Home Blog Page 51

వైసిపి భయం అదే!

YSRCP
YSRCP

YSRCP: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలం పుంజుకునే ప్రయత్నం చేస్తోంది. కానీ పట్టు దక్కడం లేదు. పైగా పార్టీకి తప్పిదాలు వెంటాడుతున్నాయి. అయితే తాజాగా అమరావతి విషయంలో మరోసారి కార్నర్ అయింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. అమరావతి రైతులు అడ్డుకోవడమే కాదు వైసిపి నేతల వెంటపడి మరి తరిమారు. దీంతో వారి మనసు మారలేదని అర్థం అయింది. ఈ పరిణామంతో ఓ రెండు జిల్లాలపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆశలు వదులుకోవాల్సిందే నన్న టాక్ నడుస్తోంది. ప్రధానంగా గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ప్రజల వైఖరిలో మార్పు రాలేదని అర్థం అవుతోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అగ్ర నేతల్లో కూడా ఆందోళన అదే. పైగా ఆ రెండు జిల్లాల నేతలు పై వివాదాస్పద ముద్ర ఉంది. వారి వైఖరితో పాటు వైసిపి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు ఆ పార్టీకి శాపంగా మారాయి.

* అప్పట్లో వైసీపీకి జై కొట్టినా..
2014 నుంచి 2019 మధ్య టిడిపి అధికారంలో ఉంది. అప్పట్లో చంద్రబాబు సర్కార్ అందరి అభిప్రాయంతో అమరావతిని ఎంపిక చేసింది రాష్ట్ర రాజధానిగా. అప్పట్లో జగన్ మోహన్ రెడ్డి సైతం అమరావతిని సమ్మతించారు. అదే అమరావతి పరిధిలో సొంత ఇల్లు కూడా కట్టుకున్నారు. 2019 ఎన్నికలకు ముందు అమరావతి రాజధాని అని.. అందుకే తాను శాశ్వత నిర్మాణం ఏర్పాటు చేసుకున్నానని చెప్పుకొచ్చారు జగన్. అమరావతి ప్రాంత రైతులు కూడా నమ్మారు. అంతులేని అభిమానంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. చివరికి మంగళగిరిలో పోటీ చేసిన లోకేష్ సైతం ఓడిపోయారు అంటే ఏ స్థాయిలో అభిమానం చూపారో అర్థం అవుతుంది.

* అక్కడ టిడిపికి బలం..
వాస్తవానికి కృష్ణాతో పాటు గుంటూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి బలం ఎక్కువ. ఎటువంటి ప్రతికూల పరిస్థితుల్లోనైనా కనీసం ఉనికి చాటుకుంటూ వస్తూ వచ్చింది. ఒకటి రెండు స్థానాలను సైతం దక్కించుకునేది. కానీ 2019 ఎన్నికల్లో ఆ రెండు జిల్లాల్లో పార్టీ ఓడిపోయింది. కనీసం ఒక్క సీటు కూడా రాలేదు. అంతలా ప్రజలు వైసీపీని ఆదరిస్తే అమరావతిని వ్యతిరేకించారు. దాదాపు నిర్వీర్యం చేశారు. రాజధానితో ఆ రెండు జిల్లాలకు ప్రత్యేక గుర్తింపు వస్తుందని భావించిన ప్రజలకు నిరాశ ఎదురయింది. అయితే ఇప్పుడు అదే పనిగా అమరావతి పై కుట్రలు చేస్తుండడం.. రోజుకో మాట ఆడుతుండడంతో ఆ రెండు జిల్లాల ప్రజలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. 2029 ఎన్నికల్లో సైతం ఆ రెండు జిల్లాల పై ఆశలు వదులుకోవాల్సిందేనన్న టాక్ వినిపిస్తోంది. దీనికి తోడు పేర్ని నాని, అంబటి రాంబాబు, దేవినేని అవినాష్ లాంటి వారి తీరు మరింత వివాదాస్పదం అవుతోంది. అందుకే ఆ రెండు జిల్లాలపై ఆశలు వదులుకోవాల్సిందేనన్న ప్రచారం ఎక్కువగా జరుగుతోంది.

కొడంగల్ లో 33 వేల అక్రమ ఓట్లు.. కర్ణాటక ఓట్లతోనే రేవంత్ గెలిచారట..

Kalvakuntla Kavitha
Kalvakuntla Kavitha

Kalvakuntla Kavitha: కొడంగల్ లో 33 వేల అక్రమ ఓట్లు ఉన్నాయా.. కర్ణాటక ప్రజల ఓట్ల తోనే రేవంత్ రెడ్డి ఆ నియోజకవర్గంలో గెలిచారా.. దీనికి ఎన్నికల సంఘం కూడా సహకరించిందా.. సరిగ్గా ఇవే మాటలు చెబుతున్నారు తెలంగాణ రక్షణ సేన అధినేత్రి కల్వకుంట్ల కవిత.. ఆమె చేసిన ఆరోపణలు తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు సంచలనంగా మారాయి. 2018 నుంచి 2023 వరకు కొడంగల్ లో మొత్తం 30 వేల కొత్త ఓట్లు చేర్చారని ఆమె ఆరోపించిన తీరు సరికొత్త చర్చకు దారితీస్తోంది.

కొడంగల్ నియోజకవర్గం లో 22 వేలకు పైగా నకిలీ ఓట్లు ఉన్నట్టు తమ పరిశీలనలో తేలిందని కావిత ఆరోపించారు. అంతేకాదు కర్ణాటక రాష్ట్రానికి చెందిన సడం నియోజకవర్గంలోని 11 వేల ఓట్లు కొడంగల్ నియోజకవర్గంలో నమోదయ్యాయని కవిత సరికొత్త విషయాన్ని తెరమీదికి తీసుకొచ్చారు. 33,000 ఓట్లు అక్రమంగా ఉన్నాయని.. రేవంత్ రెడ్డి ఏకంగా 32 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారని కవిత ఆరోపించారు. “రేవంత్ గెలుపు వెనుక కర్ణాటక ఓటర్లు ఉన్నారు. అక్కడి నుంచి ఓటర్లను తీసుకువచ్చారు. అందువల్లే ఆయన గెలిచారు. ఇప్పుడు కూడా అదే విధానాన్ని ముందుగానే కొనసాగిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా గెలవడానికి ఆయన అనేక అడ్డదారులు తొక్కుతున్నారు.. దీనికి ఎన్నికల సంఘం కూడా సహకరిస్తుందని” కవిత ఆరోపించారు.

కొడంగల్ నియోజకవర్గంలో 800 ఓట్లు మాత్రమే తొలగించారని.. బోధన్ నియోజకవర్గంలో ఏకంగా ఏడు వేల ఓట్లు తొలగించారని కవిత పేర్కొన్నారు. అంతేకాదు, దాదాపు లక్ష ఓట్ల వరకు కొడంగల్ నియోజకవర్గంలో మోడిఫికేషన్ జరిగిందని కవిత ఆరోపించారు. ఇవి సరికొత్త అనుమానాలకు తావిస్తున్నాయని ఆమె పేర్కొన్నారు..”తెలంగాణ డబ్బులను కర్ణాటకకు పంపిస్తున్నారు. ఓటర్లను తీసుకొస్తున్నారు. చివరికి డబ్బుతో పాటు ఓట్లను కూడా బదిలీ చేశారు.. రేవంత్ రెడ్డికి ఎన్నికల సంఘం అనుకూలంగా వ్యవహరించింది” అనే అనుమానాలు తమకు కలుగుతున్నాయని కవిత ఆరోపించడం విశేషం.

“ఓ నటుడికి మూడు రాష్ట్రాలలో ఓటు హక్కు ఉంది. ఆయన ఆ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆయనకు మూడు రాష్ట్రాల్లో ఓటు హక్కు ఉందని.. వాటిని తొలగించడానికి ఏడు సంవత్సరాలు పట్టిందని” కవిత ఆరోపించడం విశేషం. ఇటువంటి ఓటర్లను తొలగించకపోతే ఎస్ ఐ ఆర్ విధానాన్ని తెరపైకి తీసుకువచ్చి ఉపయోగం లేదని కవిత పేర్కొన్నారు.

రఘురామకృష్ణం రాజు అజెండా టిడిపికి నష్టమా? లాభమా?

Raghurama Krishnam Raju
Raghurama Krishnam Raju

Raghurama Krishnam Raju: ఏపీలో ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రధానంగా సామాజిక వర్గాల పరంగా సభలు, సమావేశాలు నడుస్తున్నాయి. ముఖ్యంగా దళిత బహుజన సభలు అంటూ నిర్వహిస్తున్నారు. ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజును వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకుంటున్నారు. అదే సమయంలో కూటమి ప్రభుత్వంపై విమర్శలు కూడా చేస్తున్నారు జడ శ్రావణ్ కుమార్ తో పాటు దళిత నేతలు. దీంతో టీడీపీ కూటమిలో సైతం ఒక ఆలోచన వచ్చినట్లు ప్రచారం నడుస్తోంది. గత కొంతకాలంగా రఘురామకృష్ణం రాజు సొంత అజెండాతో ముందుకు వెళుతుండగా.. ఆయనకు వ్యతిరేకంగా దళిత బహుజన సభలు జరుగుతుండడం ఇప్పుడు ఏపీలో సరికొత్త పరిణామం.

