Home Blog Page 8334

మరో ఐదుగురు పవన్ కళ్యాణ్ అభిమానులు మృతి..! 

పవన్ బర్త్ డే పార్టీ నుంచి తిరిగివస్తుండగా ప్రమాదం.. 5 గురు మృతి

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పుట్టిన రోజుని పురస్కరించుకుంటూ అతని అభిమానులంతా ఈ రోజున వేడుకలు చేసుకుంటున్నారు. అయితే కొన్ని చోట్ల ఆ వేడుకలు కాస్తా వారి జీవితాలకు సంకటంగా మారాయి. నిన్న రాత్రి ముగ్గురు యువకులు పవర్ స్టార్ బ్యానర్ ను కడుతూ కరెంటు తీగలు పట్టుకొని చనిపోగా…. తెల్లవారుజామున వరంగల్ రూరల్ దామెర మండలం పసరగొండ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని ఓవర్ టేక్ చేసే క్రమంలో ఒక కారు అదుపు తప్పినట్లు తెలుస్తోంది. 

Also Read : కుప్పంలోని బాధిత కుటుంబాలను కలవనున్న పవన్ కళ్యాణ్?

ఇక లారీ, కారు రెండు ఢీకొట్టడంతో కారు పల్టీలు కొట్టింది. ఆ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. వీరంతా కూడా వరంగల్ జిల్లా పోచం మైదాన్ కు చెందినవారుగా పోలీసులు గుర్తించారు. ఇకపోతే చనిపోయిన ఐదుగురు పవన్ కళ్యాణ్ బర్త్ డే వేడుకల్లో పాల్గొనేందుకు వెళ్తున్నారని కొన్ని మీడియా సంస్థలు వార్తలు వస్తున్నాయి. వీరందరూ పవర్ స్టార్ అభిమానులని…. అత్యుత్సాహంతో వేడుకల్లో పాల్గొనేందుకు వెళ్తున్న వారు పొరపాటున లారీని ఢీ కొట్టారని చెబుతున్నారు. 

మరణించినవారు మేకల రమేష్, మేడి చందు, రోహిత్, పవన్, సాబిర్ లుగా పోలీసులు గుర్తించారు. మృతదేహాలను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇక ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ చేపడున్నట్లు ఉన్నత అధికారులు పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన స్థలం వద్దకు హుటాహుటిన వచ్చిన ఏసిపి శ్రీనివాస్ సిబ్బందితో కలిసి అక్కడ సహాయక కార్యక్రమాలు చేపట్టారు. కానీ అప్పటికే ఫలితం లేకుండా పోయింది. 

ఇక ఈ విషయమై వారు జనసేన అభిమానులని పవన్ కళ్యాణ్ నుండి గాని, అతని పార్టీ తరఫు నుండి కానీ ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇప్పటికే నలుగురు యువకులు పైన చెప్పబడిన కరెంట్ షాక్ ఘటనలో గాయపడి హాస్పిటల్ లో ప్రాణాల కోసం పోరాడుతున్న దశలో ఇలా మరో ఐదుగురు మృతి చెందడం నిజంగా బాధించే విషయం.

Also Read : ట్విస్ట్: వదలని జగన్.. మళ్లీ హైకోర్టుకు నిమ్మగడ్డ

అభిమానులు ఇది గుర్తుంచుకోవాలి: రాంచరణ్ ఎమోషనల్

ramcharanనిన్న చిత్తూరు జిల్లా కుప్పంలో ముగ్గురు జనసేన అభిమానులు మృతిచెందడంపై హీరో రాంచరణ్ దిగ్భాంతి వ్యక్తం చేశారు. మృతిచెందిన కుటుంబాలకు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఈమేరకు తన ట్వీటర్లో ఎమోషనల్ ట్వీట్ పోస్టు చేశారు. ‘నిన్న కుప్పంలో జరిగిన దుర్ఘటనలో ముగ్గురు అభిమానులు కాలం చేశారు అనే వార్త నన్ను దిగ్భ్రాంతికి గురిచేసింది.. మీ ఆరోగ్యం, మీ ప్రాణం కంటే ఏది విలువైనది కాదు.. మీరంతా ఇది ఎప్పుడూ గుర్తు పెట్టుకొని జాగ్రత్తగా ఉండాలని నా మవని’ అంటూ ట్వీట్ చేశారు. అభిమానుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

పవన్ జన్మదినాన్ని పురస్కరించుకొని నిన్న కుప్పంలో అభిమానులు ఫెక్సీలు కడుతుండగా విద్యుదాఘాతంతో ముగ్గురు జనసేన అభిమానులు మృతిచెందాడు. ఈ ఘటనలో రాజేంద్ర, సోమశేఖర్, అరుణాచలం అనే యువకులు మృతిచెందడంతో విషాదాచాయలు నెలకొన్నాయి. వీరి ఆదుకునేందుకు ‘వకీల్ సాబ్’ చిత్ర యూనిట్ ఒక్కో కుటుంబానికి రూ.2లక్షల ఆర్థికసాయం ప్రకటించింది.

అదేవిధంగా ఈ సంఘటనలో గాయపడిన వారంతా త్వరగా కోలుకువాలని చిత్రయూనిట్ ఆకాంక్ష వ్యక్తం చేసింది. అభిమానులు వారి జీవితాల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కాగా పవన్ పుట్టినరోజును పురస్కరించుకొని ‘వకీల్ సాబ్’ నుంచి ఓ మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. అదిరిపోయే రెస్పాన్స్ తో ‘వకీల్ సాబ్’ మోషన్ పోస్టర్ ట్రెండింగులోకి దూసుకెళుతోంది.

చంద్రబాబుకు నోటీసులు జారీ చేసిన మదనపల్లి డీజీపీ… ఏం జరిగిందంటే?

Vizianagaram Royal Family Feud: Former Andhra Chief Minister Chandrababu Naidu Trapped In Duel Over The Issue

మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు మదనపల్లి డీజీపీ నుంచి నోటీసులు జారీ అయ్యాయి. కొన్ని రోజుల క్రితం చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం బండకాడ ఎస్సీ కాలనీలో ఓం ప్రకాశ్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఓం ప్రకాశ్ ఆత్మహత్య చేసుకోవడానికి మంత్రి పెద్దిరెడ్డికి సంబంధం ఉందని చంద్రబాబు సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలకు సంబంధించి ఆధారాలు ఉంటే సమర్పించాలని డీజీపీ నోటీసుల్లో చంద్రబాబును కోరారు.

Also Read : వైఎస్సార్‌‌ వర్థంతి: తండ్రిని మరిపిస్తున్న జగన్‌

చంద్రబాబు వైసీపీ నేతల వల్లే సదరు వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడని… ప్రకాశ్ మృతికి పెద్దిరెడ్డి వర్గమే కారణమని తీవ్రస్థాయిలో ఆరోపణలు చేయడంతో పాటు మదనపల్లి డీజీపికి ఆరోపణలను లేఖ రూపంలో రాశారు. దీంతో ఆ ఆరోపణల గురించి చంద్రబాబు దగ్గర ఏవైనా సాక్ష్యాలు ఉంటే పంపాలని డీజీపీ కోరారు. సీఆర్పీసీ సెక్షన్ 91 ప్రకారం చంద్రబాబు ఏవైనా ఆధారాలు ఉంటే వారం రోజుల్లోగా డీజీపీ కార్యాలయానికి హాజరై వాటిని అందజేయాల్సి ఉంది.

అయితే చంద్రబాబు సాక్ష్యాధారాలు ఉండటం వల్లే ఆరోపణలు చేశారా….? లేక సాధారణంగానే ప్రత్యర్థి పార్టీ మంత్రిపై ఆరోపణలు చేశారా….? అనే విషయాలు తెలియాల్సి ఉంది. గత నెల 24వ తేదీన బండకాడ ఎస్సీ కాలనీలో ఓం ప్రకాశ్ తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య చేసుకోవడానికి కొన్ని రోజుల ముందు ఓం ప్రకాశ్ ఏపీ సీఎం జగన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ వీడియో చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వైరల్ అయిన వీడియోనే ఒక రకంగా ఓం ప్రకాశ్ మృతికి కారణమైందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఓం ప్రకాశ్ వీడియో వల్లే ఆత్మహత్య చేసుకున్నాడా….? మంత్రి అనుచరులు అతనిని ఏమైనా బెదిరించారా….? ఓం ప్రకాశ్ ఆత్మహత్యకు ఇతర కారణాలేమైనా ఉన్నాయా….? అనే ప్రశ్నలకు పోలీసుల దర్యాప్తులో సమాధానాలు దొరికే అవకాశం ఉంది.

