Home Blog Page 64

హైడ్రోజన్ రైళ్ళు.. కాలుష్యం ఉండదు.. అగ్రరాజ్యాల సరసన భారత్.. విశేషాలివీ

Hydrogen Trains in India
Hydrogen Trains in India

Hydrogen Trains in India: రోజురోజుకు మనుషుల సంఖ్య పెరిగిపోతుంది. ప్రయాణాలు చేసే వారి సంఖ్య కూడా అధికమవుతోంది. ప్రజల అవసరాలు పెరిగిపోతున్నాయి. ప్రజలు ఉపయోగించే సరుకులు కూడా అదే స్థాయిలో ఎక్కువ అవుతున్నాయి. ఇలాంటి అప్పుడు సరుకు రవాణా చేయడం కష్టతరంగా మారుతుంది. దీనికి తోడు రైళ్లకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాల్సిన అవసరం ఏర్పడుతోంది.

మనదేశంలో అనేక విధాలుగా విద్యుత్ తయారవుతున్నప్పటికీ.. ఎక్కువగా థర్మల్ విధానంలోనే కరెంటు తయారు చేస్తున్నారు. థర్మల్ కరెంటు తయారీకి బొగ్గు.. నీరు అవసరం. బొగ్గు అనేది ఒక పరిమితమైన వనరు. ఇలానే తవ్వుకుంటూ పోతే భవిష్యత్తులో బొగ్గు అనేది ఉండదు. అప్పుడు భవిష్యత్ తరాలు ఇబ్బంది పడుతుంటాయి. అందువల్లే సరికొత్త ఆవిష్కరణ చేశారు శాస్త్రవేత్తలు.

విద్యుత్ కాకుండా.. బొగ్గును మండించడం ద్వారా కాకుండా.. హైడ్రోజన్ ద్వారా రైళ్ళను నడిపిస్తున్నారు.. ప్రపంచంలో ఇప్పటికే జర్మనీ, చైనా, జపాన్, అమెరికా దేశాలలో హైడ్రోజన్ తో నడిచే రైళ్లు ఉన్నాయి. అక్కడ అవి విజయవంతంగా కార్యకలాపాలు సాగిస్తున్నాయి.. డీజిల్ రైళ్లకు ఇవి ప్రత్యామ్నయం. వీటివల్ల ఇంధనం ఖర్చు తగ్గుతుంది. కాలుష్యం ఉండదు. శబ్ద కూడా తక్కువ. కేవలం 15 నుంచి 20 నిమిషాల వ్యవధిలోనే ఇంధనం నింపొచ్చు.. దీనివల్ల ఒక్కసారి నింపితే రైలు 1000 కిలోమీటర్ల వరకు ప్రయాణం సాగిస్తూ ఉంటుంది.

మనదేశంలో సరుకు రవాణా రైళ్ల ద్వారానే అధికంగా సాగుతూ ఉంటుంది. ప్రయాణికులు కూడా కార్యకలాపాలను రైళ్ల ద్వారానే సాగిస్తూ ఉంటారు. రైల్వే శాఖ రైళ్లను నడపడానికి విద్యుత్.. డీజిల్ అధికంగా వినియోగిస్తోంది.. వీటి ఖర్చు కూడా అధికంగా ఉంటున్నది. అందువల్లే హైడ్రోజన్ ఆధారంగా మన దేశంలో కూడా రైళ్లు నడపబోతున్నారు. ఇప్పటికే దేశంలో తొలి హైడ్రోజన్ ట్రైన్ చివరి దశ ట్రయల్ పూర్తయింది. హర్యాన రాష్ట్రంలోని జింద్ , సోనిపాట్ మార్గంలో 120 కిలోమీటర్ల వేగంతో ఈ రైలును పరీక్షించారు. అది విజయవంతం కావడంతో.. త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తారని తెలుస్తోంది. హైడ్రోజన్ రైలు సౌకర్యం అందుబాటులోకి వస్తే రైల్వే శాఖ మీద ఆర్థికంగా ఒత్తిడి తగ్గుతుంది. మరిన్ని కొత్త ప్రాజెక్టులు ఏర్పాటు చేయడానికి అవకాశం కలుగుతుంది.

అజిత్ దోవల్ ఫోన్ .. బర్మా అధ్యక్షుడు మోడీని కలిశారు.. చైనా తల పట్టుకుంది.. ఇంతకీ ఏంటి ఈ కథ

Myanmar President Meets Narendra Modi
Myanmar President Meets Narendra Modi

Myanmar President Meets Narendra Modi: అమెరికా ఏం చేస్తుంది.. తనకు ప్రయోజనాలు కలిగించే అంశంలో మాత్రమే వేలుపెడుతుంది. అవసరమైతే ఆ దేశాలతో అనవసరమైన యుద్ధం చేసి తన పంతం నెగ్గించుకుంటుంది. ప్రపంచ ప్రయోజనాల విషయంలో.. ప్రపంచానికి శాంతి కలిగించే విషయంలో అమెరికా వేలు పెట్టదు. కనీసం అటువైపుగా చూడదు. ఎందుకంటే అమెరికా తీరు అలా ఉంటుంది కాబట్టి.

భారత్ అలా కాదు. అమెరికా మాదిరిగా ప్రయోజనాలు ఉండవు .. ప్రపంచం బాగుంటే చాలు అనుకునే టైపు. అలాగని తనను ఇబ్బంది పెట్టే దేశాలను భారత్ వదిలిపెట్టదు. అవసరమైతే అంతు చూస్తుంది. అంతానికి పోరాడుతుంది. బర్మా విషయంలో కూడా భారత్ అలానే వ్యవహరించింది. మన దేశానికి వ్యతిరేకమైన శక్తులను చైనా పెంచి పోషించి బర్మా తోలేది. బర్మా కేంద్రంగా ఆ శక్తులు మనమీద దాడులు చేసేవి. కాలా అనుగుణంగా భారత్ మారింది. ముఖ్యంగా గడిచిన 12 సంవత్సరాల కాలంలో భారత్ ఇంటి దొంగలను హతమార్చే పని పెట్టుకుంది.

బర్మాలో దాగివున్న వ్యతిరేక శక్తులను తొక్కినార తీసింది. దీనికి బర్మా సహాయం కూడా తీసుకుంది. బర్మాలో ఒక దరిద్రమైన వ్యవస్థ ఉంది. అక్కడ సైనిక అధికారులే నేరుగా అధికారంలోకి వస్తుంటారు. గతంలో నోబెల్ శాంతి బహుమతి విజేత సూకీ బర్మా అధిపతి అయింది. అయితే అక్కడి సైనిక అధికారులు ఆమెను జైల్లో వేశారు. ఇప్పటికి జైలు నుంచి ఆమె విడుదల కాలేదు.

ఇటీవల బర్మాకు కొత్త అధినేత వచ్చారు. ఆయన పేరు ఆంగ్ హ్లాయింగ్. ఆయనకు మన రక్షణ సలహాదారు అజిత్ దోవల్ ఫోన్ చేశారు. వెంటనే బర్మా అధినేత ఇండియాకు వచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిశారు. ఆ తర్వాత అనేక రకాల చర్చలు జరిగాయి. అనంతరం సానుకూల దృక్పథంతో బర్మా అధిపతి వెళ్ళిపోయారు.. అజిత్ దోబల్ ఫోన్ చేయడానికి ప్రధాన కారణం.. ఇండియా, బర్మా, థాయిలాండ్ వరకు నిర్మించే కాలదాన్ ప్రాజెక్టు గురించి ప్రధానంగా చర్చించారు. దీనివల్ల భారత్ నుంచి ఈశాన్య రాష్ట్రాలకు, దేశాలకు సరుకులు రవాణా చేయడం ఈజీ అయిపోతుంది. ఈ ప్రాజెక్టులో భాగస్వామి అవుతారా.. లేదా అనే విషయం మీద క్లారిటీ తీసుకోవడానికి బర్మా అధినేతను ఇండియాకు పిలిపించారు.