* నాలుగు నెలలుగా సొంత అజెండాతో..
గత నాలుగు నెలలుగా రఘురామకృష్ణం రాజు ఒక సొంత అజెండాతో ముందుకు వెళ్తున్నారు. హిందుత్వ వాదాన్ని బలంగా తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో ఒక వేదికను సైతం ఏర్పాటు చేశారు. దానికి విపరీతంగా స్పందన వస్తోంది. ఆయనకు అభిమాన గణం కూడా పెరుగుతోంది. గతంలో పవన్ కళ్యాణ్ హిందుత్వ వాదాన్ని వినిపించారు. కానీ రఘురామకృష్ణంరాజు స్థాయిలో మాత్రం కాదు. నేరుగా హిందూ ఆలయాల పరిరక్షణతో పాటు హిందుత్వవాదం గురించి ఎక్కువగా వ్యాఖ్యానాలు చేస్తున్నారు. డిప్యూటీ స్పీకర్ లాంటి రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న ఆయన వెనక్కి తగ్గడం లేదు. దీంతో హిందుత్వ వాదం ఉన్న ప్రతి ఒక్కరు రఘురామకృష్ణం రాజును అభిమానిస్తున్నారు.

* తెర వెనుక బిజెపి..
తెలుగుదేశం పార్టీ కూడా రఘురామకృష్ణంరాజు విషయంలో చూసి చూడనట్టుగా ముందుకు వెళ్తోంది. కానీ చాలామంది టిడిపి నేతలు ఈ పరిణామాలతో ఇబ్బందికర పరిస్థితులు వస్తాయని భయపడుతున్నారు. ఇక్కడే భిన్న వాదన వినిపిస్తోంది. టిడిపికి ఎటువంటి నష్టం జరగదు అని రఘురామకృష్ణంరాజు చెబుతున్నారు. అసలు దళితులు టిడిపికి ఓటు వేయరని.. అటువంటప్పుడు వారితో రాజకీయం చేస్తున్న వారిని ఎందుకు భయపడాలని ప్రశ్నిస్తున్నారు. పైగా రఘురామకృష్ణంరాజు వెనుక ఆర్ఎస్ఎస్ తోపాటు విశ్వహిందూ పరిషత్ లాంటివి ఉన్నాయని.. దళిత క్రిస్టియానిటీని ఇప్పటికే బిజెపి వ్యతిరేకం అన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు ఎక్కువమంది. అయితే ఇది టిడిపికి నష్టం చేయకపోగా.. లాభం చేకూరుస్తుందన్న వారు ఉన్నారు. దళిత బహుజన్ సభల వెనుక వైసీపీ అజెండా ఉంటే.. రఘురామకృష్ణం రాజు హిందుత్వ ఓట్లను ఏకతాటిపైకి తెస్తున్నారు అన్నవారు కూడా ఉన్నారు. మరి ఈ సభలు, ఈ పరిణామాలు రాజకీయంగా ఏ పార్టీకి ఇబ్బందికరం అవుతాయి? ఏ పార్టీకి ప్రయోజనం చేకూరుస్తాయి? అనేది చూడాలి.

పీవీ సునీల్ కుమార్ కు అసలు పరీక్ష!

PV Sunil Kumar
PV Sunil Kumar

PV Sunil Kumar: సీనియర్ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ ఈరోజు పదవీ విరమణ చేయనున్నారు. సస్పెన్షన్ లోనే ఉండగా ఆయన రిటైర్ అవుతున్నారు. అయితే నేరుగా పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాలన్న ఆలోచనతో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ అది అంత ఈజీ కాదు అని అర్థం అవుతోంది. ఎందుకంటే ఆయన ఐపీఎస్ అధికారిగా ఉన్నప్పుడు అధికార దుర్వినియోగం, అవినీతి చేశారన్న అభియోగాలపై కేసులు నడుస్తున్నాయి. పదవీ విరమణ అనంతరం కూడా ఆ కేసుల విచారణ అలానే కొనసాగుతాయని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. తద్వారా ఏ రాజకీయ పార్టీలో చేరి మైక్ అందుకున్నా.. ఆయనకు కేసులు తప్పవని తేలిపోయింది.

* వ్యతిరేకంగా జీవీ హర్ష కుమార్ కుమారులు
దళిత అజెండాతో పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాలన్నది సునీల్ కుమార్ ఆలోచనగా వార్తలు వచ్చాయి. అయితే సొంత సామాజిక వర్గం లోనే ఆయనపై వ్యతిరేక వర్గం భారీగా తయారయింది. భారీగా విదేశీ నిధులతో పాటు కొన్ని వర్గాల నుంచి వచ్చిన నిధుల దుర్వినియోగం జరిగింది అని.. మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ తనయులు బయటకు తీశారు. సోషల్ మీడియా డొమైన్ లో పెట్టారు. అంబేద్కర్ మిషన్ ద్వారా లక్షలాదిమంది దళితులను సభ్యులుగా చూపుతూ ఆయన భారీ దందా చేశారు అనేది జీవి హర్ష కుమార్ కుమారుల వెర్షన్. పదవీ విరమణ చేసిన మరు క్షణం సొంత సామాజిక వర్గం నేతలు కచ్చితంగా వ్యక్తిగత విమర్శలు, ఆరోపణలు చేసే అవకాశం ఉంది.

* అధికారిక రక్షణ కరువు..
ఒక సీనియర్ ఐపీఎస్ అధికారిగా సునీల్ కుమార్ కు దేశవ్యాప్తంగా మంచి పేరు ఉంది. కానీ వైసీపీ హయాంలో ఆయన రాజకీయ ప్రేరేపిత కేసులను ఉపయోగించి ఇబ్బందులు పెట్టారు అనేది ఒక ఆరోపణ. అయితే ఇన్ని రోజులు సర్వీస్ లో ఉండడంతో ఆయనకు బ్యూరోక్రసి వ్యవస్థ రక్షణగా నిలిచేది. ఇకనుంచి ఆ పరిస్థితి కూడా ఉండదు. రాజకీయంగా కొంత రక్షణ రావచ్చు కానీ.. తన సర్వీస్ ప్రకారం ఆర్థిక రాయితీలు కూడా వర్తించవు. ఇలా అన్నింటా ముప్పేట దాడిని సునీల్ కుమార్ ఎలా ఎదుర్కొంటారో చూడాలి.

నాగబాబును నియంత్రించుకుంటే కూటమికి కష్టమే!

Nagababu
Nagababu

Nagababu: కూటమి విడిపోవాలన్నది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆలోచన. అందుకు ఆ పార్టీ చేయని ప్రయత్నం అంటూ లేదు. ఇటువంటి సమయంలో మూడు పార్టీల ఉమ్మడి కార్యాచరణ, పొత్తు సమన్వయంతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో సీఎం చంద్రబాబు తో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిణితితో వ్యవహరిస్తున్నారు. ఎక్కడ ఇబ్బందులు రాకుండా ముందుకు వెళుతున్నారు. క్షేత్రస్థాయిలో కొన్నిచోట్ల కూటమిలో విభేదాలు వచ్చినా.. వాటిని ఎంకరేజ్ చేయడం లేదు. కానీ మెగా బ్రదర్ నాగబాబు వల్ల మాత్రం ఇబ్బందికర పరిస్థితులు వస్తున్నాయి. జన సైనికులను ఉత్సాహపరిచే క్రమంలో ఆయన చేస్తున్న వ్యాఖ్యలు వికటిస్తున్నాయి.

* గతంలో చాలాసార్లు..
వాస్తవానికి నాగబాబు లో దూకుడు ఎక్కువ. గతంలో సినీ పరిశ్రమ విషయంలో జరిగిన పరిణామాలతో పాటు రాజకీయాల్లో ఆయన చేసిన ప్రకటనలు చాలాసార్లు వివాదాస్పదం అయ్యాయి. చిరంజీవి సౌమ్యుడు అనే పేరు ఉంది కానీ… నాగబాబు తీరుతో చిరంజీవి విమర్శలకు గురయ్యారన్న విమర్శలు కూడా ఉన్నాయి. జనసేనలో ఆయన క్రియాశీలక పాత్ర పోషించిన తర్వాత పవన్ కళ్యాణ్ నాగబాబుకు కీలక సూచనలు చేసినట్లు తెలుస్తోంది. అందుకే నాగబాబు కొన్ని ప్రకటనలు చేసే విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ వస్తున్నారు. కానీ నిన్న అరకు పార్లమెంటరీ నియోజకవర్గ సమీక్ష జరిగింది. వచ్చే ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేస్తుందని ప్రకటన చేయడం హాట్ టాపిక్ అయ్యింది. జన సైనికులను ఉత్సాహపరిచే క్రమంలో ఆయన నోటి నుంచి ఈ కామెంట్స్ వచ్చాయి. ఇది విపరీతంగా వైరల్ కావడంతో దిద్దుబాటు చర్యలకు దిగారు. మేమే పోటీ చేస్తామనలేదని.. కూటమిపరంగా మేం పోటీ చేస్తాం అని చెప్పానని కవరింగ్ ఇచ్చుకున్నారు నాగబాబు.

