Home Blog Page 83

వైసీపీకి హవాలా దెబ్బ!

YSRCP hawala case
YSRCP hawala case

YSRCP hawala case: ఏపీలో మద్యం కుంభకోణం రోజుకో మలుపు తిరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ ఒకవైపు పూర్తికాగా.. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మరోవైపు రంగంలోకి దిగింది. హవాలా మూలాలను కనుక్కొని ప్రయత్నంలో ఉంది. అయితే తాజాగా నిందితుల ఇళ్లలో జరిపిన సోదాల్లో ఒక హవాలా నంబర్ కరెన్సీ నోటు ముక్క అధికారులకు దొరికినట్లు తెలుస్తోంది. దీని ఆధారంగా అనేక రహస్య లావాదేవీలపై ఈడి దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏపీ మద్యం కుంభకోణంలో హవాలా రూపంలో పెద్ద ఎత్తున నగదు మొత్తం చేతులు మారిందన్న ఆరోపణల నేపథ్యంలో ఈడి ఎంట్రీ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం చేపట్టిన విచారణలో కొంత వివరాలను తీసుకుంది ఈడి. ఈ వ్యవహారంలో ఏపీ బేవరేజెస్ మాజీ ఎండి వాసుదేవరెడ్డి తో పాటు కీలక నిందితుడిగా భావిస్తున్న రాజ్ కసిరెడ్డిలను అరెస్టు చేసింది ఈడి. మరోవైపు మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు సునీల్ కుమార్ సైతం అరెస్టయ్యారు. అయితే ఆయనను విచారించే భాగంలో సునీల్ కుమార్ ఫోన్ ను పరిశీలించినప్పుడు ఒక కరెన్సీ నోటు ముక్క ఫోటోను ఒక నిర్దిష్ట నెంబర్ కు పంపినట్టు అధికారులు గుర్తించారు.

ఇక మరింత దూకుడుగా..
అయితే ఇప్పటివరకు మద్యం కుంభకోణం దర్యాప్తు ఒక ఎత్తు.. ఇకనుంచి మరో ఎత్తు అన్నట్టు సాగనుంది. ఈ హవాలా నోటు ముక్కతో దర్యాప్తు చేపట్టిన ఈడికి కళ్ళు బైర్లు కమ్యూనిజాలు బయటకు వచ్చాయి. ఈ హవాలా కుంభకోణం దాదాపు 195 కోట్ల రూపాయలు అని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చింది ఈడి. వైసీపీ హయాంలో నిబంధనలకు విరుద్ధంగా మద్యం సరఫరా కాంట్రాక్టును సిగ్మా సప్లై చైన్ సొల్యూషన్స్, ప్రసాద్ ట్రాన్స్పోర్ట్ కు కట్టబెట్టారు. సిగ్మా సంస్థ నుంచి ఒళ్ళు సందీప్ కు చెందిన సుదర్శన్ కన్స్ట్రక్షన్ కు సబ్ కాంట్రాక్టు దక్కింది. అక్కడి నుంచి నిధులు సునీల్ కుమార్ కు చేరాయి అని ఈడి గుర్తించింది. ఈ నిధులను సునీల్ కుమార్ హవాలా ద్వారా దారి మళ్లించి ఆస్తులు కూడా పెట్టారని.. గత ఎన్నికల్లో భారీగా ఖర్చు చేశారని ఈడీ అనుమానిస్తోంది.

తిరుగులేని ఆధారం..
కేవలం హవాలా ద్వారా ఈ కేసులో భారీగా నగదు చేతులు మారిందన్న అనుమానంతోనే ఈడి ఎంట్రీ ఇచ్చింది. తాజాగా దొరికిన ఈ నోటు ముక్క ఫోటో తో తిరుగులేని ఆధారం లభించినట్లు అయింది. ఈ ఫోటోను ఎవరికి పంపారు గుర్తిస్తే మరిన్ని ఆస్తులతో పాటు లావాదేవీల చిక్కుముడులు వీడనున్నాయి. సాధారణంగా హవాలా మార్గంలో బ్లాక్ మనీ బదిలీ చేయడానికి ఇలాంటి సగం కరెన్సీ నోటు ముక్కల ఫోటోలను టోకెన్లుగా ఉపయోగిస్తారు. మద్యం కుంభకోణంలో ఇలా బ్లాక్ మనీని హవాలా రూపంలో పంపించినట్లు ఈడి అనుమానించింది. ఆ అనుమానమే నిజం అయింది. ఈ వ్యవహారంలో మరింత లోతుగా విచారించేందుకు ఈడీ అధికారులు మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుకు నోటీసులు జారీ చేశారు. అందుకు ఆయన ఈరోజు విచారణకు హాజరయ్యారు.

ఇటాలియన్ స్పోర్ట్స్ కార్ల డిజైన్.. అల్యూమినియం ఫ్రేమ్..ఏంటి మామ ఈ ఫోన్ ఇలా ఉంది.. ఎప్పుడొస్తుందంటే..

Infinix smartphone
Infinix smartphone

Infinix smartphone: కొత్తగా మొబైల్ కొనే సమయంలో వినియోగదారులు తమకు అనుగుణంగా ఉండేలా ఫీచర్లు ఉన్న వాటిని ఎంచుకుంటున్నారు. ఇదే సమయంలో డిజైన్ గురించి కూడా ఆరా తీస్తున్నారు. ఇలాంటి వినియోగదారులను దృష్టిలో ఉంచుకొని ప్రముఖ మొబైల్ కంపెనీ ఇన్‌ఫినిక్స్ (Infinix) బ్రాండ్ నుండి సరికొత్త, ప్రీమియం లుక్ కలిగిన నోట్ 60 ప్రో 5G పినిన్‌ఫారినా లిమిటెడ్ ఎడిషన్ ను భారత మార్కెట్లోకి తీసుకువస్తున్నారు. ప్రసిద్ధ ఇటాలియన్ లగ్జరీ కార్ డిజైనింగ్ సంస్థ ‘పినిన్‌ఫారినా’ భాగస్వామ్యంతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఇన్‌ఫినిక్స్ ప్రత్యేకంగా రూపొందించింది. ఈ సరికొత్త సూపర్ కార్ ఇన్‌స్పైర్డ్ మొబైల్ గురించిన పూర్తి వివరాల్లోకి వెళితె..

Infinix నుంచి వచ్చే ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ 6.78 అంగుళాలAMOLED డిస్‌ప్లేతో ఉంటుంది. ఇది1.5K రిజల్యూషన్ తో పనిచేస్తుంది. 144Hz రిఫ్రెష్ రేట్ ను కలిగి ఉన్న ఈ మొబైల్ గరిష్టంగా 4500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. అలాగే స్క్రీన్ రక్షణ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ని ఉపయోగించారు. ఈ ఫోన్ వెనుక భాగంలో కెమెరా పక్కన ఒక ‘యాక్టివ్ మ్యాట్రిక్స్ సెకండరీ డిస్‌ప్లే’ కూడా ఉంటుంది.

ఈ ఫోన్ యొక్క ప్రధాన ఆకర్షణ దీని డిజైన్. ఇటాలియన్ స్పోర్ట్స్ కార్ల శైలిని ప్రతిబింబించేలా దీని వెనుక ప్యానెల్‌కు ‘కార్బన్ ఫైబర్ ఫినిషింగ్’ (Carbon Fibre Finish) ఇచ్చారు. దీని చుట్టూ 360 డిగ్రీల ఏరోస్పేస్-గ్రేడ్ అల్యూమినియం ఫ్రేమ్, కెమెరా మాడ్యూల్ చుట్టూ రెడ్ కలర్ యాక్సెంట్లు ఫోన్‌కు మరింత లగ్జరీ లుక్‌ను ఇస్తాయి.

ఇన్‌ఫినిక్స్ నోట్ 60 ప్రో పినిన్‌ఫారినా ఎడిషన్‌లో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 4 ప్రాసెసర్‌ను అమర్చారు. గేమింగ్ కోసం ఉపయోగించినప్పుడు ఫోన్ వేడెక్కకుండా ఇందులో ‘3D ఐస్‌కోర్ వీసి కూలింగ్’ చాంబర్ ఉంది. అలాగే 50MP ప్రధాన కెమెరా, 8MP అల్ట్రా వైడ్ లెన్స్ ఉన్నాయి. 13MP సెల్ఫీ కెమెరాను అందించారు. ఈ రెండు కెమెరాల ద్వారా 4K వీడియోలను రికార్డ్ చేయవచ్చు.

బ్యాటరీ పరంగా ఈ ఫోన్ చాలా బలంగా ఉంది. ఇందులో 6500mAh భారీ బ్యాటరీని అందించారు. దీనికి తోడు 90W ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్, 30W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. ఇది ఆండ్రాయిడ్ 16 ఆధారిత XOS 16 సాఫ్ట్‌వేర్‌పై నడుస్తుంది. కంపెనీ దీనికి 3 సంవత్సరాల మేజర్ ఓఎస్ అప్‌గ్రేడ్‌లు మరియు 5 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్లను గ్యారెంటీ ఇస్తోంది.

సాధారణ ఇన్‌ఫినిక్స్ నోట్ 60 ప్రో (8GB+256GB) ధర ప్రస్తుతం రూ. 33,999 గా ఉంది. అయితే, ఈ పినిన్‌ఫారినా ఎడిషన్ కేవలం 12GB RAM + 256GB స్టోరేజ్ సింగిల్ వేరియంట్‌లోనే, ప్రీమియం డిజైన్ మరియు లగ్జరీ యాక్సెసరీలతో వస్తుండటంతో దీని ధర సుమారు రూ. 36,999 లేదా అంతకంటే కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఈ ప్రత్యేకమైన పినిన్‌ఫారినా ఎడిషన్ స్మార్ట్‌ఫోన్ జూన్ 24, 2026 న మధ్యాహ్నం 12 గంటలకు భారతదేశంలో అధికారికంగా విడుదల కానుంది. ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం Flipkart తో పాటు ఇన్‌ఫినిక్స్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఈ మొబైల్ వినియోగదారులకు అందుబాటులోకి రానుంది.