చైనా మాటలు నమ్మకుండా.. చైనా చెప్పినట్టు వినకుండా బర్మా అధినేత ఇండియాకు వచ్చారు. వాస్తవానికి బర్మాకు అధినేత అయిన తర్వాత ఆయన బీజింగ్ వెళ్లాల్సి ఉండేది. అజిత్ దోవల్ నుంచి ఫోన్ రాగానే బర్మా అధినేత నేరుగా ఇండియాకు వచ్చారు.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో అనేక రకాల చర్చలు జరిపారు. చివరికి సానుకూల దృక్పథంతో బర్మా తిరిగి వెళ్ళిపోయారు. సాధారణంగా ఇటువంటి వ్యవహారాలలో చైనా ముందుంటుంది. కానీ ఈసారి చైనాను మించిపోయింది భారత్. ఫారిన్ పాలసీలో సరికొత్త మార్పు తీసుకురావడంతో చైనా తలలు పట్టుకుంటుంది. ఎందుకంటే కాలాదాన్ అందుబాటులోకి వస్తే లాజిస్టిక్ రంగంలో భారత్ తిరుగులేని స్థానంలో ఉంటుంది. అది తెలిసే చైనా తెగ ఉడికిపోతుంది.

పవన్ కళ్యాణ్ లో ఈ అనూహ్య మార్పుకి కారణం సీఎం విజయ్ యేనా..? రోజుకో ట్విస్ట్ ఇస్తున్నాడుగా..

Pawan Kalyan
Pawan Kalyan

Pawan Kalyan: గత కొంత కాలం గా బాగా గమనించి చూస్తే పవన్ కళ్యాణ్ లో అనూహ్యమైన మార్పులు కనిపిస్తున్నాయి. తన హెయిర్ స్టైల్ దగ్గర నుండి , డ్రెస్సింగ్ స్టైల్ వరకు మార్చేయడం , లుక్స్ జెన్ జీ ఆడియన్స్ ని ఆకర్షించే విధంగా మైంటైన్ చేయడం, అదే విధంగా పార్టీ ని సంస్థాగతంగా డెవలప్ చేసేందుకు రూట్ లెవెల్ నుండి ప్రతీ జిల్లాకు క్యాడర్ ని ఏర్పాటు చేయడం, ఇలా ఒక్కటా రెండా, అసలు మనం చూస్తున్నది పవన్ కళ్యాణ్ నేనా అని అభిమానులు సైతం ఆశ్చయపోయే రేంజ్ లో మారిపోయారు. కేవలం డ్రెస్సింగ్ స్టైల్ , రాజకీయ పరంగా మాత్రమే కాదు , సినిమాల పరంగా కూడా ఆయనలో చాలా మార్పు వచ్చేసింది. ఒకప్పటి లాగా ఆడియన్స్ ని , ఫ్యాన్స్ ని తేలికగా తీసుకునే పరిస్థితులు ఇప్పుడు లేవు.

రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ కి సినిమాల మీద ఆసక్తి పోయింది. కేవలం డబ్బుల కోసం మాత్రమే సినిమాలు చేయడం మొదలు పెట్టారు. ఈ క్రమం లో కొన్ని డిజాస్టర్ ఫ్లాప్స్ వచ్చాయి , దీంతో మినిమం గ్యారంటీ గా ఉండడం కోసం వరుసగా రీమేక్ సినిమాలు చేయడం మొదలు పెట్టారు, అవి కొంత వరకు రీ ఎంట్రీ లో వర్కౌట్ అయ్యాయి , కానీ ఇప్పుడు రీమేక్స్ ని ఆడియన్స్ ఆదరించడం మొదలు పెట్టడం తో , పవన్ కళ్యాణ్ కి మళ్లీ ఫ్లాప్స్ ఎదురయ్యాయి. ఏళ్ళ తరబడి సెట్స్ మీద నాంచుతూ వచ్చిన హరి హర వీరమల్లు , ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాలు ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్స్ గా మిగిలాయి, కానీ జెన్ జీ ఆలోచనలతో తీసిన ‘ఓజీ’ మాత్రం సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అయ్యింది. అయితే ప్రస్తుతం రాజకీయాల్లో బిజీ అవ్వడం వల్ల భవిష్యత్తులో మళ్లీ ఆయన సినిమాలు చేస్తాడా లేదా అనే అనుమానం అందరిలో ఉండేది.

అలాంటి అనుమానాలు ఉన్న సమయం లోనే ‘ఓజీ 2’ ని సెట్స్ మీదకు తీసుకొని రాబోతున్నారు. ఇక మీదట ఆయన చేయబోయే సినిమాలు కూడా ఇదే రేంజ్ స్కేల్ లో ఉండబోతున్నాయి అట. ఒకప్పటి తో పోలిస్తే పవన్ కళ్యాణ్ లో ఇప్పుడు వచ్చిన మార్పులు ఊహాతీతం, అభిమానులకు , ప్రేక్షకులకు ఏది అయితే నచ్చుతుందో , అదే ఆయన చెయ్యాలని అనుకుంటున్నాడు , అది రాజకీయం అయినా, సినిమా అయినా, ఆయనలో ఈ రేంజ్ మార్పు రావడానికి ప్రధాన కారణం తమిళనాడు ఎన్నికల్లో గెలిచి విజయ్ సీఎం గా నిలబడడమే. తన కంటే తక్కువ క్రేజ్ , ఫాలోయింగ్ ఉన్న హీరో సరైన ప్లానింగ్ తో వెళ్లి ఏకంగా సీఎం అయిపోయాడు , మనం ఇంకా డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నాము , ఇకనైనా మార్పులు చేసుకోవాలి అనే ఆలోచన ఆయనలో బలంగా కలగడం వల్లే, అభిమానులు ఆశ్చర్యపోయేంత సర్ప్రైజ్ లు ఇస్తున్నారు ప్రతీ రోజు.

మత్తు వ్యవహారాలు.. హీరోయిన్స్ తో సంబంధాలు.. ఇన్నాళ్లకు క్లారిటీ ఇచ్చిన కేటీఆర్..

KTR
KTR

KTR: భారత రాష్ట్ర సమితి కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇటీవల కాలంలో మీడియాలో ఎక్కువగా కనిపిస్తున్నారు. ముఖ్యంగా సర్ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు సాగిస్తున్నారు. సర్ ప్రక్రియ మీద పార్టీ కార్యకర్తలకు అవగాహన కల్పిస్తున్నారు. అధికార పార్టీ మీద విమర్శలు చేస్తున్నారు. అంతేకాదు.. పూర్తిస్థాయిలో డిజిటల్ ఎక్విప్మెంట్ ఏర్పాటు చేసుకొని కార్యకర్తలకు అర్థమయ్యే విధంగా లెక్కలతో సహా చెబుతున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను గణాంకాలతో సహా వివరిస్తున్నారు.

ఇక్కడితో కేటీఆర్ ఆగిపోలేదు. సమయం దొరికిన ప్రతి సందర్భంలో తన అంతరంగాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ఓ డిజిటల్ మీడియా ఛానల్ ముఖాముఖిలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాలు పదే పదే వేసే ప్రశ్నలను ఆ వ్యాఖ్యాత కూడా అడిగింది. ఆ ప్రశ్నలకు కేటీఆర్ తనదైన శైలిలో సమాధానం చెప్పారు. ఇంకోసారి తనను ఈ స్థాయిలో ఇబ్బంది పెడితే తీసుకున్న చర్యలు వేరే విధంగా ఉంటాయని హెచ్చరించారు.