* పవన్ ఆదేశాలతో తగ్గిన నాగబాబు..
వాస్తవానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పై దూకుడుగా వ్యవహరించడం లేదు నాగబాబు. జనసేనతో పాటు పవన్ కళ్యాణ్ను టార్గెట్ చేసుకున్నప్పుడు మాత్రమే నాగబాబు బయటకు వస్తున్నారు. కూటమి ప్రభుత్వం పై విమర్శలు వచ్చిన క్రమంలో నాగబాబు సరైన రీతిలో స్పందించడం లేదన్న విమర్శ ఉంది. ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ తొలిసార్లు గుర్తు చేస్తూ జనసేన నేతలతో పాటు నాగబాబుకు హెచ్చరికలు జారీ చేశారు. ప్రభుత్వం అంటే టిడిపి మాత్రమే కాదని.. జనసేన సైతం ఉందన్న విషయాన్ని గ్రహించుకొని మాట్లాడాలన్నారు. చాలాసార్లు హితబోధ కూడా చేశారు.

* కూటమి జాగ్రత్త పడకపోతే..
కూటమి పార్టీలు సమన్వయంతో ముందుకు సాగుతూ ఉండడంతో.. వాటి మధ్య చీలిక ఎప్పుడు తెస్తామా అన్న ఆలోచనలో ఉంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఈ సమయంలో నాగబాబు లాంటివారు వారికి ఛాన్స్ ఇచ్చినట్టే. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే కూటమికి నష్టం. పైగా నాగబాబు లాంటివారు ప్రకటనలు చేస్తే తప్పకుండా కిందిస్థాయిలో సైతం విపరీతంగా ప్రభావం చూపుతుంది. అందుకే నాగబాబు లాంటి వారిని నియంత్రించాల్సిన అవసరం పవన్ కళ్యాణ్ పై ఉంది. నాగబాబు సైతం బాధ్యతగా వ్యవహరించాల్సి ఉంటుంది ఇకనుంచి. ఈ విషయంలో తప్పకుండా పవన్ అప్రమత్తం అవుతారు. దిద్దుబాటు చర్యలకు దిగుతారు అని కూటమి వర్గాలు ఆశిస్తున్నాయి.

మీ ఫోన్ లో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే హ్యాక్ అయినట్లే..!

Phone Hacked Signs
Phone Hacked Signs

Phone Hacked Signs: ప్రస్తుత కాలంలో వ్యక్తిగత సమాచారం నుంచి బ్యాంకింగ్ వివరాలు, సోషల్ మీడియా ఖాతాలు, ఫొటోలు, ముఖ్యమైన పత్రాల వరకు అన్నీ స్మార్ట్‌ఫోన్‌లోనే భద్రపరిచే పరిస్థితి ఉంది. అందుకే స్మార్ట్‌ఫోన్ భద్రత అత్యంత కీలకంగా మారింది. సైబర్ నేరగాళ్లు వివిధ మార్గాల ద్వారా ఫోన్లను హ్యాక్ చేసి వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితేఫోన్ హ్యాక్ అయిందో లేదో కొన్ని సంకేతాల ద్వారా ముందుగానే గుర్తించే అవకాశం ఉందని సైబర్ భద్రత నిపుణులు చెబుతున్నారు.

ఫోన్ ఎక్కువగా వేడెక్కడం లేదా బ్యాటరీ వేగంగా ఖాళీ కావడం:
ఫోన్ ను పెద్దగా ఉపయోగించకపోయినా ఫోన్ అసాధారణంగా వేడెక్కడం లేదా బ్యాటరీ చాలా వేగంగా తగ్గిపోవడం గమనిస్తే అప్రమత్తం కావాలి. హానికరమైన సాఫ్ట్‌వేర్ (మాల్వేర్) నేపథ్యంలో నిరంతరం పనిచేస్తూ ప్రాసెసర్‌ను ఎక్కువగా ఉపయోగించడం వల్ల ఈ సమస్యలు తలెత్తుతాయి. కొత్త బ్యాటరీ పెట్టినా లేదా ఫోన్ కొత్తదైనా ఇలాంటి పరిస్థితి కొనసాగితే ఫోన్‌ను పూర్తిగా స్కాన్ చేయించడం మంచిది.

అకస్మాత్తుగా డేటా వినియోగం పెరగడం:
ఇంటర్నెట్‌ను సాధారణంగానే ఉపయోగిస్తున్నప్పటికీ మొబైల్ డేటా వినియోగం ఒక్కసారిగా పెరిగితే అది అనుమానించాల్సిన విషయమే. కొన్ని హ్యాకింగ్ యాప్‌లు లేదా మాల్వేర్‌లు మీ ఫోన్‌లోని సమాచారం, ఫొటోలు లేదా ఇతర డేటాను రహస్యంగా సర్వర్లకు పంపిస్తుంటాయి. దీంతో మీ డేటా వినియోగం అనూహ్యంగా పెరుగుతుంది. అందువల్ల డేటా వినియోగాన్ని తరచూ పరిశీలించడం అవసరం.

తెలియని మెసేజ్‌లు లేదా OTPలు:
ఫోన్ కాల్స్ సమయంలో వింత శబ్దాలు వినిపించడం, మీరు పంపని SMSలు వెళ్లడం లేదా మీరు అడగకుండానే OTPలు, వెరిఫికేషన్ కోడ్‌లు రావడం వంటి లక్షణాలు కూడా ప్రమాద సూచికలు కావచ్చు. అలాగే మీ కాంటాక్టులకు మీకు తెలియకుండా మెసేజ్‌లు వెళ్లినా వెంటనే ఫోన్‌ను పరిశీలించాలి. ఇవి ఖాతాలను హ్యాక్ చేయడానికి జరుగుతున్న ప్రయత్నాలకు సంకేతాలు కావచ్చు.

ఫోన్ పనితీరు మందగించడం:
ఇంతకుముందు వేగంగా పనిచేసిన ఫోన్ ఒక్కసారిగా చాలా నెమ్మదిగా మారడం, యాప్‌లు తరచూ క్రాష్ అవడం, ఫోన్ ఆటోమేటిక్‌గా రీస్టార్ట్ అవడం లేదా స్క్రీన్ స్పందన తగ్గిపోవడం వంటి సమస్యలు కనిపిస్తే వాటిని నిర్లక్ష్యం చేయకూడదు. కొన్ని మాల్వేర్‌లు ఫోన్ వనరులను అధికంగా వినియోగించడం వల్ల ఇలాంటి సమస్యలు ఎదురవుతాయి.

కొత్త యాప్‌లు కనిపించడం:
ఇన్‌స్టాల్ చేయని యాప్‌లు ఫోన్‌లో కనిపిస్తే అది తీవ్రమైన హెచ్చరికగా పరిగణించాలి. కొన్ని హ్యాకింగ్ టూల్స్ లేదా మాల్వేర్‌లు యూజర్‌కు తెలియకుండా యాప్‌ల రూపంలో ఫోన్‌లో ఇన్‌స్టాల్ అవుతాయి. అలాంటి యాప్‌లకు కెమెరా, మైక్రోఫోన్, లొకేషన్, కాంటాక్ట్స్ వంటి అనుమతులు ఉంటే వెంటనే వాటిని తొలగించి ఫోన్‌ను భద్రతా స్కాన్ చేయాలి.

పై లక్షణాలు కనిపిస్తే ముందుగా ఫోన్‌లోని అన్ని యాప్‌లను పరిశీలించి అనుమానాస్పద యాప్‌లను తొలగించాలి. ఆ తర్వాత బ్యాంకింగ్, ఇమెయిల్, సోషల్ మీడియా వంటి ముఖ్యమైన ఖాతాల పాస్‌వర్డ్‌లను వెంటనే మార్చాలి. అధికారిక యాంటీవైరస్ లేదా సెక్యూరిటీ యాప్‌తో పూర్తి స్కాన్ చేయాలి

నిద్రపోకుండా ఒక్కరాత్రి ఉన్నా.. ఎంత డేంజరో తెలుసా..

Sleep Deprivation
Sleep Deprivation

Sleep Deprivation: ప్రస్తుత జీవనశైలిలో చాలా మంది రాత్రిళ్లు ఆలస్యంగా నిద్రపోవడం లేదా పని, మొబైల్, వినోదం కోసం నిద్రను త్యాగం చేయడం సాధారణంగా మారింది. అయితే ఒక్కో రోజు నిద్రకుండా ఉండి.. ‘ఒక్క రాత్రే కదా’ అని చాలామంది భావిస్తుంటారు. కానీ ఆ ఒక్క రాత్రి సరైన నిద్ర లేకపోయినా శరీరంలోని అనేక కీలక వ్యవస్థలు దెబ్బతింటాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిద్ర అనేది కేవలం విశ్రాంతి మాత్రమే కాదు.. శరీరం తనను తాను మరమ్మతు చేసుకునే అత్యంత ముఖ్యమైన ప్రక్రియ. అయితే ఒక్క రాత్రి కూడా నిద్ర లేకపోతే శరీరంలో ఎటువంటి మార్పులో వస్తాయో తెలుసా?

ఒక్క రాత్రి కూడా తగినంత నిద్ర లేకపోతే మొదటగా మెదడు పనితీరు మందగిస్తుంది. ఏకాగ్రత తగ్గడం, నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురుకావడం, జ్ఞాపకశక్తి బలహీనపడడం వంటి సమస్యలు కనిపిస్తాయి. కొత్త విషయాలను నేర్చుకునే సామర్థ్యం కూడా తగ్గుతుంది. విద్యార్థులు, ఉద్యోగులు, వాహనదారులపై ఈ ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది. చిన్న విషయానికే కోపం రావడం, చిరాకు పెరగడం, ఒత్తిడి అధికమవడం, ఆందోళన వంటి సమస్యలు కనిపిస్తాయి. కొంతమందిలో నిరాశ భావన కూడా పెరిగే అవకాశం ఉంటుంది. రోజువారీ పనుల్లో ఆసక్తి తగ్గిపోవడం కూడా సాధారణమే.

