Home Blog Page 43

కన్నీళ్లు రప్పిస్తున్న ప్రముఖ దర్శకుడు భాగ్యరాజ్ చివరి లేఖ..

Bhagyaraj Last Letter
Bhagyaraj Last Letter

Bhagyaraj Last Letter: తమిళనాడు లో లెజండరీ స్థానాన్ని సొంతం చేసుకున్న ప్రముఖ నటుడు, రచయితా , దర్శకులు భాగ్య రాజ్ తన తుదిశ్వాస ని విడిచిన ఘటన యావత్తు సినీ లోకాన్ని శోకసంద్రం లో ముంచేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన జరిగిన ముందు రోజు రాత్రి ఆయన ఎంతో ఉత్సాహం తో ప్రముఖ హీరోయిన్ కుష్బూ కూతురు అవంతిక వివాహానికి హాజరయ్యారు. అలాంటి వ్యక్తి పొద్దున్న లేచేలోపే చనిపోయారు అనే వార్త విని జీర్ణించుకోలేకపోయారు అభిమానులు , సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు. అయితే సోషల్ మీడియా లో భాగ్యరాజ్ కి సంబంధించిన చివరి లేఖ ఇప్పుడు బాగా వైరల్ అయ్యింది. ఆ లేఖలో ఆయన మాట్లాడిన మాటలు వింటే కన్నీళ్లు ఆగవు. ముఖ్యంగా తన నేత్రాలను దానం చేసే విషయం పై , అదే విధంగా తన కొడుకు గురించి ఆయన మాట్లాడిన మాటలు బాగా వైరల్ అయ్యాయి.

ఆయన మాట్లాడుతూ ‘మన చుట్టూ ఉన్నవాళ్లను సంతోషపెట్టడం లోనే మన నిజమైన ఆనందం దాగుంది. ఇనీళ్ళ సుదీర్ఘ సినీ ప్రయాణం లో అభిమానులు నాపై చూపించిన అపారమైన ప్రేమ , నన్ను ఎంతగానో ప్రోత్సహించిన అక్కాచెల్లెళ్లు , తల్లులకు , ఇండస్ట్రీ లోని నా సహచరులకు కృతఙ్ఞతలు. మీ ప్రేమని ఎల్లప్పుడూ చూడడం కోసం నా కళ్ళను సజీవంగా ఉంచాను , దయచేసి వాటిని జాగ్రత్తగా చూసుకోండి. నా కోసం మీరంతా కొట్టిన చప్పట్లు నా కొడుకుకి కూడా ఆశీర్వాదం గా మారాలని కోరుకుంటున్నాను. ఈ సుదీర్ఘ సినీ ప్రయాణం లో మీరు నాపై చూపించిన ప్రేమ , ఆదరణ నా కొడుకు శాంతనుపైన కూడా చూపించాలి, నేను శారీరకంగా మీతో ఈరోజు లేకపోయినా నా కళ్ళ ద్వారా అభిమానులను చూస్తూనే ఉంటాను. ఈ శరీరం శాశ్వతం కాదు , ఎదో ఒక రోజు భూమిలో కలిసిపోతుంది , లేదంటే అగ్నికి ఆహుతి అవుతుంది’.

‘చివరికి మిగిలేది బూడిదే , కానీ మనం పంచిన ప్రేమే అసలైన సంపద. నా జీవిత ప్రయాణం లో నన్ను ప్రేమించి , నా కష్టసుఖాల్లో పాలు పంచుకున్న ప్రతీ ఒక్కరికి నేను రుణపడి ఉంటాను. నేను చేసిన మంచి సినిమాలు , కథలు , డైలాగ్స్, చూపించిన మానవత్వం ద్వారా చిరస్థాయిగా జీవిస్తాను ‘ అంటూ చెప్పుకుకొచ్చారు భాగ్యరాజ్. భాగ్యరాజ్ తెలుగు , తమిళ భాషలకు కలిపి దాదాపుగా 25 సినిమాలకు దర్శకత్వం వహించగా, 75 కి పైగా సినిమాల్లో నటించారు. ప్రముఖ హీరోయిన్ పూర్ణిమ ని ప్రేమించిన పెళ్లాడిన ఈయన , ఆ తర్వాత శాంతను కి జన్మనిచ్చారు. ప్రస్తుతం శాంతను తమిళం లో హీరోగా అనేక సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీ గా ఉన్నారు.

మీకు సొంత కారు ఉందా.. ఈ 8 విషయాల్లో జాగ్రత్త..ఎందుకంటే..

Car Safety Tips
Car Safety Tips

Car Safety Tips: ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఇలాంటి సమయంలో రోడ్లపై నీరు నిల్వ ఉండటం, జారుడు రోడ్లు, తక్కువ విజిబిలిటీ వంటి కారణాలతో కారు ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయి. ఆ పరిస్థితి రాకుండా ఉండడానికి సొంత కారు ఉన్నవారు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. నేటి కాలంలో చాలా మంది సొంత కారును కలిగి ఉన్నారు. అయితే వ్యక్తిగత, కార్యాలయ పనుల కారణంగా కారును పెద్దగా పట్టించుకోరు. కానీ చిన్న నిర్లక్ష్యం పెద్ద ఖర్చులకు కారణం అవుతుంది. ముఖ్యంగా వర్షాకాలంలో ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఆటోమోబైల్ నిపుణులు తెలుపుతున్నారు. మరి ఈ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే?

1. టైర్ల ట్రెడ్ తక్కువగా ఉంటే..
వర్షాకాలంలో కారుకు అత్యంత ముఖ్యమైన భాగం టైర్లు. టైర్ల ట్రెడ్ (గ్రిప్) తక్కువగా ఉంటే నీటిపై కారు జారిపోయే ప్రమాదం ఉంటుంది. టైర్లలో సరైన గాలి ఒత్తిడి ఉండేలా చూసుకోవాలి. పాతబడిన లేదా పగుళ్లు వచ్చిన టైర్లను వెంటనే మార్చడం మంచిది. టైర్ల గ్రిప్ బాగుంటే బ్రేకింగ్ కూడా మెరుగ్గా పనిచేస్తుంది.

2. బ్రేకింగ్ చాలా ఇంపార్టెంట్..
వర్షంలో బ్రేకింగ్ దూరం సాధారణ రోజుల కంటే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి బ్రేక్ ప్యాడ్లు, బ్రేక్ ఆయిల్, బ్రేక్ సిస్టమ్‌ను సర్వీస్ చేయించుకోవాలి. అలాగే విండ్‌షీల్డ్ వైపర్లు సరిగా పనిచేయకపోతే ముందు కనిపించదు. వైపర్ బ్లేడ్లు పాడై ఉంటే వెంటనే మార్చాలి. వాషర్ ట్యాంకులో నీరు లేదా క్లీనింగ్ లిక్విడ్ నింపుకోవాలి.

3. హెడ్‌లైట్లు, టెయిల్‌లైట్లు తనిఖీ చేయాలి..
వర్షంలో పొగమంచు, చీకటి కారణంగా విజిబిలిటీ తగ్గుతుంది. అందువల్ల హెడ్‌లైట్లు, ఫాగ్ ల్యాంపులు, ఇండికేటర్లు, టెయిల్‌లైట్లు అన్నీ సక్రమంగా వెలుగుతున్నాయో ముందుగానే పరీక్షించాలి. అవసరమైతే లో-బీమ్ లైట్లను ఉపయోగించడం ఇతర వాహనదారులకు కూడా మీ వాహనం స్పష్టంగా కనిపించేందుకు సహాయపడుతుంది.

4. నీటితో నిండిన రోడ్లపై వెళ్లాల్సి వస్తే..
రోడ్డుపై నీరు నిల్వ ఉందని కనిపిస్తే దాని లోతు తెలియకపోతే ఆ మార్గంలో వెళ్లకపోవడం మంచిది. బలవంతంగా నీటిలోకి కారును తీసుకెళితే ఇంజిన్‌లో నీరు చేరి తీవ్ర నష్టం కలిగే అవకాశం ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకోవడం సురక్షితం.

5.సురక్షిత వేగంతోనే డ్రైవింగ్ చేయాలి
వర్షంలో వేగంగా కారు నడపడం ప్రమాదకరం. రోడ్లు జారుడుగా ఉండటంతో అకస్మాత్తుగా బ్రేక్ వేస్తే కారు అదుపు తప్పే అవకాశం ఉంది. అందువల్ల నెమ్మదిగా ప్రయాణించాలి. ముందు వెళ్తున్న వాహనానికి సాధారణం కంటే ఎక్కువ దూరం పాటించడం మంచిది.

6.ఎలక్ట్రికల్ వ్యవస్థపై..
బ్యాటరీ, వైరింగ్, ఫ్యూజ్‌లు, ఇగ్నిషన్ వ్యవస్థ సరిగా ఉన్నాయో లేదో చెక్ చేయించుకోవాలి. వర్షపు నీరు ఎలక్ట్రికల్ భాగాల్లోకి చేరితే స్టార్టింగ్ సమస్యలు రావచ్చు. కాబట్టి సర్వీస్ సమయంలో ఈ అంశాలను కూడా పరిశీలించడం అవసరం.