పాకిస్తాన్‌పై గర్జించిన 19 బ్రహ్మోస్‌ మిస్సైళ్లు.. ఆపరేషన్‌ సిందూర్‌ భారత్‌ సత్తా!

19 BrahMos missiles
19 BrahMos missiles

19 BrahMos missiles: జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో 2025 ఏప్రిల్‌ 22న ఉగ్రవాదులు పర్యాటకులపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. దీనికి ప్రతిగా మే నెలలో భారత్‌ ఆపరేషన్‌ సిందూర్‌ చేపట్టింది. ఈ సైనిక చర్య భారతదేశ భద్రతా విధానంలో ఒక ముఖ్యమైన అధ్యాయంగా నిలిచింది. టెర్రరిజం సవాళ్లకు బలమైన స్పందనగా ఈ ఆపరేషన్‌ చేపట్టబడింది. ఈ ఆపరేషన్‌లో కచ్చితమైన క్షిపణి దాడులు చేసింది భారత్‌.

వివరాలు తెలిపిన అర్నబ్‌ గోస్వామి..
రిపబ్లిక్‌ టీవీ సీఈవో అర్నబ్‌ గోస్వామి ఈ ఆపరేషన్‌లో భారత్‌ 19 బ్రహ్మోస్‌ క్షిపణులను పాకిస్తాన్‌ లక్ష్యాలపైకి ప్రయోగించినట్లు తెలిపారు. ఇది మే 6వ తేదీ అర్ధరాత్రి సమయంలో జరిగినట్లు వివరించారు. రాజకీయ నాయకత్వం దృఢమైన నిర్ణయం వల్లే ఇది సాధ్యమైందని అభిప్రాయపడ్డారు. ఆ సందర్భంలో ఉన్న ప్రేక్షకులు, వ్యాపారవేత్తలు, సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు చప్పట్లతో అభినందనలు తెలిపారన్నారు.

బ్రహ్మోస్‌ క్షిపణుల ప్రాముఖ్యత..
బ్రహ్మోస్‌ అనేది అత్యంత వేగవంతమైన సూపర్‌సోనిక్‌ క్షిపణి. దీని కచ్చితత్వం, వేగం, శక్తి దాడులను సమర్థవంతంగా చేయడంలో కీలకంగా పనిచేసింది. ఈ ప్రయోగం భారత రక్షణ సాంకేతిక సామర్థ్యాన్ని ప్రపంచం ముందు చాటింది. ఇటువంటి ఆధునిక ఆయుధాలు శత్రు రక్షణలను అధిగమించి లక్ష్యాలను చేరుకోగలవని నిరూపించాయి.

రాజకీయ సంకల్పం..
అర్నబ్‌ గోస్వామి వ్యాఖ్యలు ఈ ఆపరేషన్‌ వెనుక ఉన్న రాజకీయ సంకల్పాని హైలైట్‌ చేస్తాయి. టెర్రరిజంపై జీరో టాలరెన్స్‌ విధానం ఈ చర్యలో స్పష్టంగా కనిపించింది. ఇది భారత సైనిక సామర్థ్యం మాత్రమే కాకుండా, నాయకత్వం నిర్ణయాత్మకతను కూడా ప్రతిబింబిస్తుంది. అయితే, ఇటువంటి చర్యలు ద్వైపాక్షిక సంబంధాలను ప్రభావితం చేస్తాయి, ప్రాంతీయ భద్రతా సమతుల్యతను మార్చగలవు. మీడియా వ్యక్తులు ఈ సంఘటనలను వివరించడం ద్వారా జాతీయ గర్వం పెంపొందుతుంది. అదే సమయంలో, ఇటువంటి వివరణలు సమతుల్యమైన చర్చకు దారితీస్తాయి.

మొత్తంగా, ఆపరేషన్‌ సిందూర్‌ భారత రక్షణ సంసిద్ధతను, ఆధునిక ఆయుధ వ్యవస్థల ప్రభావాన్ని ప్రపంచానికి చాటిన మైలురాయిగా నిలుస్తుంది.

మెట్రో చర్చలు సానుకూలం.. మీడియా కథనాలు విరుద్ధం.. పాపం రేవంత్‌!

Hyderabad Metro expansion
Hyderabad Metro expansion

Hyderabad Metro expansion: తెలంగాణ అభివృద్ధికి కేంద్రం సహకారం కావాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆశిస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్న నేపథ్యంలో కేంద్రం నుంచి రుణాలు, ఆర్థిక సహాయం ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని టార్గెట్‌ చేశారు. అభివృద్ధిని అడ్డుకుంటున్నారని, రుణాలు ఇవ్వొద్దని చెబుతున్నారని, తాను అడిన వెంటనే అడ్డు పుల్ల వేస్తున్నాడని విమర్శలు చేస్తూ వస్తున్నారు. తనతో కేంద్రం వద్దకు రావడం లేదని ఆరోపించారు. హైదరాబాద్‌ మెట్రో రైలు ఫేజ్‌–1ను ఏప్రిల్‌ 2026లో రాష్ట్ర ప్రభుత్వం ఎల్‌అండ్‌డీకంపెనీ నుంచి స్వాధీనం చేసుకున్న తర్వాత, దాని రీఫైనాన్సింగ్‌ కోసం ఇండియన్‌ రైల్వే ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ (ఐఆర్‌ఎఫ్‌సీ) నుంచి రూ.13,600 కోట్ల రుణం విడుదల కావాల్సి ఉంది.

కేంద్రానికి వినతులు..
ఈ రుణం ఆలస్యంతో అదనపు వడ్డీ భారం రాష్ట్రం, ఐఆర్‌ఎఫ్‌సీపై పడుతోందని రేవంత్‌ రెడ్డి ఇటీవల కేంద్ర బీజేపీ నాయకులను సంప్రదించారు. ఈ నేపథ్యంలో బీజేపీ ఎంపీ, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్‌ రెడ్డిని రాష్ట్ర సమస్యల్లో ఇన్వాల్వ్‌ చేయడానికి రేవంత్‌ రెడ్డి లేఖలు రాశారు. కిషన్‌ రెడ్డి ఈ అభ్యర్థనను సానుకూలంగా స్వీకరించి, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌తో భేటీ ఏర్పాటు చేశారు.

భేటీలో ఏం జరిగింది…?
సోమవారం న్యూఢిల్లీలోని రైల్‌ భవన్‌లో రేవంత్‌రెడ్డి, కిషన్‌రెడ్డి కలిసి అశ్విని వైష్ణవ్‌ను సుమారు రెండు గంటల పాటు కలిశారు. ఈ సమావేశంలో హైదరాబాద్‌ మెట్రో ఫేజ్‌–1 రుణ విడుదల, ఫేజ్‌–2 విస్తరణ (సుమారు 123 కిలోమీటర్లు, విమానాశ్రయం, బయటి ప్రాంతాలను అనుసంధానించే ప్రణాళిక, అంచనా వ్యయం రూ38,595 కోట్లు వరకు), సంబంధిత అనుమతులపై వివరంగా చర్చ జరిగింది. రేవంత్‌ రెడ్డి ప్రకారం, అన్ని అధికారిక ప్రక్రియలు పూర్తి చేసినట్లు వివరించారు. ఐఆర్‌ఎఫ్‌సీ రుణం ఆలస్యం వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చర్చించారు. రేవంత్‌ రెడ్డి భేటీ తర్వాత మీడియాకు మాట్లాడుతూ, ‘‘అశ్విని వైష్ణవ్‌తో చర్చలు సానుకూలంగా జరిగాయి. రేపు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌తో కూడా భేటీ ఉంది’’ అని తెలిపారు. కిషన్‌ రెడ్డి ఈ విషయంపై వ్యాఖ్యానించలేదు.

మీడియాలో వ్యతిరేక కథనాలు..
ఈ భేటీని అధికారికంగా సానుకూలంగా చూసిన మీడియా సంస్థలు ఎక్కువగా ఉన్నాయి. అవి రాష్ట్ర–కేంద్ర సహకారం, మెట్రో విస్తరణ ద్వారా ట్రాఫిక్‌ సమస్యల పరిష్కారం, అభివృద్ధి ప్రాధాన్యతను హైలైట్‌ చేశాయి. అయితే బీఆర్‌ఎస్‌కు మద్దతుతో నడిచే ఒక మీడియా వాయిస్‌ మాత్రం ఈ సమావేశాన్ని పూర్తిగా భిన్నంగా చిత్రీకరించింది. ఆ నివేదికలో కేంద్ర మంత్రి రేవంత్‌రెడ్డిని తీవ్రంగా విమర్శించారని, కిషన్‌రెడ్డి ముందస్తు ప్రణాళికతో ఆయనను అక్కడికి తీసుకెళ్లి తిట్టించాడని పేర్కొన్నారు. ఇతర మీడియా సంస్థలన్నీ సానుకూలంగా కవర్‌ చేసినప్పటికీ, ఈ ఒక్కటి అసహనం, విద్వేషంతో నిండిన వివరణ ఇచ్చింది. ఇలాంటి వ్యత్యాసం రాజకీయ పక్షపాతం కారణంగా ఏర్పడిందని విమర్శలు వస్తున్నాయి.

