Hydrogen Trains in India: రోజురోజుకు మనుషుల సంఖ్య పెరిగిపోతుంది. ప్రయాణాలు చేసే వారి సంఖ్య కూడా అధికమవుతోంది. ప్రజల అవసరాలు పెరిగిపోతున్నాయి. ప్రజలు ఉపయోగించే సరుకులు కూడా అదే స్థాయిలో ఎక్కువ అవుతున్నాయి. ఇలాంటి అప్పుడు సరుకు రవాణా చేయడం కష్టతరంగా మారుతుంది. దీనికి తోడు రైళ్లకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాల్సిన అవసరం ఏర్పడుతోంది.
మనదేశంలో అనేక విధాలుగా విద్యుత్ తయారవుతున్నప్పటికీ.. ఎక్కువగా థర్మల్ విధానంలోనే కరెంటు తయారు చేస్తున్నారు. థర్మల్ కరెంటు తయారీకి బొగ్గు.. నీరు అవసరం. బొగ్గు అనేది ఒక పరిమితమైన వనరు. ఇలానే తవ్వుకుంటూ పోతే భవిష్యత్తులో బొగ్గు అనేది ఉండదు. అప్పుడు భవిష్యత్ తరాలు ఇబ్బంది పడుతుంటాయి. అందువల్లే సరికొత్త ఆవిష్కరణ చేశారు శాస్త్రవేత్తలు.
విద్యుత్ కాకుండా.. బొగ్గును మండించడం ద్వారా కాకుండా.. హైడ్రోజన్ ద్వారా రైళ్ళను నడిపిస్తున్నారు.. ప్రపంచంలో ఇప్పటికే జర్మనీ, చైనా, జపాన్, అమెరికా దేశాలలో హైడ్రోజన్ తో నడిచే రైళ్లు ఉన్నాయి. అక్కడ అవి విజయవంతంగా కార్యకలాపాలు సాగిస్తున్నాయి.. డీజిల్ రైళ్లకు ఇవి ప్రత్యామ్నయం. వీటివల్ల ఇంధనం ఖర్చు తగ్గుతుంది. కాలుష్యం ఉండదు. శబ్ద కూడా తక్కువ. కేవలం 15 నుంచి 20 నిమిషాల వ్యవధిలోనే ఇంధనం నింపొచ్చు.. దీనివల్ల ఒక్కసారి నింపితే రైలు 1000 కిలోమీటర్ల వరకు ప్రయాణం సాగిస్తూ ఉంటుంది.
మనదేశంలో సరుకు రవాణా రైళ్ల ద్వారానే అధికంగా సాగుతూ ఉంటుంది. ప్రయాణికులు కూడా కార్యకలాపాలను రైళ్ల ద్వారానే సాగిస్తూ ఉంటారు. రైల్వే శాఖ రైళ్లను నడపడానికి విద్యుత్.. డీజిల్ అధికంగా వినియోగిస్తోంది.. వీటి ఖర్చు కూడా అధికంగా ఉంటున్నది. అందువల్లే హైడ్రోజన్ ఆధారంగా మన దేశంలో కూడా రైళ్లు నడపబోతున్నారు. ఇప్పటికే దేశంలో తొలి హైడ్రోజన్ ట్రైన్ చివరి దశ ట్రయల్ పూర్తయింది. హర్యాన రాష్ట్రంలోని జింద్ , సోనిపాట్ మార్గంలో 120 కిలోమీటర్ల వేగంతో ఈ రైలును పరీక్షించారు. అది విజయవంతం కావడంతో.. త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తారని తెలుస్తోంది. హైడ్రోజన్ రైలు సౌకర్యం అందుబాటులోకి వస్తే రైల్వే శాఖ మీద ఆర్థికంగా ఒత్తిడి తగ్గుతుంది. మరిన్ని కొత్త ప్రాజెక్టులు ఏర్పాటు చేయడానికి అవకాశం కలుగుతుంది.
















మత్తు వ్యవహారాలు.. హీరోయిన్స్ తో సంబంధాలు.. ఇన్నాళ్లకు క్లారిటీ ఇచ్చిన కేటీఆర్..