7.ఎయిర్ కండిషనింగ్‌…
వర్షంలో కారు అద్దాలపై ఆవిరి పేరుకుపోవడం సాధారణం. దీంతో డ్రైవర్‌కు బయట స్పష్టంగా కనిపించదు. ఈ సమస్యను నివారించేందుకు ఎయిర్ కండిషనర్ లేదా డిఫాగర్‌ను ఉపయోగించాలి. దీంతో అద్దాలు త్వరగా శుభ్రపడతాయి.

8.అత్యవసర సామగ్రి అవసరం..
వర్షాకాలంలో కారులో టార్చ్ లైట్, ఫస్ట్ ఎయిడ్ కిట్, జంప్ స్టార్టర్ కేబుల్స్, టోయింగ్ రోప్, గొడుగు, పవర్ బ్యాంక్, తాగునీరు వంటి అత్యవసర వస్తువులు ఉంచుకోవడం మంచిది. టైర్ పంక్చర్ అయితే ఉపయోగపడే స్టెప్నీ, జాక్, టూల్ కిట్ కూడా ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి.

ఒక్క పోస్ట్ తో 'కల్కి 2' హీరోయిన్ ఎవరో చెప్పేసిన ప్రభాస్.. ఈ ట్విస్ట్ అసలు ఊహించలేదు..

Kalki Part 2 Heroine
Kalki Part 2 Heroine

Kalki Part 2 Heroine: ‘కల్కి 2’ చిత్రం నుండి దీపికా పదుకొనే తప్పుకోవడం , ఈ సినిమాలో హీరోయిన్ గా నటించబోతున్నది ఎవ్బరు అనే అంశం పై సోషల్ మీడియాలో చాలా రోజుల నుండి చర్చలు నడుస్తున్న సంగతి తెలిసిందే. నిన్న మొన్నటి వరకు సాయి పల్లవి ని ఖరారు చేసినట్టు వార్తలు వచాయి. కానీ ఆ చిత్ర దర్శకుడు నాగ్ అశ్విన్ మాత్రం ‘ఏదైనా మేము అధికారికంగా చెప్పే వరకు నమ్మకండి , త్వరలోనే కల్కి 2 కి సంబంధించిన వివరాలను తెలియజేస్తాము , సెప్టెంబర్ నుండి నాన్ షెడ్యూల్స్ ఉంటాయి’ అంటూ చెప్పుకొచ్చారు. దీంతో సాయి పల్లవి ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించబోతుంది అనే వార్తలకు చెక్ పడింది. ఇక ఆ తర్వాత సోషల్ మీడియా లో ప్రధానంగా వినిపిస్తున్న పేరు అలియా భట్. బాలీవుడ్ లో ఈమెకు ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.

మన తెలుగు ఆడియన్స్ కి ఈమె #RRR చిత్రం ద్వారా పరిచయమైంది, తెలుగు ఆడియన్స్ లో సోషల్ మీడియా ని ఉపయోగించే యూత్ ఆడియన్స్ కి అలియా భట్ ఎప్పటి నుండో తెలుసు. అయితే ఈమె ఈ చిత్రం లో హీరోయిన్ గా నటించబోతుందని ఈమధ్య కాలంలో సోషల్ మీడియాలో ప్రచారమైన వార్త. మేకర్స్ ఇప్పటికే ఖరారు చేసారని , ఆమెపై పలు సన్నివేశాల చిత్రీకరణ కూడా జరిగిందంటూ చెప్పుకొచ్చారు. అయితే దీన్ని చాలా మంది అభిమానులు నమ్మలేదు , కానీ నేడు ప్రభాస్ తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో అలియా భట్ ప్రధాన పాత్ర పోషించిన ‘ఆల్ఫా’ మూవీ ట్రైలర్ ని అప్లోడ్ చేస్తూ మూవీ టీం కి ఆల్ టైం బెస్ట్ చెప్పారు. జులై 3 న విడుదల అవ్వబోతున్న ఈ చిత్రం ఘనవిజయం సాధించాలని ఈ సందర్భంగా ఆయన మనస్ఫూర్తిగా కోరుకున్నారు.

సాధారణంగా ప్రభాస్ తన మనసుకి బాగా దగ్గరైన వాళ్ళ సినిమాలు విడుదల అయ్యేటప్పుడు శుభాకాంక్షలు చెప్తుంటారు. లేకపోతే తనతో కలిసి పనిచేయబోయే వాళ్ళ సినిమాలు దగ్గర్లో ఉన్నప్పుడు సపోర్ట్ చేస్తుంటారు . ప్రభాస్ కి అలియా భట్ తో ఎలాంటి స్నేహం లేదు, కాబట్టి త్వరలో తనతో కలిసి పని చేయబోతున్న హీరోయిన్ కావడంతో , ఆయన ఇలా పోస్ట్ చేసి ఉండొచ్చని , కల్కి 2 లో హీరోయిన్ గా అలియా భట్ నటిస్తుందని ఈ ఒక్క ఘటన తో నిర్థారించుకోవచ్చని అంటున్నారు విశ్లేషకులు. రాబోయే రోజుల్లో వీటిల్లో ఎంత నిజముందో చూడాలి.

తమిళనాడులో విజయ్ నాయకత్వాన కొత్త కూటమి.. డీఎంకే ఒంటరి

TVK Vijay

TVK Vijay : బెంగాల్ లో బీజేపీ దెబ్బకు టీఎంసీ కకావికలం అయిపోయింది. మే 4 తర్వాత పరిస్థితి మారిపోయింది. ఇప్పుడు తమిళనాడులో టీవీకే దెబ్బకు డీఎంకే కకావికలం అవుతోంది. పరిణామాలు ఆ దిశగా సాగుతున్నాయి.

టీవీకే అధినేత, సీఎం విజయ్ ఒక మీటింగ్ పెట్టారు. నిన్నటిదాకా డీఎంకేతో అంటకాగిన పార్టీలు ఒక్కోటి ఈ మీటింగ్ కు వచ్చాయి. ఎండీఎంకే, ఐయూ ఎంఎల్, వీసీకే కావచ్చు. ఈ సెక్యూరల్ పార్టీలన్నీ డీఎంకే కూటమిలో ఉండేవి ఇప్పుడు ఇవన్నీ విచ్చిన్నమై టీవీకే ఆధ్వర్యంలో కొత్త కూటమి రూపుదిద్దుకోబోతోంది.

దీంతో మెల్లగా డీఎంకేను బలహీన పరచడానికి టీవీకే విజయ్ ఒక్కో అడుగు వేస్తున్నారు. తర్వాత కాంగ్రెస్ ను ఇందులో కలుపుకుంటారు.

తమిళనాడులో విజయ్ నాయకత్వాన కొత్త కూటమి.. డీఎంకే ఒంటరి.. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

'టాక్సిక్' చిత్రానికి కూడా సెన్సార్ కష్టాలు తప్పవా.. ? పాపం నిర్మాత పరిస్థితి ఏంటో..

Toxic Movie Censor Issues
Toxic Movie Censor Issues

Toxic Movie Censor Issues: సెన్సార్ బోర్డు ఈమధ్య కాలం లో చాలా కఠినంగా వ్యవరిస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా ఏ మాత్రం ఉన్నా సదరు సన్నివేశాలను తొలగించడంలో , లేదా ట్రిమ్ చేయడమో చేస్తుంది. అంతే కాకుండా కొన్ని సినిమాలకు UA సర్టిఫికేట్ రావాల్సి ఉంటే , కొన్ని యాక్షన్ షాట్స్ కారణంగా A సర్టిఫికేట్ ఇచ్చిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. ఇకపోతే తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ హీరో గా నటించిన చివరి చిత్రం ‘జన నాయగన్ ‘ కి సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వడానికే నిరాకరించారు. మూడు నెలల క్రితం వరకు ఇదంతా మాజీ సీఎం స్టాలిన్ కుట్ర అని అంతా అనుకునేవారు, కానీ ఇప్పుడు స్వయంగా ఆ చిత్రం లోని హీరోనే సీఎం అయ్యారు, అయినప్పటికీ ఈ చిత్రం సెన్సార్ సర్టిఫికేట్ కి నోచుకోలేదంటే పరిస్థితి ఒక్కసారి ఊహించుకోండి. ఈ చిత్రాన్ని KVN ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించింది.