చర్చల్లో చొచ్చి చూసినట్లే..
బీఆర్‌ఎస్‌ మీడియా కథనం పరిశీలిస్తే.. చర్చలు జరిగిన సమావేశ మందిరంలో తానూ ఉన్నట్లుగా కథనం వండి వాచ్చింది. అంతర్గత సమాచారం ఎలా లభించిందనే ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. భేటీలో పాల్గొన్న ముగ్గురు నాయకులు మాత్రమే తెలుసుకోగలిగే విషయాలను ఇతరులు ఎలా తెలుసుకున్నారు? కేవలం సంచలనం కోసమే ఈ కథనం రాశారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. రాజకీయ అవసరాల కోసం రాసినట్లుగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఈ భేటీ ద్వారా రాష్ట్ర–కేంద్ర సమన్వయం మెరుగుపడి, హైదరాబాద్‌ నగరంలో ట్రాఫిక్‌ సమస్యలు తగ్గి, పౌరులకు మెరుగైన రవాణా సౌకర్యాలు లభించే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. ఈ వివరాలు ఇటీవలి అధికారిక ప్రకటనలు, మీడియా నివేదికల ఆధారంగా తెలుస్తోంది.

లెనిన్ ఫస్ట్ రివ్యూ.. ఇండస్ట్రీ పెద్దల స్పందన ఇదేనా..?

Lenin Box Office Collection
Lenin Box Office Collection

Lenin Movie First Review: అక్కినేని అఖిల్ హీరోగా భాగ్యశ్రీ హీరోయిన్ గా నటిస్తున్న లెనిన్ సినిమా వచ్చే నెల 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ రివ్యూ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరప్ అవుతుంది. ఇప్పటికే ఈ సినిమాను ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది పెద్దలకైతే చూపించారట. ఈ సినిమా కథ చాలా ఎగ్జైటింగ్ గా ఉందట. మహాభారతాన్ని బేస్ చేసుకొని ఈ కథనైతే రెడీ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ సినిమాలో అఖిల్ తన నట విశ్వరూపాన్ని చూపించాడు అంటూ కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. నిజానికి ఈ సినిమాలో కథ బాగున్నప్పటికి దాని ఎగ్జిక్యూషన్ కూడా చాలా బాగా చేశారు అంటూ కొన్ని కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి. ఇక ఇప్పటివరకు అఖిల్ సినిమా మీద చాలావరకు నెగెటివ్ ప్రచారం జరుగుతుంది.

కానీ సినిమా ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది పెద్దలు ఈ సినిమాను చూసిన తర్వాత ఈ సినిమా మీద పాజిటివ్ గా స్పందించినట్టుగా తెలుస్తుంది. దాంతో ఇండస్ట్రీ లో పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అవుతున్నట్టుగా తెలుస్తుంది… ఒక పెద్ద అడ్వెంచర్ ని చేసి ఆ ఊరిలోని కొంతమందిని హీరో ఎలా కాపాడాడు అనేది ఈ సినిమాలో మిళితమై ఉన్న అంశం అని తెలుస్తుంది. ఇక ఇందులో ట్విస్ట్ లు కూడా చాలా వరకు ఎగ్జైట్ చేయబోతున్నాయట.

ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమాని చూసిన ఇండస్ట్రీ పెద్దలు చాలా హ్యాపీ గా ఉన్నారు. కాబట్టి ఈ సినిమా మీద పాజిటివ్ వైబ్ క్రియేట్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. ఇంతకుముందు నాగార్జున సైతం ఈ సినిమాను చూసి భారీ సక్సెస్ ను సాధించబోతున్నామంటూ ఒక ట్వీట్ చేశాడు. కాబట్టి ఇప్పుడు అందుతున్న సమాచారాన్ని బట్టి చూస్తే ఈ మూవీ ఏదో గట్టిగానే కొట్టబోతుంది అనే అభిప్రాయాలైతే వ్యక్తమవుతున్నాయి…

ఇక ఏది ఏమైనా కూడా అఖిల్ లాంటి హీరో ఈ మధ్యకాలంలో చేసిన సినిమాలేవి పెద్దగా సక్సెస్ అయితే సాధించలేదు. కాబట్టి ఆయనకి ఈ సక్సెస్ అనేది చాలా కీలకంగా మారబోతుంది. ఇండస్ట్రీ పెద్దల నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్ చూస్తుంటే ప్రస్తుతం ఆయన కొంతవరకు ఊపిరి పీల్చుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఇక వచ్చే నెల 10 వ తేదీ వస్తే గాని ఈ సినిమాను ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది తెలియదు…

వారణాసి మూవీ కోసం రాజమౌళి ఫ్యామిలీ అన్ని వందల కోట్లు తీసుకుంటున్నారా..? అన్యాయం ఇది..

Rajamouli Family Remuneration
Rajamouli Family Remuneration

Rajamouli Family Remuneration: మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న వారణాసి సినిమా భారీ అంచనాల మధ్య తెరకెక్కుతుంది. ఇక ఈ సినిమాతో రాజమౌళి మరోసారి ప్రపంచ స్థాయి ప్రేక్షకులను తన వైపు తిప్పుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. మహేష్ బాబు ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీకి మాత్రమే పరిమితమయ్యాడు. కానీ వారణాసి సినిమాతో ప్రపంచ స్థాయి ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా అక్కడి దర్శకులందర్నీ కూడా ఆకర్షించాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. 1500 కోట్లు బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రాజమౌళి వైవిద్య భరితమైన అంశాలను ఈ సినిమాని చిత్రీకరిస్తున్నట్టుగా తెలుస్తుంది. యాక్షన్ ఎపిసోడ్స్ బీభత్సంగా ఉండబోతున్నాయట. కొన్ని గూస్ బంప్స్ ఎపిసోడ్స్ ప్రతి ప్రేక్షకుడికి ఎగ్జైట్ మెంట్ కలుగుతుందని ఎలివేషన్స్ మామూలుగా ఉండవని కూడా తెలుస్తుంది. ఇక ఏది ఏమైనా కూడా మహేష్ బాబును రాజమౌళి ఏ రేంజ్ లో చూపిస్తాడు. ఇప్పటివరకు వీళ్ళ కాంబినేషన్లో ఒక్క సినిమా కూడా రాలేదు. మరి మొత్తానికైతే రాజమౌళి మహేష్ బాబును పూర్తిస్థాయిలో వాడుకుంటాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే… వారణాసి సినిమాతో తెలుగు సినిమా స్థాయి ప్రపంచవ్యాప్తంగా విస్తరింపజేస్తున్నాడు అనేది వాస్తవం.

రాజమౌళి ఈ సినిమా కోసం దాదాపు 250 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారట. ఆయనది పక్కన పెడితే తన ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా ఈ సినిమాలో ఇన్వాల్వ్ అయ్యారు. కాబట్టి వీళ్ళందరికి కలిపి 200 కోట్ల వరకు ప్యాకేజీ అయితే మాట్లాడినట్టుగా తెలుస్తుంది…

ఇక కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరిస్తే రాజమౌళి భార్య రమా రాజమౌళి కాస్ట్యూమ్ డిజైనర్ గా పని చేస్తుంది. కీరవాణి వాళ్ళ వైఫ్ వల్లి లైన్ ప్రొడ్యూసర్ గా, రాజమౌళి కొడుకు కార్తీకేయ సినిమా మొత్తాన్ని తనే దగ్గరుండి మరి షూటింగ్ పర్ఫెక్ట్ గా ఎగ్జిక్యూట్ అయ్యే విధంగా చూసుకుంటూ ఉంటాడు. కీరవాణి తమ్ముడు అయిన కాంచి సైతం స్టోరీ లో రాజమౌళికి చాలా వరకు హెల్ప్ చేస్తుంటాడు.

ఇక రాజమౌళి వాళ్ళ ఫాదర్ అయిన విజయేంద్రప్రసాద్ ఈ సినిమాకి కథను అందించాడు. కీరవాణి చిన్న తమ్ముడు అయిన కళ్యాణ్ మాలిక్ సైతం ఈ సినిమా మ్యూజిక్ లో తను ఒక కీలకపాత్ర వహిస్తున్నాడు. ఇక ఇలా ఫ్యామిలీ మొత్తం సినిమాలో ఇన్వాల్వ్ ఇవ్వడం వల్ల వాళ్లందరికి కలిపి దాదాపు 200 కోట్ల వరకు ఒక ప్యాకేజీ తీసుకున్నట్టుగా తెలుస్తుంది. రాజమౌళి 250 కోట్లు ఫ్యామిలీ మొత్తానికి 200 కోట్లు అంటే వీళ్ళకే 450 కోట్ల వరకు అమౌంట్ వెళ్ళిపోతుందని మరి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు…

5G నడుస్తుండగా త్వరలో మార్కెట్లోకి 4జీ ఫోన్లు.. ఎందుకంటే..

4G Smartphones
4G Smartphones

4G Smartphones: భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ప్రస్తుతం 5G నెట్ వర్క్ ఎక్కువగా వినియోగిస్తున్నారు. అయితే కొన్ని ప్రాంతాల్లో ఈ సౌకర్యం లేదు. అక్కడ ఇప్పటికీ 4G నెట్ వర్క్ మాత్రమే కొనసాగుతోంది. ఉదాహరణకు ముంబై, ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై కోల్ కతాపట్టణ ప్రాంతాల్లోని ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామీణ ప్రాంతాల్లో 4 జీ సేవలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ 4జీ ఫోన్లకు డిమాండ్ ఏర్పడుతుంది. ఇలాంటి వినియోగదారులను టార్గెట్ చేస్తూ కొన్ని కంపెనీలు సరికొత్త 4G ఫోన్లను మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధమవుతున్నాయి. ఈ ఏడాది జూలై నుండి సెప్టెంబర్ మధ్య కాలంలో భారీ సంఖ్యలో సరికొత్త మిడ్-రేంజ్ 4G స్మార్ట్‌ఫోన్‌లు లాంచ్ కానున్నట్లు టెక్ వర్గాల సమాచారం. వాటి వివరాల్లోకి వెళితె..