“నేను జీవితంలో పొగ తాగలేదు. మందు కూడా ముట్టలేదు. నేను హీరోయిన్లతో దగ్గరగా ఉన్నానని వీడియోలు సృష్టించారు. రకరకాల ప్రచారాలు మొదలుపెట్టారు. వ్యక్తిత్వ హనానికి పాల్పడ్డారు. కాపురాలు కూల్చానని ఒక మంత్రి ఆరోపించారు. దీని వెనుక ముఖ్యమంత్రి కుట్ర ఉంది. ఇవన్నీ చూస్తే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. అసలు నాకు వాటితో ఏం సంబంధం.. నాకు ఏం అవసరం.. ఎందుకొచ్చాం రా బాబు ఈ రాజకీయాల్లోకి అనిపించేది. కొన్ని సందర్భాలలో ఏదైనా మంచి పని చేసినప్పుడు ప్రజల నుంచి ప్రశంస లబించినప్పుడు గొప్పగా ఉండేది. ఉగాది పండుగ సందర్భంగా షడ్రుచుల సమ్మేళనం మాదిరిగానే రాజకీయాలు కూడా ఉంటాయని అర్థమైంది. నేను రాజకీయాల్లోకి వస్తున్నప్పుడు మా అమ్మ నువ్వు ఎక్కువ రోజులు ఇందులో ఉండవు అని చెప్పింది. ఎందుకంటే నీ వ్యవహార శైలికి ఇది సరిపోదని మా అమ్మ అనేది. కానీ ఇప్పుడు నేను కూడా అడ్జస్ట్ అవుతున్నానని”కేటీఆర్ వ్యాఖ్యానించారు.

చాలా కాలం తర్వాత తన మీద వస్తున్న విమర్శలకు కేటీఆర్ సరైన సమాధానం చెప్పారు. తన రాజకీయ లక్ష్యాలు.. నిర్దేశించుకున్న మార్గాలు.. వంటి వాటిపై ఫుల్ క్లారిటీతో సమాధానాలు చెప్పారు. ఇటీవల కాలంలో కేటీఆర్ ఈ స్థాయిలో మాట్లాడటం ఇదే తొలిసారి. ఒకరకంగా తన అంతరంగాన్ని పూర్తిగా ఆవిష్కరించారు. తన మీద వస్తున్న విమర్శలకు.. స్పష్టమైన సమాధానం చెప్పారు. అయితే దీనిపై కాంగ్రెస్ నాయకులు ఏ విధంగా కౌంటర్ ఇస్తారో చూడాల్సి ఉంది.

ట్రంప్ గోడ కట్టేస్తున్నాడు.. ఇలాగైతే అమెరికా అడుక్కు తినడమే..

Donald Trump Border Wall
Donald Trump Border Wall

Donald Trump Border Wall: పరిపాలకుడికి దూర దృష్టి ఉండాలి. మూర్ఖత్వం ఉండకూడదు. ఆలోచన ఉండాలి.. ఆవేశం ఉండకూడదు. పరిపాలన మీద పట్టు ఉండాలి. పిచ్చోడి చేతిలో రాయి మాదిరిగా వ్యవహరించకూడదు. ఇవన్నీ ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేస్తున్నట్లు కనిపిస్తోంది.

ప్రపంచ దేశాల మీద ఇప్పటికే టారిఫ్ లు విధించాడు ట్రంప్ మహాశయుడు. ఇరాన్ దేశం మీద అనవసరమైన యుద్ధాన్ని ప్రకటించాడు. నెలల పాటు యుద్ధం చేసి ప్రపంచాన్ని ఇబ్బందుల్లో పెట్టాడు. చివరికి అమెరికా ప్రజలకు చుక్కలు చూపించాడు. యుద్ధం మీద అమెరికా పార్లమెంట్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో ట్రంప్ వెనక్కి తగ్గాడు. అంతేకాదు ఇప్పుడు శాంతి వచనాలు వల్లిస్తున్నాడు.

ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయమే కాదు.. అమెరికాకు పొరుగున ఉన్న దేశాల మీద తీసుకుంటున్న నిర్ణయాలు కూడా వివాదాస్పదంగా మారుతున్నాయి. ఇప్పటికే మెక్సికో సరిహద్దుల్లో గోడను మరింత పటిష్టంగా నిర్మిస్తున్నడు ట్రంప్. అమెరికా దేశంలో ఉంటున్న మెక్సికో ప్రజలను బలవంతంగా యుద్ధ ఖైదీల మాదిరిగా తరలించాడు. అమెరికాలో ఉంటున్న మెక్సికో దేశస్థులను వెళ్ళగొడుతున్నాడు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ మెక్సికో ప్రజలు అమెరికా నుంచి వెళ్ళిపోతే.. శ్వేత దేశ ప్రజలు అడుక్కుతినాల్సిందే.

మనదేశంలో వివిధ రాష్ట్రాల్లో బీహార్.. ఉత్తర్ ప్రదేశ్.. వెస్ట్ బెంగాల్ కూలీలు పని చేస్తుంటారు. ఎందుకంటే ఆ రాష్ట్రాలలో జనాభా ఎక్కువగా ఉంటుంది. అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఈ మూడు రాష్ట్రాల కూలీలు గనుక లేకపోతే భారత దేశంలో అనేక ప్రాంతాలలో అన్ని పనులు ముందుకు సాగవు. చాలావరకు కార్యకలాపాలు ఆగిపోతాయి. తద్వారా నష్టం చోటు చేసుకుంటుంది. సేమ్ అమెరికాలో కూడా ఇదే పరిస్థితి. అమెరికాలో ఇంటి పని.. వంట పని.. మూత్రశాలలు.. మరుగుదొడ్లు శుభ్రపరచడం.. గార్డెన్ లో గడ్డి కత్తిరించడం.. వీధులు ఊడ్చడం.. కొమ్మలు కత్తిరించడం వంటి పనులను మెక్సికో కార్మికులు చేస్తుంటారు.

మెక్సికో దేశంలో అంతగా సదుపాయాలు ఉండవు. అందువల్లేవారు ఉపాధి కోసం అమెరికా వస్తుంటారు. ఇప్పుడు మెక్సికో సరిహద్దుల్లో ట్రంప్ గోడ కట్టిస్తున్నాడు. మెక్సికో ప్రజలు రావద్దని హెచ్చరికలు జారీ చేస్తున్నాడు. ఇదే గనక దీర్ఘకాలంలో జరిగితే అమెరికాలో పనిచేసే వారు ఉండరు. అప్పుడు అమెరికా మొత్తం మురికి మయంగా మారుతుంది. పనిచేసే వారు ఉండరు కాబట్టి అమెరికా అడుక్కుతినాల్సి ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు.

సంప్రదాయినీ.. మన శ్రీముఖి

Sreemukhi traditional look
Sreemukhi traditional look

వైభవ్ కు నో ఎంట్రీ.. తన అనుచరుడు హర్షిత్ కు ఛాన్స్.. గంభీర్ ఇక మారడా..

Vaibhav Suryavanshi
Vaibhav Suryavanshi

Vaibhav Suryavanshi: ఐర్లాండ్ టూర్ ను భారత జట్టు మొదలుపెట్టింది. తొలి మ్యాచ్ ఆడుతోంది. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ టీం ఇండియా అభిమానులకు బ్యాడ్ న్యూస్ ఎదురైంది. ఐర్లాండ్ స్థిరపడిన భారత అభిమానుల్లో ఆవేదన నెలకొంది. దీనంతటికీ ప్రధాన కారణం టీమిండియా గౌతమ్ గంభీర్.