Also Read : ఏపీలో మందుబాబులకు శుభవార్త

క్లాసికల్ పాటకు అదిరిపోయే స్టెప్పులేసిన సొట్టబుగ్గల బ్యూటీ!

0

Lavanya Tripathi: I didn't plan to work in remakes- Cinema express

హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఎంత మంచి డ్యాన్సరో అందరికీ తెలిసిందే. కెరీర్ మొదట్లో వరుస విజయాలతో గుర్తింపు తెచ్చుకున్న లావణ్య త్రిపాఠికి గత కొంతకాలంగా అవకాశాలు తగ్గాయి. లాక్ డౌన్ వల్ల ఇంటికే పరిమితమైన ఈ బామ్మ తాజాగా కన్నానులే పాటకు స్టెప్పులేసి నెటిజన్లను అలరించింది. మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన బొంబాయి సినిమాలో ఈ పాటకు లావణ్య వేసిన స్టెప్పులు నెటిజన్లను ఫిదా చేస్తున్నాయి.

Also Read : #RRR: పులి ఫైట్ తోపాటు ట్రైన్ సీన్ గూస్ బంబ్సే?  

మనీషా కోయిరాలా, అరవింద స్వామి జంటగా నటించిన ఈ చిత్రం అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ అనిపించుకుంది. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించగా ఈ సినిమా పాటలు నేటికీ మ్యూజిక్ లవర్స్ ను ఆకట్టుకుంటూ ఉంటాయి. రెహమాన్ ఈ సినిమాకు అదిరిపోయే పాటలతో పాటు అంతకు మించిన స్థాయిలో నేపథ్య సంగీతం ఇచ్చాడు. ఈ సినిమా విడుదలై పాతికేళ్లు పూర్తయినా ఈ సినిమాను ఇష్టపడే అభిమానులు నేటికీ ఎంతో మంది ఉన్నారు.

లావణ్య ఈ పాటకు అద్భుతంగా స్టెప్పులు వేయడంతో తాజాగా ఈ పాట గురించి మరోసారి చర్చ జరుగుతోంది. కొరియోగ్రాఫర్ ఉమాంగ్ గుప్తాతో కలిసి వైట్ డ్రస్ లో లావణ్య వేసిన స్టెప్పులు సూపర్ గా ఉన్నాయి. అడవిలో తెల్ల పంజాబీ డ్రస్సులో లావణ్య అచ్చం దేవకన్యలా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. లావణ్య ఈ పాటకు స్టెప్పులేయడం గురించి కామెంట్లు చేస్తూ తన మనస్సుకు దగ్గరైన పాటకు డ్యాన్స్ చేశానని… ఇకపై మనస్సును అనుసరించాలని నిర్ణయం తీసుకున్నానని చెప్పారు.

Also Read : పవన్ బలం.. బలహీనత అభిమానులే..!

ఈఎస్‌ఐ స్కాం: మళ్లీ కదులుతున్న డొంక?

ఈఎస్‌ఐ మెడికల్‌ స్కాంని ఏసీబీ అధికారులు మరోసారి తవ్వుతున్నారు. నిందితులను అదుపులోకి తీసుకుని దర్యాప్తులో వేగం పెంచారు. ఈఎస్‌ఐ మాజీ డైరెక్టర్‌‌ దేవికారాణి, ఫార్మసిస్ట్‌ నాగలక్ష్మికి చెందిన రూ.4 కోట్ల 47 లక్షలను తాజాగా స్వాధీనం చేసుకున్నారు. కమర్షియల్‌, రెసిడెన్షియల్‌ భవనాల కోసం ఆ డబ్బును ఓ స్థిరాస్తి వ్యాపార సంస్థకు ఇచ్చినట్లుగా ఏసీబీ పక్కా సమాచారం అందింది. దీంతో దాడి చేసి ఆ డబ్బును సీజ్‌ చేశారు. బెయిల్‌ మీద బయటకొచ్చిన వెంటనే దేవికారాణి ఈ డబ్బులు అప్పజెప్పారు.

కొంతకాలం క్రితం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈఎస్‌ఐ స్కాం కేసు సంచలనం రేపింది. ఈ కేసులో డైరెక్టర్‌‌ దేవికారాణి, జాయింట్‌ డైరెక్టర్లు, ఫార్మసిస్టులు, మరికొంత మంది మధ్యవర్తులను అరెస్టు చేశారు. మొత్తం 25 మందిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం వారంతా కూడా బెయిల్‌పై బయటికి వచ్చారు. తాజాగా డైరెక్టర్‌‌ దేవికారాణి, ఫార్మసిస్ట్‌ నాగలక్ష్మికి చెందిన నగదును భారీ మొత్తంలో సీజ్‌ చేయడంతో మరోసారి కేసు తెరపైకి వచ్చింది.

మందుల కొనుగోలు, అమ్మకాలు, మెడికల్‌ క్యాంప్‌లు, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న డిస్పెన్సరీల్లో అవకతవకాలు జరిగాయని గతంలోనే అధికారులు ఆధారాలు సేకరించారు. ఈ గోల్‌మాల్‌లో కోట్ల రూపాయలు చేతులు మారినట్లు నిరూపించారు. దేవికారాణినే పాత్రధారి, సూత్రధారిగా చేర్చారు. ఆమె ఆస్తుల మీద ఆరా తీయడంతో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.

దేవికారాణి ఆస్తులపై ఆరా తీసిన ఏసీబీ.. ఐటీ కారిడార్‌‌లో సైబరాబాద్‌కు చెందిన ఆ సంస్థకు భారీ ఎత్తున డబ్బును అందజేశారు. అక్రమ సంపాదనలో కొంత సొమ్మును రూ.4కోట్ల 47 లక్షలను తాజాగా ఏసీబీ స్వాధీనం చేసుకుంది. వీటిలో దేవికారాణి రూ.3,75,30,000 చెల్లించగా.. నాగలక్ష్మి రూ.72 లక్షలు చెల్లించినట్లు గుర్తించారు. వీటితో సైబరాబాద్‌లో ఆరు రెసిడెన్షియల్‌ ఫ్లాట్లతో పాటు దాదాపు 15 వేల చదరపు అడుగుల కమర్షియల్‌ స్థలాలను తన కుటుంబ సభ్యుల పేరిట కొనేందుకు దేవికారాణి ప్లాన్‌ వేసింది. బినామీల పేరుతోనే రూ.22 లక్షల్ని ఆ సంస్థకు చెల్లించినట్లుగా అధికారులు తెలిపారు. ఇదీ కాకుండా మరో రూ.2 కోట్ల 29 లక్షల 30 వేల విలువైన చెక్కులు, ఆన్‌లైన్‌ ద్వారా ట్రాన్స్‌ఫర్‌‌ చేసినట్లు బయటపడింది.

ఐపీఎల్ ఆటగాళ్లకు కరోనా టెస్టులు.. ఖర్చు తెలిస్తే షాకే..!

0

దేశంలో కరోనా ఎంట్రీతో పరిస్థితులన్నీ తలకిందులుగా మారాయి. కరోనా దెబ్బకు ఇది అది అనే తేడా లేకుండా అన్నిరంగాలు కుదేలయ్యాయి. ముఖ్యంగా వలస కార్మికుల జీవనం అస్తవ్యస్తం అయింది. అదేవిధంగా సినీ పరిశ్రమ, క్రీడారంగానికి కోలుకులేని దెబ్బ తాకింది. సినీ పరిశ్రమ ఇప్పట్లో తెరుకునేలా కన్పించకపోయినా క్రీడారంగం మాత్రం కొద్దిగా కొద్దిగా కోలుకుంటోంది.