మోబైల్ ఇండస్ట్రీ నివేదికల ప్రకారం.. షియోమి , రెడ్‌మి , ఒప్పో , వివో తో పాటు రియల్‌మి వంటి అగ్రగామి సంస్థలు జూలై నుంచి సెప్టెంబర్ క్వార్టర్‌లో తమ సరికొత్త మోడళ్లను రంగంలోకి దించనున్నాయి. ఇప్పటికే ఉన్న పాపులర్ సిరీస్‌లకు కొనసాగింపుగా ఈ సరికొత్త 4G వేరియంట్లు రాబోతున్నాయి.

ఈ మిడ్ రేంజ్ 4G ఫోన్లలో ఫీచర్లు మాత్రం ప్రీమియం రేంజ్‌లో ఉండనున్నాయి. 50MP ప్రధాన కెమెరాలు, 120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన AMOLED డిస్‌ప్లేలు, 6000mAh లేదా అంతకంటే ఎక్కువ సామర్థ్యం గల భారీ బ్యాటరీలతో ఇవి రానున్నాయి. వీటికి తోడు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా లభించనుంది. మీడియాటెక్ హెలియో లేదా స్నాప్‌డ్రాగన్ బడ్జెట్ ప్రాసెసర్లు వీటిలో ఉపయోగించే అవకాశం ఉంది.

ఈ స్మార్ట్‌ఫోన్ల ధరలు దాదాపు రూ. 10,000 నుంచి రూ. 18,000 బడ్జెట్ లోపలే ఉండే అవకాశం ఉంది. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో వచ్చే పండగ సీజన్ సేల్స్ లక్ష్యంగా ఈ మొబైళ్లను విడుదల చేయనున్నారు. తక్కువ ధరలో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చే సరికొత్త ఫోన్ కోసం చూస్తున్న మిడిల్ క్లాస్ బయ్యర్లకు ఈ క్వార్టర్ లో భారీ ఆప్షన్లు లభించబోతున్నాయి.

ముద్రగడ గుర్తు లేరా? గట్టిగానే నిలదీసిన కుమార్తె!

Mudragada Padmanabham
Mudragada Padmanabham

Mudragada Padmanabham: తండ్రి పై కొడుకు కంటే కుమార్తెకు మమకారం ఎక్కువ. అది కూడా వృద్ధాప్యంలో ఉంటే మరి ఎక్కువగా ఉంటుంది దృష్టి కుమార్తెకు. ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే ముద్రగడ పద్మనాభం విషయంలో. ప్రస్తుతం ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. హైదరాబాదులోని పేరు మోసిన ఆసుపత్రిలో వైద్య సేవలు పొందేందుకు ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదురయ్యాయని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో కుటుంబ సభ్యులు జగన్మోహన్ రెడ్డిని ఆశ్రయిస్తే తగిన విధంగా స్పందించలేదు అన్న ప్రచారం కూడా ఉంది. ఈ క్రమంలో ఆయన కుమార్తె క్రాంతి స్పందించారు. జగన్మోహన్ రెడ్డి వైఖరిని తప్పు పట్టారు. మీకోసం, మీ పార్టీ కోసం ఇంతగా శ్రమించిన తన తండ్రిని పరామర్శించేందుకు కూడా మీకు వీలు కాలేదా అని ప్రశ్నించారు. గంజాయి బ్యాచ్ ను పరామర్శించిన మీరు.. తమ తండ్రిని గుర్తు చేసుకోలేదా అంటూ గట్టిగానే ప్రశ్నించారు.

Kranti Mudragada
Kranti Mudragada

* సాయి కృష్ణ కుటుంబ పరామర్శ..
ఇటీవల సాయి కృష్ణ అనే యువకుడి అదృశ్యం మిస్టరీ సంచలనంగా మారింది. అయితే ఆ యువకుడు కాపు సామాజిక వర్గానికి చెందిన వాడు కావడంతో.. వెంటనే వైసీపీ రాజకీయం మొదలు పెట్టింది. కనీసం ఆ యువకుడి పేరు తెలియకుండానే జగన్మోహన్ రెడ్డి పరామర్శకు వెళ్లిపోయారు. తల్లిదండ్రులను కలిసి ఓదార్చారు.. కూటమి ప్రభుత్వంపై బురదజల్లేశారు. అయితే ముద్రగడ పద్మనాభం అస్వస్థతకు గురై హైదరాబాద్ ఆసుపత్రికి చేరినట్లు తెలుస్తోంది. సాయి కృష్ణ పై ఉన్న శ్రద్ధ ముద్రగడపై లేదా అని ఇప్పుడు ఆయన కుమార్తె ప్రశ్నించేసరికి ఒక్కసారిగా సిన్ మారింది. ఎందుకంటే కాపు ఉద్యమం చేపట్టి వైసిపి రాజకీయం చేయాలని చూసింది. అయితే ఇప్పుడు ముద్రగడను వాడుకొని వదిలేస్తారు అన్న విమర్శ సొంత కుమార్తె చేయడం తో వైసీపీ ఆత్మరక్షణలో పడింది.

* పరామర్శించకపోవడాన్ని ప్రశ్నించిన కుమార్తె..
గతంలో కూడా తన తండ్రి ఆరోగ్యం విషయంలో ఆందోళన చెందారు కుమార్తె క్రాంతి. తన తండ్రిని చూసేందుకు కూడా తనకు అనుమతి లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ముద్రగడ పద్మనాభం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి బాగానే ఉపయోగపడ్డారు. అలా ఉపయోగించుకున్నారు జగన్మోహన్ రెడ్డి.. కానీ ఇప్పుడు ముద్రగడ అనారోగ్య సమస్యలకు ఆర్థిక సాయం చేయడం లేదు. కనీసం పరామర్శించిన దాఖలాలు కూడా లేవు. గతంలో కిర్లంపూడి వరకు వెళ్లిన జగన్ ముద్రగడ ఇంటికి వెళ్లలేదు. ఆయన వచ్చి తాడేపల్లిలో కలిస్తే తప్ప జగన్ పరామర్శించిన పరిస్థితి లేదు. ఇప్పుడు స్వయంగా ముద్రగడ కుమార్తె క్రాంతి తన తండ్రికి పరామర్శ, ఆర్థిక భరోసాపై ప్రశ్నించడంతో డిఫెన్స్ లో పడిపోయారు వైసీపీ కాపు నేతలు. మరి ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

రాజుల భూమిని వదలని వైసీపీ!

Vijayanagaram Land Issue
Vijayanagaram Land Issue

Vijayanagaram Land Issue: రాజుల సొమ్ము రాళ్ళ పాలు అనేది ఒక నానుడి. కానీ విజయనగరంలో మాత్రం రాజుల సొమ్ము వైసిపి పాల్లు అనేది కొత్త మాట. రాజులకు చెందిన ఎకరా భూమిని అడ్డగోలుగా పొంది ఏకంగా వైసిపి కార్యాలయాన్ని నిర్మించారు విజయనగరంలో. అధికారంలో ఉన్నప్పుడు అన్ని సవ్యంగా సాగిపోతాయి కానీ.. ఇప్పుడు విజయనగరం రాజు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటకు వచ్చింది. ప్రైవేటు భూమిగా ఉన్న సంస్థానం స్థలాన్ని.. ప్రభుత్వ భూమిగా మార్చేసి.. ప్రభుత్వం నుంచి 33 ఏళ్లకు లీజుకు పొంది.. ఏకంగా కార్యాలయాన్ని నిర్మించేశారు వైసీపీ నేతలు. ఇప్పుడు దానిపై ఫిర్యాదు రావడంతో అసలు విషయం బయటకు వచ్చింది.

* ప్రభుత్వ భూములు లీజులకు..
2019లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. మరో 30 సంవత్సరాలు పాటు తామే అధికారంలో ఉంటామని జగన్ ప్రకటనలు కూడా చేశారు. అయితే ప్రతి జిల్లాకు ఒక భారీ కార్యాలయాన్ని నిర్మించాలని భావించారు. దాదాపు అన్నిచోట్ల ప్రభుత్వ స్థలాలను లీజు రూపంలో కేటాయించి కార్యాలయాలను నిర్మించారు. కానీ కూటమి వచ్చిన తరువాత ఈ కార్యాలయాలన్నీ నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారని నోటీసులు జారీ అయ్యాయి. అయితే తాజాగా విజయనగరంలో నిర్మించిన పార్టీ కార్యాలయం ప్రైవేటు స్థలంలో నిర్మించేసారని.. అది సంస్థానానికి చెందినది అని.. ప్రైవేటు స్థలం అని.. విజయనగరం రాజవంశీయులు పూసపాటి అశోక్ గజపతిరాజు కలెక్టర్ కు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటకు వచ్చింది.