ఐర్లాండ్ జట్టుతో జరుగుతున్న సిరీస్లో మేనేజ్మెంట్ జట్టులో వైభవ్ సూర్య వంశీకి చోటు కల్పించింది. అతడు కూడా మైదానంలో తీవ్రంగా సాధన చేశాడు. బంతులను కసికొద్ది ఆడాడు. అయితే అతడికి చోటు కల్పించే విషయంలో మేనేజ్మెంట్ దోబూచులాట ఆడింది. చివరికి మ్యాచ్ మరికొద్ది సేపట్లో ప్రారంభం అవుతుంది అనుకుంటుండగా సోషల్ మీడియాలో బీసీసీఐ ఒక వీడియో విడుదల చేసింది. అందులో వైభవ్ సూర్య వంశీ కనిపించాడు. దీంతో అతడు ఆడతాడని.. తన ఆటతీరుతో ఐర్లాండ్లో స్థిరపడిన భారత అభిమానులను సమ్మోహ పరుస్తాడని అందరూ అనుకున్నారు. కానీ వారందరి ఆశల మీద టీం ఇండియా కోచ్ గౌతమ్ గంభీర్ నీళ్లు చల్లాడు.

గౌతమ్ గంభీర్ సూర్య వంశీని పక్కనపెట్టి.. తనకు అత్యంత ఇష్టమైన హర్షిత్ కు చోటు కల్పించాడు. వాస్తవానికి హర్షిత్ తనను తాను నిరూపించుకోవడానికి కొత్తగా ఏమీ లేదు. ఎందుకంటే ఇప్పటికే అతనికి చాలా అవకాశాలు వచ్చాయి. వచ్చిన అవకాశాలను అతడు కొంతమేర వినియోగించుకున్నాడు. ఇటీవల కాలంలో తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం చికిత్స పొంది ఫిట్ గా ఉన్నాడు. వాస్తవానికి అతడిని ఇంగ్లాండ్ సీరీస్ లో ఆడిస్తే బాగుండేది. అలాకాకుండా గౌతమ్ గంభీర్ ఏరి కోరి ఐర్లాండ్ సిరీస్ లో కూడా ఎంట్రీ ఇచ్చేలా చేశాడు.

హర్షిత్ కు చోటు లభించడంతో సూర్య వంశీ రిజర్వ్ బెంచ్ కు పరిమితం కావలసి వచ్చింది. అతని ఆట తీరు చూసే అవకాశం అభిమానులకు లేకుండా పోయింది. ఫలితంగా మైదానంలో ఒక రకమైన నిరాశ జనకమైన వాతావరణం కనిపిస్తోంది. వాస్తవానికి హర్షిత్ ఈ మ్యాచ్లో 4 ఓవర్లు వేసి.. 24 పరుగులు ఇచ్చి.. మూడు వికెట్లు పడగొట్టాడు. వాస్తవానికి హర్షిత్ కు ఐర్లాండ్ సిరీస్ లో అవకాశం కల్పించి.. ప్లేయింగ్ 11 లో స్థానం ఎందుకు ఇచ్చాడో గౌతమ్ గంభీర్ కే తెలియాలి. వైభవ్ ఆట చూడాలని ఐర్లాండ్లో స్థిరపడిన భారత అభిమానులు ఎంతగానో ఆశపడ్డారు. టికెట్లు కూడా కొనుగోలు చేశారు. కానీ వారందరి ఉత్సాహం మీద లీటర్ల కొద్దీ నీళ్లు కుమ్మరించాడు గౌతమ్ గంభీర్. వచ్చే మ్యాచ్ లో నైనా సూర్య వంశీకి చోటు కల్పిస్తాడా.. గౌతమ్ గంభీర్ అప్పుడు కూడా హ్యాండ్ ఇస్తాడా.. చూడాల్సి ఉంది.

ఈ అమ్మాయిలు చాలా ఖతర్నాక్.. ఒంటరిగా ఉన్న అబ్బాయిలను టార్గెట్ చేస్తారు.. ఆ తర్వాత జరిగేది అదే..

Fake Dating Apps Scam
Fake Dating Apps Scam

Fake Dating Apps Scam: నేటి కాలంలో మోసాలు జరిగే తీరు మారిపోతుంది. అదేదో సినిమాలో చెప్పినట్టు జేబుకు తెలియకుండా పర్స్ కొట్టేస్తున్నారు. మనం తేరుకునే లోపు జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. అందువల్లే ఇటువంటివి జరగకుండా అప్రమత్తంగా ఉండాలి. అప్రమత్తంగా లేపోతే అంతే సంగతులు.

ఇటీవల కాలంలో టెక్నాలజీ ఆధారంగా మోసాలు చేయడం పెరిగిపోయింది. ముఖ్యంగా కృత్రిమ మేధ అందుబాటులోకి వచ్చిన తర్వాత రకరకాల మోసాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా కొన్ని యాప్స్ ద్వారా అక్రమార్కులు మోసాలకు పాల్పడుతున్నారు. భారీగా దండుకొని.. నిండా ముంచుతున్నారు. ఈ మోసంలో ఒంటరిగా ఉన్న అబ్బాయిలనే లక్ష్యంగా చేసుకోవడం విశేషం.

డేటింగ్ ట్రెండ్ అనేది మనదేశంలో విస్తృతంగా ఉంది. గతంలో ఈ కల్చర్ ఉండేది కాదు. ఈ కల్చర్ వల్ల అబ్బాయిలు.. అమ్మాయిలు పెళ్లి కాకముందే మొదలు పెడుతున్నారు. మోజు తీరిపోయిన తర్వాత ఎవరికి వారు అన్నట్టుగా ఉంటున్నారు. అయితే డేటింగ్ యాప్స్ ద్వారా జరుగుతున్న వ్యవహారాలను చూసిన కొంతమంది అక్రమార్కులు నకిలీ డేటింగ్ యాప్స్ రూపొందిస్తున్నారు. వీటి ద్వారా మోసాలకు పాల్పడుతున్నారు.

నకిలీ డేటింగ్ యాప్స్ లో ఏ ఐ ద్వారా అమ్మాయిలను సృష్టిస్తున్నారు. వీడియోలు రూపొందిస్తున్నారు. నకిలీ అమ్మాయిలతో రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తున్నారు.”మేము అందంగా ఉంటాం. పెళ్లి చేసుకోవడం మాకిష్టం ఉండదు. కేవలం కబుర్లు చెప్పడం మాత్రమే ఇష్టం. ఒంటరిగా ఉంటే మాత్రం మాతో మాట్లాడొచ్చు. ఆ తర్వాత ఎక్కడ దాకైనా వెళ్లొచ్చు” అంటూ కసిగా మాట్లాడతారు. యాప్స్ లో చేర విధంగా రెచ్చగొడతారు. కైపు కలిగించే ఫొటోలు పోస్ట్ చేస్తారు. మోహం కలిగించే వీడియోలతో ఉద్రేకపరుస్తారు. అవన్నీ నిజమని నమ్మితే నిండామునగడం ఖాయం. ఆ తర్వాత నెత్తీనోరు కొట్టుుకున్నా ఉపయోగం ఉండదు.