ఇదే సంస్థ లో ‘టాక్సిక్’ చిత్రం కూడా తెరకెక్కింది. ‘KGF ‘ సిరీస్ తర్వాత రాకింగ్ స్టార్ యాష్ హీరో గా నటిస్తూ , సహనిర్మాతగా కూడా వ్యవహరించిన సినిమా ఇది. నేడు ఈ చిత్రానికి సంబంధించిన సరికొత్త టీజర్ ని విడుదల చేశారు మేకర్స్. ఈ టీజర్ ని చూసిన తర్వాత నెటిజెన్స్ లో కలిగిన అనుమానం ఒక్కటే , సెన్సార్ బోర్డు ఈ సినిమాకు అసలు సర్టిఫికేట్ ఇస్తుందా?, ఆ సన్నివేశాలేంటి బాబోయ్ , ఈ రేంజ్ బోల్డ్ ఉంటే కష్టమని అంటున్నారు. ముగ్గురు హీరోయిన్స్ తో రొమాన్స్ బోల్డ్ గానే ఉంది , యాక్షన్ అంతకంటే బోల్డ్ గా ఉంది. కచ్చితంగా సెన్సార్ సభ్యులు అనేక కట్స్ సూచిస్తారు. అలా వాళ్ళు చెప్పిన కట్స్ మొత్తం విధిస్తే , కనీసం 30 నిమిషాల ఫుటేజీ అయినా మిగులుతుందా అని అంటున్నారు నెటిజెన్స్.

ఈ చిత్రం లో నయనతార, కియారా అద్వానీ , రుక్మిణి వాసంత్, తార సుతారియా , హుమా ఖురేషి వంటి వారు ముఖ్య పాత్రలు పోషించారు. హీరోయిన్ కియారా అద్వానీ తో యాష్ రొమాన్స్ హద్దులు దాటినట్టు గా అందరికీ అనిపించింది. ఈ సన్నివేశాల్లో సెన్సార్ బోర్డు కట్ వేస్తుందో లేదో చూడాలి. ఒకవేళ యాష్ సెన్సార్ బోర్డు చెప్పిన కట్స్ ని అంగీకరించకపోతే , ఆయన ఇప్పట్లో ఈ సినిమాని విడుదల చేయరేమో, ఎందుకు KVN ప్రొడక్షన్ సినిమాలకే ఇలా జరుగుతోంది పాపం అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే ఈ చిత్రాన్ని ఆగస్టు 26 న ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లోనూ గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు.

భారత్ లో 45 డిగ్రీలు సాధారణమే.. కానీ ఐరోపాలో 41 డిగ్రీల ఉష్ణోగ్రత ప్రమాదం.. ఎందుకు..

Europe heatwave
Europe heatwave

Europe heatwave: ఐరోపా దేశాలను ఈ ఏడాది తీవ్ర వేసవి తీవ్రంగా వేధిస్తోంది. ఎప్పుడూ చల్లటి వాతావరణానికి అలవాటుపడిన ఈ దేశాలు ఇప్పుడు రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలతో అల్లాడుతున్నాయి. జర్మనీ, స్లోవేకియా, పోలండ్, ఫ్రాన్స్, రొమేనియా, సెర్బియా వంటి దేశాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్‌ను దాటుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో 41 నుంచి 43 డిగ్రీల వరకు నమోదవుతుండటంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి కూడా భయపడుతున్నారు. ఎండ తీవ్రత కారణంగా వందలాది మంది ప్రాణాలు కోల్పోతుండగా, ప్రభుత్వాలు అత్యవసర హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. అయితే మన భారతదేశంలో 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదైనా ఇలాంటి పరిస్థితి రాలేదు. కానీ ఆయా దేశాల్లో 41 డిగ్రీలకే ప్లాస్టిక్ కరిగిపోతుంది. కారణం ఏంటంటే?

ఈసారి ఐరోపా ఖండంలో నమోదవుతున్న ఉష్ణోగ్రతలు గతంలో ఎన్నడూ లేనంతగా ఉన్నాయి. స్లోవేకియాలో 40.5 డిగ్రీల సెల్సియస్, జర్మనీలో 41.7 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. బెల్‌గ్రేడ్, బుకారెస్ట్ వంటి నగరాల్లో 37 నుంచి 38 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రస్తుతం ఈ వేడి తరంగం బాల్కన్స్ ప్రాంతం నుంచి ఉక్రెయిన్ వైపు విస్తరిస్తున్నట్లు వాతావరణ నిపుణులు చెబుతున్నారు.

తీవ్ర ఎండలకు వడగాలులు తోడవడంతో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. జూన్ 21 నుంచి ఇప్పటివరకు ఫ్రాన్స్‌లోనే దాదాపు వెయ్యి మంది వరకు ఎండల ప్రభావంతో మరణించినట్లు స్థానిక నివేదికలు చెబుతున్నాయి. వృద్ధులు, చిన్నపిల్లలు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారిపై ఈ వేడి తీవ్ర ప్రభావం చూపుతోంది. ఆసుపత్రుల్లో హీట్ స్ట్రోక్, డీహైడ్రేషన్ కేసులు కూడా పెరుగుతున్నాయి.

భారతదేశంలో 43 డిగ్రీలు నమోదైనా సాధారణమే అనిపిస్తుంది. కానీ యూరప్‌లో అదే ఉష్ణోగ్రత ఎందుకు అంత ప్రమాదకరం? అనే సందేహం చాలా మందికి వస్తుంది. దీనికి ప్రధాన కారణం అక్కడి భౌగోళిక పరిస్థితులు, వాతావరణ స్వభావం, ప్రజల శారీరక అనుసరణ అని తెలుస్తోంది. భారత్ ఉష్ణమండల దేశం కావడంతో ప్రతి ఏడాది వేసవిలో అనేక ప్రాంతాల్లో 40 నుంచి 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. దీంతో ఇక్కడి ప్రజల శరీరాలు ఆ వాతావరణానికి సహజంగానే అలవాటుపడతాయి. కానీ ఐరోపా దేశాల్లో సాధారణంగా చల్లటి వాతావరణమే ఉంటుంది. అక్కడ ఇలాంటి తీవ్ర ఎండలు చాలా అరుదుగా వస్తాయి. అందువల్ల శరీరం ఒక్కసారిగా ఆ వేడిని తట్టుకోలేకపోతుంది.

మనిషి శరీరం తాను నివసించే వాతావరణానికి అనుగుణంగా మారుతుంది. ఉష్ణమండల ప్రాంతాల్లో నివసించే వారిలో చెమట త్వరగా పడుతుంది. ఆ చెమట ఆవిరై శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది. అలాగే రక్తప్రసరణ వ్యవస్థ కూడా వేడి పరిస్థితులకు అనుగుణంగా పనిచేస్తుంది. అయితే ఐరోపా ప్రజలు ఎక్కువగా చల్లటి వాతావరణంలో జీవిస్తారు. అందువల్ల వారి శరీరం తీవ్రమైన వేడిని తట్టుకునే సామర్థ్యాన్ని అంత వేగంగా అభివృద్ధి చేసుకోలేదు. ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పెరిగితే హీట్ స్ట్రెస్, హీట్ స్ట్రోక్ వంటి సమస్యలు త్వరగా తలెత్తుతాయి.

ఉష్ణోగ్రతతో పాటు గాలిలో తేమ కూడా మనకు వేడి ఎలా అనిపిస్తుందో నిర్ణయిస్తుంది. భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో వేసవిలో తేమ ఎక్కువగా ఉంటుంది. దీంతో చెమట త్వరగా ఆవిరికాక శరీరానికి మరింత వేడి అనిపిస్తుంది. అయినప్పటికీ, ఇక్కడి ప్రజలు ఆ పరిస్థితులకు అలవాటు పడిన కారణంగా వాటిని తట్టుకోగలుగుతారు. ఐరోపాలో ప్రాంతాన్ని బట్టి తేమ స్థాయిలు మారుతూ ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో వేడి, పొడి గాలులు కలిసి శరీరంలో నీటి శాతం వేగంగా తగ్గిస్తాయి. దీనివల్ల డీహైడ్రేషన్, హీట్ ఎగ్జాస్షన్ ప్రమాదం పెరుగుతుంది.

భారత్‌లో చాలా ఇళ్లలో సీలింగ్ ఫ్యాన్లు, కూలర్లు, ఎయిర్ కండీషనర్లు సాధారణంగా ఉంటాయి. అయితే యూరప్‌లో చాలామంది ఇళ్లను చలిని తట్టుకునే విధంగా నిర్మిస్తారు. గోడలు మందంగా ఉండటం, వేడిని బయటకు వెళ్లనివ్వని ఇన్సులేషన్ ఉండటం వల్ల వేసవిలో ఇళ్లలోనే వేడి ఎక్కువసేపు నిల్వ ఉంటుంది. చాలాచోట్ల ఎయిర్ కండీషనర్లు కూడా సాధారణంగా ఉండవు. దీంతో ప్రజలు తీవ్ర అసౌకర్యాన్ని ఎదుర్కొంటున్నారు.

పెద్ద నగరాల్లో కాంక్రీట్ భవనాలు, రోడ్లు, వాహనాల కాలుష్యం వల్ల ‘అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్’ ఏర్పడుతుంది. పగలు గ్రహించిన వేడిని భవనాలు, రోడ్లు రాత్రిపూట కూడా విడుదల చేస్తుండటంతో ఉష్ణోగ్రతలు తగ్గకుండా ఉంటాయి. దీంతో రాత్రివేళల్లో కూడా ప్రజలకు ఉపశమనం లభించడం లేదు.

శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న వాతావరణ మార్పుల ప్రభావంతోనే ఐరోపాలో వేడి తరంగాలు మరింత తీవ్రంగా, తరచుగా నమోదవుతున్నాయి. గతంలో అరుదుగా కనిపించిన 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు ఇప్పుడు ప్రతి వేసవిలో నమోదవుతున్నాయి. ఇది భవిష్యత్తులో మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

బ్రేకప్ వార్తలపై ఘాటుగా స్పందించిన హీరోయిన్ కృతి సనన్.. వైరల్ అవుతున్న ఫోటో..

Kriti Sanon breakup
Kriti Sanon breakup

Kriti Sanon breakup: పాన్ ఇండియా లెవెల్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకున్న యంగ్ హీరోయిన్స్ లో ఒకరు కృతి సనన్. ఈమె మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా నటించిన ‘1 నేనొక్కడినే’ చిత్రం తో వెండితెర అరంగేట్రం చేసింది. ఆ సినిమా ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ అయ్యినప్పటికీ కూడా ఈమె అవకాశాలు ఆగలేదు. ఈ చిత్రం తర్వాత ఆమె నాగ చైతన్య హీరో గా నటించిన ‘దోచేయ్’ అనే చిత్రం లో హీరోయిన్ గా నటించి మరో భారీ డిజాస్టర్ ని మూటగట్టుకుంది. ఇక ఆ తర్వాత ఈమె మరో తెలుగు సినిమాలో కనిపించలేదు. బాలీవుడ్ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి, ఎన్నో అద్భుతమైన సూపర్ హిట్ సినిమాల్లో నటిస్తూ, ఛాలెంజింగ్ రోల్స్ చేస్తూ , ఉత్తమ నటిగా నేషనల్ అవార్డు ని సైతం అందుకొని చరిత్ర సృష్టించింది.

రీసెంట్ గానే ఈమె బాలీవుడ్ లో ‘కాక్ టైల్ 2’ అనే చిత్రం లో నటించింది. షాహిద్ కపూర్, రష్మిక హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో కృతి సనన్ నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో కనిపించింది. కేవలం ఆమె కారణంగానే ఈ సినిమా కమర్షియల్ గా కూడా హిట్ అయ్యింది. ఇకపోతే కృతి సనన్ సోషల్ మీడియా నిత్యం యాక్టీవ్ గా ఉండే సెలబ్రిటీలలో ఒకరు అనే సంగతి మన అందరికీ తెలిసిందే. రీసెంట్ గా ఆమె అప్లోడ్ చేసిన ఒక ఫోటో, సోషల్ మీడియా లో ఇంతకాలం సాగిన రూమర్స్ కి చెక్ పెట్టేలా చేసింది. అసలు విషయంలోకి వెళ్తే కృతి సనన్ గత కొంతకాలంగా లండన్ కి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కబీర్ బాహియా తో ప్రేమాయణం నడుపుతోంది. అయితే రీసెంట్ గా వీళ్లిద్దరి మధ్య బ్రేకప్ జరిగింది అంటూ సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.

ఈ ప్రచారాలకు చెక్ పెడుతూ కృతి సనన్ తన ఇన్ స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ ద్వారా అందరికీ ఒక క్లారిటీ ఇచ్చేసింది. జూన్ నెలకు సంబంధించి ఆమె చేసిన పనులను ఒక ఫోటో ఆల్బుమ్ లాగా షేర్ చేసింది కృతి సనన్. ఆ ఫోటోలలో ఆమె తన బాయ్ ఫ్రెండ్ కబీర్ తో ఉన్న ఫోటో కూడా ఒకటి ఉంది. ఈ ఫోటో తో ఆమె మేమిద్దరం ఇప్పటికీ కలిసే ఉన్నాం , సోషల్ మీడియా లో జరిగే దుష్ప్రచారాలు నమ్మకండి అంటూ పరోక్షంగా తన అభిమానులకు చెప్తున్నట్టుగా అనిపించింది . సోషల్ మీడియా లో బాగా వైరల్ అయినటువంటి ఈ ఫోటోలను మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి.

 

View this post on Instagram

 

A post shared by Kriti Sanon (@kritisanon)

స్టడీ కలెక్షన్స్ తో దూసుకుపోతున్న 'మా ఇంటి బంగారం'.. 12వ రోజున ఎంత గ్రాస్ వచ్చిందంటే..

Maa Inti Bangaram Collections
Maa Inti Bangaram Collections

Maa Inti Bangaram Collections: స్టార్ హీరోలకు కూడా సాధ్యం అవ్వనటువంటి అరుదైన రికార్డ్స్ ని సమంత ‘మా ఇంటి బంగారం’ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద నెలకొల్పుతోంది. ఎంత పెద్ద స్టార్ హీరో సినిమాకు అయినా వర్కింగ్ డేస్ లో ఎంతో కొంత కలెక్షన్స్ డ్రాప్ అవ్వడం సహజం, అది పాజిటివ్ టాక్ వచ్చినా సరే. కానీ ముందు రోజు తో పోలిస్తే ఒక్క శాతం వసూళ్లు కూడా డ్రాప్ అవ్వకపోవడాన్ని ఎప్పుడైనా చూశామా?, కానీ ‘మా ఇంటి బంగారం’ చిత్రం ఆ అరుదైన ఘనత ని సాధించింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే ఈ చిత్రానికి 11 వ రోజున , అనగా సోమవారం రోజున తెలుగు రాష్ట్రాల నుండి 85 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. అదే విధంగా 12 వ రోజున కూడా ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల నుండి 85 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి అంటేనే అర్థం చేసుకోవచ్చు ఎలాంటి హిస్టారికల్ బ్లాక్ బస్టర్ అనేది.

ఓవరాల్ గా వరల్డ్ వైడ్ గా ఈ చిత్రానికి 11 వ రోజు కంటే 12 వ రోజునే ఎక్కువ వసూళ్లు వచ్చాయి. 11 వ రోజున 2 కోట్ల 20 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు రాగా, 12 వ రోజున 2 కోట్ల 55 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. మంగళవారం రోజున నేషనల్ మల్టీప్లెక్స్ థియేటర్స్ లో టిక్కెట్ రేట్స్ పై ఆఫర్లు ఉంటాయి. అందుకే ముందు రోజుతో పోలిస్తే ఆరోజున ఎక్కువ వసూళ్లు నమోదు అవుతుంటాయి. ఇక ప్రాంతాల వారీగా వచ్చిన వసూళ్లను ఒకసారి పరిశీలిస్తే నైజాం ప్రాంతం నుండి 13 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు రాగా, సీడెడ్ + ఆంధ్ర ప్రదేశ్ నుండి 9 కోట్ల 88 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.

ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల నుండి ఈ చిత్రానికి 22 కోట్ల 86 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు రాగా, 44 కోట్ల 15 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇక ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన వసూళ్లను ఒకసారి పరిశీలిస్తే తమిళనాడు నుండి 1 కోటి 82 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు రాగా, కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా 4 కోట్ల 85 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఇక ఓవర్సీస్ నుండి అయితే ఏకంగా 10 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తమగు 39 కోట్ల 58 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు , 80 కోట్ల 30 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్ళు వచ్చాయి. లాభాల సంఖ్య 27 కోట్ల 58 లక్షలకు చేరింది. భవిష్యత్తులో ఈ లెక్క ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుందో చూడాలి.

వేధింపులు తట్టుకోలేక కుర్రాడి తల పగలగొట్టిన హీరోయిన్ కాయదు లోహర్..

Kayadu Lohar
Kayadu Lohar

Kayadu Lohar: ఆడపిల్లలపై ఈవ్ టీజింగ్ చేయడం కుర్రాళ్లకు కొత్తేమి కాదు. సరదాగా ర్యాగింగ్ చేయడం వేరు, అసభ్యంగా ప్రవర్తిస్తూ , మానవ మృగం లాగా ప్రవర్తించడం వేరు, ఇలా ప్రవర్తించే ముందు మన ఇంట్లో కూడా ఆడవాళ్లు ఉన్నారు అనే విషయాన్ని ఎలా మర్చిపోతారో అసలు అర్థం అవ్వదు. ఇన్ని ప్రభుత్వాలు మారుతున్నాయి, ఇప్పటికీ కూడా ఈ ఈవ్ టీజింగ్ కేసులు తగ్గడం లేదు. కేవలం సామాన్య మహిళలపై మాత్రమే కాదు, సినీ సెలబ్రిటీలపైన కూడా ఇలాంటి ఈవ్ టీజింగ్ లు గతం లో జరిగాయట. అలాంటి సెలబ్రిటీస్ లో ఒకరు డ్రాగన్ హీరోయిన్ జయదు లోహర్. తనని ఈవ్ టీజింగ్ చేసిన కుర్రాడిపై ఈమె చేసిన పోరాటం చూసి ప్రతీ మహిళ ఎంత ధైర్యం గా ఉండాలో నేర్చుకోవాలి, మగవాళ్లకు తమ ఇష్టం లేకుండా ప్రవర్తిస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయో చూపించాలి.

