఇవ్వడంపై పలువురు అతడిని అభినందిస్తున్నారు. ప్రస్తుతం ఈ పరోటా మాస్కులు నెట్టింట్లో వైరల్ అవుతోన్నాయి. కొందరు నెటిజన్లు తమదైన శైలిలో మిమ్స్, లైకులు, కామెంట్లు పెడుతూ వైరల్ చేస్తున్నారు.

క్రియేటివ్ డైరెక్టర్ కి క్రియేటివిటీ ఉందా ?


సినిమా ఇండస్ట్రీలోని చాలామంది డైరెక్టర్స్ లో క్రియేటివ్ డైరెక్టర్ అని పేరు తెచ్చుకోవడం మాములు విషయం కాదు. క్రియేటివ్ ఫీల్డ్ లో.. క్రియేటివ్ పర్సన్స్ చేతే ప్రత్యేకంగా క్రియేటివ్ డైరెక్టర్ అని పిలిపించుకోవడంలో మంచి కిక్ ఉంటుంది. అయితే.. ఇప్పుడు అలాంటి ఓ క్రియేటివ్ డైరెక్టర్ కి వరుస ప్లాప్ లు రావడంతో ఆయనకు అసలు క్రియేటివిటీ ఉందా లేదా అని డౌట్ గా చూస్తున్నారు సినిమా జనం. ఆయనే టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ ‘కృష్ణ వంశీ’. గత కొన్ని సంవత్సరాలుగా ఆయన చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద విజయం సాధించలేక డిజాస్టర్ లుగా నిలవడంతో కృష్ణవంశీకి ఛాన్స్ ఇచ్చే స్టార్ హీరో కరువు అయిపోయాడు.

ఆ మహిళ చేసిన పనికి ఐపీఎస్ ఫిదా

ఒకప్పుడు మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ గా తన హావా చూపించిన ఈ క్రియేటివ్ డైరెక్టర్ ఛాన్స్ కోసం స్టార్లు అందరి చుట్టూ తిరిగి ఏది దొరకపోయే సరికీ, ఇక చేసేదేం లేక.. ఎలాగోలా తానే ఓ సినిమా మొదలుపెట్టాడు. అదీ రీమేక్ అనుకోండి. అయితే ఈ సినిమా మొదలుపెట్టి షూటింగ్ ముమ్మరం చేసే సరికి కరోనా వచ్చింది. పాపం అందరిలాగే ఈయన కూడా షూటింగ్ కి బ్రేక్ ఇవ్వాల్సి వచ్చింది. అయితే ఈ సినిమాకి సంబంధించి ఇప్పటివరకూ అయిన సీన్స్ ఎడిటింగ్ పూర్తి అయిందట. సీన్స్ అన్నీ సీరియల్ గా సాగుతూ.. స్టార్టింగ్ కి ఎండింగ్ కి మధ్య వ్యత్యాసం లేకుండా గజిబిజిగా అర్థంపర్ధం లేకుండా ఉన్నాయట. ఆ సీన్స్ చూసిన వారు అసలు ఈయనికి క్రియేటివిటీ ఉందా లేదా అని పరోక్షంగా కామెంట్స్ చేస్తున్నారట.

ఈనాడు, ఆంధ్రజ్యోతిని వదలని జగన్!

ఏది ఏమైనా అన్ని వేళలా ఒక్కరిదే హవా నడవదు. ఎవరి టైమ్ అయినా కొంత కాలమే అని కొంతమందిని చూస్తే అర్ధం అవుతుంది. ఒకప్పుడు ఒక వెలుగు వెలిగి.. చివరికి ఆ వెలుగు కోల్పోయి మాములు మనిషిగా మిగిలిపోవాల్సి వస్తోంది. అన్నట్టు ఈ సినిమా తరువాత.. నిర్మాత బండ్ల గణేష్, కృష్ణవంశీతో ఓ సినిమా ప్లాన్ చేస్తోన్నాడట. మరి ఆ సినిమా తోనైనా కృష్ణవంశీ తన క్రియేటివిటీకి కాస్త పదును పెడతాదేమో చూడాలి. ఇక ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందో ఇంకా క్లారిటీ లేదు.

ట్రెడిషినల్ బ్యూటీ హాట్ హాట్ సీన్స్ కి సై ?


ట్రెడిషినల్ హీరోయిన్ గా, బొద్దు గుమ్మగా, ‘నిజం’ లాంటి సినిమాలో హాట్ బ్యూటీగా.. సీనియర్ హీరోయిన్ రాశికి తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు ఉంది. అయితే ఆ గుర్తింపును క్యాష్ చేసుకోవడానికి పాపం రాశి శాయశక్తులా ప్రయత్నిస్తున్నా… ఏది సరిగ్గా వర్కౌట్ అవ్వలేదు. డబ్బులు కోసం నమ్మకం లేని ప్రోడక్ట్స్ పై చేసిన యాడ్స్ లో నటించి కేసులు పెట్టించుకుంది. ఇక అందరి లాగే తానూ కూడా డిజిటల్ సంపాదనను రాబట్టుకోవాలని ఒక యూట్యూబ్ ఛానెల్ పెట్టి.. ఏవేవో చేస్తూ తెగ కష్ట పడిపోతుంది. అది పెద్దగా సక్సెస్ కాలేదు అనుకోండి. ఈ మధ్యలో స్లిమ్ అయిపోయి.. బోల్డ్ కైనా హాట్ హాట్ సీన్స్ కైనా సై అంటూ డైరెక్టర్లకు లీకులు ఇస్తుందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.