రాత్రి సరైన నిద్ర లేకపోతే జీర్ణక్రియ మందగిస్తుంది. గ్యాస్, అజీర్ణం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు రావచ్చు. అలాగే ఆకలిని నియంత్రించే హార్మోన్లలో మార్పులు ఏర్పడి అధికంగా తినాలనే కోరిక పెరుగుతుంది. ముఖ్యంగా తీపి పదార్థాలు, జంక్ ఫుడ్ తినాలనే ఆసక్తి ఎక్కువవుతుంది. నిద్ర సమయంలో శరీరంలో అనేక హార్మోన్లు సమతుల్యంగా విడుదల అవుతాయి. కానీ నిద్ర తగ్గితే కార్టిసోల్ (ఒత్తిడి హార్మోన్) స్థాయులు పెరుగుతాయి. అలాగే ఆకలిని నియంత్రించే లెప్టిన్, గ్రెలిన్ హార్మోన్లలో అసమతుల్యత ఏర్పడి బరువు పెరిగే ప్రమాదం ఉంటుంది. దీర్ఘకాలంలో మధుమేహం, ఊబకాయం వంటి సమస్యల ప్రమాదం కూడా పెరుగుతుంది.

శరీరానికి అవసరమైన రోగనిరోధక వ్యవస్థ బలపడేందుకు నిద్ర కీలకం. ఒక్క రాత్రి నిద్రలేమి కూడా రోగనిరోధక కణాల పనితీరును తాత్కాలికంగా ప్రభావితం చేస్తుందని పరిశోధనలు సూచిస్తున్నాయి. దీంతో వైరస్‌లు, బ్యాక్టీరియాల వల్ల వచ్చే ఇన్‌ఫెక్షన్లను ఎదుర్కొనే శక్తి తగ్గే అవకాశం ఉంటుంది. నిద్ర సరిపోకపోతే రక్తపోటు తాత్కాలికంగా పెరగవచ్చు. గుండె వేగం మారడం, ఒత్తిడి హార్మోన్లు పెరగడం వంటి మార్పులు చోటుచేసుకుంటాయి. తరచూ నిద్రలేమి ఉంటే భవిష్యత్తులో గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

అందువల్ల ఏ ఒక్క రోజూ అనుకోకుండా ప్రతీరోజూ కంటినిండా నిద్రపోవాలి. వయోజనులు ప్రతి రోజు కనీసం 7 నుంచి 9 గంటల నాణ్యమైన నిద్ర పొందాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. పిల్లలు, యువతకు దీనికంటే ఎక్కువ నిద్ర అవసరం. ప్రతిరోజూ ఒకే సమయానికి నిద్రపోవడం, పడుకునే గంట ముందు మొబైల్, ల్యాప్‌టాప్ వినియోగాన్ని తగ్గించడం, కెఫీన్ అధికంగా తీసుకోకపోవడం, ప్రశాంతమైన వాతావరణంలో నిద్రపోవడం ద్వారా మంచి నిద్ర పొందవచ్చు.

జూలై 1 నుంచి అలర్ట్.. ఇవన్నీ మారుతున్నాయి.. వెంటనే తెలుసుకోండి..

July 2026 Rules Changes
July 2026 Rules Changes

July 2026 Rules Changes: జూన్ ముగిసి జూలై నెల ప్రారంభం అవుతున్న తరుణంలో కొన్ని ఆర్థిక అంశాల్లో మార్పులు జరగబోతున్నాయి. సామాన్యుల నుంచి ఉద్యోగులు, పన్ను చెల్లింపుదారులు, ప్రయాణికులు వీటిని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. పాస్‌పోర్ట్ ఫీజుల పెంపు, ఆధార్ ఈ-మెయిల్ అప్‌డేట్‌కు ఉచిత అవకాశం, ఎస్‌బీఐ-ఫోన్‌పే క్రెడిట్ కార్డు రివార్డు పాయింట్ల నిబంధనల్లో మార్పులు, ఆదాయపు పన్ను రిటర్నుల గడువు వంటి అంశాల్లో కీలక మార్పులు జరగనున్నాయి. ఈ మార్పులు లక్షలాది మందిపై ప్రభావం చూపనున్నాయి. ఇవి ఏ విధంగా మారుతున్నాయి? ఎవరిపై ఎక్కువ ప్రభావం చూపనున్నాయి?

ఐటీ రిటర్న్ గడువు:
2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయడానికి జులై 31, 2026 చివరి తేదీగా నిర్ణయించారు. గడువులోపు రిటర్నులు దాఖలు చేయని వారికి ఆలస్య రుసుము, వడ్డీతో పాటు కొన్ని పన్ను ప్రయోజనాలు కోల్పోయే అవకాశం ఉంటుంది. అలాగే రీఫండ్ రావాల్సి ఉన్నవారు కూడా ఆలస్యం చేయకుండా రిటర్నులు దాఖలు చేయడం మంచిది. అవసరమైన ఫారమ్-16, బ్యాంక్ వివరాలు, పెట్టుబడి పత్రాలు ముందుగానే సిద్ధం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఆరు నెలల పాటు ఆధార్ అప్డేట్ ఉచితం:
ప్రస్తుతం ఆధార్‌లో ఈ-మెయిల్ ఐడీ అప్‌డేట్ చేసుకోవడానికి రూ.75 ఫీజు చెల్లించాల్సి వస్తోంది. అయితే జులై 1 నుంచి డిసెంబర్ 31, 2026 వరకు ఈ సేవను ఉచితంగా అందించనున్నట్లు యూఐడీఏఐ (UIDAI) ప్రకటించింది. డిజిటల్ సేవలు, బ్యాంకింగ్, ప్రభుత్వ పథకాలు, ఓటీపీ ఆధారిత ధృవీకరణలు సజావుగా సాగాలంటే ఆధార్‌లో సరైన ఈ-మెయిల్, మొబైల్ నంబర్ నమోదు చేసి ఉండటం ఎంతో అవసరం.

పాస్‌పోర్ట్ ఫీజులు భారీగా పెంపు:
విదేశాలకు వెళ్లే వారు, కొత్త పాస్‌పోర్ట్‌కు దరఖాస్తు చేసుకునే వారు ఇకపై అధిక రుసుము చెల్లించాల్సి ఉంటుంది. 36 పేజీల సాధారణ పాస్‌పోర్ట్ ఫీజు రూ.1,500 నుంచి రూ.2,500కు పెరిగింది. తత్కాల్ సేవకు రూ.3,500 స్థానంలో రూ.5,000 చెల్లించాలి. 60 పేజీల పాస్‌పోర్ట్ రుసుము రూ.2,000 నుంచి రూ.3,500కు పెంచగా, తత్కాల్ సేవకు రూ.6,000గా నిర్ణయించారు. 18 సంవత్సరాల లోపు వారికి కొత్త పాస్‌పోర్ట్ రుసుము రూ.1,000 నుంచి రూ.1,750కు పెరగనుంది. ఇప్పటికే దరఖాస్తు చేసుకోవాలని భావిస్తున్న వారు ఈ పెంపును దృష్టిలో ఉంచుకోవాలి.

ఫోన్‌పే క్రెడిట్ కార్డుల రివార్డు పాయింట్లలో మార్పులు:
ఫోన్‌పే ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ పర్పుల్, ఫోన్‌పే ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ సెలెక్ట్ బ్లాక్ వినియోగదారులకు రివార్డు పాయింట్ల విధానంలో మార్పులు అమల్లోకి రానున్నాయి. కొన్ని కేటగిరీలలో రివార్డు పాయింట్లకు పరిమితులు విధించనుండగా, కొన్ని లావాదేవీలపై పాయింట్ల లెక్కింపు విధానాన్ని కూడా సవరించారు. దీంతో క్రెడిట్ కార్డును ఎక్కువగా ఉపయోగించే వారు కొత్త నిబంధనలను ముందుగానే పరిశీలించుకోవడం మంచిది.

ఈ మార్పులు ఎవరిపై ప్రభావం చూపుతాయి:
విదేశీ విద్య, ఉద్యోగం లేదా పర్యటన కోసం పాస్‌పోర్ట్ తీసుకోవాలనుకునే వారు, ఆదాయపు పన్ను చెల్లింపుదారులు, ఆధార్ వివరాలు నవీకరించాలనుకునే పౌరులు, అలాగే ఎస్‌బీఐ-ఫోన్‌పే క్రెడిట్ కార్డు వినియోగదారులు ఈ మార్పుల వల్ల నేరుగా ప్రభావితమవుతారు. చిన్న మార్పులుగా కనిపించినా, సమయానికి స్పందించకపోతే అదనపు ఖర్చులు లేదా సేవల్లో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.

'లెనిన్' బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఎంత గ్రాస్ రావాలో తెలుసా.. బయ్యర్స్ పెద్ద సాహసమే చేశారు..