రీసెంట్ గా ఆమె ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో 16 ఏళ్ళ వయస్సు లో తన జీవితం లో జరిగిన ఒక సంఘటన గురించి చెప్పుకొచ్చింది. ఆమె మాట్లాడుతూ ‘సరిగ్గా నాకు 16 ఏళ్ళు ఉన్నప్పుడు మా ఇంటికి దగ్గర్లోనే ఉన్న ఒక ట్యూషన్ కి వెళ్లేదాన్ని. ఆ సమయంలో మార్గం మధ్యలో ఒక కుర్రాడు నను అనుసరిస్తూ ఉండేవాడు. మొదట్లో పెద్దగా పట్టించుకునే దాన్ని కాదు. కానీ అతను హద్దులు దాటి నాతో చాలా అసభ్యంగా ప్రవర్తించారు. దీంతో నా కోపం కట్టలు తెంచుకుంది. ఒకరోజు అలా ప్రవర్తించడం తో పక్కనే ఒక పెద్ద రాయిని తీసుకొని అతని తల మీద వేశాను , దెబ్బ చాలా గట్టిగా తగిలింది , రక్తం బాగా కారింది. దీంతో భయపడిపోయిన ఆ కుర్రాడు అక్కడి నుండి పారిపోయాడు. నేను చూసేందుకు చాలా సాఫ్ట్ గానే కనిపిస్తాను , కానీ తప్పు జరిగితే మాత్రం నాకు తెలియకుండానే కోపం వచ్చేస్తుంది, ఆ సమయంలో ఏమి చేస్తానో నాకే తెలియదు. ఆరోజు ఆ కుర్రాడు అంతలా అసభ్యంగా ప్రవర్తించబట్టే నేను అతని తల పగలగొట్టాల్సి వచ్చింది, భవిష్యత్తులో కూడా ఇంతే , ఎవరైనా నా పట్ల అలా ప్రవర్తిస్తే ఇలాగే రియాక్ట్ అవుతాను’ అంటూ చెప్పుకొచ్చింది కాయదు లోహర్.

ఇకపోతే ప్రస్తుతం ఆమె టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ మూవీస్ లో ఒకటైన ‘ది ప్యారడైజ్’ చిత్రం లో హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ ఏడాది ఈమె పల్లి చట్టంబి, ఫంకీ వంటి చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది. ఇప్పుడు ‘ది ప్యారడైజ్’ తో పాటుగా, ఇదయం మురళి, ఇమ్మొర్తల్ వంటి క్రేజీ చిత్రాల్లో కూడా హీరోయిన్ గా నటిస్తోంది. ఇక తెలుగు లో కూడా ఈమె కాల్ షీట్స్ కోసం ప్రముఖ దర్శక నిర్మాతలు ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తున్నారు. రెండు సినిమాలకు కూడా రీసెంట్ గానే సంతకాలు చేసిందట. వాటి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

50 వేల మందిని ఆహ్వానిస్తున్న జపాన్.. ప్రపంచానికి శ్రమశక్తి కేంద్రంగా భారత్..

Japan Recruitment
Japan Recruitment

Japan Recruitment: ఇటీవల జరిగిన హర్యానాలో జరిగిన ఓ ఉన్నత స్థాయి సమావేశంలో జపాన్‌, హర్యానా ప్రభుత్వం మధ్య ఒక చారిత్రాత్మక ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం.. రాబోయే ఐదేళ్లలో హర్యానా నుంచి సుమారు 50,000 మంది యువతకు జపాన్‌లో ఉద్యోగ, శిక్షణ అవకాశాలను కల్పించనున్నారు. దీని గురించి పూర్తి వివరాల్లోకి వెళితె..

ప్రస్తుతం జపాన్‌లో సెమీకండక్టర్లు, ఆటోమొబైల్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT), మాన్యుఫ్యాక్చరింగ్ రంగాలకు చెందిన దాదాపు 80 శాతం కంపెనీలు తీవ్రమైన సాంకేతిక నిపుణుల కొరతను ఎదుర్కొంటున్నాయి. జపాన్‌లో వేగంగా పెరుగుతున్న వృద్ధుల జనాభా, తగ్గుతున్న యువత సంఖ్య కారణంగా అక్కడి పరిశ్రమలు నడపడం కష్టంగా మారింది. ఈ శూన్యతను భర్తీ చేయడానికి జపాన్ ప్రభుత్వం భారతదేశంలోని హర్యానా రాష్ట్రాన్ని తమ ప్రధాన భాగస్వామిగా ఎంచుకుంది. అక్కడి కంపెనీల అవసరాలకు తగ్గట్టుగా ఇక్కడి యువతకు శిక్షణ ఇచ్చి తరలించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు.

చండీగఢ్‌లో జరిగిన ఈ కీలక సమావేశంలో హర్యానా ప్రభుత్వ ఉన్నతాధికారులు, జపాన్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ ప్రాజెక్టును వేగవంతం చేయడానికి హర్యానా ప్రభుత్వం ప్రత్యేకంగా ‘హర్యానా సకురా వర్కింగ్ గ్రూప్’ జపాన్ కంపెనీల కోసం ఒక ప్రత్యేక హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటు చేసింది. హర్యానా నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా విశ్వవిద్యాలయాల విద్యార్థులను గుర్తించి, వారికి జపనీస్ భాషతో పాటు ప్రత్యేక సాంకేతిక కోర్సులలో శిక్షణ ఇవ్వనున్నారు. అంతేకాకుండా, గురుగ్రామ్‌లో జపాన్‌కు చెందిన ‘ఫుకుయోకా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ’ క్యాంపస్‌ను ఏర్పాటు చేయాలని కూడా ప్రతిపాదించారు.

ఈ నియామకాల వెనుక ఉన్న అంతర్జాతీయ ఆర్థిక కోణాన్ని పరిశీలిస్తే, భారతదేశం ప్రపంచానికి అత్యంత తక్కువ వేతనాలతో కూడిన నాణ్యమైన శ్రామిక శక్తిని అందించే దేశంగా ఎదుగుతోందనేది స్పష్టమవుతోంది. అభివృద్ధి చెందిన పాశ్చాత్య దేశాలు లేదా జపాన్ వంటి దేశాల స్థానిక కార్మికులతో పోలిస్తే, భారతీయ వలస కార్మికులకు చెల్లించే వేతనాలు ఆయా దేశాల కంపెనీలకు చాలా పొదుపుగా మారుతున్నాయి. నైపుణ్యం ఉండి, తక్కువ వేతనాలకైనా పనిచేసేందుకు సిద్ధంగా ఉండే కోట్లాది మంది యువత భారత్‌లో అందుబాటులో ఉండటం అంతర్జాతీయ సంస్థలను ఆకర్షిస్తోంది.

దీని వల్ల దేశంలో నిరుద్యోగ సమస్య వేధిస్తున్న తరుణంలో, ఇటువంటి అంతర్జాతీయ ఒప్పందాలు యువతకు గ్లోబల్ ఎక్స్‌పోజర్‌ను ఇస్తాయి. వారు విదేశాల నుండి పంపే డబ్బు ద్వారా దేశీయ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. మరోవైపు భారతదేశం కేవలం ‘చౌక కార్మికులను సరఫరా చేసే దేశం’ అనే ముద్రను మూటగట్టుకునే ప్రమాదం ఉంది. దేశంలోనే అత్యున్నత సాంకేతిక రంగాలు మరియు పరిశ్రమలు వేగంగా వృద్ధి చెందకపోతే, మన మేధోసంపత్తి అంతా తక్కువ ధరకే పరాయి దేశాల ఆర్థిక వ్యవస్థలను నిర్మించడానికి ఉపయోగపడుతుంది.

ప్రస్తుతానికి, జపాన్‌తో కుదిరిన ఈ 50,000 ఉద్యోగాల ఒప్పందం హర్యానా యువతకు ఒక గొప్ప అవకాశంగా మారినప్పటికీ, భవిష్యత్తులో భారత్ కేవలం చౌక శ్రామిక శక్తి కేంద్రంగానే మిగిలిపోకుండా, సొంతంగా గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్‌గా ఎదగాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఏపీకి తీపికబురు.. ఇక అన్నీ మంచి రోజులే

AP-Rain-Alert
AP-Rain-Alert

AP Rain Alert: ఏపీకి చల్లటి కబురు అందించింది భారత వాతావరణ శాఖ. జూలై మొదటి వారంలో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని చెప్పింది. దీని ప్రభావం ఏపీతోపాటు ఒడిస్సా పై అధికంగా ఉంటుందని తెలిపింది. రానున్న రోజుల్లో వర్షాలు కురిసేందుకు అనుకూల పరిస్థితులు ఏర్పడనున్నాయి. దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాల మందగమనం కనిపిస్తోంది. వాటి రాక ఆలస్యం కావడంతో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతోంది. దేశభ్యాప్తంగా 12 రాష్ట్రాలపై ఎప్పటికీ దీని ప్రభావం పడింది. 315 జిల్లాల్లో సగటు కంటే 40 మూడు శాతం లోటు వర్షం కురిసింది. జూలై రెండవ తేదీ నాటికి పరిస్థితుల్లో ఎటువంటి మార్పు ఉండదని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ పరిస్థితుల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని తెలియడం ఉపశమనం కలిగించే విషయం.