KTR: భారత రాష్ట్ర సమితి కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇటీవల కాలంలో మీడియాలో ఎక్కువగా కనిపిస్తున్నారు. ముఖ్యంగా సర్ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు సాగిస్తున్నారు. సర్ ప్రక్రియ మీద పార్టీ కార్యకర్తలకు అవగాహన కల్పిస్తున్నారు. అధికార పార్టీ మీద విమర్శలు చేస్తున్నారు. అంతేకాదు.. పూర్తిస్థాయిలో డిజిటల్ ఎక్విప్మెంట్ ఏర్పాటు చేసుకొని కార్యకర్తలకు అర్థమయ్యే విధంగా లెక్కలతో సహా చెబుతున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను గణాంకాలతో సహా వివరిస్తున్నారు.
ఇక్కడితో కేటీఆర్ ఆగిపోలేదు. సమయం దొరికిన ప్రతి సందర్భంలో తన అంతరంగాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ఓ డిజిటల్ మీడియా ఛానల్ ముఖాముఖిలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాలు పదే పదే వేసే ప్రశ్నలను ఆ వ్యాఖ్యాత కూడా అడిగింది. ఆ ప్రశ్నలకు కేటీఆర్ తనదైన శైలిలో సమాధానం చెప్పారు. ఇంకోసారి తనను ఈ స్థాయిలో ఇబ్బంది పెడితే తీసుకున్న చర్యలు వేరే విధంగా ఉంటాయని హెచ్చరించారు.
“నేను జీవితంలో పొగ తాగలేదు. మందు కూడా ముట్టలేదు. నేను హీరోయిన్లతో దగ్గరగా ఉన్నానని వీడియోలు సృష్టించారు. రకరకాల ప్రచారాలు మొదలుపెట్టారు. వ్యక్తిత్వ హనానికి పాల్పడ్డారు. కాపురాలు కూల్చానని ఒక మంత్రి ఆరోపించారు. దీని వెనుక ముఖ్యమంత్రి కుట్ర ఉంది. ఇవన్నీ చూస్తే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. అసలు నాకు వాటితో ఏం సంబంధం.. నాకు ఏం అవసరం.. ఎందుకొచ్చాం రా బాబు ఈ రాజకీయాల్లోకి అనిపించేది. కొన్ని సందర్భాలలో ఏదైనా మంచి పని చేసినప్పుడు ప్రజల నుంచి ప్రశంస లబించినప్పుడు గొప్పగా ఉండేది. ఉగాది పండుగ సందర్భంగా షడ్రుచుల సమ్మేళనం మాదిరిగానే రాజకీయాలు కూడా ఉంటాయని అర్థమైంది. నేను రాజకీయాల్లోకి వస్తున్నప్పుడు మా అమ్మ నువ్వు ఎక్కువ రోజులు ఇందులో ఉండవు అని చెప్పింది. ఎందుకంటే నీ వ్యవహార శైలికి ఇది సరిపోదని మా అమ్మ అనేది. కానీ ఇప్పుడు నేను కూడా అడ్జస్ట్ అవుతున్నానని”కేటీఆర్ వ్యాఖ్యానించారు.
చాలా కాలం తర్వాత తన మీద వస్తున్న విమర్శలకు కేటీఆర్ సరైన సమాధానం చెప్పారు. తన రాజకీయ లక్ష్యాలు.. నిర్దేశించుకున్న మార్గాలు.. వంటి వాటిపై ఫుల్ క్లారిటీతో సమాధానాలు చెప్పారు. ఇటీవల కాలంలో కేటీఆర్ ఈ స్థాయిలో మాట్లాడటం ఇదే తొలిసారి. ఒకరకంగా తన అంతరంగాన్ని పూర్తిగా ఆవిష్కరించారు. తన మీద వస్తున్న విమర్శలకు.. స్పష్టమైన సమాధానం చెప్పారు. అయితే దీనిపై కాంగ్రెస్ నాయకులు ఏ విధంగా కౌంటర్ ఇస్తారో చూడాల్సి ఉంది.