* నగరం నడిబొడ్డున..
విజయనగరంలోని నగరం నడిబొడ్డున వైసిపి కార్యాలయ నిర్మాణం నిమిత్తం ప్రభుత్వ భూమి అంటూ ఎకరా స్థలాన్ని కేటాయించారు 2022లో. 33 ఏళ్ల పాటు లీజుకు..రూ.33,000 తీసుకొని ప్రభుత్వమే ఆ భూమి కేటాయించింది. పేదల భూముల్లో సవాలక్ష నిబంధనలతో ఇబ్బంది పెట్టే అధికారులు అప్పటి ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో.. ఒక ప్రైవేటు స్థలాన్ని ప్రభుత్వ భూమిగా చూపి వైసిపికి కేటాయించారు. పోనీ ప్రభుత్వ భూమిగా మార్చిన క్రమంలో ఆ ప్రైవేటు భూమికి చెందిన వ్యక్తులకు, సంస్థలకు కనీసం నోటీసులు ఇచ్చారా? అంటే అది కూడా లేదు. కానీ ఎంచక్కా వైసీపీ కార్యాలయాన్ని నిర్మించేశారు. వాస్తవానికి ఆ భూమి విజయనగరం రాజులకు చెందినది. దాదాపు 4.78 ఎకరాల భూమి ఉండగా అందులో ఎకరా స్థలాన్ని ప్రభుత్వ భూమిగా చూపి ఇచ్చేశారు. ఇప్పుడు అశోక్ గజపతిరాజు ఫిర్యాదుతో ఇదో సంచలన అంశంగా మారింది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

బిజెపి విషయంలో జగన్ కు సీనియర్ల హెచ్చరిక!

YSRCP
YSRCP

YSRCP: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ధిక్కార స్వరాలు పెరుగుతున్నట్లు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా జాతీయస్థాయిలో పార్టీ స్టాండ్ విషయంలో కొంతమంది సీనియర్లు అభ్యంతరాలు తెలుపుతున్నట్లు తెలుస్తోంది. బిజెపితో స్నేహం.. కాంగ్రెస్ పార్టీతో కయ్యం.. తటస్థ వైఖరి.. ఇండియా కూటమికి దూరం.. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమికి వ్యతిరేకం.. జాతీయస్థాయిలో ఎన్డీఏకు సానుకూలం.. ఇలా ఈ పరిణామాలతో వైసిపికి డ్యామేజ్ జరుగుతుందని కొంతమంది సీనియర్లు అభిప్రాయపడుతున్నారు. వీటన్నింటికీ చెక్ పడాలంటే బిజెపికి వైసీపీ దూరం అనే స్పష్టత ఇవ్వాలి అని ఇప్పుడు సీనియర్లు కోరుతున్నట్లు తెలుస్తోంది.

* వైసీపీ ఆవిర్భావం నుంచి..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి బిజెపి విషయంలో సానుకూలంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టేసరికి బిజెపి కేంద్రంలో అధికారంలో లేదు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి పార్టీ ఏర్పాటు చేశారు కాబట్టి.. అదే కాంగ్రెస్ కు బద్ధ శత్రువుగా ఉన్న బిజెపి సానుకూలంగా మారిపోయింది. అసలు బిజెపికి పూర్తి వైరుధ్య సిద్ధాంతాలతో వైసిపి ఉంది. అయినా సరే మధ్యలో కాంగ్రెస్కు ఇద్దరూ వ్యతిరేకం కాబట్టి ఒక్కటయ్యారు. అలాగని భిన్న సాంప్రదాయ ఓటర్లు రెండు పార్టీలకు. ఇద్దరూ కలిసేందుకు కుదరదు. అందుకే పరోక్ష సహకారం తీసుకుంటూ స్నేహాన్ని కొనసాగిస్తూ వచ్చారు.

* డిఫెన్స్ లో టిడిపి..
2014లో టిడిపి అధికారంలోకి వచ్చింది రాష్ట్రంలో. కేంద్రంలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది. అందులో టిడిపి కీలక భాగస్వామిగా ఉంది. అయినా సరే వైసీపీ పొలిటికల్ గేమ్ ఆడింది. ఆ ట్రాప్ లో పడ్డారు చంద్రబాబు. ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేసారు. కానీ అలా చేసింది మాత్రం జగన్మోహన్ రెడ్డి. విజయసాయిరెడ్డిని ప్రయోగించి జాతీయస్థాయిలో తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ నుంచి బయటకు వెళ్లేలా చేశారు. అది మొదలు ఇప్పటివరకు స్నేహం కొనసాగుతూ వచ్చింది. ఎంతవరకు రాష్ట్ర ప్రయోజనాల కోసం పెద్దలను కలుస్తున్నట్లు సీఎంగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పుకునేవారు. ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి ఏదైనా అడగాలి అనుకుంటే సాయి రెడ్డిని అడగండి అంటూ మీడియా ప్రతినిధులకు సూచించేవారు
. అయితే ఇంతవరకు బిజెపితో పరోక్ష స్నేహం జగన్మోహన్ రెడ్డికి కలిసి వచ్చింది. కానీ ఇప్పుడు ప్రజలకు నిజాలు తెలుస్తున్నాయి. మైనారిటీలతో పాటు దళితుల్లో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అందుకే బిజెపిని వదిలాల్సిన పరిస్థితి జగన్ మోహన్ రెడ్డి పై ఏర్పడింది.

* తెంచుకోవాల్సిందే..
ప్రస్తుతం బిజెపితో స్నేహం ఒక్క జగన్మోహన్ రెడ్డికి మాత్రమే లాభం. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి ప్రయోజనం లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పై కేసులు ఉన్నాయి కాబట్టి కేంద్రంతో సఖ్యతగా ఉండాలి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి బిజెపితో ఎటువంటి ప్రయోజనం వచ్చే అవకాశం లేదు. పార్టీకి ప్రయోజనం జరగాలి అంటే జగన్మోహన్ రెడ్డి బిజెపితో పరోక్ష స్నేహాన్ని కూడా వదులుకోవాల్సిందేనని సీనియర్లు తేల్చి చెబుతున్నారు. లేకుంటే మాత్రం ఇబ్బందికర పరిస్థితులు వస్తాయని భావిస్తున్నారు. ఒకరిద్దరు నేతలు అయితే ఈ విషయంలో కరాకండిగా ఉన్నారు. అలా చేయకుంటే పార్టీని కూడా విడిచిపెడతామని హెచ్చరిస్తున్నట్లు తెలుస్తోంది.

AI ఎఫెక్ట్.. చిప్ ఖర్చులు భరించలేమంటున్న సంస్థలు.. పెరగనున్న మొబైల్ ధరలు..

AI Chip Crisis
AI Chip Crisis

AI Chip Crisis: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికత ప్రపంచాన్ని ఎంత వేగంగా మారుస్తోందో.. అంతకంతకూ వినియోగదారులపై ఆర్థిక భారాన్ని కూడా మోపుతోంది. ప్రస్తుతం గ్లోబల్ టెక్ మార్కెట్లో తలెత్తిన సరికొత్త సంక్షోభం కారణంగా మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్ల ధరలు భారీగా పెరగనున్నాయని ప్రముఖ అంతర్జాతీయ రీసెర్చ్ సంస్థలు Gartner, TrendForceలు హెచ్చరిస్తున్నాయి. ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణం ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్’ విపరీతమైన వాడకమేనని టెక్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అదెలా అంటే?

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అత్యాధునిక AI కోడింగ్ ఏజెంట్లను రన్ చేయడానికి టెక్ కంపెనీలకు భారీ ఎత్తున ‘AI డేటా సెంటర్లు’ అవసరమవుతున్నాయి. ఈ డేటా సెంటర్లలోని సూపర్ కంప్యూటర్లు సజావుగా పనిచేయాలంటే అత్యంత వేగవంతమైన హై బ్యాండ్‌విడ్త్ మెమొరీ (HBM), సర్వర్-గ్రేడ్ DRAM, NAND ఫ్లాష్ స్టోరేజ్ చిప్‌లు అవసరం. ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్లో ఉత్పత్తి అవుతున్న మొత్తం మెమొరీ చిప్‌లలో సుమారు 70 శాతం వరకు ఈ AI డేటా సెంటర్ల కోసమే కంపెనీలు కొనుగోలు చేస్తున్నాయి.

సాధారణంగా మొబైల్స్, ల్యాప్‌టాప్‌లు కోసం చిప్ లను తయారు చేసే శాంసంగ్ , ఎస్‌కే హైనిక్స్ , మైక్రాన్ వంటి దిగ్గజ సంస్థలు.. ఇప్పుడు ఎక్కువ లాభాలు తెచ్చిపెట్టే AI సర్వర్ చిప్‌ల తయారీ వైపు తమ ప్లాంట్లను మళ్లించాయి. దీనివల్ల మనం రోజువారీగా వాడే స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, గేమింగ్ ప్లేస్టేషన్లకు అవసరమైన ర్యామ్ , రోమ్ చిప్‌ల కొరత తీవ్రమైంది. ఇదే సమయంలో వీటికి డిమాండ్ పెరిగింది. ఈ క్రమంలో కేవలం కొద్ది నెలల్లోనే మెమొరీ చిప్స్ కాంట్రాక్ట్ ధరలు 90% నుండి 130% పైగా పెరిగాయి.

ఇప్పటివరకు పెరిగిన అదనపు తయారీ ఖర్చులను మొబైల్, ల్యాప్‌టాప్ బ్రాండ్లే భరిస్తూ వచ్చాయి. కానీ, ఈ విపరీతమైన చిప్స్ ధరల భారంతో ఇకపై తాము ఏమీ చేయలేమని కంపెనీలు చేతులెత్తేస్తున్నాయి. ఇటీవలే యాపిల్ , హెచ్‌పీ వంటి గ్లోబల్ కంపెనీల ప్రతినిధులు మాట్లాడుతూ.. మెమొరీ చిప్స్ ధరల పెరుగుదల వల్ల తమ ఉత్పత్తుల ధరలను పెంచడం అనివార్యం అని స్పష్టం చేశారు. గతంలో ఒక ల్యాప్‌టాప్ తయారీ ఖర్చులో మెమొరీ చిప్‌ల వాటా 15% మాత్రమే ఉండగా, ఇప్పుడది ఏకంగా 35% కి చేరింది. ఫలితంగా ల్యాప్‌టాప్‌లు, మ్యాక్‌బుక్‌ల ధరలు అంతర్జాతీయ మార్కెట్లో 15% నుండి 35% వరకు పెరగడం మొదలైంది.