Lenin Movie
Lenin Movie

Lenin Movie: అక్కినేని అఖిల్ కెరీర్ లో ‘లెనిన్’ చిత్రం ఎంతో ప్రత్యేకం. చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని , ఈసారి ఎలా అయినా సూపర్ హిట్ కొట్టాలి అనే కసితో ఈ చిత్రాన్ని చేశాడు . ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి ఇన్నేళ్లు అయినప్పటికీ కూడా , ఇప్పటికీ సరైన హిట్ లేకపోవడం తో , అక్కినేని అభిమానులు అఖిల్ పట్ల తీవ్రమైన అసంతృప్తి తో ఉన్నారు. పాపం ప్రతీ సినిమాకు అఖిల్ ప్రాణం పెట్టి పని చేస్తున్నారు , కానీ ఫలితం మాత్రం దక్కడం లేదు అనే భావన కేవలం అక్కినేని ఫ్యాన్స్ లోనే కాదు, ఇతర హీరోల అభిమానుల్లో కూడా ఉంది. అందుకే తప్పుల నుండి అఖిల్ చాలా నేర్చుకున్నారని , ఈసారి ఆయన టార్గెట్ మిస్ అయ్యే అవకాశం లేదని అక్కినేని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు. కేవలం వాళ్ళు మాత్రమే కాదు , ట్రేడ్ కూడా అఖిల్ ని ఈసారి గట్టిగానే నమ్ముతోంది.

అందుకే తెలుగు రాష్ట్రాల్లో మంచి బిజినెస్ ని జరుపుకుంటుంది ఈ చిత్రం. కేవలం ఒక్క కోస్తాంధ్ర ప్రాంతం లోనే ఈ చిత్రానికి 10 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ‘ఏజెంట్’ లాంటి దారుణమైన డిజాస్టర్ తర్వాత ఈ రేంజ్ బిజినెస్ జరగడం అనేది చిన్న విషయం కాదు. ఇక నైజాం , సీడెడ్ ప్రాంతాలకు కలిపి కచ్చితంగా ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల నుండే 22 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరుపుకునే అవకాశాలు ఉన్నాయని , ఓవరాల్ వరల్డ్ వైడ్ గా ఈ చిత్రానికి 30 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ బిజినెస్ ట్రెండ్ నడుస్తుందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. కెరీర్ మొత్తం మీద ఒక్క హిట్ సరైనది లేదు, గత చిత్రం ఆల్ట్రా డిజాస్టర్, అయినప్పటికీ ఈ రేంజ్ బిజినెస్ జరిగిందంటే , అఖిల్ ని ఈసారి ట్రేడ్ చాలా గట్టిగా నమ్ముతుందని అర్థం.

ఇప్పటి వరకు విడుదలైన ప్రీ రిలీజ్ ప్రొమోషనల్ కంటెంట్ కి ఆడియన్స్ నుండి , ఫ్యాన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక అఖిల్ తండ్రి నాగార్జున ఈ చిత్రాన్ని చూసి పుత్రోత్సాహం తో మురిసిపోతున్నారు. చూస్తుంటే అఖిల్ ఈసారి గట్టిగానే కొట్టేలా ఉన్నారు. అన్నీ అనుకున్నట్టు జరిగి ఉండుంటే ఈ చిత్రం విడుదలై నేటికి నాలుగు రోజులు అయ్యుండేది. కానీ పోస్ట్ ప్రొడక్షన్ పర్ఫెక్షన్ కోసం జులై 10 కి వాయిదా వేశారు. మరి అఖిల్ ఈసారైనా అంచనాలను అందుకుంటాడా లేదా అనేది చూడాలి.

బాలీవుడ్ నటుడితో తెలుగు అమ్మాయి ఘాటు రొమాన్స్.. ప్రేమలో పడ్డారా...

Kavya NM
Kavya NM

Kavya NM: సినిమా ఇండస్ట్రీలో ఉండే నటీనటుల మధ్య ఫ్రెండ్షిప్ అనేది ఉంటుంది. ఎందుకంటే వాళ్లు సినిమాల్లో నటిస్తూనే ఒకరికొకరు పరిచయం చేసుకొని ఎవరు ఎలాంటి సినిమాలు చేస్తున్నారు. ఫ్యూచర్లో ఎవరు ఎలా ముందుకు వెళ్లాలనుకుంటున్నారు అనే విషయాలను పంచుకుంటారు. అలాగే సినిమా షూటింగ్లో కలిసి నటిస్తుంటారు. కాబట్టి వాళ్ళ మధ్య మంచి ఫ్రెండ్షిప్ కుదురుతుంది. ఆ ఫ్రెండ్షిప్ ప్రేమగా మారి నటీనటులు పెళ్లి చేసుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇక ఇలాంటి క్రమంలోనే తెలుగమ్మాయిగా మంచి గుర్తింపును సంపాదించుకొని యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్ గా పేరు తెచ్చుకున్న కావ్య ఎన్ ఎమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రస్తుతం కావ్య ప్రముఖ బాలీవుడ్ నటుడు అయిన రాఘవ జుయల్ తో కొద్ది రోజులుగా రిలేషన్షిప్ లో ఉంటుంది ఏంటి కొన్ని వార్తలైతే వస్తున్నాయి. దీనిమీద వాళ్ళిద్దరిలో ఎవరు కూడా అధికారిక ప్రకటన ఇవ్వకపోయిన కూడా రీసెంట్ గా వాళ్ళిద్దరూ క్లోజ్ గా దిగిన ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది… వాళ్ళిద్దరూ అంత క్లోజ్ గా ఉన్న ఫోటో బయటకి వచ్చింది అంటే కచ్చితంగా వాళ్ళిద్దరూ రిలేషన్ షిప్ లో ఉన్నారు అంటూ నెటిజన్లు సైతం కామెంట్లు చేస్తున్నారు. ఇక ఆ ఫోటోకి రెడ్ హార్ట్ సింబల్ ని జోడించి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో ప్రతి ఒక్కరూ వాళ్లకు కంగ్రాట్స్ చెప్తున్నారు.

ఇక ఏది ఏమైనా కూడా వీరిద్దరి జంట చూడ ముచ్చటగా ఉందని మరి కొంతమంది కామెంట్లు చేస్తుండటం విశేషం…ఇక రాఘవ్ జుయల్ ఇంతకుముందు ‘కిల్’ సినిమాలో నటించి ప్రేక్షకులందరికి దగ్గరయ్యాడు. ప్రస్తుతం నాని హీరోగా చేస్తున్న ప్యారడైజ్ సినిమాలో విలన్ గా నటిస్తుండడం విశేషం…

తను అనుకున్నట్టుగానే ఈ సినిమాలో విలన్ గా తన పాత్రని ఏ రేంజ్ లో పోషిస్తాడు ప్రేక్షకులందరి చేత శభాష్ అనిపించుకుంటాడా? లేదా అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఆయన బాలీవుడ్ లో కూడా కొన్ని సినిమాలకు కమిట్ అయినట్టుగా తెలుస్తుంది. మరి ఆయన నుంచి వచ్చే సినిమాల విషయంలో తను చాలా కేర్ ఫుల్ గా వ్యవహరిస్తున్నాడు.

కొంచెం కూడా నిర్లక్ష్యం వహించకుండా ఖచ్చితంగా సక్సెస్ ఫుల్ సినిమాలను మాత్రమే చేయాలని తనకు గుర్తింపు వచ్చే క్యారెక్టర్లలో మాత్రమే నటించాలని ఆయన ఏరీ కోరి మరి క్యారెక్టర్స్ ని ఎంపిక చేసుకున్నట్లుగా తెలుస్తుంది. మరి కావ్య ఎన్ ఎమ్ ను ప్రేమిస్తున్నాడా? లేదంటే రిలేషన్ షిప్ లో ఉన్నారా అనే విషయాన్ని ఆఫీషియల్ గా అనౌన్స్ చేస్తే బాగుంటుందని మరి కొంతమంది అతని అభిమానులు సైతం కామెంట్లు చేస్తున్నారు…

తన పక్కన పడుకోవచ్చు.. టచ్ చేయకూడదు.. నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..

Monique Jeremiah
Monique Jeremiah

Monique Jeremiah: దూకుడు సినిమాలో అసలు మీద వడ్డీ.. వడ్డీ మీద చక్రవడ్డీ.. చక్రవడ్డీ మీద విష్ణు చక్రవడ్డీ.. వసూలు చేస్తూనే ఉంటాను. ఇది వ్యాపారం.. అని బ్రహ్మానందం అంటుంటాడు గుర్తుందా.. ఈ ప్రపంచంలో వ్యాపారం అనేది అనేక రకాలు. మనిషి అవసరాలను బట్టి వ్యాపారం సాగుతూ ఉంటుంది. ఆ వ్యాపారాన్ని చాలామంది రకరకాలుగా సాగిస్తూ ఉంటారు. అందులో ఈమె చేస్తున్న వ్యాపారం మాత్రం అన్నిటికంటే భిన్నం. ఇలా కూడా చేస్తారా.. ఇలా కూడా ఆలోచిస్తారా అని చాలామంది అనుకోవడమే కాదు.. ఆశ్చర్యపోతున్నారు.

ఆమె పేరు మోనిక్ జెరీమియా వయసు 37 సంవత్సరాల వరకు ఉంటుంది. ఉండేది కెనడా దేశంలో. ఈమెకు గతంలోనే వివాహం జరిగింది. కొంతకాలం పాటు వైవాహిక జీవితం సజావుగానే సాగింది. ఆ తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. మొదట్లో కాస్త సర్దుకున్నప్పటికీ.. అవి మరింత పెరిగిపోయాయి. దీంతో ఇద్దరు విడాకులు తీసుకున్నారు. దీనికి తోడు కరోనా సోకడంతో అప్పుడు పరిస్థితులు దారుణంగా మారిపోయాయి. ఆమె ఉపాధి కోసం రకరకాల మార్గాలను అన్వేషించింది. చివరికి ఒక కొత్త వ్యాపారాన్ని మొదలుపెట్టింది..