మనదేశంలో ఎన్ని ఆటలున్న.. క్రికెట్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇప్పటికే కరోనా కారణంగా టీ-20 కప్ వాయిదా పడగా పలు అంతర్జాతీయ మ్యాచులు రద్దయ్యాయి. కాగా ఇప్పుడిప్పుడు కొన్ని జట్లు కరోనా నిబంధనలు కఠినంగా పాటిస్తూ ప్రేక్షకుల్లేకుండానే మ్యాచులను నిర్వహిస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఐపీఎల్ ను నిర్వహించేందుకు బీసీసీఐ రెడీ అవుతోంది.

కరోనా సవాళ్లను ఎదుర్కొంటునే మ్యాచులను నిర్వహించేందుకు బీసీసీఐ మొగ్గుచూపుతోంది. ఈసారి ఐపీఎల్ యూఏఈలో జరుగనుంది. ప్రేక్షకులు లేకుండా ఐపీఎల్ జరుగనుందని సమాచారం. ఐపీఎల్ కోసం బీసీసీఐ ఆటగాళ్లందరికీ 10కోట్ల భారీ ఖర్చుతో కరోనా టెస్టులను నిర్వహిస్తోంది. భారత్ లో ఆటగాళ్లకు నిర్వహించిన కరోనా టెస్టులకు ఎనిమిది ప్రాంచైజీలు ఖర్చును భరించాయి.

అయితే యూఏఈలో ఐపీఎల్ ఆటగాళ్లు అడుగుపెట్టినప్పటి నుంచి ముగిసే వరకు అన్ని టెస్టులకు బీసీసీఐ ఖర్చు భరించనుంది. ఇప్పటికే యూఏఈకి చెందిన వీపిఎస్ హెల్త్ కేర్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. మొత్తం 20వేల మందికి కరోనా టెస్టులను నిర్వహించనున్నారు. ఒక్కో టెస్టుకు పన్నులు మినహా రూ.4వేలు(200 దిర్హామ్) చెల్లించనున్నట్లు ఐపీఎల్ నిర్వాహకులు తెలిపారు.

ప్రస్తుతం తాము రిస్కు తీసుకోలేదని.. ఆటగాళ్ల కోసం ప్రత్యేక హోటల్ ఏర్పాట్లు చేసి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే పలువురు ఆటగాళ్లకు కరోనా టెస్టులు పూర్తయినట్లు తెలిపారు.

జీడీపీ క్షీణత: అమెరికాదే అగ్రస్థానం.. నెక్ట్స్ భారత్‌దే..  

ఎక్కడో చైనా దేశంలోని వూహాన్‌లో పుట్టిన కరోనా వైరస్‌ ప్రపంచమంతటికి పాకి ఛిన్నాభిన్నం చేస్తోంది. ప్రపంచ దేశాలకు పెద్దన్న అయిన అమెరికాను సైతం కకావికలం చేసింది. ఆ దేశ ఆర్థిక వ్యవస్థను పూర్తిగా దెబ్బతీసింది. దాని తర్వాత ఆ ఎఫెక్ట్‌ పడింది మన భారత్‌పైనే. కరోనా మహమ్మారితో ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో జీడీపీ 23.9 శాతానికి కుంచించుకుపోయింది. ఇంత భారీ స్థాయిలో జీడీపీ పతనం కావడం ఇదే మొదటిసారి. సుదీర్ఘ లాక్‌డౌన్‌తో మన దేశానికి ఈ పరిస్థితి వచ్చినట్లు నిపుణులు అంటున్నారు.

కరోనా ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోంది. ఆర్థిక మూలాలను భారీగా దెబ్బతీస్తోంది. అగ్రరాజ్యమైన అమెరికా ఆర్థిక వ్యవస్థ ఏప్రిల్‌, జూన్ క్వార్టర్‌‌లో ఏకంగా మైనస్‌ 32.9 శాతానికి పడిపోయింది. తర్వాతి స్థానంలో మైనస్‌ 23.9 శాతంతో భారత్‌ ఉంది. 20.9 శాతంతో మూడో స్థానంలో బ్రిటన్‌, 13.8 శాతంతో ఫ్రాన్స్‌ నాలుగో స్థానంలో, 12.4 శాతంతో ఇటలీ ఐదో స్థానంలో, 12 శాతంతో కెనడా ఆరో స్థానంలో, మైనస్‌ 10.1 శాతంతో జర్మనీ ఏడో స్థానంలో, మైనస్‌ 7.6 శాతంతో జపాన్‌ ఎనిమిదో స్థానంలో ఉన్నాయి. ఈ దేశాల్లో భారత్‌, చైనా మినహా మిగతావన్నీ జీ7 కంట్రీసే.

కరోనాకు పుట్టినిల్లైన చైనాలో మహమ్మారి విజృంభించడంతో జనవరి–మార్చి క్వార్టర్‌‌లో జీడీపీ కేవలం 6.8 శాతమే క్షీణించింది. అదే క్వార్టర్‌‌లో భారత్‌ వృద్ధి రేటు 3.1 శాతంగా నమోదైంది. ఇప్పుడు అదే చైనాలో ప్రస్తుతం వృద్ధి రేటు 3.2 శాతం నమోదు చేసుకోవడం గమనార్హం. మన దేశంలో మాత్రం దారుణ పతనానికి గురైంది. కరోనాతో ఎక్కువ ప్రభావానికి గురైన జర్మనీ 10.1 శాతం మేర ప్రతికూలతను నమోదు చేసింది.

భారత్‌లో ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో కేవలం వ్యవసాయం, ఫారెస్ట్రీ, ఫిషింగ్ మాత్రమే 3.4 శాతం మేర వృద్ధిని నమోదు చేశాయి. నిర్మాణ రంగం మైనస్ 50.30 శాతం, ట్రేడ్, హోటల్, ట్రాన్స్‌పోర్ట్ మైనస్ 47 శాతం, మానుఫ్యాక్చరింగ్‌ మైనస్ 39.30 శాతం, మైనింగ్ అండ్ క్వారియింగ్ మైనస్ 23.30 శాతం, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, డిఫెన్స్‌ మైనస్ 10.30 శాతం, ఎలక్ట్రిసిటీ, యుటిలిటీస్ సర్వీసెస్ మైనస్ 7 శాతం మేర క్షీణించాయి.

Adah Sharma Latest Pics

0

అధికార టీఆర్‌‌ఎస్‌ సంఘంలో చీలికలు

 కార్మికుల సమస్యల మీద పోరాడి వాటి పరిష్కారానికి కృషి చేయాల్సిన యూనియన్‌ లీడర్లు.. వారికే వాళ్లే కొట్టుకుంటున్నారు. పదవి కోసం పొట్లాడుకుంటున్నారు. రెండు వర్గాలుగా వీడిపోయి బలాలను చాటుతున్నారు. ఏకంగా అధికార టీఆర్‌‌ఎస్‌ పార్టీ సంఘమైన టీఎంయూలోనే ఈ దుస్థితి దాపురించింది. యూనియన్‌లో నాయకత్వ మార్పుపై అంతర్గత కలహాలు భగ్గుమంటున్నాయి. జనరల్‌ సెక్రటరీ పదవి కోసం ఎవరి ప్రయత్నాలు వారు మొదలుపెట్టారు.

తమ సమస్యలు పరిష్కరించాలంటూ గతేడాది డిసెంబర్‌‌లో ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగారు. దాంతో అటు ప్రజలు ఇబ్బందులు పడడమే కాకుండా.. ఇటు ప్రభుత్వం కూడా లాస్‌ అయింది. ప్రజల నుంచి విమర్శలు సైతం ఎదుర్కొంది. అయితే.. వీటన్నింటికి కారణం యూనియన్లే అని సీఎం కేసీఆర్ ఆ టైంలో ఆగ్రహంతో ఊగిపోయారు. అసలు ఆర్టీసీలో యూనియన్లే అవసరం లేదని జబర్దస్త్‌గా ప్రకటించేశారు. ఇందులో భాగంగా యూనియన్లకు ఇచ్చిన అన్ని సదుపాయాలను రద్దు చేశారు. అప్పటి నుంచి గుర్తింపు సంఘమైన టీఎంయూ స్తబ్దుగానే ఉంది. ఇటీవల మళ్లీ యాక్టివ్‌ అయ్యేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇందుకు నాయకత్వం మార్పు తప్పదని భావించింది. కానీ.. ఇక్కడే అసలు ముసలం మొదలైంది యూనియన్‌లో.