వ్యక్తిగత వివరాలు.. ఎంట్రీ చేయాలని చెబుతారు. ఆ తర్వాత అసలు కథ మొదలు పెడతారు. బ్లాక్మెయిలింగ్ చేసి.. డబ్బులు వసూలు చేస్తూ ఉంటారు. ఇటీవల కాలంలో ఇలాంటి కేసులు పెరిగిపోతున్నాయని సైబర్ పోలీసులు చెబుతున్నారు. ఈ ముఠా బ్లాక్మెయిలింగ్ కు దిగిన తర్వాత డబ్బులు వసూలు చేయడం మొదలుపెడుతుంది. రకరకాల వీడియోలు పోస్ట్ చేస్తూ భయభ్రాంతులకు గురిచేస్తుంది. డబ్బులు ఇచ్చినప్పటికీ కూడా వదిలిపెట్టదు. అందువల్లే ఇటువంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

వెనిజులా లో అకస్మాత్తుగా ఎందుకు ఈ భూకంపాలు.. అక్కడ ఏం జరుగుతోంది

Venezuela Earthquake
Venezuela Earthquake

Venezuela Earthquake: భూకంపాలు.. ఈ పేరు వినిపిస్తే ఆసియాలో జపాన్.. పాకిస్తాన్.. ఆఫ్ఘనిస్తాన్.. టర్కీ వంటి ప్రాంతాలు మాత్రమే మనకు గుర్తుకొస్తాయి. ఎందుకంటే ఈ ప్రాంతాలలో గతంలో అనేక సందర్భాలలో భూకంపాలు చోటుచేసుకున్నాయి. భారీగా ప్రాణ నష్టం చోటుచేసుకుంది. ఆస్తి నష్టం కూడా భారీగానే వాటిల్లింది. ఈ నేపథ్యంలో జపాన్ నుంచి మొదలు పెడితే టర్కీ వరకు కట్టుకునే ఇళ్ల విషయంలో.. జాగ్రత్తలు పాటిస్తారు అక్కడి ప్రజలు.

తాజాగా వెనిజులా ప్రాంతంలో భీకరమైన భూకంపం వచ్చింది. వేలాది మంది చనిపోయారు. ఆస్తి నష్టం కూడా కోట్లల్లో చోటుచేసుకుంది. శిధిలాల తొలగింపు ఇంకా జరగలేదు. మృతులను వెలికితీస్తున్నారు. ప్రపంచ దేశాలు సహాయం చేస్తున్నాయి. ఒకరకంగా వెనిజులా ప్రాంతంలో ఇప్పుడు అత్యవసర పరిస్థితి ని అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. సహాయక చర్యలు సాగుతూనే ఉన్నాయి. ఇంకా కొద్దిరోజులు గడిస్తే తప్ప వెనిజులాలో పరిస్థితి మునుపటి స్థితికి రాదు.

వెనిజులా ప్రాంతంలో ఈ స్థాయిలో భూకంపం రావడానికి ప్రధానంగా కొన్ని కారణాలను శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వెనిజులా లో కొంత ప్రాంతం దక్షిణ అమెరికా వైపు ఉంటుంది. ఇది చాలా సురక్షితమైనది.. ఇదేదేశంలో ఉత్తర తీర ప్రాంతం.. కరేబియన్ దీవుల ప్రాంతాలు క్రియాశీలకంగా ఉండే ఫలకాల సరిహద్దు మీద ఉన్నాయి. ఈ సరిహద్దు మీద కరేబియన్.. దక్షిణ అమెరికా ఫలకాలు కలిసి ఉంటాయి. ఈ రెండింటి మధ్య నిత్యం ఘర్షణ జరుగుతూ ఉంటుంది. అందువల్ల అక్కడ రకరకాల పగుళ్లు కనిపిస్తూ ఉంటాయి. అయితే అవి విడిగా ఉండవు. పరస్పరం కలిసి ఉంటాయి.

ఇక్కడ దక్షిణ ప్రాంతంలో విస్తరించిన ఫలకంతో పోల్చి చూస్తే కరేబియన్ ఫలకం ప్రతి ఏడాది రెండు సెంటీమీటర్ల మేర తూర్పు వైపు విస్తరిస్తోంది. దీనివల్ల అక్కడి పగుళ్ల ప్రాంతంలో ఒత్తిడి ఎక్కువవుతున్నది. ఇలా ఒత్తిడి పెరిగిపోయినప్పుడు భూకంపం ఏర్పడుతోంది. శాస్త్రవేత్తల పరిశీలనలో భాగంగా వెనిజులా దేశంలో సుమారు 80% జనాభా ఈ క్రియాశీలత ఎక్కువగా ఉన్న ఫలకాల ప్రాంతంలోనే జీవిస్తూ ఉండడం విశేషం.

స్వల్ప వ్యవధిలోనే.. ఒకే విధమైన పగుళ్లు చోటు చేసుకుంటే.. దానిని భూకంప ద్వయం అని పిలుస్తుంటారు. ద్వయం లో ప్రకంపనలు ఒకే స్థాయిలో ఉంటాయి. వెనిజుల ప్రాంతంలో భూకంప తీవ్రత కేవలం నిమిషం వ్యవధిలోనే కేవలం 7.2, 7.5 గా నమోదయింది. ఎందుకంటే పగుళ్లు తీవ్రస్థాయిలో నమోదు కావడం.. భూ ఫలకాల మీద ఒత్తిడి విపరీతంగా పెరగడంతో నష్టం అధికంగా ఉంది. ఇటువంటి చోట మరొక ప్రకంపన చోటుచేసుకునే అవకాశం ఉండదు.. భూకంపం ఏర్పడినప్పుడు సమీప ప్రాంతంలో పగుళ్ల వ్యవస్థ మీద ఒత్తిడి పెరిగితే.. మళ్లీ భూమిలో ప్రకంపనలు చోటుచేసుకునే అవకాశం ఉంటుంది.

వెనిజులా ప్రాంతంలో తక్కువలోతులోనే భూకంపం ఏర్పడింది. కేవలం నేల నుంచి ఇవి 20 కిలోమీటర్ల లోతులోనే ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఎక్కువ లోతులో ఏర్పడే ప్రకంపనలు అంతగా నష్టాన్ని కలగజేయవు. తక్కువ లోతులో ప్రకంపనలు ఏర్పడ్డాయి కాబట్టి.. నష్టం తీవ్రత అధికంగా ఉంది.

ఇండస్ట్రీ లో నాతో పోటీపడి డ్యాన్స్ వేసేవాళ్ళు లేరంటూ శ్రీలీల హాట్ కామెంట్స్..

Sreeleela Dance Comments
Sreeleela Dance Comments

Sreeleela Dance Comments: ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయం లోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిన వారిలో ఒకరు హీరోయిన్ శ్రీలీల. ‘పెళ్లి సందడి’ చిత్రం తో వెండితెర అరంగేట్రం చేసిన ఈమె , ఆ తర్వాత ‘ధమాకా’ తో తొలి భారీ కమర్షియల్ సక్సెస్ ని అందుకుంది. ఆ తర్వాత ఈమె చేసిన సినిమాల్లో ‘భగవంత్ కేసరి’ తప్ప, మిగిలినవన్నీ ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్స్ గా నిలిచాయి. అదృష్టం కలిసి రాకనో , ఏమో తెలియదు కానీ , శ్రీలీల కి ఇండస్ట్రీ లో ఐరన్ లెగ్ అనే ముద్ర పడింది. అయినప్పటికీ కూడా ఆమెకు అవకాశాలు ఏ మాత్రం తగ్గలేదు , వరుసగా వస్తూనే ఉన్నాయి. ఈ ఏడాది ఆరంభం లో ఈమె తమిళం లో ‘పరాశక్తి’ అనే చిత్రంతో అక్కడ ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా కమర్షియల్ గా పెద్ద ఫ్లాప్ అయ్యింది.