జెరీమియా ఉన్నత విద్యావంతురాలు కావడంతో విచిత్రంగా ఆలోచించింది. తను పడుకునే పడకలో సగభాగాన్ని అద్దెకు ఇవ్వడం మొదలుపెట్టింది. ఇలా సంపాదించడం ప్రారంభించింది. అయితే దీనికోసం ఒక షరతు కూడా పెట్టింది. తన పక్కన పడుకోవాలని.. టచ్ చేయకూడదు.. పైగా రెంట్ కూడా నార్మల్ ధరలోనే ఉండడంతో.. ఆమె ఆఫర్ చాలా మందికి నచ్చింది. ఫలితంగా ఆమె పక్కన పడుకోడానికి చాలామంది ముందుకు వచ్చారు. దీంతో ఆదాయం అదిరిపోయింది. ప్రతినెల ఇలా 50 వేల వరకు ఆమె సంపాదిస్తోంది.

తన పక్కన పడుకున్నప్పటికీ టచ్ చేయకూడదని ఆమె షరతు విధించడంతో.. దానికి చాలామంది లోబడి వచ్చారు. అందమైన అమ్మాయి.. పక్కనే అవకాశం కల్పించడంతో చాలామంది యువకులు పడుకోడానికి క్యూ కట్టారు. ఫలితంగా ఆమె ఆదాయం నెలకు 50000 వరకు జరిగింది. పైసా ఖర్చు లేకుండా.. రూపాయి పెట్టుబడి లేకుండా ఆమె ఇలా సంపాదించింది. మనదేశంలో ఇలాంటి విధానం లేకపోయినప్పటికీ.. విదేశాలలో ఇటువంటి విధానాలు కామన్. వీటిని అక్కడి ప్రజలు హాట్ బెడ్డింగ్ అని పిలుస్తుంటారు.

లోహ్ గడ్ కోట కిటకిట.. సియా పాయింట్ కోసం తహతహ.. ఇలా ఉన్నారేంట్రా బాబూ..

Lohagad Fort
Lohagad Fort

Lohagad Fort: మహారాష్ట్రలో పూణేకు 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న లోహ్ గడ్ కోట చారిత్రాత్మకమైన ప్రాంతం. ఈ ప్రాంతాన్ని సందర్శించడానికి చాలామంది పర్యటకులు వస్తూనే ఉంటారు. ఈ కోట అత్యంత పురాతనమైనది. ఇక్కడి ప్రాంతాలు అందంగా ఉంటాయి. గత చరిత్రను కళ్ళ ముందు ఉంచుతాయి. కానీ.. ఈ కోటను సందర్శించడానికి ఇటీవల కాలంలో పర్యాటకులు ఆసక్తిని చూపిస్తున్నారు. ఆ పర్యటకుల సంఖ్య ఇటీవల కాలంలో పెరిగింది. దీనికి కారణం ఒకే ఒక్క యువతి.

ఇటీవల లోహ్ గడ్ కోట లోయలో కేతన్ అనే వ్యాపారి పడి చనిపోయిన విషయం తెలిసిందే. అతడిని చంపిన ఘటనలో కాబోయే భార్య సియా, అతడి ప్రియుడు చేతన్ ముఖ్యపాత్ర పోషించారు. అతడిని చంపడానికి వారిద్దరు అనేక రకాలుగా ప్రణాళికలు రూపొందించారు. చివరికి చంపేసి తమకు అడ్డు లేకుండా చూసుకున్నారు. కానీ చట్టం అనేది ఒకటుంటుందని.. పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేసి అదుపులోకి తీసుకుంటారని వారు ఊహించలేకపోయారు. చివరికి పోలీసులకు దొరికిపోయి జైలు శిక్ష అనుభవిస్తున్నారు.

ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తినే పద్యంలో ఈ కోటను సందర్శించడానికి పర్యాటకులు పెరిగిపోయారు. గతంతో పోల్చి చూస్తే 25% మంది పర్యాటకులు పెరగారని తెలుస్తోంది.. అంతేకాదు, ఈ కోట చివరి అంచు ప్రాంతంలోకి సియా ఎక్కడినుంచి కేతన్ ను నెట్టివేసిందో తెలుసుకోవడానికి పర్యాటకులు ఆసక్తి చూపిస్తున్నారు. కేతన్ ను నెట్టి వేసిన ప్రాంతాన్ని సియా పాయింట్ గా అభి వర్ణించారు. అ పాయింట్ ను సందర్శించేందుకు పర్యాటకులు ఆసక్తి చూపిస్తున్నారు.

ఒకప్పుడు ఒక హత్య జరిగితే ఆ ప్రాంతం వద్దకు వెళ్లాలంటే ప్రజలు భయపడేవారు. అక్కడ ఏమైనా ప్రతీప శక్తులు ఉంటాయేమోనని ఆందోళన చెందేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. పైగా ఆ సంఘటన గురించి తెలుసుకోవడానికి.. ఆ ప్రాంతాన్ని సందర్శించడానికి.. పర్యాటకులు ఆసక్తి చూపిస్తున్నారు. ఎంతైనా నేటి సోషల్ మీడియా కాలంలో మనుషులు పూర్తిగా మారిపోయారు.

షాపులు తెరవడమే ఆలస్యం.. అందినకాడికి ఏసీలు ఎత్తుకుపోతున్నారు.. అక్కడ ఎందుకిలా. ఏం జరుగుతోంది..

France Heatwave
France Heatwave

France Heatwave: అది శీతల దేశం. మహా అయితే ఉష్ణోగ్రత 25 డిగ్రీలకు మించిపోదు. ఎండాకాలంలో కూడా అక్కడ ఉష్ణోగ్రత 25 డిగ్రీల లోపు ఉంటుంది.. అక్కడ సాధారణంగా ఏసీల వినియోగం కూడా అంతగా ఉండదు. చుట్టూ దట్టమైన కొండలు.. అంత ఎత్తున ఉండే వృక్షాలు ఆ దేశాన్ని సరికొత్తగా చూపిస్తుంటాయి. ఆ దేశాన్ని సందర్శించడానికి ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులు ఆసక్తి చూపిస్తుంటారు. పైగా ఆ ప్రాంతంలో చలిని తట్టుకోవడానికి ప్రత్యేకంగా గీజర్లు ఉంటాయి. అయితే అటువంటి ఆ శీతల దేశంలో పరిస్థితి మారిపోయింది. ఎంతలా అంటే.. యావత్ ప్రపంచం మొత్తం ఆసక్తిగా చూసేలా..

ఫ్రాన్స్ పేరు చెబితే ప్రపంచానికి ఫ్యాషన్ గుర్తుకొస్తుంది. అక్కడ ప్రతిరోజు ఫ్యాషన్ పోటీలు జరుగుతూనే ఉంటాయి. ప్రఖ్యాత ఈఫిల్ టవర్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ మహా అయితే ఉష్ణోగ్రత 25° మించదు. కానీ ఇప్పుడు ఫ్రాన్స్ దేశం నిప్పుల కొలిమి మీద ఉంది. ఎండవేడికి తట్టుకోలేక అక్కడి ప్రజలు చుక్కలు చూస్తున్నారు. ఎండ వేడిమి నుంచి కాపాడుకోవడానికి సముద్ర తీర ప్రాంతాలకు వెళ్తున్నారు. సాయంత్రమైతే చాలు బీచ్ లలో సేద తీరుతున్నారు.. వాస్తవానికి అక్కడ ఈ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అక్కడి ప్రజలు కలలో కూడా ఊహించలేదు.. ఎండ వేడిమి ఈ స్థాయిలో ఇబ్బంది పెడుతుంటే తమకు ఇంట్లో ఉండాలని కూడా అనిపించడం లేదని అక్కడ ప్రజలు అంటున్నారంటే.. పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

అక్కడ ఎండ వేడిమి అలా పెరిగిపోవడానికి ప్రధాన కారణం ఒమేగా ఎఫెక్ట్. పసిఫిక్ సముద్రంలో ఏర్పడిన ఎల్ నీనో వల్ల అక్కడ ఒమేగా ఎఫెక్ట్ చోటుచేసుకుంది. దీనికి తోడు అక్కడి వాతావరణం లో మార్పులు కూడా అనూహ్యంగా ఉంటున్నాయి.. ఉష్ణోగ్రతలు పెరిగిపోవడంతో అక్కడ ప్రజలు ఏసీలు కొనుగోలు చేయడానికి పోటీ పడుతున్నారు. గతంలో ఎన్నడు లేనివిధంగా అక్కడ ఏసీల కొనుగోళ్లు పెరిగిపోయాయి. షాపులు ఓపెన్ చేయడమే ఆలస్యం.. ఏసీలు కొనుగోలు చేసేందుకు అక్కడి ప్రజలు పోటీ పడుతున్నారు. ఇటీవల ఫ్రాన్స్ లో చాబర్ అనే ప్రాంతంలో ఓ షాపు ఓపెన్ చేయగానే అందులోకి ప్రజలు భారీగా వచ్చారు. ఏసీలు కొనుగోలు చేశారు. కూరగాయలు.. ఉల్లిపాయలు కొనుగోలు చేసినట్టు ఏసీలను కొనుక్కున్నారు. అలా ప్రజలు ఏసీలు కొనుగోలు చేయడం అక్కడ పరిస్థితిని తేట తెల్లం చేస్తోందని నెటిజన్లు అంటున్నారు.