నాయకత్వ మార్పుపై ఇప్పటికే యూనియన్ కీలక నేతలు ఒకటి, రెండు సార్లు సమావేశమయ్యారు. అయితే యూనియన్‌లో జనరల్‌ సెక్రటరీ తర్వాత కీలకంగా వ్యవహరిస్తున్న ఓ సీనియన్‌ నేత తనకే జనరల్‌ సెక్రటరీ కావాలనే పంతంలో ఉన్నారు. ఉద్యమ సమయం నుంచి కీలకంగా వ్యవహరిస్తున్నానని, తనకే ఇవ్వాలంటూ భీష్మించుకుకూర్చున్నారు. మొదట ఇస్తామని అంగీకరించిన యూనియన్‌ పెద్దలు ఆ తర్వాత వివిధ పరిణామాలతో వెనక్కి తగ్గినట్లు తెలిసింది. దీంతో సదరు నేతలో అసహనం పెరిగింది. ఆయన అనుచరులతో కలిసి మరో వర్గంగా చీలారు.

ఇటీవల రహస్యంగా జరిగిన సమావేశంలో తమ వర్గానికి అనుకూలంగా ఉన్న కొంత మంది హాజరై వివిధ అంశాలపై చర్చించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తమకే ప్రధాన కార్యదర్శి పదవి కావాలని మద్దతు కోరే ప్రయత్నం చేశారు. ఒక వేళ జనరల్‌ సెక్రటరీ పదవి ఇవ్వకపోతే యూనియన్‌ సభ్యత్వానికి రాజీనామా చేసి, కొత్తగా మరో యూనియన్‌ పెట్టాలనే ఆలోచన కూడా చేస్తున్నారు. ఇప్పటికే పలువురు మంత్రుల సాయంతో కేసీఆర్‌, కేటీఆర్‌ అపాయింట్‌మెంట్‌ కోసం ప్రయత్నిస్తున్నారని తెలిసింది. ఈ సమస్యకు పరిష్కారం దొరకాలంటే ప్రభుత్వ మద్దతుతోనే సాధ్యమని ఆ వర్గం భావిస్తోంది. కాగా ఈ విషయంపై 10వ తేదీ వరకు ఏదో ఒక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.

ఇదిలా ఉండగా.. ఇప్పట్లో నాయకత్వ మార్పు అంటూ లేదని మరో వర్గం చెప్పుకొస్తోంది. ఇన్‌చార్జి జనరల్‌ సెక్రటరీ ఇస్తామని ఆఫర్‌ ఇచ్చినా సదరు నేత అంగీకరించలేదని పేర్కొంటోంది. కావాలని రహస్య సమావేశాలు పెడుతున్నా ఆశించిన మేర నేతలు హాజరు కాలేదని అంటోంది. ఇలానే యూనియన్‌కు వ్యతిరేకంగా ప్రవర్తిస్తే బహిష్కరిస్తామని ఆ వర్గం నేతలు చెబుతున్నారు.

ఏపీలో మందుబాబులకు శుభవార్త

ఏపీలో మందుబాబుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ప్రజలకు ఇచ్చిన మాట కోసం సీఎం వైఎస్ జగన్ మందుబాబులపై పగబట్టాడు. ఏపీలో మద్యనిషేధం దిశగా మద్యం ధరలను భారీగా పెంచారు. ఈ క్రమంలోనే పక్కరాష్ట్రంలో మద్యం సగం ధరకు చీప్ గా దొరుతుండగా.. ఏపీలో మాత్రం డబుల్ రేట్లు పెట్టి పేదలు, మధ్యతరగతి ప్రజలు ఒళ్లుగుల్ల చేసుకుంటున్నారు. ఏపీలో మద్యం ధరలపై మందుబాబుల్లో తీవ్రమైన వ్యతిరేకత కూడా ఉంది.

ఇక ఈ క్రమంలోనే ఏపీకి తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు వంటి పొరుగురాష్ట్రాల నుంచి చీప్ మద్యం పోటెత్తుతోంది. దీన్ని స్వయంగా కొందరు నేతలే సరఫరా చేస్తూ దొరికారు. దీంతో ఏపీ పోలీసులు ఇప్పుడు పక్క రాష్ట్రాలనుంచి ఒక్క మద్యం బాటిల్ తెచ్చినా అరెస్ట్ చేసి కేసులు పెడుతున్నారు. దీనిపై బాధితులు హైకోర్టుకు ఎక్కగా మందుబాబులకు గొప్ప ఊరటల లభించింది.

జీవోనెంబర్ 411 ప్రకారం ఏపీలో మద్యాన్ని తీసుకొని వచ్చే వెసులు బాటు ఉంది. అయినప్పటికీ ఏపీ పోలీసులు కేసులు పెట్టి వేధిస్తున్నారు. ఈ క్రమంలోనే బాధితులు ఏపీ హైకోర్టు వ్యాజ్యం వేశారు.దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం కీలక తీర్పు వెలువరించింది.

ఏపీలోని మందుబాబులకు హైకోర్టు గుడ్ న్యూస్ చెప్పింది. మద్యానికి సంబంధించి దాఖలైన పిటీషన్ లో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇతర రాష్ట్రాల నుంచి మద్యం బాటిళ్లు తీసుకొచ్చుకోవడంపై కీలక తీర్పును ఏపీ హైకోర్టు ఇచ్చింది. జీవో నంబర్ 411 ప్రకారం మూడు మద్యం బాటిళ్లు తీసుకొని రావచ్చని స్పష్టం చేసింది. ఈ జీవోను ఏపీ పోలీసులు అమలు చేయాలని సూచించింది.

హైకోర్టు తీర్పు మందుబాబులకు ఊరటనిచ్చింది. దీనిపై తీర్పును రిజర్వు చేసింది. ఇప్పటివరకు దాఖలైన అనేక కేసుల్లో కొన్ని న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి కూడా ఎదురవుతుందని నిపుణులు అభిప్రాయపడ్డారు.

#RRR: పులి ఫైట్ తోపాటు ట్రైన్ సీన్ గూస్ బంబ్సే?  

rrr movieదర్శక దిగ్గజం రాజమౌళి తాజాగా తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. భారీ బడ్జెట్లో ప్యాన్ ఇండియా మూవీగా ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం రాబోతుంది. మెగా పవర్ స్టార్ రాంచరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ తొలిసారి ఈ మూవీలో కలిసి నటిస్తున్నారు. దీంతో ఈ మూవీపై మెగా, నందమూరి ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. వీరి అంచనాలకు మించిపోయేలా దర్శకుడు రాజమౌళి ఆర్ఆర్ఆర్ మూవీని తీసుకురానున్నట్లు తెలుస్తోంది.

కరోనా కారణంగా ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ షూటింగ్ నిలిచిపోయింది. లేకుంటే ఈపాటికే సినిమా పూర్తి చేసుకొని పోస్టు ప్రొడక్షన్ పనులు చేసుకునేది. రాజమౌళి సినిమా అంటేనే భారీగా టెక్నిషియన్లు, నటులతోపాటు జూనియర్ ఆర్టిస్టులు ఉండి తీరాల్సిందే. ప్రస్తుతం కరోనా కారణంగా వారిని ఇబ్బందులు పెట్టడం ఇష్టం లేక రాజమౌళి ప్రస్తుతానికి షూటింగులను ప్రారంభించలేదని తెలుస్తోంది. అయితే ఈ మూవీ షూటింగ్ నవంబర్లో లేదా డిసెంబర్లో సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు రాజమౌళి ప్లాన్ చేస్తున్నాడు.