రియల్‌ టైగర్ తో రీల్‌ టైగర్ ఫైట్‌!

ప్రస్తుతం ఓ కొత్త మూవీలో సెక్సీ లేడీ ఆఫీసర్ పాత్ర చేస్తున్న ఈమె కొత్త లుక్ కోసం.. తనలోని బొద్దు తనాన్ని సగానికి తగ్గించుకొని స్లిమ్ గా తయారైంది. ఇప్పుడు ఈ సీనియర్ బ్యూటీకి మరో హాట్ రోల్ వచ్చిందట. హీరో నితిన్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రీమేక్ కాబోతున్న బాలీవుడ్ సూపర్ హట్ మూవీ ‘అంధాదూన్’లో నెగెటివ్ అండ్ బోల్డ్ రోల్ చేసిన ‘టబు’ పెర్ఫార్మెన్స్ చాలా కీలకమైనది. ఇప్పుడు టబు నటించిన ఆ బోల్డ్ క్యారెక్టర్ లో నటించమని రాశికి అవకాశం వచ్చింది.

ఆసుపత్రిలో చేరిన ప్రముఖ నిర్మాత..

అయితే రాశి ఈ సినిమా చేయడానికి.. కాస్త లేటు వయసులో కూడా అందాల ప్రదర్శనకి కూడా ఒకే అంటుందట. కానీ ఈ చిత్రంలోని బోల్డ్ సీన్స్ లో నటించడానికి ఆమె పెద్ద మొత్తంలోనే డబ్బును డిమాండ్ చేస్తోందని తెలుస్తోంది. రాశిది ప్రధాన పాత్ర కావడంతో.. పైగా కథ మొత్తం ఆమె చుట్టూ తిరుగుతుండటంతో అన్నిటికి మించి కాస్త ఒళ్లు దాచుకోకుండా బోల్డ్ సీన్స్ తో రెచ్చిపోవాల్సి రావడంతో ఆమె అడిగిన భారీ రెమ్యునిరేషన్ ను ఇచ్చేందుకు మేకర్స్ కూడా ఇంట్రస్ట్ గానే ఉన్నారట.

ఎర్ర తివాచీలు పోయాయి..ఏమి చేయాలో పాలుపోవడంలేదు!

Us studies

విదేశాల్లో చదువులు, మంచి ఉద్యోగం చేసే వారికి ఎర్ర తివాచీలు పరిచే రోజులు పోయాయి. ఒకప్పుడు మా వాళ్ళు అమెరికాలోనో, ఆస్ట్రేలియాలోనో లేదా ఇతర దేశాల్లో ఉన్నారని చెప్పుకోవడం గొప్పగా భావించే వాళ్ళు కానీ కరోనా రాకతో అన్ని ప్రగల్బాలు పక్కదారి పట్టాయి. కరోనా దెబ్బతో విదేశాల్లోని భారతీయ విద్యార్ధుల బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి.

అక్కడి విద్యాసంస్థలు నిరవధికంగా సెలవులు ఇస్తూ వుండడంతో విద్యార్ధులు ఇండియాబాట పడుతున్నారు. స్వస్థలాలకు వెళ్లాలనుకునే విద్యార్ధులు 72 గంటల్లోగా దేశం విడిచి వదిలి వెళ్లాలని ఫిలిప్పీన్స్‌ ప్రభుత్వం ప్రకటించింది. దీంతో అక్కడ చదువుతున్న మూడు వందల మంది భారతీయ విద్యార్థులు ఇండియాకి బయలుదేరి, మలేసియా రాజధాని కౌలాలంపూర్‌ ఎయిర్పోర్ట్ లో ఇరుక్కుపోయారు. తెలుగు రాష్ట్రాలకి చెందిన 60 మంది విద్యార్థులు వీరిలో ఉన్నట్టు సమాచారం. ఇండియన్ ఎంబసీ అనుమతి లేనిదే విమానం ఎక్కేందుకు అనుమతించేది లేదని అక్కడి విమానాశ్రయ అధికారులు అడ్దుకున్నారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికార్లని సంప్రదిస్తే…తిరిగి ఫిలిప్పీన్స్‌ వెళ్లిపోమంటున్నారని విమానాశ్రయంలో చిక్కుకుపోయిన విద్యార్థులు,వారి తల్లితండ్రులూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.