అయినప్పటికీ కూడా ఈమెకు ధనుష్ 55 వ చిత్రం లో ఒక హీరోయిన్ గా నటించే అవకాశం వచ్చింది. అయితే రీసెంట్ గా ఈమె ఇచ్చిన ఒక తమిళ ఇంటర్వ్యూ లో ‘తనతో సమానంగా డ్యాన్స్ చేసేవాళ్ళు ఎవ్వరూ లేరు’ అంటూ వ్యాఖ్యలు చేసిందని సోషల్ మీడియా లో ఒక పెద్ద ప్రచారం జరిగింది. ఈ ప్రచారం శ్రీలీల వరకు చేరడం తో ఆమె వెంటనే రెస్పాన్స్ ఇచ్చింది. కొందరు నా మాటలను తప్పుగా అర్థం చేసుకొని ఇలాంటి రూమర్స్ వ్యాప్తి చేశారని, తనది అలాంటి మనస్తత్వం కాదని , మా అమ్మ నన్ను అలా పెంచలేదని , తోటి వారిని గౌరవించడమే నాకు తెలుసనీ , దయచేసి ఇలాంటి ఫేక్ ప్రచారాలను నమ్మకండి అంటూ శ్రీలీల ఈ సందర్భంగా చెప్పుకొచ్చింది. క్లారిటీ ఇచ్చింది కాబట్టి , ఇప్పటికైనా శ్రీలీల పై వస్తున్న రూమర్స్ కి చెక్ పడుతుందో లేదో చూడాలి.

ఇకపోతే టాలీవుడ్ లో ఏడాదికి కనీసం 5 సినిమాలు చేస్తూ వచ్చిన శ్రీలీల చేతిలో ఇప్పుడు ఒక్క తెలుగు సినిమా కూడా లేకపోవడం గమనార్హం. ఈ ఏడాది ఆమె హీరోయిన్ గా నటించిన తెలుగు చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ భారీ అంచనాల నడుమ విడుదలై ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. ఈ సినిమా తర్వాత ఆమె మరో సినిమాకు ఒప్పుకోలేదట. ఎక్కువగా ఇప్పుడు ఆమె తన ఫోకస్ ని తమిళం మరియు హిందీ సినిమాల మీదనే పెట్టింది. మరి అక్కడ ఎంత వరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

షూటింగ్ సెట్స్ లో స్టార్ హీరో చెంప పగలగొట్టిన రష్మిక మందాన.. వీడియో వైరల్..

Rashmika Mandanna
Rashmika Mandanna

Rashmika Mandanna: పాన్ ఇండియా లెవెల్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న యంగ్ హీరోయిన్స్ లో ఒకరు రష్మిక మందాన. కన్నడ సినీ ఇండస్ట్రీ ద్వారా వెండితెర అరంగేట్రం చేసిన ఈమె , ఆ తర్వాత టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి , వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ ని అందుకొని స్టార్ హీరోయిన్ గా ఎదిగి , ఇక్కడొచ్చిన ఫేమ్ తో బాలీవుడ్ లో కూడా వరుసగా అవకాశాలు సంపాదించి , నేడు పాన్ ఇండియన్ బిగ్గెస్ట్ స్టార్ హీరోయిన్స్ లో ఒకరిగా చలామణి అవుతున్న ఈమె గురించి ఎంత చెప్పినా తక్కువే. అందం , అభినయం రెండు ఉన్న హీరోయిన్స్ మన ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో చాలా అరుదుగా దొరుకుతుంటారు. ఆ అరుదైన వారిలో రష్మిక మందాన కూడా ఒకరు అనడం లో ఎలాంటి సందేహం లేదు.

తన తోటి నటీనటులతో చాలా ఫ్రెండ్లీ గా ఉండే రష్మిక , షూటింగ్ సెట్స్ లో ఒక స్టార్ హీరో చెంప పగలగొట్టింది అంటే నమ్ముతారా?, కానీ నిజంగానే ఆమె కొట్టింది. ఈ విషయాన్నీ స్వయంగా ఆమెనే గతం లో యాంకర్ ప్రదీప్ పాపులర్ గేమ్ షో ‘కొంచెం టచ్ లో ఉంటే చెప్తా’ టాక్ షోలో పాల్గొన్నప్పుడు చెప్పుకొచ్చింది. ప్రదీప్ ఆమెని ఒక ప్రశ్న అడుగుతూ ‘మీ జీవితం లో ఎవరి మీదైనా చెయ్యి చేసుకున్నారా?’ అని అడగ్గా, అందుకు రష్మిక ‘అవును , షూటింగ్ సెట్స్ లోనే ‘ అని అంటుంది. అప్పుడు ప్రదీప్ ‘అవునా, అయితే ఇది కచ్చితంగా తెలుసుకోవాల్సిందే’ అని అడగ్గా, రష్మిక అందుకు సమాధానం చెప్తూ ‘ఒక సన్నివేశం షూటింగ్ లో స్టార్ హీరో చెంప పగలగొట్టాల్సి వచ్చింది. వాస్తవానికి యాక్ట్ చెయ్యాలి , కానీ నాకు ఫ్లో లో వచ్చేసింది, దెబ్బ గట్టిగా తగలడం తో నేను చాలా ఫీల్ అయ్యాను’ అంటూ చెప్పుకొచ్చింది.

ఆమె మాట్లాడిన ఈ మాటలకు సంబంధించిన వీడియో ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి. ఇకపోతే రష్మిక సినిమాల విషయానికి వస్తే , ప్రస్తుతం ఆమె తన భర్త విజయ్ దేవరకొండ తో కలిసి ‘రణబలి ‘ అనే చిత్రం లో నటిస్తోంది. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ చిత్రం , ఈ ఏడాది సెకండ్ హాఫ్ లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రం తో పాటు ‘మైసా’ అనే లేడీ ఓరియెంటెడ్ చిత్రంలో నటిస్తున్న రష్మిక, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘రాకా’ లో విలన్ క్యారెక్టర్ చేస్తోంది, ఇలా వరుసగా క్రేజీ ఆఫర్స్ తో ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో దూసుకెళ్తోంది రష్మిక.

భారత్ లో అత్యంత విలువైన కంపెనీలు వాటి వివరాలు

India Most Valuable Companies

India Most Valuable Companies : రెండు రోజుల క్రితం.. యాక్సిక్ బ్యాంక్ , హురున్ ఇండియా అనే అనుబంధ సంస్థ ఆధ్వర్యంలో అత్యంత విలువైన 500 కంపెనీల లిస్ట్ ప్రకటించారు. ఫ్యార్చూన్ ఇండియా రెవెన్యూ ప్రకారం మోస్ట్ వాల్యువ్ సంస్థలను ప్రకటించారు. కానీ యాక్సిస్ బ్యాంక్ హరున్ ను మార్కెట్ క్యాపిటల్ అనుసారం లిస్ట్ ప్రకటిస్తారు.

దీనివల్ల ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి? పన్నులు వచ్చాయన్నది మొత్తం 500 కంపెనీలకు మొత్తం విలువ 323 లక్షల కోట్లు గా ఉన్నాయి. దేశంలో టాప్ 10 కంపెనీలు చూస్తే టాటా గ్రూప్ 14 కంపెనీలున్నాయి. దీని మొత్తం విలువ 24.93 లక్షల కోట్లతో ప్రథమ స్థానంలో ఉంది. గ్రూప్ వైజ్ చూస్తే టాటా గ్రూప్ దేశంలోనే అత్యంత విలువైన సంస్థగా ఉంది. రెండో స్థానంలో రిలయన్స్ 19 లక్షల కోట్లు.. అదానీ గ్రూపు 8 కంపెనీలుంటే 17.65 లక్షల కోట్లు,

భారత్ లో అత్యంత విలువైన కంపెనీలు వాటి వివరాలపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

పూణే వ్యాపారి కేసు.. ఫ్యూజులు ఎగిరిపోయే ట్విస్ట్ లు. ఇంకా ఎన్ని మలుపులు ఉన్నాయో..

Pune businessman case
Pune businessman case

Pune businessman case: పూణే వ్యాపారి కేతన్ అగర్వాల్ కేసు కు సంబంధించి రకరకాల మలుపులు చోటుచేసుకుంటున్నాయి. ఈ కేసులో అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కేతన్ అగర్వాల్ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులకు దిమ్మతిరిగి పోయే నిజాలు తెలుస్తున్నాయి.