ఆర్ఆర్ఆర్ షూటింగు నిలిచిపోయినప్పటికీ ఈ సినిమా గురించి నిత్యం ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంటుంది. ఈ మూవీలో జూనియర్ ఎన్టీఆర్-పులి మధ్య వచ్చే ఫైట్ సీన్ సినిమాకే హైలట్ అవుతుందనే ప్రచారం జరుగుతోంది. తాజాగా మరో యాక్షన్ సీన్ కూడా సినిమాకే హైలట్ అయ్యేలా రాజమౌళి ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. కదిలే ట్రైన్లో వచ్చే యాక్షన్ సీన్స్ ప్రేక్షకులను థ్రిల్లింగ్ గురిచేస్తాయనే టాక్ విన్పిస్తోంది. సినిమాలు ఈ యాక్షన్ సీన్ 5 నుంచి 6 నిమిషాల పాటు ఉంటుందని సమాచారం. ఈ ఒక్క సీన్ కోసమే దాదాపు నెలరోజుల షూటింగ్ చేయనున్నారట.

ఇప్పటికే రాంచరణ్ పుట్టిన రోజున ‘ఆర్ఆర్ఆర్’ టీం విడుదల చేసిన ‘భీమ్ ఫర్ రామరాజు’ టీజర్ ప్రేక్షకుల్లో సినిమాపై భారీ అంచనాలు పెంచింది. ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ కుతోడు చరణ్ ఫార్ఫామెన్స్ అదిరిపోవడంతో ఈ టీజర్ విడుదలైన కొద్దిగంటల్లోనే కొత్త రికార్డులను సృష్టించింది. ఇక ఎన్టీఆర్ టీజర్ కోసం ఫ్యాన్స్ అత్రుతగా ఎదురుచూస్తున్నారు. కొమురంభీం పాత్రలో ఎన్టీఆర్, అల్లూరి సీతరామరాజు పాత్రలో రాంచరణ్ నటిస్తుండటం ఆసక్తిని రేపుతోంది. చరణ్ కు జోడీగా అలియాభట్, ఎన్టీఆర్ సరసన ఓలివియా నటిస్తుండగా కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ సినిమా రిలీజు కోసం ప్రేక్షకులు అత్రుతగా ఎదురుచూస్తున్నారు.

త్వరపడండి: రూ.3.50 లక్షలకే ఇల్లు

‘ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు..’ అంటారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ రెండూ కష్టంతో కూడినవే. ఇక నిరుపేదలైతే ఇల్లు కొనుక్కోవడం అంటే వారికి కలగానే చెప్పాలి. ఇప్పుడున్న మెటీరియల్‌ రేటు.. కూలీల కాస్ట్‌.. వింటేనే దిమ్మతిరిగిపోతుంటుది. ఎంత లేదనుకున్నా ఒక మంచి ఇల్లు కట్టుకోవాలంటే రూ.30 లక్షల వరకు కావాల్సిందే. అయితే ఇల్లు లేని నిరుపేదల కోసం కేంద్ర ప్రభుత్వం సరికొత్త ప్లాన్‌ అందుబాటులోకి తెచ్చింది. ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన స్కీం కింద సొంతింటి కల సాకారం చేయనుంది. ఈ పథకం కింద పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని పేదలు, మిడిల్‌ క్లాస్‌ పీపుల్‌ ఇల్లు కొనుగోలు చేసేలా వెసులుబాటు కల్పించింది. అంతేకాదు మొదటిసారి ఇల్లు కొన్న వారికి వడ్డీ రాయితీ కూడా కల్పించింది.

కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన ఈ స్కీం వచ్చే ఏడాది మార్చి వరకు అమలులో ఉంటుంది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం హౌసింగ్ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌ మాత్రం ఈ పథకాన్ని వినూత్నంగా ముందుకు తీసుకెళ్తోంది. ఈ స్కీం కింద ప్రభుత్వమే ఇళ్లు నిర్మించి విక్రయిస్తోంది. అది కూడా కేవలం రూ.3.50 లక్షలకే. ఇలా ఇప్పటికే ఆ ప్రభుత్వం 3,500 ఇళ్లు నిర్మించింది. వాటిని నిరుపేద ప్రజలకు అమ్ముతోంది. కొనాలనుకునే వారు ఈనెల 1 నుంచే బుకింగ్‌ చేసుకోవాలని ఆ గవర్నమెంట్‌ సూచించారు. అక్టోబర్‌‌ 15లోపు దరఖాస్తు చేసుకున్న వారికే ఈ అవకాశం కల్పిస్తోంది. అయితే ఈ పథకానికి కొన్ని కండీషన్స్‌ అప్లై చేసింది.

ఈ పథకం ద్వారా ఇల్లు కొనాలనుకునే వారి వార్షిక ఆదాయం రూ.3.5 లక్షల లోపు ఉండాలి. పేద మధ్యతరగతి ప్రజలు మాత్రమే ఇందుకు అర్హులని ప్రకటించింది. అంతేకాదు అర్హులకు మరో బంపర్ ఆఫర్ ఇచ్చింది. రూ.3.50 లక్షలకు ఇల్లు కట్టివ్వడమే కాకుండా ఆ సొమ్మును ఒకేసారి చెల్లించే స్థోమత లేని వారి కోసం ఈఎంఐ ఆప్షన్‌ కూడా ఇచ్చింది. మూడేళ్లలోపు ఆ సొమ్మును చెల్లించాలని సూచించింది. దీంతో ఇప్పుడు ఈ హౌసింగ్‌ స్కీం ఫుల్‌ పాపులర్‌‌ అయింది.

ఏ పేదవాడికైనా కూడు, గూడు అవసరం. కూడు ఎలాగోలా సంపాదించుకున్నా గూడు కట్టుకోలేని దుస్థితి. అందుకే మన తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఈ హౌసింగ్‌ స్కీం అమలు దిశగా ఆలోచన చేయాలని కోరుతున్నారు. దీంతో తక్కువ ఖర్చుతో తమకు ఓ నీడ దొరుకుతుందని అంటున్నారు. మరి మన ప్రభుత్వాలు కూడా రూ.3.50 లక్షలకే ఇల్లు ఇచ్చే విధంగా ఆలోచన చేస్తాయని ఆశిద్దాం..!

పట్టాలెక్కనున్న మెట్రో.. తెలంగాణలో అన్ లాక్ 4 ఇలా..

metrotrains
‘కరోనాతో సహజీవనం తప్పదు.. అది మనల్ని వదిలి ఇప్పుడే పోదు.. మన జాగ్రత్తలో మనం ఉండాల్సిందే’ అంటూ ప్రెస్‌మీట్లలో చెప్పిన మన తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్‌‌ అంతే ఈజీగా కరోనా మీద చేతులెత్తేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనాను సీరియస్‌గా తీసుకోవడం మానేయడంతో కేసులు కూడా అంచనాకు అంతకుండా పెరిగిపోతూనే ఉన్నాయి. అందుకే.. ప్రారంభంలో ఎంతో ఆరాటంగా అమలు చేసిన లాక్‌డౌన్‌లు ఒక్కొక్కటిగా అన్‌లాక్‌ అవుతున్నాయి. ఈనెలతో అన్‌లాక్‌ 4 అమల్లోకి వచ్చింది. దీనికి సంబంధించి పలు మార్గదర్శకాలు మూడు రోజుల క్రితం కేంద్రం విడుదల చేసింది. దీనికి తగ్గట్లే తెలంగాణ రాష్ట్ర సర్కార్‌‌ కూడా పలు నిర్ణయాలు వెల్లడించింది.

కరోనా నేపథ్యంలో ఆగిపోయిన మెట్రో రైళ్లను ఈనెల 7 నుంచి పునః ప్రారంభించాలని నిర్ణయించింది. అయితే.. గతంలో మాదిరి కాకుండా దశల వారీగా రైళ్లను నడపాలని అనుకుంది. అంతేకాదు కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్రంలోనూ పలు అంశాలకు సంబంధించి అన్‌లాక్‌ 4 షురూ కానుంది. ఈ నెల 21 నుంచి ఓపెన్ ఎయిర్ థియేటర్లు నడుస్తాయని చెప్పిన ప్రభుత్వం.. ఆన్‌లైన్ క్లాసులను కూడా నిర్వహించుకోవచ్చని పేర్కొంది. స్కూళ్లు.. కాలేజీలు.. విద్యా శిక్షణ సంస్థలు.. సినిమాహాళ్లు.. స్విమ్మింగ్ పూల్స్.. ఎంటర్ టైన్‌మెంట్ పార్కులు.. థియేటర్లపై మాత్రం నిషేధం కంటిన్యూ చేసింది. కంటైన్మెంట్ జోన్లలో ఈ నెలాఖరు వరకు లాక్ డౌన్ రూల్స్‌ ఫాలో కావాలని ఆదేశించింది.