టెక్ నిపుణుల అంచనా ప్రకారం.. ఈ ధరల పెరుగుదల ప్రభావం ప్రీమియం మొబైల్స్/ల్యాప్‌టాప్‌ల కంటే బడ్జెట్ ఫ్రెండ్లీ డివైజ్‌లపైనే ఎక్కువగా ఉండనుంది. ధరలు విపరీతంగా పెరగడం వల్ల కంపెనీలు తక్కువ మార్జిన్ ఉండే బడ్జెట్ ఫోన్లను, ల్యాప్‌టాప్‌లను తయారు చేయడం తగ్గించవచ్చు. దీనివల్ల రాబోయే రోజుల్లో మార్కెట్లో సాధారణ డివైజ్‌ల లభ్యత తగ్గిపోనుంది. వినియోగదారులు కూడా కొత్త ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు కొనడానికి బదులు.. పాత వాటినే ఎక్కువ కాలం వాడటానికో లేదా సెకండ్ హ్యాండ్/రిఫర్బిష్డ్ మోడళ్లను ఆశ్రయించడానికో మొగ్గు చూపే అవకాశం ఉంది.

రవితేజ ను అవమానించిన దర్శకుడే పిలిచి సినిమా చేస్తున్నాడా..? రవన్న రేంజ్ నెక్స్ట్ లెవల్ అంతే...

Raviteja Upcoming Movie
Raviteja Upcoming Movie

Raviteja Upcoming Movie: మాస్ మహారాజా గా మంచి గుర్తింపును సంపాదించుకున్న నటుడు రవితేజ… ఆయన ఒకప్పుడు వరుసగా కమర్షియల్ సక్సెస్ లను సాధించాడు. ఇక ఇప్పుడు ఇరుముడి సినిమాతో డిఫరెంట్ ప్రయత్నమైతే చేస్తున్నాడు. అయితే ఒకప్పుడు మంచి విజయాలను సాధించి స్టార్ హీరోగా గుర్తింపును సంపాదించుకున్నప్పటికి ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాలు ప్రేక్షకుల్ని ఏమాత్రం అలరించడం లేదు. దాంతో ఇరుముడి అంటూ ఈసారి డిఫరెంట్ గా ప్రయత్నిస్తున్నాడు. మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ ను సాధిస్తాడు తద్వారా ఆయనకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ అవుతుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…

ఇక రవితేజ కెరీర్ స్టార్టింగ్ లో ఉన్నప్పుడు ఒక తమిళ్ డైరెక్టర్ రవితేజతో సినిమా చేయడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదట. రవితేజతో సినిమా చేసే అవకాశం వచ్చినా కూడా ఆ దర్శకుడు రవితేజతో ఎందుకు వేరే హీరోతో సినిమా చేద్దాం అన్నట్టుగా మాట్లాడాడట. కానీ ఇప్పుడు ఆ దర్శకుడే రవితేజ దగ్గరికి వచ్చి మనం ఒక సినిమా చేద్దాం అని అడుగుతున్నాడట. ఇంతకీ ఆ దర్శకుడు ఎవరు అంటే కమర్షియల్ డైరెక్టర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న హరి కావడం విశేషం…

ఇంతకుముందు హరి యముడు సినిమాతో మంచి పాపులారిటి ని సంపాదించుకున్నాడు. ఇప్పుడు రవితేజ హరి దర్శకత్వంలో చేయబోయే సినిమా ఫుల్లీ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ గా రాబోతుందని వార్తలైతే వస్తున్నాయి. రవితేజ క్రేజ్ అయితే ఇప్పుడు మామూలుగా లేదు. ఒకప్పుడు తను రిజెక్ట్ చేసిన దర్శకుడు తన దగ్గరకు వచ్చి సినిమా చేద్దామని అడిగినప్పుడు రవితేజ ఏ రేంజ్ లో ముందుకు దూసుకెళ్తున్నాడో మనం అర్థం చేసుకోవచ్చు.

ఇక రవితేజ తో హరి ఎలాంటి ప్రయోగం చేయబోతున్నాడు తద్వారా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయగలుగుతాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. రవితేజ సైతం ఇరుముడి రిజల్ట్ ఎలా ఉండబోతుంది అనే దాని మీదనే తన పూర్తి ఫోకస్ పెట్టాడు. ఈ సినిమా రిజల్ట్ ను బట్టి తన తదుపరి సినిమాలు ఏ విధంగా ఉండాలి అనేది ఆలోచించుకుంటాడట…

అమెరికా – ఇరాన్‌ చర్చలు.. వాన్స్‌ను రక్షణ కవచంగా వాడుతూ ట్రంప్‌ సేఫ్‌ గేమ్‌!

JD Vance Diplomacy
JD Vance Diplomacy

JD Vance Diplomacy: వంద రోజులకుపైగా జరిగిన అమెరికా – ఇరాన్‌ వార్‌ ముగిసింది. శాంతి చర్చలు జరుగుతున్నాయి. తుది డీల్‌ కుదరాల్సి ఉంది. అయితే ఈ సమయంలో ట్రంప్‌ సేఫ్‌ గేమ్‌ మొదలు పెట్టారు. స్విట్జర్లాండ్‌లో జరిగిన అమెరికా–ఇరాన్‌ చర్చల్లో ఇరాన్‌ ప్రతినిధులు ఆకస్మాత్తుగా సమావేశం నుంచి బయటకు వెళ్లిపోవడం దౌత్యపరమైన వివాదంగా మారింది. ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరఘ్చీ పాకిస్తాన్‌ నాయకులతో మాట్లాడి, అమెరికా బృందం వైపు చూడకుండా వెనుదిరగడం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. ఇది ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌కు జరిగిన అవమానం. అయితే ఈ ఘటన వెనుక ఉన్న అసలు రాజకీయ ఆటలు మరింత ఆసక్తికరంగా ఉన్నాయి.

స్విట్జర్లాండ్‌లో జరిగిన ఘటనకు కారణాలు..
ఇరాన్‌ మీడియా కథనాల ప్రకారం, అమెరికా ప్రతినిధులతో ఫొటో దిగాలన్న ప్రతిపాదన, అదే సమయంలో ట్రంప్‌ జారీ చేసిన హెజ్‌బొల్లా హెచ్చరికలు ఇరాన్‌ బృందానికి అసంతృప్తిని కలిగించాయి. దీంతో వారు తాత్కాలికంగా సమావేశం నుంచి బయటకు వెళ్లారని తెలుస్తోంది. ఇరానీయులు చర్చల్లో కొన్నిసార్లు అస్పష్టంగా వ్యవహరించడం సాధారణమని వాన్స్‌ స్పష్టం చేశారు. ఆ ఘటన తర్వాత కూడా తాము తొమ్మిది గంటలపాటు చర్చలు కొనసాగించామని ఆయన చెప్పారు. సోషల్‌ మీడియా దృశ్యాల కంటే నిజమైన చర్చల పరిణామాలు ముఖ్యమని ఆయన వ్యాఖ్యానించారు.

ఒప్పందంపై రిపబ్లికన్‌ వ్యతిరేకత..
ఇదిలా ఉంటే ఇరాన్‌తో సాధ్యమయ్యే తాత్కాలిక ఒప్పందంలో చమురు ఆంక్షల సడలింపు, స్తంభించిన ఆస్తుల విడుదల, ఇరాన్‌ పునర్నిర్మాణానికి భారీ ఆర్థిక సహాయం వంటి అంశాలు రిపబ్లికన్‌ వర్గాల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ట్రంప్‌ ఒప్పందాన్ని విజయవంతం చేస్తే క్రెడిట్‌ తనదని, విఫలమైతే నింద మాత్రం వేరొకరిపై పడేలా వ్యూహం రచిస్తున్నారని విశ్లేషకులు అంటున్నారు. అందుకే ట్రంప్‌ వాన్స్‌ను ముందు పెడుతున్నారని భావిస్తున్నారు. విదేశాంగ మంత్రి మార్కో రుబియో, రక్షణ శాఖ నాయకులు వెనక్కి తగ్గగా, విమర్శలన్నీ వాన్స్‌ భుజాలపై పడుతున్నాయి. ట్రంప్‌ ‘ఒప్పందం విజయవంతమైతే క్రెడిట్‌ నాదే, విఫలమైతే నింద జేడీదే‘ అని చేసిన వ్యాఖ్యలు ఈ వ్యూహాన్ని స్పష్టం చేస్తున్నాయి. రిపబ్లికన్‌ వర్గాలు దీన్ని ఇప్పటికే ‘వాన్స్‌ డీల్‌‘ అని పిలవడం మొదలుపెట్టాయి.

వాన్స్‌కు రాజకీయంగా గర్తింపు..
ఒప్పందం విజయవంతమైతే 2028 అధ్యక్ష ఎన్నికల్లో వాన్స్‌కు గణనీయమైన రాజకీయ లాభం కలిగే అవకాశం ఉంది. అయితే చర్చలు విఫలమైతే లేదా ఇరాన్‌ మళ్లీ సమస్యలు సృష్టిస్తే, ఆ రాజకీయ దెబ్బ ముందుగా వాన్స్‌కే తగిలే ప్రమాదం ఉంది. ట్రంప్‌ తాను సురక్షిత దూరంలో ఉండి, వాన్స్‌ను బాధ్యతలో పెట్టి రాజకీయంగా ఆడుతున్నారని అమెరికా మీడియా విశ్లేషిస్తోంది. ఇది ట్రంప్‌కు సాధారణమైన రక్షణ వ్యూహం అని, వాన్స్‌ను పరీక్షించే అవకాశం కూడా అని నిపుణుల అభిప్రాయం.

