Dalit Christian Sankharava Sabha : దళిత క్రైస్తవ శంఖారావ సభ.. ఏలూరులో జరిగింది. సభ ఉద్దేశం వేరు.. అక్కడ జరిగింది వేరు. దళిత క్రైస్తవులకు ఎస్సీ రిజర్వేషన్ కల్పించాలన్నది ఈ సభ ప్రధాన ఉద్దేశం. ఈ సమావేశంలో పవన్ కళ్యాణ్ ను తిట్టడం.. జడ శ్రవణ్ కుమార్, ప్రశ్న రావణ్ లు సభ్య సమాజం తలదించుకునేలా మాట్లాడారు. ఇదేనా రిజర్వేషన్లు సాధించే మార్గం.. రిజర్వేషన్లు సాధించాలంటే జనాలను ఎడ్యూకేట్ చేయాలి. ఎలా దళిత క్రైస్తవులకు రిజర్వేషన్లు సాధించాలో ప్లాన్ చేయాలి. కానీ సుప్రీంకోర్టు స్వయంగా దళిత క్రైస్తవులకు రిజర్వేషన్లు కల్పించకూడదు అని స్పష్టం చేసింది.
సభ ఉద్దేశం ఒకటైతే.. వేదికపై వినిపించిన మాటలు మరోలా ఉంటే అసలు సమస్యే పక్కదారి పడుతుంది. ఏలూరులో జరిగిన దళిత క్రైస్తవ శంఖారావ సభ కూడా ఇప్పుడు అదే చర్చకు కారణమైంది. దళిత క్రైస్తవులకు ఎస్సీ రిజర్వేషన్లు కల్పించాలనే ప్రధాన డిమాండ్తో నిర్వహించిన ఈ సమావేశం, ఆ అంశంపై నిర్మాణాత్మక చర్చకు వేదిక కావాల్సింది. కానీ సభలో కొందరు చేసిన రాజకీయ విమర్శలు, వ్యక్తిగత వ్యాఖ్యలే ఎక్కువగా హైలైట్ కావడంతో అసలు లక్ష్యం మరుగున పడిపోయిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రజాస్వామ్యంలో ఏ వర్గానికైనా తమ హక్కుల కోసం పోరాడే హక్కు ఉంది. రిజర్వేషన్ల వంటి సున్నితమైన అంశాలపై తమ వాదనను వినిపించడం కూడా రాజ్యాంగబద్ధమైన హక్కే. అయితే అలాంటి డిమాండ్లకు బలం చేకూరాలంటే భావోద్వేగాల కంటే వాస్తవాలు, చట్టపరమైన అంశాలు, గణాంకాలు, సామాజిక న్యాయం వంటి అంశాల ఆధారంగా ప్రజలను చైతన్యపరచడం అవసరం. వ్యక్తులపై విమర్శలు లేదా వివాదాస్పద వ్యాఖ్యలు సమస్య పరిష్కారానికి దోహదం చేయవు.
దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలా వద్దా అనే అంశం ఇప్పటికే న్యాయ, రాజ్యాంగ, సామాజిక కోణాల్లో విస్తృత చర్చకు గురైంది. ఈ అంశంపై వివిధ న్యాయస్థానాల్లో విచారణలు జరిగాయి. ఇలాంటి నేపథ్యంలో ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే చట్టపరమైన మార్గాలు, ప్రజల్లో అవగాహన పెంపు, ప్రభుత్వంపై విధానపరమైన ఒత్తిడి వంటి అంశాలపై దృష్టి పెట్టడం మరింత ప్రయోజనకరంగా ఉంటుంది.
ఏ ఉద్యమమైనా తన లక్ష్యాన్ని చేరుకోవాలంటే సందేశం స్పష్టంగా ఉండాలి. వేదికలు సమస్య పరిష్కారానికి మార్గాలు సూచించాలి కానీ కొత్త వివాదాలకు కేంద్రబిందువుగా మారకూడదు. సమాజంలో చర్చించాల్సిన అసలు అంశం రిజర్వేషన్లపై విధానం కావాలి గానీ, సభలో ఎవరు ఎవరిని ఏమన్నారు అనేది కాకూడదు. అదే జరిగితేనే ఉద్యమం తన అసలు ఉద్దేశాన్ని నెరవేర్చగలదు.