కేంద్రం విడుదల చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్ర సర్కారు అన్‌లాక్‌ గైడ్‌లైన్స్‌ తెలంగాణ సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌‌ రిలీజ్‌ చేశారు. బార్లు, క్లబ్‌లు మూసి ఉంటాయని.. వాటిని తెరవాలంటే ప్రత్యేక ఆదేశాలు జారీ చేయాల్సి ఉంటుందని చెప్పారు. 65 ఏళ్లు దాటిన వారు.. అనారోగ్యంగా ఉన్న వారు, గర్భిణులు, పదేళ్ల కంటే తక్కువ వయసున్న వారు ఇళ్లకే పరిమితం కావాలని స్పష్టం చేశారు. కంటైన్మెంట్ జోన్ల నుంచి ఆన్ లైన్ విద్య కోసం యాభై శాతం మంచి అధ్యాపక.. అధ్యాపకేతర సిబ్బంది హాజరయ్యేందుకు అనుమతి ఇచ్చారు. 9 నుంచి ప్లస్ టూ స్టూడెంట్స్‌, టీచర్స్‌, లెక్చరర్లు స్వచ్ఛందంగా స్కూళ్లు, కాలేజీలు సందర్శించే వీలుంది. ఇందుకు తల్లిదండ్రుల నుంచి లిఖితపూర్వకంగా అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది.

వీటితోపాటు సామాజిక, విద్య, క్రీడలు, వినోదం, ఆధ్యాత్మిక కార్యక్రమాలతోపాటు కల్చరల్‌ ప్రోగ్రాంలు వంద మంది నిర్వహించుకోవచ్చని గైడ్‌లైన్స్‌లో సూచించారు. పెళ్లిళ్లకు కూడా వంద మందికే పర్మిషన్‌ ఇచ్చారు. అదనంగా అంత్యక్రియలు, చివరి కర్మల్లో మాత్రం వంద మంది పాల్గొనేందుకు అనుమతి ఇచ్చారు. వీటికి అనుగుణంగా అన్‌లాక్‌ 4 అమలుకానుంది.

పవన్ బలం.. బలహీనత అభిమానులే..!

ప్లాపులు.. హిట్టులతో సంబంధం లేకుండా క్రేజ్ సంపాదించుకున్న హీరో పవన్ కల్యాణ్. ఆయన చేసేంది కేవలం 25 సినిమాలే అయినా ప్రపంచ వ్యాప్తంగా అశేష అభిమానులను సంపాదించుకున్నాడు. ఏ హీరోకు లేని ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పవర్ స్టార్ సొంతం. పవన్ ప్రస్తుతం సినిమాలతోపాటు రాజకీయాల్లోనూ బీజీగా మారారు. ప్రస్తుతం ప్రజా సమస్యలపై పోరాడుతూ పవర్ స్టార్ ప్రజలకు అండగా ఉంటున్నారు. అదేవిధంగా కొంచెం సమయాన్ని సినిమాలకు కేటాయించి తన అభిమానులను అలరించేందుకు మరోసారి రెడీ అవుతున్నాడు. అయితే పవన్ బలం.. బలహీనత అభిమానులే కావడం గమనార్హం.

 పవన్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు..

  •  పవన్ కల్యాణ్ అసలు పేరు కొడిదెల కల్యాణ్ బాబు. అయితే కల్యాణ్ ఇంటర్మీయట్ అయిపోయాక మార్షల్ ఆర్ట్స్ పై మక్కువ పెంచుకున్నాడు. కల్యాణ్ శిక్షణ తీసుకుంటున్న సమయంలోనే ఆయన గురువు కల్యాణ్ పేరు ముందు పవన్ పేరును చేర్చాడు. దీంతో కల్యాణ్ బాబు కాస్తా పవన్ కల్యాణ్ గా మారారు. సినీరంగంలో పవన్ కల్యాణ్ పేరే ఆయనకు బాగా కలిసొచ్చింది.
  •  పవన్ కల్యాణ్ కొన్నాళ్లపాటు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాడు. కరాటేలో బ్లాక్ బెల్ట్ సాధించాడు. కాగా పవన్ పూర్తి శాఖహరి. ఆయన నాన్ వెజ్ జోలికి వెళ్లడు.
  •  పవన్ కల్యాణ్ హీరో కంటే డైరెక్టర్ కావాలని ఆకాంక్షించాడు. అయితే చిరంజీవి భార్య సురేఖ ఒత్తిడితో పవన్ హీరోగా మారాడు. చిరంజీవి తమ్ముడిగా టాలీవుడ్లోకి ‘అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి’ మూవీతో ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఈ మూవీ అనుకున్నంత విజయం సాధించలేదు.
  • అయితే పవన్ కల్యాణ్ నటించిన నాలుగో చిత్రం ‘తొలిప్రేమ’ టాలీవుడ్లో సరికొత్త రికార్డులను సృష్టించింది. అమ్మాయికి తెలియకుండా ప్రేమించే యువకుడి(బాలు)గా ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. యువతకు బాలు పాత్ర బాగా కనెక్ట్ కావడంతో ఈ సినిమా భారీ విజయం సాధించింది. ఈ మూవీకి జాతీయ అవార్డుతో పాటు ఆరు నంది అవార్డులు వచ్చాయి. పవర్ స్టార్ ఖుషీ.. గబ్బర్‌ సింగ్‌.. అత్తారింటికి దారేది సినిమాలతో టాలీవుడ్లో సరికొత్త రికార్డులు సృష్టించాడు.
  • సౌత్‌ ఇండియా నుంచి పెప్సీ యాడ్‌లో కనిపించిన తొలి హీరో పవన్‌ కళ్యాణే. ఆయనకు క్యూబా విప్లవ వీరుడు చెగువేరా ఇష్టం. ఆయన సినిమాల్లోనూ చెగువేరా ఫొటోలు తరుచూ కన్పిస్తుంటాయి. అభిమానులు సైతం పవర్ స్టార్ ను చెగువేరాతో పోలుస్తుంటారు. పవన్ కల్యాణ్ కు పబ్బులు, విదేశీ టూర్లకు నచ్చదు. ఖాళీ సమయం దొరికితే పుస్తకాలు చదువుతూనో.. లేదా తన ఫాం హౌస్‌లో వ్యవసాయం చేస్తూనే ఉంటారు.
  •  పవన్ మ్యారేజీ లైఫ్ కొంత ఒడిదుడుకులతో ఉన్నట్లు కన్పిస్తోంది. 1997లోనే పవన్ ఓ యువతిని వివాహం చేసుకున్నాడు. అయితే వారిద్దరి మధ్య మనస్పర్థలు రావటంతో చాలాకాలం దూరంగా ఉండి 2007లో విడాకులు తీసుకున్నాడు. ఆ తర్వాత 2007లో రేణు దేశాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు 2012లో విడాకులు ఇచ్చిన తర్వాత రష్యాకు చెందిన అన్నా లెజనోవాను పవన్ మూడో పెళ్లి చేసుకున్నాడు.
  • పవన్ హీరోనే కాకుండా డైరెక్టర్‌గా, కొరియోగ్రాఫర్‌గా, రచయితగా, సింగర్‌గా, స్టంట్‌ కోఆర్టినేటర్‌గా, స్క్రీన్‌ప్లే రైటర్‌గా ఇండస్ట్రీలో రాణించాడు. పవన్ ఇండస్ట్రీ వర్గాలతో చాలా సన్నిహితంగా ఉంటాడు. ‘అర్జున్‌’ పైరసీ సమయంలో మహేష్ బాబుకు పవన్ మద్దతుగా నిలిచాడు. ఇండస్ట్రీలో హీరో వెంకటేష్, మహేష్ బాబు, రవితేజలతో పవన్ చాలా సన్నిహితంగా ఉంటాడు.
  • పవన్ సినిమాలతోపాటు సేవా కార్యక్రమాల్లోనూ ఎప్పుడు ముందుంటాడు. ప్రకృతి విపత్తుల సమయంలో కోట్లలో విరాళాలు ఇస్తుంటాడు. పవన్ కు సినిమాల్లో ఎంతో క్రేజీ ఉన్న అవార్డులు మాత్రం ఆయనకు పెద్దగా వరించలేదు. ఆయనకు కేవలం ఒకే ఒక్క ఫిలీం ఫేర్ అవార్డు వచ్చింది.
  • జనసేన పార్టీ స్థాపించి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన పవన్ కల్యాణ్ రాజకీయ సెలబ్రెటీల్లో టాప్ ప్లేసులో ఉన్నారు. 2014 ఎన్నికల సమయంలో అత్యధిక మంది సెర్చ్ చేసిన పొలిటిషన్ గా పవన్ కల్యాణ్ నిలిచాడని గూగుల్ వెల్లడించింది.