ఉపరితల ఆవర్తనం..
బంగాళాఖాతం వాయువ్య ప్రాంతంలో జూలై రెండు నాటికి ఉపరితల ఆవర్తనం బలపడనుంది. అది మూడు, నాలుగు తేదీ నాటికి మరింత బలపడి బంగాళాఖాతంలో.. ఉత్తర ప్రాంతం వైపు కదులుతుంది. క్రమంగా అల్పపీడనంగా ఏర్పడే అవకాశం ఉంది. దీని ప్రభావం తీరప్రాంత రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్, ఒడిస్సా, ఏపీ తమిళనాడు తో పాటు తెలంగాణ పై అధిక ప్రభావం చూపి ఛాన్స్ ఉంది. నిజంగా ఇది శుభవార్త. జూన్లో నైరుతీ రుతుపవనాల ప్రభావంతో ఆశించిన స్థాయిలో వర్షాలు పడలేదు. ఆలస్యంగా విస్తరించిన రుతుపవనాలు పెద్దగా ప్రభావం చూపలేదు. ఇప్పుడు ఈ ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వర్షాలు పడతాయని తెలుస్తుండడం ఆనందాన్ని ఇచ్చే విషయం. ఈరోజు శ్రీకాకుళం, విజయనగరం తో పాటు ఉత్తర కోస్తా తీర జిల్లాల్లో వర్షాలు పడవచ్చని చెప్పింది వాతావరణ శాఖ. ఉభయగోదావరి తో పాటు కోస్తాంధ్ర జిల్లాలకు సైతం వర్ష సూచన ఉన్నట్లు తెలిపింది.

ఇప్పటికీ వేడి వాతావరణం..
ఇంకా రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో వేసవి వాతావరణం కొనసాగుతోంది. ఖరీఫ్ పై ఆశలు సన్నగిల్లుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో వర్షాలు పడతాయని చెబుతుండడంతో ఆశలు చిగురిస్తున్నాయి. సాధారణంగా బంగాళాఖాతంలో జూన్ నుంచి నవంబరు వరకు ఉపరితల ఆవర్తనాలు, అల్పపీడనాలు ఏర్పడుతుంటాయి. ఒకవైపు ఎల్ నినో ప్రభావంతో వర్షాలు పడవని అంతా భావిస్తున్న తరుణంలో.. కనీసం ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో వర్షాలు పడితే గట్టెక్కవచ్చు అనే ఆలోచనలో రైతాంగం ఉంది. ఈ పరిస్థితుల్లో భారత వాతావరణ శాఖ వర్షాలపై కీలక అప్డేట్ ఇవ్వడం పై ఆశలు చిగురిస్తున్నాయి.

పాన్ కార్డులో ఉన్న 10 అంకెల అర్థం ఏంటో తెలుసా..

PAN Card
PAN Card

PAN card: ప్రస్తుత కాలంలో పాన్ (PAN – Permanent Account Number) కార్డు కేవలం ఒక గుర్తింపు కార్డు మాత్రమే కాదు. భారతదేశంలో ఆర్థిక లావాదేవీలకు ఇది అత్యంత కీలకమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ (ITR) దాఖలు చేయడం నుంచి బ్యాంకు ఖాతా ప్రారంభించడం, స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టడం, మ్యూచువల్ ఫండ్స్ కొనుగోలు చేయడం, భారీ మొత్తంలో ఆస్తులు కొనుగోలు చేయడం వరకు అనేక సందర్భాల్లో పాన్ కార్డు తప్పనిసరిగా అవసరం అవుతోంది. అయితే చాలా మంది ప్రతిరోజూ పాన్ కార్డును ఉపయోగిస్తున్నప్పటికీ, దానిపై ఉండే 10 అంకెల నంబర్ వెనుక ఒక ప్రత్యేకమైన కోడ్ ఉంటుందని తెలియదు. దాని అర్థం ఏంటో తెలుసుకుందాం..

పాన్ నంబర్ మొత్తం 10 అక్షరాలతో ఉంటుంది. ఇందులో మొదటి ఐదు ఇంగ్లీష్ అక్షరాలు, తర్వాత నాలుగు సంఖ్యలు , చివరిగా మరో ఒక ఇంగ్లీష్ అక్షరం ఉంటుంది. ఉదాహరణకు: ABCDE1234F. ఈ 10 అక్షరాల్లోని ప్రతి భాగానికి ప్రత్యేకమైన అర్థం ఉంటుంది.

మొదటి మూడు అక్షరాల అర్థం ఏమిటి?
పాన్ నంబర్‌లోని మొదటి మూడు అక్షరాలు (AAA నుంచి ZZZ వరకు) ఆదాయపు పన్ను శాఖ రూపొందించే ఆల్ఫాబెటికల్ సిరీస్‌లో భాగంగా ఉంటాయి. ఇవి వ్యక్తిగత వివరాలను సూచించవు. పాన్ నంబర్లను ప్రత్యేకంగా గుర్తించేందుకు ఈ సిరీస్‌ను ఉపయోగిస్తారు.

నాలుగో అక్షరం..
పాన్ నంబర్‌లో అత్యంత ముఖ్యమైనది నాలుగో అక్షరం. ఇది పాన్ హోల్డర్ ఏ కేటగిరీకి చెందినవారో తెలియజేస్తుంది.
కొన్ని ముఖ్యమైన కోడ్లు ఇవి:
P – Individual (వ్యక్తిగత పాన్ కార్డు)
C – Company (కంపెనీ)
H – Hindu Undivided Family (HUF)
F – Firm (భాగస్వామ్య సంస్థ)
A – Association of Persons (AOP)
T – Trust
B – Body of Individuals (BOI)
L – Local Authority
J – Artificial Juridical Person
G – Government
సాధారణంగా వ్యక్తులకు జారీ చేసే పాన్ కార్డులో నాలుగో అక్షరం Pగా ఉంటుంది.

ఐదో అక్షరం ఎందుకు ముఖ్యమైనది?
పాన్ నంబర్‌లోని ఐదో అక్షరం వ్యక్తిగత పాన్ కార్డు విషయంలో చాలా ప్రత్యేకమైనది. ఇది పాన్ హోల్డర్ ఇంటిపేరులో మొదటి అక్షరాన్ని సూచిస్తుంది. ఉదాహరణకు ఒకరి ఇంటిపేరు Reddy అయితే ఐదో అక్షరం Rగా ఉంటుంది. అయితే కంపెనీలు, ట్రస్టులు లేదా ఇతర సంస్థల విషయంలో మాత్రం ఆ సంస్థ పేరులోని మొదటి అక్షరాన్ని ఈ స్థానంలో ఉపయోగిస్తారు.

మధ్యలో ఉండే నాలుగు సంఖ్యలు?
పాన్ నంబర్‌లోని 6వ నుంచి 9వ స్థానాల్లో ఉండే నాలుగు అంకెలు 0001 నుంచి 9999 వరకు ఉండే ప్రత్యేక సీరియల్ నంబర్. పాన్ కార్డు జారీ సమయంలో ప్రతి దరఖాస్తుదారునికి ప్రత్యేక గుర్తింపుగా ఈ సంఖ్యను కేటాయిస్తారు. ఈ సంఖ్య ద్వారా ఒక పాన్ మరొకదానితో ఎప్పటికీ ఒకేలా ఉండదు.

చివరి అక్షరం ఎలా నిర్ణయిస్తారు?
పాన్ నంబర్‌లోని చివరి (10వ) అక్షరం ఒక చెక్ డిజిట్. ప్రత్యేకమైన ఆల్గోరిథమ్ ఆధారంగా దీనిని రూపొందిస్తారు. దీని ప్రధాన ఉద్దేశం పాన్ నంబర్‌లో ఎలాంటి పొరపాట్లు లేకుండా ఉండేలా ధృవీకరించడం. దీంతో నకిలీ లేదా తప్పుగా నమోదు చేసిన పాన్ నంబర్లను గుర్తించడం సులభమవుతుంది.

పాన్ నంబర్‌ను ఎందుకు మార్చకూడదు?
ఒకసారి పాన్ నంబర్ జారీ అయిన తర్వాత అది జీవితాంతం అదే ఉంటుంది. చిరునామా, మొబైల్ నంబర్, ఫోటో లేదా ఇతర వివరాలు మారినా పాన్ నంబర్ మాత్రం మారదు. అందుకే దీనిని శాశ్వత ఖాతా సంఖ్య అని పిలుస్తారు.