ఎండ వేడి పెరిగిపోవడంతో చల్లదనం కోసం ప్రజలు తాపత్రయపడుతున్నారు
. అందువల్ల ఇలా ఏసీలను కొనుగోలు చేస్తున్నారు. ఇటీవల కాలంలో ఏసీలను కొనుగోలు చేసేవారి సంఖ్య అక్కడ పెరిగిపోయింది. అందువల్లే అన్ని షాపులు కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్నాయి. కొన్ని షాపులలో అయితే. ఔట్ ఆఫ్ స్టాక్ అని బోర్డు పెట్టారంటే అక్కడ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
image.png

ఏఐ ని నమ్ముకుంటే పుట్టి మునిగింది.. చివరికి ఆ కంపెనీ ఏం చేసిందంటే..

Ford AI
Ford AI

Ford AI: కృత్రిమ మేధ.. కొంతకాలంగా ప్రపంచాన్ని షేక్ చేస్తోంది. అన్ని కంపెనీలు దీని మాయలో పడి ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఉద్యోగాలలో కోత విధిస్తున్నాయి. దీంతో లక్షల పదిమంది రోడ్డు మీద పడ్డారు. ఇంకా పడుతూనే ఉన్నారు. అతిపెద్ద కంపెనీల నుంచి మొదలు పెడితే కింది స్థాయి సంస్థల వరకు ఉద్యోగులను కంపెనీలు తొలగిస్తున్న నేపథ్యంలో.. భవిష్యత్ కాలంలో అసలు మనుషుల అవసరం లేకుండానే అన్ని జరిగిపోతాయని.. ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ మనుషుల జీవితాల్లో సమూల మార్పులు తీసుకొస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్ని రంగాలలో ప్రవేశించి.. సమూల మార్పులకు కారణమవుతున్న నేపథ్యంలో.. ఓ కంపెనీలో మాత్రం ఇందుకు భిన్నమైన పరిస్థితి ఏర్పడుతోంది. అంతేకాదు ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ నమ్ముకున్న ఆ కంపెనీ నిండా మునిగింది. చివరికి ఏం చేయాలో తెలియక ఒక కీలక నిర్ణయం తీసుకుంది.

కార్ల తయారీలో అత్యంత కీలకమైన సంస్థగా ఫోర్డ్ కంపెనీ కొనసాగుతోంది. ఈ కంపెనీలో అనుభవం ఉన్న ఇంజనీర్లు అనేక రకాల కారణాలతో బయటకు వెళ్లిపోయారు. అయితే ఆ సంస్థ వారి స్థానంలో కొత్తవారిని నియమించుకోలేదు. పైగా గత ఏడాది అక్టోబర్లో 900 ఏఐ ఆధారిత కెమెరాలను ఏర్పాటు చేసింది. అవి ఆశించిన స్థాయిలో పనిచేయలేకపోవడంతో మళ్లీ అనుభవం ఉన్న ఉద్యోగులను తిరిగి ఫోర్డ్ కంపెనీ నియమించుకుంటున్నది. ఇప్పటిదాకా 350 మంది ఉద్యోగులను ఫోర్డ్ కంపెనీ నియమించుకుంది. ఆ ఉద్యోగులు కృత్రిమ మేధకు శిక్షణ ఇవ్వబోతున్నారు. వాస్తవానికి కృత్రిమ మేధ అనేది సొంతంగా పనిచేయదు. దానికి సొంతంగా పనిచేసే స్థాయి కూడా ఉండదు.. శిక్షణ ఇస్తేనే అది పనిచేస్తూ ఉంటుంది.

“కొంతకాలంగా మేము అనుభవం ఉన్న ఉద్యోగులకు సరైన ప్రాధాన్యం ఇవ్వలేదు. కృత్రిమ మేధ మీద ఎక్కువగా దృష్టి పెట్టాం. అయితే ఉద్యోగులు చేసే స్థాయిలో కృత్రిమ మేధ పనిచేయలేకపోయింది. సంస్థ అవసరాలకు తగ్గట్టుగా ఉత్పత్తులు అందించలేకపోయింది. డిజైన్ అవసరాలకు అనుగుణంగా ఇన్పుట్ ఇస్తే.. కృత్రిమ మేధ అత్యున్నత నాణ్యత ఉన్న ఉత్పత్తులు తయారు చేస్తుందని అనుకున్నాం. కానీ అలా జరగలేదు. కృత్రిమ మేధను నమ్ముకుని మేము విఫలమయ్యామని” ఫోర్డ్ కంపెనీ హార్డ్వేర్ ఇంజనీరింగ్ వైస్ ప్రెసిడెంట్ చార్లెస్ చెబుతున్నారు. సంస్థ అవసరం తగ్గట్టుగా చాలామంది ఇంజనీర్లను నియమించుకోవాలని అనుకుంటున్నాం. త్వరలోనే ఆ ప్రక్రియ పూర్తి చేస్తామని ఆయన అంటున్నారు. ప్రపంచం మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దుమ్ము రేపుతున్న నేపథ్యంలో.. అది కేవలం అవసరానికి పనికి వచ్చే టూల్ మాత్రమేనని.. అది నవ్యతను.. అంది పుచ్చుకోలేదని.. ఇచ్చిన పని మాత్రమే చేస్తుందని ఫోర్డ్ కంపెనీ ఉదంతం ద్వారా తెలిసింది.

ఫుడ్ డెలివరీ బాయ్ ని కొట్టిన 'రాజు వెడ్స్ రాంబాయి' హీరో...వైరల్ వీడియో...

Akhil Raj
Akhil Raj

Akhil Raj: సినిమా ఇండస్ట్రీలో ఒక్కసారి హీరోగా మారిన తర్వాత వాళ్ళ ఆటిట్యూడ్ మొత్తం మారిపోతుంది. అంతకుముందు ఉన్న వైఖరి సినిమా సక్సెస్ అయిన తర్వాత ఉండదని చాలా మంది చెబుతూ ఉంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే గత సంవత్సరం ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించిన నటుడు అఖిల్ రాజ్… ఈ మూవీతోనే హీరోగా పరిచయమైన తను మొదటి సినిమాతోనే సక్సెస్ ని సాధించాడు. దాంతో అతనికి ఇండస్ట్రీలో భారీ అవకాశాలైతే వస్తున్నాయి. ఇక దానికి తోడుగా ఆయన ప్రతి సినిమా విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నట్లుగా తెలుస్తుంది. ఇక సినిమాల విషయం పక్కన పెడితే ఆయన ఏదో ఒక రెస్టారెంట్ నుంచి ఫుడ్ ఆర్డర్ అయితే పెట్టుకున్నాడు. ఫుడ్ డెలివరీ బాయ్ రాంగ్ ఫుడ్ ఆర్డర్ డెలివరీ చేయడంతో అఖిల్ రాజ్ తో పాటు వాళ్ళ అమ్మ కూడా అతని మీద గొడవకు దిగారు.

మొత్తానికైతే ఫుడ్ డెలివరీ అబ్బాయి తీసిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. ఇదంతా చూసిన కొంతమంది హీరో అయితే ఎందుకు అంత పొగరు ఫుడ్ డెలివరీ బాయ్ మీద దాడి చేయడం ఏంటి రాంగ్ ఫుడ్ వస్తే అది రెస్టారెంట్ వాడి తప్పు ఫుడ్ డెలివరీ చేసిన వాడి తప్పు కాదు కదా అంటూ కొంతమంది మాట్లాడుతున్నారు.

ఇక ఫుడ్ డెలివరీ బాయ్ మాత్రం అఖిల్ రాజు వాళ్ళ అమ్మ తన మొహం మీద ఉమ్మేసిందని ఆ వీడియో తీస్తూ మాట్లాడుతున్నాడు. నిజానికి ఒక సినిమా సక్సెస్ సాధించినంత మాత్రాన అంత తల పొగరు ఉండాల్సిన పని లేదు. అంతకంటే చాలా గొప్ప సక్సెస్ లను సాధించిన వారు కామ్ గా ఉంటూ వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటూ ముందుకు సాగుతున్నారు.

ఆ వీడియోలో అఖిల్ రాజ్ ను చూస్తే వాళ్ళ నాన్నను దాటుకుని మరీ వచ్చి ఆ ఫుడ్ డెలివరీ బాయ్ ని కొట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. ఆ పొగరు మార్చుకోకపోతే మాత్రం సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ కాలం పాటు నిలవడం చాలా కష్టమవుతుందని చాలామంది విమర్శకులు సైతం అతన్ని హెచ్చరిస్తున్నారు…

 

View this post on Instagram

 

A post shared by Telangana News Zone (@tnewszone)

'ఓజీ 2' లో డిజాస్టర్ హీరోయిన్.. భయపడిపోతున్న ఫ్యాన్స్..