వైఎస్సార్‌‌ వర్థంతి: తండ్రిని మరిపిస్తున్న జగన్‌

ys jaganmohanreddy

‘సంకల్పం ముందు ఏదీ కష్టం కాదు’ అంటారు పెద్దలు. అది ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి  సరిగ్గా సరిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. వైఎస్సార్‌‌ వారసత్వంతో రాజకీయాల్లోకి వచ్చిన ఆయన ఎన్ని ఒడిదొడుకులు అనుభవించారో ఎవరికి తెలియనది కాదు. ఓ సీఎం కొడుకు అయినప్పటికీ ఏనాడూ ప్రభుత్వంలో పెత్తనం చెలాయించకుండా తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూనే వెళ్లారు. ఆ తర్వాత వైఎస్సార్‌‌ మరణంతో ఆయనకు కష్టాలు మొదలయ్యాయి. ఓ ఎంపీ అని కూడా చూడకుండా ఏడాదికి పైగా జైల్లో పెట్టారు. అయినా మనోనిబ్బరం కోల్పోకుండా జైలు నుంచి బయటకు వచ్చి కొత్త పార్టీని స్థాపించారు. తన తండ్రి పేరుతోనే వైఎస్సార్‌‌ కాంగ్రెస్‌ పార్టీ అని నామకరణం చేశారు. మొదటిసారి జరిగిన ఎన్నికల్లో అధికారం దరిచేరలేదు. అప్పటి నుంచి నిత్యం ప్రజల్లోనే ఉండిపోయారు. అయితే.. తన తండ్రికి కలిసివచ్చిన పాదయాత్రను అస్త్రంగా ఎంచుకొని పాదయాత్రకు దిగారు.

తను పాదయాత్ర మొదలు పెట్టిన రోజే ప్రజలకు చెప్పారు.. తండ్రి ఫొటో పక్కన తన ఫొటో పెట్టుకునేలా చేస్తానని.. ఎన్ని ఇబ్బందులు వచ్చినా వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసి తీరుతారనని భరోసా ఇచ్చారు. చెప్పినట్లుగానే పాదయాత్రలో ఎన్ని సమస్యలు వచ్చినా లెక్కచేయలేదు. అన్ని వర్గాలకు చెందిన సమస్యలు విన్నారు. తను ఒక గ్రంథంలా సిద్ధం చేసుకున్న నవరత్నాలతోపాటు మరిన్ని అవసరాలను గుర్తించారు. సెకండ్‌ టైం ఎన్నికల్లో వాటినే ప్రచారాస్త్రాలుగా వాడారు. అటు పాదయాత్ర.. ఇటు ప్రచారంలో ఇచ్చిన హామీలు నమ్మిన ప్రజలు బంపర్‌‌ మెజార్టీ కట్టబెట్టారు. ఏకంగా 151 స్థానాల్లో గెలిపించి ప్రతిపక్షం లేకుండా చేశారు.

అధికారంలోకి రాగానే సీఎం జగన్మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు చేస్తున్న కృషిలో ఆయన తండ్రి వైఎస్సార్‌‌ కనిపిస్తున్నారు. ఒక పథకం తర్వాత మరో పథకం.. ఇలా తను ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు తన వంతు ప్రయత్నం చేస్తున్నారు. తండ్రి మాదిరిగానే ఇచ్చిన మాటకు కట్టుబడి పని చేస్తానని నిరూపిస్తున్నారు. ప్రపంచాన్నే కకావికలం చేస్తున్న కరోనా టైంలో దేశంలో ఏ రాష్ట్రంలోనూ చేయని విధంగా టెస్టులు చేస్తూ ఆదర్శంగా నిలిచారు. ఇదొక్కటి చాలదా ఆయన పాలన ఎలా నడుస్తోందో చెప్పడానికి.

నేడు దివంగత నేత వైఎస్ రాజశేఖరెడ్డి వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయలో సమాధి వద్ద జరిపే పూజలకు సీఎం జగన్‌ వెళ్లారు. ‘పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం, రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం మా నాన్న గారు ఒక అడుగు ముందుకు వేస్తే.. ఆయన కొడుకుగా నేను రెండు అడుగులు ముందుకు వేస్తాను’ అని చెప్పిన మాటలను నిలుపుకుంటున్నారు. దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ఐదున్నరేళ్లపాటు ముఖ్యమంత్రిగా పనిచేశారు. సంక్షేమానికి సరికొత్త నిర్వచనం ఇచ్చారు. కోటి ఎకరాలకు నీళ్లందించి.. రాష్ట్రాన్ని సుభిక్షం చేయడానికి జలయజ్ఞం కింద 84 ప్రాజెక్టులను చేపట్టి, సింహభాగం పూర్తి చేశారు. రికార్డు స్థాయిలో వ్యవసాయ ఉత్పత్తులు సాధించడం ద్వారా అన్నపూర్ణ నామధేయాన్ని రాష్ట్రానికి సార్థకం చేశారు. శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం, గంగవరం పోర్టు, కృష్ణపట్నం పోర్టులను పూర్తి చేసి.. ఐటీ రంగం, పారిశ్రామికాభివృద్ధికి బాటలు వేయడం ద్వారా ప్రగతి రథాన్ని కొత్త పుంతలు తొక్కించారు. సంక్షేమాభివృద్ధి పథకాల అమలులో మార్గ నిర్దేశకుడిగా నిలిచారు. ఆయన మన నుంచి దూరమై అప్పుడే 11 ఏళ్లు గడిచాయి. ఆ మహానేత దిశానిర్దేశం చేసిన మార్గంలోనే 15 నెలలుగా సీఎం జగన్‌ విప్లవాత్మక రీతిలో సంక్షేమాభివృద్ధి పథకాలను పరుగులు పెట్టిస్తున్నారు. మున్ముందు కూడా ఇలానే రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించి తన మార్క్‌ పాలన నిరూపించాలని ప్రజలూ కోరుకుంటున్నారు.

నెంబర్ వన్ పవర్ స్టారే.. మోషన్ పోస్టరే నిదర్శనం !


పవర్ స్టార్.. సినిమాలు మానేసినా.. తన పేరు మీద పెద్దగా ఇండస్ట్రీ రికార్డ్స్ లేకపోయినా.. పవన్ కళ్యాణ్ అనే హీరోనే టాలీవుడ్ లో ఎప్పటికైనా నెంబర్ వన్ హీరో అని ఒక ముద్ర పడిపోయిందంటే.. అది పవన్ కళ్యాణ్ కి ఉన్న అశేష అభిమానగణమే కారణం. పవర్ స్టార్ సినిమాలు చేసినా.. చేయకపోయినా మాకు ఆయనే నెంబర్ వన్ అని పవన్ ఫ్యాన్స్ తో పాటు సగటు సినీ అభిమాని కూడా ఫీల్ అవుతూ ఉంటాడు. పవన్ కూడా అలాంటి నెంబర్ వన్ పొజిషన్ ను కాదనుకుని.. ప్రజలకు మేలు చేయటానికి రాజకీయాల్లోకి వెళ్లారు. అయినప్పటికీ పవన్ సినిమాలకు ఇంకా డిమాండ్ తగ్గలేదు. పైగా పవన్ దే నెంబర్ వన్ పొజిషన్ అనేలా ప్రస్తుతం సోషల్ మీడియాలో పవన్ కి ఉన్న డిమాండ్ చూస్తే అర్ధమవుతుంది. ఏమైనా రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నా.. తన ఫ్యాన్స్ ను అలరించడం కోసం పవన్ ఇప్పటికే మూడు సినిమాలాకు సైన్ చేసి.. అభిమానులకు అదిరిపోయే గిప్ట్స్ ఇచ్చాడు.