ఈ కేసులో సియాగోయల్ తనకు కాబోయే భర్త కేతన్ అగర్వాల్ ను చంపడానికి ప్రధాన కారణం ప్రియుడు చేతన్ చౌదరి అని తెలుస్తోంది. అతడు ఆమెను అనేకసార్లు బ్లాక్మెయిల్ చేశాడని.. అందువల్లే అతడిని హత్య చేయడానికి ఆమె సిద్ధమైందని తెలుస్తోంది. పోలీసుల విచారణలో చేతన్ చౌదరి ఈ విషయాన్ని అంగీకరించినట్టు సమాచారం. మొదట్లో అతడిని చంపడానికి మే నెలలో ప్రణాళిక రూపొందించింది సియా. ఆది విఫలమైంది. ఆ తర్వాత జూన్ 14న కూడా అతనిని చంపడానికి కోట వద్దకు తీసుకెళ్లింది. ఆ ప్లాన్ కూడా ఫ్లాఫ్ అయింది. జూన్ 18న మాత్రం చేతన్.. సియా ఇద్దరు కలిసి కేతన్ ను చంపినట్టు సమాచారం.

సియాను అనేక పర్యాయాలు బెదిరించడం.. ప్రవేట్ వీడియోలు.. ప్రైవేట్ సంభాషణలు బయట పెడతానని చేతన్ చౌదరి బెదిరించడంతో సియా ఈ పని చేసినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన డిజిటల్ ఆధారాలను కూడా పోలీసులు సంపాదించినట్టు సమాచారం.

మరోవైపు ఈ కేసు సంబంధించి ఒక కీలక వీడియోను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పెళ్లికి ముందు సియా, కేతన్ ప్రీ వెడ్డింగ్ షూట్ నిర్వహించారు. ఇందులో సియా సిగ్గుల మొగ్గ గా నటించింది. అంతేకాదు అతనిపై ప్రేమను చూపించింది. ఇది నిజమే అని అతడు నమ్మాడు. చివర్లో వెల్కమ్ టు అగర్వాల్ ఫ్యామిలీ అంటూ ఆమె ఆ వీడియో షూట్లో చెప్పడం విశేషం. వెల్కమ్ చెప్పి చివరికి అతనికి గుడ్ బై పలికిందని నెటిజన్లు అంటున్నారు. మరోవైపు ఈ సియాను తమ ఇంటి కోడలు చేసుకోవాలని కేతన్ అగర్వాల్ తండ్రి భావించాడు. ఫలితంగా సియా కుటుంబాన్ని అనేక పర్యాయాలు సంప్రదించాడు. చివరికి వారు ఒప్పుకున్నారు. అయితే పెళ్లికి ముందు సియాను కూడా అనేకసార్లు అడిగారు. దానికి ఆమెకు సమ్మతమే అని చెప్పడంతో పెళ్లికి సిద్ధమయ్యారు. తమ కూతురు ఇలా చేసిందంటే నమ్మడం లేదని సియా తల్లిదండ్రులు అంటున్నారు..

కేతన్ అగర్వాల్ కేసును విచారించడానికి ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ ముందుకు వచ్చారు. ఈయనను ప్రభుత్వం స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా నియమించింది. ఈయన 26/11 ముంబై ఉగ్రదాడుల కేసును వాదించారు. అత్యంత కిరాతకమైన ఉగ్రవాది కసబ్ కు ఉరిశిక్ష వేయించారు. 1993 ముంబైలో వరుస బాంబు పేలుళ్లు.. కేంద్ర మాజీ మంత్రి ప్రమోద్ మహాజన్ హత్య కేసు.. ఇంకా అనేకమైన సంచలన కేసులను ప్రభుత్వం తరఫున వాదించారు. 2016లో ఈయనకు కేంద్రం పద్మశ్రీ పురస్కారం అందజేసింది.

వైభవ్ సూర్య వంశీ ఎంట్రీ ఇస్తాడా.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ..

BCCI clarification on Suryavanshi
BCCI clarification on Suryavanshi

BCCI clarification on Suryavanshi: టీమిండియా యంగ్ గన్ వైభవ్ సూర్య వంశీ మైదానంలో అడుగు పెడతాడా.. డెబ్యు మ్యాచ్ ఆడతాడా.. జట్టులో విపరీతమైన పోటీ ఉన్న నేపథ్యంలో.. అతడి కోసం ఎవరిని పక్కన పెడతారు.. ఎవరు తన స్థానాన్ని త్యాగం చేస్తారు.. ఇవే ప్రశ్నలు కొద్దిరోజులుగా మీడియాలో సర్కులేట్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో బీసీసీఐ సూర్య వంశీ డెబ్యూ మీద క్లారిటీ ఇచ్చింది.

సూర్య వంశీ మైదానంలో ఎంట్రీ ఇచ్చే విషయంలో ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. కోచింగ్ సిబ్బంది కూడా ఇంతవరకు దీనిపై క్లారిటీ ఇవ్వలేదు. సూర్య వంశీ ఇటీవల కాలంలో సూపర్ ఫామ్ లో ఉన్నాడు. ఐపీఎల్లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఇటీవల శ్రీలంకలో జరిగిన ట్రై సిరీస్లో ఫైనల్ మ్యాచ్లో మెరుపు స్థాయిలో ఇన్నింగ్స్ ఆడాడు. అందువల్లే అతడిని జాతీయ జట్టులోకి తీసుకున్నారు. జట్టులోకి తీసుకున్నప్పటికీ అతడు మైదానంలోకి అడుగు పెడతాడా.. లేదా అనే విషయంపై క్లారిటీ లేదు.. అయితే సూర్య వంశీ ఎంట్రీ కి సంబంధించి టీమిండియా బ్యాటింగ్ కోచ్ శీతాన్ష్ కొటక్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అతని కోసం మెరుగ్గా మరొక ఆటగాడిని పక్కన పెట్టడం భావ్యం కాదని పేర్కొన్నాడు.

ఇది ఇలా ఉండగానే బీసీసీఐ తన సోషల్ మీడియా ఖాతాలో ఒక వీడియోను పోస్ట్ చేసింది. ఆ వీడియోని చూసిన అభిమానులు సంతోష పడుతున్నారు.. ఎందుకంటే ఐర్లాండ్ సిరీస్లో అతడు ఆడతాడని.. అతడు మైదానంలో అడుగుపెడతాడని బీసీసీఐ అనధికారికంగా క్లారిటీ ఇచ్చేసింది. ఎందుకంటే సూర్య వంశీ ఆట చూసేందుకే ఐర్లాండ్ లో అభిమానులు ఆసక్తి చూపిస్తున్నారు. టికెట్లు కూడా భారీగా అమ్ముడుపోయాయి. అదనంగా సీట్లును కూడా ఏర్పాటు చేయాల్సి వచ్చింది. అలాంటప్పుడు వైభవ్ ఆడకపోతే అభిమానుల నుంచి నిరసన వ్యక్తం అయ్యే అవకాశం ఉంది. అందువల్ల బిసిసిఐ సూర్య వంశీకి అవకాశం ఇస్తుందని సమాచారం. అందువల్లే తన అఫీషియల్ సోషల్ మీడియా అకౌంట్లో వీడియో పోస్ట్ చేసినట్టు తెలుస్తోంది.

సూర్యవంశీ కూడా మైదానంలో అడుగు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇప్పటికే మైదానంలో తీవ్రంగా సాధన చేశాడు. అతడు సాధన చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. అతడి ఆట కోసం ఐర్లాండ్ లో స్థిరపడిన భారతీయులు ఎదురు చూస్తున్నారు. అతడు ఆడుతుంటే చూసి ఆనందించేందుకు సిద్ధంగా ఉన్నారు.

ఇక ఫోల్డింగ్ చేసినా మడత కనిపించదు.. శామ్‌సంగ్ కొత్త ప్రయోగం..