భారత ఆదాయపు పన్ను నిబంధనల ప్రకారం ఒక వ్యక్తికి ఒకే ఒక్క పాన్ కార్డు మాత్రమే ఉండాలి. ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డులు కలిగి ఉండడం చట్టవిరుద్ధం. అలాంటి సందర్భాల్లో జరిమానా విధించే అవకాశం ఉంది. అదనంగా ఉన్న పాన్ కార్డులను స్వచ్ఛందంగా సరెండర్ చేయాలని ఆదాయపు పన్ను శాఖ సూచిస్తుంది.

ప్రైవేటు సంస్థలకు ఉచితంగా ప్రభుత్వ భూమినా? నిజమెంత?

AP land allotment
AP land allotment

AP land allotment: ప్రభుత్వ భూములకు సంబంధించి కూటమి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. వివిధ ప్రాజెక్టులకు గాను కేటాయించే భూములను విక్రయించేందుకు, రిజిస్ట్రేషన్లు జరిపేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇకనుంచి ఆ భూమిపై పూర్తి హక్కులు సంబంధిత యాజమాన్యాల కేనని తేల్చి చెప్పింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ మంగళవారం జీవో జారీ చేశారు. మార్కెట్ ధరకు తీసుకున్న భూములను తమ పేరుతో రిజిస్ట్రేషన్ చేయాలని.. తమకు పూర్తి హక్కులు కల్పించాలని కంపెనీలు సుదీర్ఘకాలంగా కోరుతూ వస్తున్నాయి. ఎట్టకేలకు దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా పర్యాటక ప్రాజెక్టుల విషయంలో.. టూరిజం కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వం భూములు కేటాయిస్తోంది. ప్రాజెక్టు డెవలపర్గా తమకు ఇస్తున్న భూములపై పూర్తిగా హక్కులు ఉండాలని కంపెనీలు పట్టుబడుతున్నాయి. దీనిపై నిర్ణయం తీసుకోవాలని ఏపీటీడీసీ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపింది. ఈ మేరకు సానుకూల నిర్ణయం తీసుకోవడం విశేషం.

భూముల కేటాయింపు అలా..
ఏ ప్రభుత్వంలోనైనా పరిశ్రమల ఏర్పాటుతో ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయి. పన్నుల రూపంలో ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది. ఈ లెక్క తోనే ప్రభుత్వాలు భారీ ఎత్తున సాధారణ ధరకు ప్రైవేటు కంపెనీలకు భూములను కేటాయిస్తాయి. అయితే చౌకగా భూములు తీసుకున్న వారిలో కొందరు వాటిని బ్యాంకులో తనకా పెట్టి రుణాలు తీసుకుంటున్నారు. పరిశ్రమలు ఏర్పాటు చేయడం లేదు. అయితే భూయాజమాన్య హక్కులు ప్రభుత్వ పరిధిలోనే ఉన్నప్పుడే ఆ పరిస్థితి ఉంటే.. ఇప్పుడు అదే కంపెనీలకు సేల్ చేసి.. హక్కులు బదలాయిస్తే ఎలా ఉంటుందోనన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. దీనిపై అనేక రకాల ఆరోపణలు వస్తున్నాయి.

ఆ చట్టానికి సవరణ..
ఇప్పటిదాకా ప్రభుత్వ భూముల కేటాయింపులు ఒక ప్రక్రియ కొనసాగేది. ఆయా కంపెనీల స్వభావం, పెట్టి పెట్టుబడి, ఉపాధి కల్పన స్థాయిని బట్టి ఉచితంగా, రాయితీ ధరకు, కనీస విలువ ఆధారంగా మార్కెట్ విలువకు భూములు కేటాయిస్తూ వస్తున్నారు. 2012లో ఉమ్మడి రాష్ట్రంలో విడుదలైన భూ కేటాయింపు పాలసీ ప్రకారం కేటాయింపులు జరుగుతూ వస్తున్నాయి. కంపెనీలకు మార్కెట్ ధర ప్రకారం భూములు కేటాయించినా.. ఉచితంగా అందించినా.. యాజమాన్య హక్కులు మాత్రం ప్రభుత్వం వద్దనే ఉంటున్నాయి. వాటిని నిషేధిత జాబితా 22 (a) లో ఉంచేవారు. అంటే ప్రభుత్వం నుంచి వచ్చిన భూములను ఇతరులకు విక్రయించుకునే అవకాశం ఉండదు. ఒకవేళ కంపెనీలు ఆ భూములను తనకా పెట్టి రుణాలు తీసుకోవాలన్న ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. అయితే ఇప్పుడు పర్యాటక ప్రాజెక్టులు శరవేగంగా అభివృద్ధి చెందాలంటే ఈ నిబంధనను సడలించి ప్రభుత్వం వాటికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే దీనిపై వ్యతిరేక ప్రచారం మొదలైంది. మరి ప్రభుత్వం వెనక్కి తగ్గుతుందా? అలానే ముందుకు వెళుతుందా అన్నది చూడాలి.

ఆగస్టు లో అసలు సినిమా పోటీ మొదలవ్వనుందా..?

August movie releases
August movie releases

August movie releases: తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోల సినిమాల మధ్య ఎప్పుడు పోటీ వాతావరణం ఉంటుంది. హీరోలు వాళ్ళకంటూ ఒక స్టాండర్డ్ ను ఏర్పాటు చేసుకున్నప్పటికి చిన్న పెద్దా అనే తేడా లేకుండా కొన్ని మూవీస్ మధ్య ఎప్పటికప్పుడు పోటీ ఉంటుంది… ఈ మధ్యకాలంలో అసలు సినిమాల మధ్య పెద్దగా పోటీలు లేకుండా పోయాయి. ఇక వచ్చే నెల ఆగస్టులో పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. సూర్య హీరోగా వెంకి అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘విశ్వనాధ్ అండ్ సన్స్’ సినిమా ఆగస్టు 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సినిమా వచ్చిన వారం రోజులకే రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వం ‘ఇరుముడి’ సినిమా సైతం ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం కానుంది. ఈ రెండు సినిమాలు వచ్చిన వారం రోజులకి టాక్సిక్ సినిమా సైతం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక వీటితో పాటుగా మరికొన్ని సినిమాలు కూడా రిలీజ్ కి రెడీ అవుతున్నట్టుగా తెలుస్తుంది… అయితే ఆగస్టు నెలలో ఏ సినిమాలు విజయాన్ని సాధించబోతున్నాయి.

ఇంకా ఏ సినిమాలు రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేసుకోబోతున్నాయి అనేది తెలియాల్సి ఉంది. ఇక ఆగస్టు నెలకి మరో నెల రోజుల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో ఇప్పటికే కొన్ని పెద్ద సినిమాలను సైతం ఆగస్టు లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సమ్మర్ లో పెద్ద సినిమాలు రిలీజ్ కాలేదు కాబట్టి ఆగస్టులో అయిన మీడియం రేంజ్ బడ్జెట్ సినిమాలు వచ్చి ప్రేక్షకులను అలరిస్తే బాగుంటుంది.

జూన్ నెలలో రిలీజ్ అయిన పెద్ది సినిమా పాజిటివ్ టాక్ ను సంపాదించుకున్న కూడా భారీ కలెక్షన్స్ ను కొల్లగొట్టలేక పోయింది. కాబట్టి ఇప్పుడు ఇండస్ట్రీ సైతం భారీగా నష్టాల్లో ఉంది. ఒక పెద్ద సినిమా వచ్చి 1000 కోట్లకు పైన కలెక్షన్స్ ని రాబడితేనే ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తం మళ్లీ లాభాల బాట పట్టే అవకాశాలైతే ఉన్నాయి…

అఖిల్ కి లెనిన్ మూవీ తో భారీ సక్సెస్ రాబోతోంది..?

Lenin First Day Collections
Lenin First Day Collections

Akhil Lenin movie: అఖిల్ హీరోగా తెరకెక్కిన చాలా సినిమాలు భారీ ఫ్లాప్ లను మూటగట్టుకుంటున్నాయి. ఈ మధ్యకాలంలో ఆయన నుంచి వచ్చిన సినిమాలేవి ప్రేక్షకులకు ఆశించిన మేరకు విజయాన్ని అందించలేకపోయాయి. ఇక ఇలాంటి క్రమంలోనే ఈనెల 10వ తేదీన ‘లెనిన్’ సినిమాతో మరోసారి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు. ఈ సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు. ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణ రాబట్టుకుంటాడా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక నిన్న రిలీజైన ట్రైలర్ ఓకే అనిపించినప్పటికి అఖిల్ ఈ సినిమాలో ఎలాంటి పర్ఫామెన్స్ ఇవ్వబోతున్నాడు అనేది ఇప్పుడు చర్చనియంశంగా మారింది. ఈ ట్రైలర్ ని కనక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇందులో ఒక రా అండ్ రస్ట్రీక్ క్యారెక్టర్ లో అఖిల్ కనిపించబోతున్నాడు. అఖిల్ చాక్లెట్ బాయ్ లా ఉంటాడు.

కాబట్టి అతనికి ఈ సినిమా ఏమాత్రం సెట్ అయింది. ట్రైలర్లో అతని నటన అలరించినప్పటికి సినిమాలో ఏ మాత్రం ఎఫెక్టివ్ గా నటించాడు అనేది తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే.