Also Read: హ్యపీ బర్త్ డే పవన్ కల్యాణ్: సినీ, రాజకీయ ప్రస్థానం

కాగా తాజాగా పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా వకీల్ సాబ్ సినిమా నుండి మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేసింది చిత్రబృందం. మోషన్ పోస్టర్ లో పవన్ కళ్యాణ్ లుక్ ను చూస్తుంటే.. గూస్ బంప్స్ వచ్చేలా ఉన్నాయి. మొత్తానికి పవన్ కళ్యాణ్ సినిమా కోసం ఇన్నేళ్లు ఎదురు చూసిన పవన్ ఫ్యాన్స్ కు ఈ మోషన్ పోస్టర్ మంచి కిక్ ఇచ్చింది. ఏమైనా పవన్ ఫ్యాన్స్ కు ఏది కావాలో మోషన్ పోస్టర్ లో అదే చూపించారని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ పోస్టర్ సినిమా పై అంచనాలను మరింతగా పెంచేసింది. కచ్చితంగా ఈ సినిమా ఇప్పటివరకూ ఉన్న రికార్డులన్నింటినీ బద్దలు కొడుతుందని పవర్ స్టార్ ఫ్యాన్స్ తమ ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు.

Also Read: పవన్ కళ్యాణ్ బర్త్ డే ఎందుకు చేసుకోరంటే?

ఈ సినిమా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా వస్తోంది. థమన్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఈ సినిమా కోసం ప్రత్యేకమైన ట్యూన్స్ రెడీ చేస్తున్నాడట. అనట్టు ఈ మోషన్ పోస్టర్ లో పవర్ స్టార్ లాయర్ కోట్ వేసుకొసుకుని కుర్చీ మీద కాలు పెట్టి లా పుస్తకాన్ని చేతుల్లో పట్టుకొని నిలబడిన తీరు ఆమోహం అద్భుతం అంటూ పవర్ స్టార్ అభిమానులు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయిపోతున్నారు. ఇక ఇప్పటికే ట్విట్టర్ లో పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా #HBDPawanKalyan అనే హ్యాష్ టాగ్ ట్విట్టర్ లోనే టాప్ లో ట్రెండింగ్ అవుతూ సోషల్ మీడియాని ఊపేస్తోంది. అలాగే ఫ్యాన్స్ కి పవన్ నుండి మరో సర్ ప్రైజ్ గిప్ట్స్ ఉన్నాయి. పవర్ స్టార్ చేస్తోన్న మిగితా సినిమాల అప్ డేట్స్ కూడా ఈ రోజే రివీల్ కానున్నాయి. ఈ సాయంత్రం 4 గంటలకు హరీశ్ శంకర్, పవన్ కల్యాణ్ డిటైల్స్ చెప్పనున్నారు. అలాగే క్రిష్ తో కలిసి పవన్ చేస్తోన్న సినిమా అప్ డేట్ కూడా ఈ రోజు రాబోతోంది.

 

యువతను టార్గెట్‌ చేసిన జగన్‌

CM Jagan
ఒక్కసారి ప్రజల ఆదరాభిమానాలు పొందాలంటే ఎంత కష్టమో అది ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డికి బాగా తెలుసు. ఒక్క ఛాన్స్‌ ప్లీజ్‌ అంటూ ఎన్ని కష్టాలు పడ్డారో.. ఎన్ని రోజులు ప్రజల్లో తిరిగారో అందరికీ తెలిసిందే. ఎట్టకేలకు ఆ అవకాశం వచ్చింది. బంపర్‌‌ మెజార్టీ ఇచ్చి జగన్‌ను సీఎం సీటు ఎక్కించారు. మరి ఇప్పుడు ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం జగన్‌ మీద ఎంతగానో ఉంది. అందుకే.. ఏ సంక్షేమ పథకాలతో ప్రజలకు లాభం చేకూరుతుంది..? రైతన్నలను ఎలా ఆదుకోవాలి..? యువతకు ఎలాంటి ఉపాధి చూపాలి..? వారి భవిష్యత్‌ ఎలా ఉండాలి..? ఇలా ప్రతీ వర్గం గురించి ఆలోచిస్తూ పాలనలో ముందుకు సాగుతున్నారు.

ఇందులో భాగంగానే రాష్ట్రంలో 30 నైపుణ్యాభివృద్ధి కాలేజీల ఏర్పాటుకు నడుం బిగించారు. కాలేజీల నిర్మాణం కోసం స్థలాల గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేయాలని, భవనాల నిర్మాణం అత్యంత నాణ్యతగా ఉండాలని, ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి చెప్పారు. ఆర్థిక శాఖ అధికారులతో కూర్చొని కాలేజీల నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేయాలని.. పనులు త్వరగా మొదలు పెట్టాలని.. వ్యవసాయంలో ఉపయోగించే యంత్రాల వినియోగం, వాటి మరమ్మతులపై యువతకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. హై ఎండ్‌ స్కిల్స్‌తోపాటు ప్రతీ కాలేజీలో ఏసీలు, ప్లంబింగ్, భవన నిర్మాణం తదితర పనులపై  శిక్షణ ఇవ్వాలని.. ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గానికి ఒక కాలేజీ ఉండేలా చూసుకోవాలన్నారు. నైపుణ్యాల అభివృద్ధి, ఉత్తమ మానవ వనరులను పరిశ్రమలకు అందించడంలో, పారిశ్రామికాభివృద్ధిలో ఈ కాలేజీలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు.

కాలేజీల కోసం ఇప్పటి వరకు దాదాపు 20 చోట్ల స్థలాలను గుర్తించారు. మిగిలిన చోట్ల కూడా ఆ ప్రక్రియ చురుగ్గా సాగుతోందని అధికారులు వెల్లడించారు. స్కిల్‌ డెవలప్‌ మెంట్‌ కాలేజీల్లో వివిధ కోర్సులకు పాఠ్యప్రణాళిక సిద్ధం చేశారు. ఫినిషింగ్‌ స్కిల్‌ కోర్సులు, ప్రత్యామ్నాయ ఉపాధి కోర్సుల్లో శిక్షణ ఉంటుంది. మొత్తం 162కిపైగా కోర్సులు ఉంటాయి. ఇందులో 127 కోర్సులు ఫినిషింగ్‌ స్కిల్స్, 35 ప్రత్యామ్నాయ ఉపాధి కోర్సులు ఉన్నాయి. పరిశ్రమల అవసరాలపై సర్వే ప్రకారం కోర్సులు నిర్ణయించారు. పాఠ్య ప్రణాళిక తయారీలో సింగపూర్‌ పాలిటెక్నిక్, జీఐజెడ్, వాన్‌ హాల్‌ లారెన్‌స్టెన్‌ (యూనివర్సిటీ ఆఫ్‌ అప్‌లైడ్‌ సైన్సెస్‌), డిపార్ట్‌మెంట్‌ ఫర్‌ ఇంటర్నేషనల్‌ డెవలప్‌మెంట్‌ భాగస్వామ్యాన్ని తీసుకుంటున్నారు.

మరో 23 ప్రఖ్యాత సంస్థలతో భాగస్వామ్యం కోసం ఎంఓయూలకు సిద్ధమయ్యారు. ఇంకో 35 సంస్థలతో చర్చలు నడుస్తున్నాయి. ల్యాబ్‌ ఏర్పాట్లు, పాఠ్య ప్రణాళికలో వీరి సహకారం తీసుకోనున్నారు. ఎంఓయూలకు సిద్ధమైన వాటిలో డెల్, హెచ్‌పీ, టీసీఎస్, ఐబీఎం, బయోకాన్, టాటా తదితర కంపెనీలు ఉన్నట్లు ఆఫీసర్లు చెప్పారు.