Samsung Galaxy Z Fold 8
Samsung Galaxy Z Fold 8

Samsung Galaxy Z Fold 8: శామ్‌సంగ్ కంపెనీ నుంచి రాబోతున్న సరికొత్త ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ ‘శామ్‌సంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 8’. ఈ ఫోన్ కు సంబంధించిన కీలక వివరాలు ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. ఈసారి శామ్‌సంగ్ తన ఫోల్డబుల్ సిరీస్‌లో డిస్‌ప్లే క్రీజ్, బరువు విషయంలో ఊహించని మార్పులు చేయబోతోంది. ఈ సిరీస్‌లో రెండు మోడల్స్ గెలాక్సీ Z ఫోల్డ్ 8 , గెలాక్సీ Z ఫోల్డ్ 8 ఆల్ట్రా రానున్నట్లు తెలుస్తోంది. ఈ ఫోన్లు ఎలా ఉన్నాయి? ఎవరికి ఉపయోగంగా ఉంటాయి? పూర్తి వివరాల్లోకి వెళితె..

కొత్త గెలాక్సీ Z ఫోల్డ్ 8 ‘వైడ్’ మోడల్ బరువు చాలా తేలికంగా ఉండే అవకాశం ఉంది. ఇది కేవలం 201 గ్రాముల బరువు మాత్రమే ఉండొచ్చని అంచనా. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న గెలాక్సీ Z ఫోల్డ్ 7 బరువు 215 గ్రాములుగా ఉంది. దానితో పోలిస్తే ఇది చాలా తక్కువ. సాధారణ స్మార్ట్‌ఫోన్‌ల బరువుతో పోటీ పడనుంది. ఫోల్డ్ 8 ఆల్ట్రా మోడల్ మాత్రం దాదాపు 215 గ్రాముల బరువుతో రానుంది.

ఫోల్డబుల్ ఫోన్ వినియోగదారులను ఎప్పటినుంచో వేధిస్తున్న ప్రధాన సమస్య స్క్రీన్ మధ్యలో కనిపించే మడత (Crease). అయితే, ఈసారి శామ్‌సంగ్ దీనికి శాశ్వత పరిష్కారం చూపించబోతోంది. కంపెనీ తన కొత్త మోడల్స్‌లో అల్ట్రా థిన్ గ్లాస్ సాంకేతికతను, లేజర్ డ్రిల్డ్ మెటల్ సపోర్ట్ ప్లేట్‌ను వాడుతోంది. దీనివల్ల స్క్రీన్‌ను తాకినప్పుడు లేదా చూసినప్పుడు ఆ మడత మార్క్ అస్సలు కనిపించదు. సాధారణ ఫోన్ డిస్‌ప్లే లాగే స్మూత్‌గా ఉంటుంది.

లండన్‌లో జూలై 22న నిర్వహించే ‘గెలాక్సీ అన్‌ప్యాక్డ్’ ఈవెంట్‌లో గెలాక్సీ Z ఫోల్డ్ 8 సిరీస్‌ను అధికారికంగా లాంచ్ చేస్తారు. ఆ తర్వాత ఆగస్టు 4 నుంచి ప్రీ బుకింగ్స్ ప్రారంభం కానుంది. ఆగస్టు 7 నుంచి ఈ మొబైల్స్ మార్కెట్లో విక్రయానికి వచ్చే అవకాశం ఉంది. ఫీచర్ల విషయానికి వస్తే, ఇందులో క్వాల్‌కామ్ సంస్థకు చెందిన అత్యంత శక్తివంతమైన ‘స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్’ సిరీస్ ప్రాసెసర్‌ను ఉపయోగించనున్నారు. అలాగే ఆల్ట్రా మోడల్‌లో 200 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 5,000 mAh భారీ బ్యాటరీ ఉంటుంది. ఈ బ్యాటరీకి 45W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉండనున్నాయి. భారతదేశంలో ఈ ఫోన్ ప్రారంభ ధర సుమారు రూ. 1,65,000 నుంచి ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.

'వారణాసి' షూటింగ్ పై రాజమౌళి సంచలన అప్డేట్.. ఫ్యాన్స్ డ్యూటీ ఎక్కే సమయం వచ్చేసింది..

Rajamouli on Varanasi Shooting
Rajamouli on Varanasi Shooting

Rajamouli on Varanasi Shooting: మన టాలీవుడ్ లో డైరెక్టర్ రాజమౌళి ఒక్కో సినిమాని ఎంత ఆలస్యం గా తీస్తాడో అందరికీ తెలిసిందే. రాజమౌళి తో సినిమా చెయ్యాలని ప్రతీ హీరో అభిమాని కి ఉంటుంది , కానీ అదే సమయం లో మా హీరో ని మరో మూడేళ్లు వెండితెర పై చూడలేము అని బాధ కూడా ఉంటుంది. అయితే కాలం గడిచే కొద్దీ ఎలాంటి వారిలో అయినా మార్పు వస్తుందని అంటుంటారు పెద్దలు , అలా రాజమౌళి తీరులో కూడా మార్పు వచ్చింది. ఒకప్పుడు సంవత్సరాలు తరబడి సినిమాలు చేస్తూ వచ్చిన ఈయన , ‘వారణాసి’ లాంటి విజువల్ వండర్ ని కేవలం ఏడాది లోనే పూర్తి చేసే పరిస్థితి కి వచ్చారు. 2025 సెకండ్ హాఫ్ లో ఈ చిత్రం మొదలైంది. ఇప్పుడు 2026 సెకండ్ హాఫ్ కి వచ్చేశాం, షూటింగ్ కార్యక్రమాలు ఎంత వరకు వచ్చాయో రీసెంట్ గా ఒక ప్రముఖ హాలీవుడ్ మాస పత్రిక కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చారు రాజమౌళి.

ఆయన మాట్లాడుతూ ‘సినిమాలోని భారీ యాక్షన్ సన్నివేశాలకు సంబంధించిన షూటింగ్ ని పూర్తి చేశాము , ఇప్పుడు కేవలం సినిమాలోని కథకు ఇంటర్ లింక్ చేసే సన్నివేశాలకు సంబంధించిన షూటింగ్ మాత్రమే చేస్తున్నాము. మా ప్లానింగ్ ప్రకారం అయితే ఈ చిత్రం సెప్టెంబర్ నెలలోనే పూర్తి చెయ్యాలని అనుకున్నాం. ఒకవేళ ఆలస్యం అయితే అక్టోబర్ లో పూర్తి చేస్తాము , అంతకు మించి టైం పట్టదు’ అంటూ చెప్పుకొచ్చారు రాజమౌళి. ఇక ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ని సాధ్యమైత తొందరగా పూర్తి చేసి , ముందు ప్రకటించిన తేదీ ప్రకారమే ఏప్రిల్ 7 , 2027 న ఈ చిత్రాన్ని అంతర్జాతీయ లెవెల్ లో అన్ని భాషల్లోనూ విడుదల చేస్తామంటూ చెప్పుకొస్తున్నారు.

ఇకపోతే ఆగస్టు 9 న సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజు అనే విషయం అందరికీ తెలిసిందే. ఆరోజున వారణాసి నుండి ఏదైనా అప్డేట్ వస్తుందేమో అని అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. సోషల్ మీడియా లో గ్లింప్స్ విడుదల చేయబోతున్నారు అనే ప్రచారం ఉంది. కానీ రాజమౌళి మాత్రం రీసెంట్ గా జరిగిన ఇంటర్వ్యూ లో దీనిపై ఎలాంటి కామెంట్స్ చేయలేదు. దీంతో అసలు మహేష్ పుట్టినరోజున అప్డేట్ ఉంటుందా లేదా అనే అనుమానం ఫ్యాన్స్ లో బలంగా కలిగింది. చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.