'మంగళగిరి' ఇక లోకేష్ కు శాశ్వతం!

Nara Lokesh Mangalagiri
Nara Lokesh Mangalagiri

Nara Lokesh Mangalagiri: ఇంట గెలిచి రచ్చ గెలవాలి అంటారు. ఇప్పుడు మంత్రి నారా లోకేష్ చేసింది అదే. మంగళగిరిలో గెలిచి అదే నియోజకవర్గాన్ని శాశ్వతంగా మలుచుకోవాలన్న ఆలోచనతో ముందడుగు వేస్తున్నారు లోకేష్. అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నారు. ఏపీలో నెంబర్ వన్ నియోజకవర్గం గా తీర్చిదిద్దే పనిలో ఉన్నారు. అసలు తెలుగుదేశం పార్టీ గెలవని నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకొని పెద్ద సాహసమే చేశారు. అటువంటి చోట ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కుమారుడిగా, సిట్టింగ్ మంత్రిగా ఉంటూ ఓడిపోయారు. అదే నియోజకవర్గ నుంచి 90 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలిచి రికార్డ్ సృష్టించారు.

* కేవలం రెండుసార్లు మాత్రమే..
మంగళగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలిచిన దాఖలాలు చాలా తక్కువ. ఆ పార్టీ ఆవిర్భవించిన తర్వాత కేవలం రెండుసార్లు మాత్రమే గెలిచింది. అటువంటి నియోజకవర్గాన్ని లోకేష్ ఎంపిక చేసుకోవడం సాహసమే. అయితే ఓటమి ఎదురైన తర్వాత లోకేష్ మంగళగిరి నియోజకవర్గాన్ని విడిచిపెట్టలేదు.. సొంత డబ్బులు పెట్టి ప్రత్యేకంగా అభివృద్ధి పనులు చేశారు. ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి అక్కడ రాజకీయాలనే మార్చేశారు. ప్రతి పేదవాడికి సాయం చేశారు. అసలు అక్కడ ఆయనకు కుల బలం లేదు. పార్టీ బలం లేదు. అటువంటి చోట ప్రజల మనసును గెలిచేందుకు ఐదేళ్లపాటు అహర్నిశలు శ్రమించారు. ఆయన సేవలను గుర్తించిన మంగళగిరి నియోజకవర్గ ప్రజలు భారీ మెజారిటీతో గెలిపించారు.

* శరవేగంగా అభివృద్ధి..
మంగళగిరిని శాశ్వత నియోజకవర్గంగా మార్చుకోవాలని లోకేష్ అడుగులు వేశారు. ప్రస్తుతం మంగళగిరి నియోజకవర్గ రూపురేఖలే మారిపోతున్నాయి. ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు ఏర్పాటు చేస్తున్నారు. నియోజకవర్గంలో ప్రధానంగా చేనేత కార్మికులు అధికం కావడంతో వారి కోసం అంతర్జాతీయ ప్రమాణాలతో చేనేతశాలను ఏర్పాటు చేశారు. అమరావతి రాజధాని ప్రాంతం కావడంతో రహదారులను అనుసంధానం చేస్తున్నారు. నిత్యం గ్రీవెన్స్ సెల్ లను ఏర్పాటు చేసి ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఏపీలోనే ఒక రోల్ మోడల్ గా మంగళగిరిని తీర్చిదిద్దే పనిలో ఉన్నారు లోకేష్. రాష్ట్ర ప్రభుత్వపరంగా భారీగా నిధులు వెచ్చించి పనులు చేపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను సైతం ఏర్పాటు చేయించి మంగళగిరిని జాతీయస్థాయిలో కూడా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు.

దువ్వాడ టీం పెద్దదే!

Duvvada Srinivas
Duvvada Srinivas

Duvvada Srinivas: రాజకీయాల్లో ప్రచారం అనేది ఒక కీలక ఘట్టం. ప్రచారం లేకపోతే రాజకీయాల్లో రాణించలేరు కూడా. కేవలం ప్రచారం ద్వారా ఎదిగిన నేతలు చాలామంది ఉన్నారు. ఎదిగిన తర్వాతే ఈ ప్రచారం అంతగా అవసరం ఉండదు. అయితే ప్రచారం విషయంలో ఏ స్థాయిలో ముందుకు వెళ్లాలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, మాధురి జంటకు తెలిసినంతగా మరొకరికి తెలియదు. ఎందుకంటే నిన్న శ్రీకాకుళం జిల్లాలో ఆ జంట చేసిన హల్చల్ సోషల్ మీడియాను షేక్ చేసింది. ఏ ఛానల్లో చూసిన వారే.. ఏ డిజిటల్ మీడియా ప్లాట్ ఫామ్ లో చూసిన వారే. అంతలా కుమ్మేశారు. ఒక పగడ్బందీ ప్రణాళికతో అడుగులు వేశారు.

* రోజంతా హైడ్రామా..
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై గతంలో దువ్వాడ శ్రీనివాస్ చేసిన కామెంట్స్ పై పోలీసులు విచారణకు పిలిచారు. అయితే తన సహచరి మాధురి తో కలిసి విచారణకు హాజరయ్యారు దువ్వాడ. దాదాపు 8 గంటల పాటు దువ్వాడ శ్రీనివాస్ కు విచారించారు పోలీసులు. ఆ సమయంలో పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో మాధురి ఉన్నారు. కానీ సాధారణ మీడియా జర్నలిస్టులతో పాటు పెద్ద ఎత్తున యూట్యూబర్లు చేరుకున్నారు అక్కడికి. దీనికి తోడు దువ్వాడ అనుచరుగణం వందల సంఖ్యలో అక్కడకు చేరుకోవడం ఆశ్చర్యం వేస్తోంది. ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్న దువ్వాడ శ్రీనివాస్ పై సస్పెన్షన్ వేటు పడింది. ఇప్పుడు ఆయన ఏ పార్టీకి చెందని వ్యక్తి. అటువంటి నేత కోసం వందలాది మంది రావడం పక్కా ప్రణాళికని అర్థం అవుతోంది.

* సామాజిక వర్గ కోణంలో..
శ్రీకాకుళం జిల్లాలో ఒక సామాజిక వర్గం పెత్తనం సాగుతోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా… తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినా ఆ సామాజిక వర్గం వారే ఆధిపత్యం ప్రదర్శిస్తున్నారు. అయితే మరో ప్రధాన సామాజిక వర్గం ఇందుకు జీర్ణించుకోవడం లేదు. అందుకే ఆధిపత్యం ప్రదర్శిస్తున్న ధర్మాన, కింజరాపు ఫ్యామిలీలను టార్గెట్ చేస్తున్నారు దువ్వాడ శ్రీనివాస్. దీంతో సొంత సామాజిక వర్గం అండదండలు ఆయనకు లభిస్తున్నాయి. అదే సమయంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు దువ్వాడ జంట. అందుకే యాక్టివిస్టులతో పాటు యూట్యూబర్లు దువ్వాడ జంట విషయంలో చాలా ఆసక్తి చూపుతుంటారు. అందుకే శ్రీకాకుళం జిల్లాలో మారుమూల గ్రామం గా ఉండే కొత్తూరులో సైతం వారు హల్చల్ చేయగలిగారు. 8 గంటల విచారణను రాష్ట్రస్థాయి అంశంగా మార్చగలిగారు.

జగన్మోహన్ రెడ్డికి చికాకు పెడుతున్న దువ్వాడ!

Duvvada Srinivas
Duvvada Srinivas

Duvvada Srinivas Controversy:  దువ్వాడ శ్రీనివాస్, మాధురి జంట సొంత జిల్లా శ్రీకాకుళంలో హల్చల్ చేసింది. పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యల కేసులో నోటీసులు అందుకున్న దువ్వాడ శ్రీనివాస్ శ్రీకాకుళం జిల్లా కొత్తూరు పోలీస్ స్టేషన్కు విచారణకు హాజరయ్యారు. దువ్వాడ శ్రీనివాస్ విచారణను ఎదుర్కొనగా.. ఆయన సహచరి మాధురి మాత్రం స్టేషన్ బయట హల్చల్ చేశారు. యూట్యూబ్ ఛానల్ తో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పై విమర్శలు చేశారు. మధ్యలో వైయస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన తీసుకొచ్చారు. పవన్ కళ్యాణ్ ను దువ్వాడ శ్రీనివాస్ తిడితే తప్పు అయినప్పుడు.. తమ నేత జగన్మోహన్ రెడ్డిని పవన్ కళ్యాణ్ తిడితే తప్పు కాదా అంటూ లాజిక్ ప్రశ్న వేశారు. తద్వారా తాము వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలం అని చెప్పుకొచ్చారు. దువ్వాడ శ్రీనివాస్ పై ఇంకా వైసీపీ సస్పెన్షన్ ఎత్తివేయలేదు. ఆ పార్టీ జిల్లా నేతలకు దువ్వాడకు అస్సలు పడడం లేదు. కానీ దువ్వాడ జంట మాత్రం జగన్మోహన్ రెడ్డి పట్ల అభిమానం దాచుకోవడం లేదు. మళ్లీ పార్టీలోకి వస్తాం అన్న ఆశ వారిలో కనిపిస్తోంది. పార్టీ నుంచి గట్టి భరోసా దక్కి ఉంటుందన్న అనుమానాలు కూడా ఉన్నాయి.