OG 2 Movie
OG 2 Movie

OG 2 Movie: ‘సోషల్ మీడియా లో గత వారం రోజుల నుండి ఎక్కడ చూసినా ‘ఓజీ 2’ మేనియా నే కనిపిస్తోంది. గత ఏడాది దసరా కానుకగా విడుదలైన ఈ చిత్రం , జెన్ జీ ఆడియన్స్ ని విపరీతంగా అలరించింది. ఓటీటీ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత , ఈ చిత్రానికి పాన్ ఇండియా లెవెల్ లో ఇంకా ఎక్కువ రీచ్ వచ్చింది. దీంతో అభిమానుల నుండి ‘ఓజీ 2’ కచ్చితంగా కావాల్సిందే అనే డిమాండ్ రోజురోజుకి పెరుగుతూ పోవడం తో , వాళ్ళ కోసం పవన్ కళ్యాణ్ ‘ఓజీ 2’ చిత్రం చేయడానికి నడుం బిగించారు. ఈ సినిమాకు సంబంధించిన చర్చలు మొదలయ్యాయి. రీసెంట్ గానే డైరెక్టర్ సుజిత్ పవన్ కళ్యాణ్ ని కలిసి ఈ సినిమా స్టోరీ ని వినిపించారు. ఆయనకు తెగ నచ్చేసింది , ఈ సినిమా కోసం ఎంత దూరమైనా వస్తా, ఏదైనా చేస్తా అని ఆయన మాట ఇచ్చారు.

ఈ వీడియో ని చూసిన తర్వాత అభిమానులు మెంటలెక్కిపోయారు, ముఖ్యంగా సుజిత్ పవన్ కళ్యాణ్ కి ఈ చిత్రం లోని సన్నివేశాలను వివరించే విధానం వాళ్లకు గూస్ బంప్స్ రప్పించింది. ఆయన చెప్పిన సన్నివేశాలకు AI ద్వారా విజువల్ రూపం ఇస్తూ , సోషల్ మీడియా లో ఎన్నో వేల ఎడిటింగ్స్ ని అప్లోడ్ చేశారు నెటిజెన్స్. ముఖ్యంగా గంభీర పెట్ డ్రాగన్ అంటూ ఏ రేంజ్ ఎడిటింగ్స్ వచ్చాయో మన అందరం చూసాము, చూస్తూనే ఉన్నాం. ఇదంతా పక్కన పెడితే గత రెండు రోజుల క్రితమే ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం బాలీవుడ్ టాప్ హీరోయిన్స్ ని సంప్రదిస్తున్నారు అంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అభిమానులు ఈ విషయం తెలుసుకొని సంబరాలు చేసుకున్నారు. అయితే ఇప్పుడు లేటెస్ట్ గా మరో వార్త వినిపిస్తోంది.

ఈ చిత్రంలో హీరోయిన్ పాత్ర కోసం హాట్ బ్యూటీ పూజ హెగ్డే ని ఎంచుకునే ఆలోచనలో ఉన్నారట సుజిత్. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా చేస్తారట. పూజ హెగ్డే హీరోయిన్ అయితే కొంతమంది అభిమానులు సంతోషిస్తున్నారు కానీ , ఎక్కువ శాతం మంది అభిమానులు మాత్రం మాకొద్దు బాబోయ్ అంటున్నారు. ఎందుకంటే పూజా హెగ్డే ఈమధ్య కాలం లో చేసిన ప్రతీ సినిమా కమర్షియల్ గా ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. రీసెంట్ గా బాలీవుడ్ డీసెంట్ హైప్ తో విడుదలైన సినిమా కూడా యావరేజ్ రేంజ్ లో ఆడింది. ప్రస్తుతం ఆమె టైం అసలు బాలేదు , ఇలాంటి సమయం లో ఆమెని ఏరికోరి ‘ఓజీ 2’ లాంటి సినిమాలో తీసుకోవడం అవసరమా అని మెజారిటీ పవన్ అభిమానులు అంటున్నారు. మరి సుజిత్ రాబోయే రోజుల్లో ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

ఈ ఐదురాశుల వారు ఈరోజు నక్క తోక తొక్కినట్లే.. పట్టిందల్లా బంగారమే..

Today 30 June 2026 Horoscope:
Today 30 June 2026 Horoscope:

Today 30 June 2026 Horoscope: జ్యోతిష శాస్త్రం ప్రకారం మంగళవారం ద్వాదశ రాశులపై పూర్వాషాడ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఈరోజు పట్టిందల్లా బంగారమే అవుతుంది. మరికొన్ని రాశుల వారు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

ఈ ఐదురాశుల వారు ఈరోజు నక్క తోక తొక్కినట్లే.. పట్టిందల్లా బంగారమే..
మేష రాశి (అశ్విని, భరణి,1,2,): ఈ రాశి నిరుద్యోగులు ఈరోజు శుభవార్తలు వింటారు. ఉద్యోగులకు అధికారుల మద్దతు ఉండడంతో ముఖ్యమైన ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేస్తారు. సీనియర్ల మద్దతు ఉండడంతో కొందరికి పదోన్నతులు వచ్చే అవకాశం ఉంటుంది. వ్యాపారులకు ఈరోజు రాజయోగం ఉండే అవకాశం ఉంది. గతంలో పెట్టిన పెట్టుబడులకు ఇప్పుడు లాభాలు పొందుతారు.

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి విద్యార్థులు ఈరోజు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. కొత్తగా పెట్టుబడులు పెట్టేవారికి ఇదే మంచి సమయం. గతంలో కంటే ఇప్పుడు ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. పాత అప్పుడు తీరిపోవడంతో సంతోషంగా గడుపుతారు. ఉద్యోగులకు అదనపు ఆదాయం చేకూరుతుంది. అధికారుల నుంచి మద్దతు ఉండడంతో పదోన్నతులు వచ్చే అవకాశం ఉంటుంది.

మిథున రాశి( మృగశిర 3,4 ): ఈ రాశి వారికి ఈ రోజు అన్ని శుభాలే జరగనున్నాయి. అయితే కుటుంబ సభ్యుల మధ్య భేదాభిప్రాయాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇలాంటి సమయంలో మాటల తీరును అదుపులో ఉంచుకోవాలి. సొంత వాహనాలపై ప్రయాణం చేసేవారు జాగ్రత్తగా ఉండాలి. స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తారు. కొన్ని విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం తగదు.

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారికి ఈ రోజు ప్రమోషన్ విషయంలో శుభవార్తలు అందుతాయి. విద్యార్థులు పోటీ పరీక్షలో రాణించడానికి గురువుల సహాయం తీసుకుంటారు. వ్యాపారులకు కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది. దీంతో గతంలో కంటే ఇప్పుడు వీరు అధిక ఆదాయాన్ని పొందుతారు. గ్రహాల అనుకూలతలతో ఏ పని మొదలుపెట్టిన ఈరోజు విజయం అవుతుంది.

సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారు త్వరలో జరిగే శుభకార్యానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటారు. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి అధిక రాబడి పొందే అవకాశం ఉంటుంది. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఉద్యోగులకు కొత్త అవకాశాలు ఏర్పడతాయి. ఇదే సమయంలో అదనపు ఆదాయం చేకూరుతుంది.

కన్య రాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారికి ఈ రోజు అన్ని విజయాలే ఉంటాయి. వ్యాపారులకు గతంలో కంటే ఇప్పుడు లాభాలు ఉంటాయి. కుటుంబ జీవితం సంతోషంగా సాగుతుంది. దైవానుగ్రహం ఉండడంతో పెట్టుబడుల నుంచి అధిక లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఓపికతో చేపట్టిన పనులు అన్నీ పూర్తిచేసే ప్రయత్నం చేయాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారికి ఈ రోజు పెట్టుబడులు పెట్టేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఉద్యోగులకు అధికారుల సహాయం ఉంటుంది. దీంతో అధిక ఆదాయాన్ని పొందే అవకాశం ఉంది. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు.

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారికి ఈ రోజు అన్ని విజయాలే చేకూరుతాయి. అయితే సొంత వాహనాలపై ప్రయాణం చేసేవారు జాగ్రత్తగా ఉండాలి. కొత్తగా పెట్టుబడులు పెట్టేవారు పెద్దల సలహాలు తీసుకోవడం మంచిది. ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదు. అనుకోకుండా శుభకార్యంలో పాల్గొనాల్సి వస్తుంది. పాత అప్పులను తీర్చేందుకు ఇదే మంచి సమయం.

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారికి ఈ రోజు కొత్త ప్రాజెక్టులను చేపట్టేందుకు అవకాశం ఏర్పడుతుంది. అయితే ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. ఇలాంటి సమయంలో వస్తువుల కొనుగోలు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. గతంలో కంటే ఇప్పుడు ఆరోగ్యం మెరుగుపడుతుంది. విద్యార్థుల కెరీర్ విషయంలో తల్లిదండ్రులు కీలక నిర్ణయం తీసుకుంటారు.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : . ఈ రాశి వారికి ఈ రోజు ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. గతంలో పోగొట్టుకున్న డబ్బులు తిరిగి పొందుతారు. ఆగిపోయిన డబ్బు వసూలు అవుతుంది. పాత అప్పులను తీరుస్తారు. ఉద్యోగులకు అధికారుల మద్దతు ఉండడంతో ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేస్తారు. ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారికి ఈ రోజు ఊహించిన దానికంటే అధిక లాభాలు రానున్నాయి. వ్యక్తిగత జీవితం మెరుగ్గా ఉంటుంది. గతంలో కంటే ఇప్పుడు ఆరోగ్యం కుదుటపడుతుంది. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. వ్యాపారులకు కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది. దీంతో ఊహించిన దాని కంటే ఎక్కువ లాభాలు ఉంటాయి.

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారు ఈరోజు ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లడం వల్ల అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారులు అనుకోని విధంగా అధిక లాభాలు పొందుతారు. జీవిత భాగస్వామి కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. కొత్త పెట్టుబడులకు ఇదే మంచి సమయం.