ఈ సినిమాతోనే అతనికి భారీ సక్సెస్ దక్కితే ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతాడు. లేకపోతే మాత్రం ఆయన ఇబ్బందులను ఎదుర్కొనే పరిస్థితులు రావచ్చు. ఆల్మోస్ట్ ఇప్పుడు ఇండస్ట్రీ నుంచి ఫేడ్ అవుట్ దశకు దగ్గరలో ఉన్నాడు. ఈ సినిమాతో అతను ఊపిరి పోసుకుంటాడా? లేదంటే ఈ మూవీతో మరోసారి ఫ్లాప్ ని మూట గట్టుకుంటాడా? అనేది తెలియాలంటే మాత్రం జులై 10 వరకు వెయిట్ చేయాల్సిందే…

ఇప్పటివరకు ఆయన అనుకున్న సక్సెస్ ని సాధించలేకపోయాడు. దాంతో నాగార్జున సైతం అఖిల్ విషయంలో కొంచెం స్పెషల్ కేర్ తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా లెనిన్ సినిమా విషయంలో ఆయన చాలావరకు అంచనాలు పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది… ఈ సినిమా అనుకున్న రేంజ్ లో సక్సెస్ ను సాధిస్తుందా? ప్రేక్షకులను అలరిస్తుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…

విశాఖ-మావిగన్.. ఎటు తేల్చుకోలేకపోతున్న జగన్

Jagan Visakhapatnam
Jagan Visakhapatnam

Jagan Visakhapatnam: వైయస్ జగన్మోహన్ రెడ్డి వైఖరిలో అస్సలు మార్పు రావడం లేదు. ముఖ్యంగా రాజధానుల విషయంలో ఆయన ఇంకా గందరగోళం లోనే ఉన్నారు. తొలుత అమరావతి రాజధాని కి జై కొట్టిన జగన్ తర్వాత మూడు రాజధానులు అన్నారు. మొన్నటికి మొన్న మావిగన్ అంటూ కొత్త ప్రతిపాదన చేశారు. ఇప్పుడు తాజాగా మీడియా ముందుకు వచ్చి విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్కు తాము కట్టుబడి ఉన్నామని చెబుతున్నారు. అసలు ఇంతటి గందరగోళం ఎందుకని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికి అమరావతి రాజధాని విషయంలో వ్యతిరేకముద్ర వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పై పడిందని.. ముఖ్యంగా విద్యాధికులతో పాటు తటస్తులు దీనిని తప్పుపడుతూ ఓట్ల రూపంలో తీర్పు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అయినా ఎందుకో జగన్మోహన్ రెడ్డి వైఖరిలో మార్పు రాకపోవడాన్ని ఎక్కువమంది తప్పు పడుతున్నారు.

వచ్చే ఎన్నికల్లో అదే..
తాడేపల్లి లో మీడియా సమావేశంలో మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి. విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కు కట్టుబడి ఉన్నామని చెబుతూనే.. మావిగన్ అనేది తమ పార్టీ అజెండా అని.. వచ్చే ఎన్నికల్లో అమరావతి వర్సెస్ మావిగన్ అన్న అజెండాతో ముందుకు వెళ్తామని తేల్చి చెప్పారు. అదే సమయంలో అమరావతి రైతుల పట్ల తమకు వ్యతిరేక భావన లేదని.. వారికి న్యాయం చేయాలన్నదే తమ పార్టీ లక్ష్యం అని చెప్పుకొచ్చారు. అయితే జగన్మోహన్ రెడ్డి వైఖరి చూస్తుంటే అపరిచితుడు గుర్తుకొస్తున్నారు. ఏకకాలంలో మూడు మాటలు చెబుతున్నారు. అమరావతి రైతులంటే తనకు కోపం లేదని చెబుతూనే వారి పట్ల సానుభూతి చూపుతున్నారు. విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అంటూ మూడు రాజధానుల మాట మళ్లీ తెరపైకి తెచ్చారు. వచ్చే ఎన్నికల్లో అమరావతికి వ్యతిరేకంగా మావిగన్ పేరుతో ప్రజల్లోకి వెళ్తామని చెబుతున్నారు. అయితే ఏం మాట్లాడుతున్నారో తెలియక అక్కడ ఉన్న మీడియా ప్రతినిధులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

గుణపాఠాలు నేర్చుకొని జగన్..
ఏదైనా ప్రతికూల అంశాలు ఫలితాలపై ప్రభావం చూపినప్పుడు వాటి నుంచి గుణపాఠాలు నేర్చుకోవాలి. కానీ ఎందుకో ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి వెనుక పడ్డారు. అమరావతిని నిర్వీర్యం చేసి అక్కడి రైతులకు వ్యతిరేకంగా మారిపోయారు. గుంటూరు తో పాటు కృష్ణాజిల్లాలో రాజకీయంగా నష్టపోయారు. విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని జగన్మోహన్ రెడ్డి చెబితే ఉత్తరాంధ్ర ప్రజలు కనీస స్థాయిలో కూడా ఆహ్వానించలేదు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ఆదరించలేదు. ఇప్పుడు కొత్తగా మావిగన్ అంటూ చెబుతున్న మాటకు అటు విజయవాడ ప్రజలు కానీ.. అటు మచిలీపట్నం ప్రజలు కానీ.. మరోవైపు గుంటూరు ప్రజలు కానీ పెద్దగా స్పందించడం లేదు.. అయితే జగన్ ఈరోజు ప్రెస్మీట్లో విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అంటూనే.. మావిగన్ ప్రస్తావన చేయడం మాత్రం ఒక గందరగోళంగా మారింది.

ఆ రికార్డ్ బాలయ్య తర్వాత నాని కే సాధ్యమైందా..?

Balakrishna Nani
Balakrishna Nani

Balakrishna Nani: తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పంతుల తొక్కుతూ ముందుకు దూసుకెళ్తుంది. ఒకప్పుడు చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున లాంటి స్టార్ హీరోలు సైతం తమదైన రీతిలో సత్తా చాటుకుంటూ సినిమాలను చేశారు. వీళ్లను ఇండస్ట్రీకి నాలుగు పిల్లర్లుగా భావించేవారు. ఇక అప్పటినుంచి ఇప్పటివరకు వాళ్ల నుంచి వస్తున్న సినిమాలు ప్రేక్షకులను విశేషంగా అలరిస్తున్నాయి. ముఖ్యంగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాలకు సైతం వీళ్ళను రిఫర్ చేస్తూ ఉండడం విశేషం…ప్రస్తుతం సీనియర్ హీరోలుగా కొనసాగుతున్న వీళ్ళు అవకాశం దొరికినప్పుడు మాత్రం పెను సంచలనాలను క్రియేట్ చేస్తున్నారు.

టైర్ వన్ హీరోలందరు పాన్ ఇండియా నేపథ్యంలో ముందుకు దూసుకెళ్తుంటే వీళ్ళు మాత్రం తెలుగు సినిమా ఇండస్ట్రీకే పరిమితం అవుతున్నారు. ఇక ఏది ఏమైనా కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీలో పెను సంచలనాలను క్రియేట్ చేస్తున్న ఈ హీరోలందరూ వండర్స్ ని చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇక బాలయ్య బాబు సైతం డిఫరెంట్ సినిమాలను చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుండటం విశేషం…

ఈ జనరేషన్ లో ఉన్న కుర్ర హీరోలలో నాని సైతం విశేషంగా అలరిస్తున్నాడు. ఇప్పటివరకు సీనియర్ హీరోలకు టైర్ వన్ హీరోలకు సాధ్యం కానీ ఒక రికార్డుని బాలయ్య బాబు క్రియేట్ చేయగా ఈ జనరేషన్ లో ఉన్న హీరోల్లో నాని దానిని రీ క్రియేట్ చేయడం విశేషం…ఇంతకీ ఆ రికార్డు ఏంటంటే బాలయ్య బాబు హీరోగా చేసిన బంగారు బుల్లోడు, నిప్పు రవ్వ రెండు సినిమాలు కూడా 1993 సెప్టెంబర్ 3 వ తేదీన రిలీజ్ అయ్యాయి. అప్పుడు ఇండస్ట్రీ లో ఉన్న నలుగురు హీరోల్లో ఎవరు కూడా ఒకే తేదీన రెండు సినిమాలను రిలీజ్ చేయలేకపోయారు.

ఇక వీళ్ళ తర్వాత జనరేషన్ లో వచ్చిన హీరోలు సైతం అలాంటి ఫీట్ ని సాధించలేకపోయారు. మొత్తానికైతే నాని హీరోగా చేసిన ఎవడే సుబ్రమణ్యం, జెండా పై కపిరాజు సినిమాలు ఒకేరోజు రిలీజ్ అవ్వడం ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించింది. ఇక ఏది ఏమైనా కూడా బాలయ్య తర్వాత ఆ రికార్డు ను క్రియేట్ చేసిన హీరో నాని నే కావడం విశేషం…