* ధర్మాన బ్రదర్స్ తో విభేదాలు..
దువ్వాడ శ్రీనివాస్ వైసీపీ జిల్లా నేతలుగా ఉన్న ధర్మాన సోదరులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతుంటారు. కింజరాపు కుటుంబంతో కలిసి ధర్మాన కుటుంబం మ్యాచ్ ఫిక్సింగ్ పాల్పడుతుందంటూ పలుమార్లు ఆరోపణలు చేశారు. అయితే కుటుంబ వ్యవహారంతో చాలా రోజుల తర్వాత దువ్వాడ శ్రీనివాస్ పై సస్పెన్షన్ వేటు వేసింది వైసిపి హై కమాండ్. అయితే దీని వెనుక ధర్మాన సోదరుల కుట్ర ఉందంటూ దువ్వాడ శ్రీనివాస్ ఆరోపణలు చేస్తూ వచ్చారు. దువ్వాడ శ్రీనివాస్ సస్పెన్స్ కు గురైన తర్వాత శాసనమండలిలో ఓ నిరసన కార్యక్రమానికి హాజరయ్యారు జగన్మోహన్ రెడ్డి. ఆ క్రమంలో ఎదురుపడిన దువ్వాడ శ్రీనివాస్ ను పలకరించగా… అప్పట్లో దువ్వాడ శ్రీనివాస్ జగన్మోహన్ రెడ్డిని కలుస్తానని చెప్పుకొచ్చారు. కానీ ఇంతవరకు కలిసే అవకాశం ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి. అయితే ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ తో పాటు మాధురి మాత్రం తాము వైసిపి నేతలమే అన్నట్టు మాట్లాడుతున్నారు. దువ్వాడ శ్రీనివాస్ అయితే కూటమి ప్రభుత్వంపై అదే పనిగా విమర్శలు చేస్తున్నారు.

* ఇండిపెండెంట్ ప్యానల్ తో పోటీ..
అసలు దువ్వాడ జంటను వైసీపీలోకి తీసుకునే పరిస్థితి ఉందా? జిల్లా నేతలు ఒప్పుకుంటారా? అనే అనుమానాలు ఉన్నాయి. అయితే తనను పార్టీలోకి రాకుండా అడ్డుకుంటారని దువ్వాడ శ్రీనివాస్ కు తెలుసు. అందుకే ఆయన గట్టి ప్లాన్ తో ఉన్నారు. తాను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అసలు సిసలైన నాయకుడిని అని చెప్పుకునేందుకు ఆయన ప్రయత్నం చేస్తున్నారు. చివరి నిమిషం వరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నం చేస్తారు. ఒకవేళ అది వీలుకాకపోతే అదే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసుకోనున్నారు. ఇండిపెండెంట్ ప్యానల్ పెట్టి.. కొంతమంది అభ్యర్థులతో అన్ని నియోజకవర్గాల్లో పోటీకి దిగనున్నారు. సహజంగా ఈ ప్యానల్ తో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కువగా డ్యామేజ్ జరుగుతుంది. ఎందుకంటే కుల ప్రాతిపదికన వెళ్తారు దువ్వాడ శ్రీనివాస్. అప్పుడు ఓట్లు చీల్చి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి నష్టం చేకూర్చనున్నారు. అందుకే దువ్వాడ శ్రీనివాస్ విషయంలో జగన్మోహన్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. పార్టీలోకి తీసుకుంటే ధర్మాన సోదరులతో పాటు సీనియర్లనుంచి ఇబ్బందులు తప్పవు. తీసుకోకపోతే ఇండిపెండెంట్ ప్యానల్ తో దువ్వాడ శ్రీనివాస్ వైసీపీకి ఇబ్బంది కలిగించక మానరు.

అగ్రరాజ్యానికి ఏంటీ కష్టం.. రష్యా ఆయువు పట్టుపై కొడుతోన్న ఉక్రెయిన్

Russia Ukraine War
Russia Ukraine War

Russia Ukraine War: రష్యా – ఉక్రెయిన్‌ వార్‌ తీవ్ర రూపం దాలుస్తోంది. గతంలో ఏ యుద్ధం కొనసాగనంత సుధీర్ఘంగా ఈ యుద్ధం జరుగుతోంది. అప్పుడప్పుడు కాస్త ఆగినట్లు అనిపించినా శక్తి పుంజుకుని మళ్లీ దాడులు చేసుకుంటున్నాయి. తాజాగా ఉక్రెయిన్‌ రష్యాపై విరుచుకుపడుతోంది. యుద్ధంలో ఆధిపత్యం చెలాయిస్తోంది. ఏకంగా రష్యా రాజధాని మాస్కోపై డ్రోన్లదో అటాక్‌ చేస్తోంది. దీంతో రష్యా భద్రతా వ్యవస్థలు ఒత్తిడిలో పడ్డాయి. అదే సమయంలో ఆక్రమిత క్రిమియాకు రష్యా ప్రధాన భూభాగం నుంచి ఇంధనం, సైనిక సామగ్రి చేరకుండా ఉక్రెయిన్‌ అడ్డంకులు సృష్టిస్తోంది. ఫలితంగా ప్రపంచంలోనే అత్యధిక చమురు ఉత్పత్తి చేసే దేశం అయిన రష్యాలోనే ఇంధన కొరత తీవ్రమవుతోంది.

క్రిమియా ప్రత్యామ్నాయ మార్గంపై దాడులు..
రోస్టోవ్‌–ఆన్‌–డాన్‌ నుంచి మారియపోల్, మెలిటోపోల్‌ మీదుగా క్రిమియాకు వెళ్లే ఆర్‌–280 హైవేను రష్యా సైన్యం కెర్చి వంతెనకు ప్రత్యామ్నాయంగా ఉపయోగిస్తోంది. ఉక్రెయిన్‌లోని 412వ నెమిసిస్‌ బ్రిగేడ్‌ (ప్రతీకార దేవత పేరుతో) ఈ మార్గాన్ని లక్ష్యంగా చేసుకుంది. అమెరికా తయారీ హార్నెట్‌ డ్రోన్లు, స్థానికంగా తయారైన మోర్గాన్‌ డ్రోన్లతో జరిపిన దాడుల తర్వాత ఈ రహదారిపై వాహనాల రాకపోకలు 70 శాతం పైగా తగ్గాయి. ట్యాంకర్లు, సైనిక వాహనాలు ఈ మార్గంలో వెళ్లడానికి భయపడుతున్నాయి.

మధ్య శ్రేణి డ్రోన్లతో దాడులు..
ఎఫ్‌పీ–2, బెహెమోత్‌ వంటి 50 నుంచి 300 కిలోమీటర్ల దూరం వరకు చేరగలిగే డ్రోన్లను ఉక్రెయిన్‌ విస్తృతంగా ఉపయోగిస్తోంది. ఇవి కేవలం సరఫరా వాహనాలనే కాకుండా రష్యా వైమానిక రక్షణ వ్యవస్థలను కూడా దెబ్బతీస్తున్నాయి. గతేడాది కంటే ఈ రకమైన మధ్య శ్రేణి దాడులు 28 రెట్లు పెరిగాయని అంచనా.

చమురు శుద్ధి కర్మాగారాలే లక్ష్యంగా..
2022 ఫిబ్రవరి నుంచి 2026 ఏప్రిల్‌ చివరి వరకు ఉక్రెయిన్‌ రష్యా ఇంధన శుద్ధి కర్మాగారాలపై 158 సార్లు దాడులు చేసింది. దేశంలోని అతిపెద్ద 33 రిఫైనరీల్లో కనీసం 24 దెబ్బతిన్నాయి. ర్యాజన్, సరటోవ్‌ రిఫైనరీలపై దాదాపు 15 సార్లు, సిజ్రాన్‌పై 11వ సారి దాడి జరిగింది. ఈ ఏడాది జనవరి నుంచి మే వరకు 16 రిఫైనరీలు దెబ్బతిని, రోజుకు 7 లక్షల బ్యారెల్స్‌ శుద్ధి సామర్థ్యం తగ్గింది. రష్యా ఇంధన శుద్ధి సామర్థ్యం 2009 తర్వాత తొలిసారి అత్యల్ప స్థాయికి చేరింది. 30కి పైగా రిఫైనరీల్లో ఉత్పత్తి రోజుకు 28 లక్షల బ్యారెల్స్‌ కంటే ఎక్కువగా తగ్గింది. ముడి చమురు ఉత్పత్తి కూడా రోజుకు 4.6 లక్షల బ్యారెల్స్‌ తగ్గిందని ఇంటర్నేషనల్‌ ఎనర్జీ ఏజెన్సీ అంచనా వేసింది.

సప్లయ్‌ చైన్‌ విచ్ఛిన్నం..
ఉక్రెయిన్‌ ఇప్పుడు రష్యా సైన్యం మందుగుండు, ఇంధనం, ఆహారం వంటి అవసరాల సరఫరాను నేరుగా అడ్డుకోవడంపై దృష్టి పెట్టింది. రష్యా లోపలి ప్రాంతాల్లోని ఇంధన కాన్వాయ్లు, సైనిక ట్రక్కులు, రైళ్లపై డ్రోన్‌ దాడులు పెంచింది. అమెరికా విశ్లేషకులు ఇలాంటి 150 దాడులను రికార్డు చేశారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇంధనం తరలిస్తున్న 20 రైళ్లను నాశనం చేసింది. రష్యా సైన్యం విజయాలు సాధిస్తున్నామని చెప్పినా, సరఫరా వ్యవస్థ విచ్ఛిన్నం కావడంతో ఆ విజయాలు ఖరీదైనవిగా మారుతున్నాయి.