సభ్య సమాజం తలదించుకునేలా దళిత క్రైస్తవ శంఖారావ సభ.. దీనిపై రామ్ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.
















నిన్న మావిగన్.. నేడు విజయవాడ.. జగన్ మళ్ళీ..!
Jagan Mohan Reddy: రాష్ట్ర రాజధాని విషయంలో జగన్మోహన్ రెడ్డి యూటర్న్ తీసుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. నిన్ననే మావిగన్ రాజధాని అంటూ తేల్చి చెప్పిన జగన్మోహన్ రెడ్డి.. ఒక్కరోజు గడవకముందే ఇప్పుడు అమరావతి కాదు.. విజయవాడ మన రాజధాని అంటూ తేల్చి చెప్పారు. నిన్ననే మీడియా ముందుకు వచ్చి మావిగన్ అజెండాతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు వెళ్తుందని ప్రకటించారు. అదే మీడియా సమావేశంలో విశాఖ పరిస్థితి ఏంటి అని జర్నలిస్టులు అడిగితే సమాధానమివ్వకుండా జారుకున్నారు. అందుకే సోషల్ మీడియాకు ఆయన టార్గెట్ అయ్యారు. మీమ్స్ ఓ రేంజ్ లో పేలుతున్నాయి. మళ్లీ ఈరోజు మరోసారి నోరు జారి వారికి అడ్డంగా దొరికిపోయారు జగన్. వాస్తవానికి మన రాజధాని అమరావతి కాదు.. విజయవాడ మన రాజధాని అంటూ జగన్ చేసిన తాజా కామెంట్లకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
* పరామర్శ చేసిన క్రమంలో..
తాజాగా మరో పరామర్శ చేశారు జగన్మోహన్ రెడ్డి. కృష్ణలంక మాజీ సిఐ నాగరాజు వేధింపులతో తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నానంటూ క్రాంతి కుమార్ అనే వ్యక్తి సెల్ఫీ సూసైడ్ వీడియో విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో క్రాంతి కుమార్ కుటుంబాన్ని గురువారం పరామర్శించారు. విజయవాడలో ఆయన కుటుంబాన్ని పరామర్శించే క్రమంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఇదంతా కూడా సో కాల్డ్ క్యాపిటల్, సో కాల్ టు రాజధానిలో జరుగుతోందని జగనన్నారు. చంద్రబాబు కూడా పక్కనే ఉంటారని.. అమరావతి కాదు మన రాజధాని.. సో కాల్డ్.. వాస్తవం చెప్పాలంటే విజయవాడ మన రాజధాని అని జగన్ చెప్పారు. కళ్లెదుటే పోలీస్ స్టేషన్, సిపి కార్యాలయం, డిజిపి ఆఫీస్, హోం మంత్రి ఆఫీస్.. సీఎం అందరం ఇక్కడే ఉంటామని అన్నారు.
* ఒక్క రోజులోనే మారిన మాట..
వాస్తవానికి జగన్ సో కాల్డ్ రాజధాని అమరావతి అని చెబుతూనే విజయవాడ మన రాజధాని అని అన్నారు. అంటే అమరావతి సో కాల్డ్ రాజధాని అయినప్పుడు.. విజయవాడ కూడా సో కాల్డ్ రాజధాని అన్న ఉద్దేశంతో జగన్ ఆ కామెంట్స్ చేసి ఉండవచ్చు. కానీ ఇలా పూటకో సారి రాజధాని విషయంలో జగన్ మాట మారుస్తుండడంతో.. రాజధాని విషయంపై జగన్కు క్లారిటీ లేదన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు సైతం ఇది ఎంత మాత్రం మింగుడు పడడం లేదు. రాజధాని విషయంలో జగన్ తీసుకుంటున్న యూటర్న్ లపై నెటిజెన్లు మీమ్స్ పండుగ చేసుకుంటున్నారు.