OG 2 : పవన్ కళ్యాణ్ అభిమానులు , ప్రేక్షకులు ‘ఓజీ 2’ మూవీ గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఏ రేంజ్ లో ఊగిపోతుంటారో మన కళ్లారా చూస్తూనే ఉన్నాం. కేవలం ఈ సినిమాకు సంబంధించిన ప్రకటన వీడియో రాగానే సోషల్ మీడియా మొత్తం ఊగిపోయింది. వేల సంఖ్యలో ఎడిటింగ్స్ తో అభిమానులు సోషల్ మీడియా ని షేక్ చేసి వదిలారు. ఒక టీజర్, లేదా ట్రైలర్ విడుదలైతే ఏ రేంజ్ రెస్పాన్స్ వస్తుందో , ఆ రేంజ్ రెస్పాన్స్ కేవలం ప్రకటన కి సంబంధించిన వీడియో కి వచ్చింది. దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు , ఈ సినిమా రేంజ్ ఏంటి అనేది . ఇకపోతే ఈ ‘ఓజీ’ చిత్రం లో ప్రకాష్ రాజ్ సత్య దాదా గా నటించిన సంగతి అందరికీ తెలిసిందే.
ఓజాస్ గంభీర కి గాడ్ ఫాదర్ రోల్ లో ఆయన అద్భుతంగా నటించారు. అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పై ప్రకాష్ రాజ్ రాజకీయ పరంగా ఏ రేంజ్ విబేధాలు పెట్టుకున్నారో మన కళ్లారా చూస్తూనే ఉన్నాం. రాజకీయ పరంగా ప్రకాష్ రాజ్ హద్దులు దాటి మరీ పవన్ కళ్యాణ్ ని ‘వాడు..వీడు’ అంటూ సంబోధించారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ప్రకాష్ రాజ్ ని పట్టించుకోలేదు. ఇప్పటికీ ఆయన్ని ఒక నటుడిగా గౌరవిస్తూనే ఉన్నారు. అయితే ‘ఓజీ 2’ లో ప్రకాష్ రాజ్ తో కలిసి నటించడానికి ఇప్పటికీ పవన్ కళ్యాణ్ కి ఎలాంటి ఇబ్బంది లేకపోయినా, ఆయన అభిమానులకు మాత్రం అసలు ఇష్టం లేదు. ఎట్టి పరిస్థితి లోనూ ప్రకాష్ రాజ్ ని ఈ సినిమా నుండి తొలగించాల్సిందే అంటూ మండిపడుతున్నారు. అయితే ఈమధ్య కాలంలో పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా ని బాగా ఉపయోగిస్తున్నారు. బయట జరిగే వాస్తవాలను తెలుసుకుంటున్నారు.
అందుకే ‘ఓజీ 2’ లో ప్రకాష్ రాజ్ పాత్రని తొలగించాల్సిందిగా డైరెక్టర్ సుజిత్ కి ఆదేశించినట్టు తెలుస్తోంది. అంటే ‘ఓజీ 2’ లో సత్య దాదా పాత్ర చనిపోయినట్టుగా చూపించే ఆలోచనలో ఉన్నారట. ఒకవేళ ఆ పాత్ర అత్యవసరం అనిపిస్తే , ఆయన స్థానం లోకి బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ని తీసుకోవాల్సిందిగా సూచించారట పవన్ కళ్యాణ్. ఇందులో ఎంత మాత్రం నిజముందో రాబోయే రోజుల్లో తెలియనుంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో ఫుల్ బిజీ గా ఉన్నారు డైరెక్టర్ సుజిత్. ఈ ఏడాది నవంబర్ నుండి ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ప్రారంభం కానుంది.
















నిన్న మావిగన్.. నేడు విజయవాడ.. జగన్ మళ్ళీ..!
Jagan Mohan Reddy: రాష్ట్ర రాజధాని విషయంలో జగన్మోహన్ రెడ్డి యూటర్న్ తీసుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. నిన్ననే మావిగన్ రాజధాని అంటూ తేల్చి చెప్పిన జగన్మోహన్ రెడ్డి.. ఒక్కరోజు గడవకముందే ఇప్పుడు అమరావతి కాదు.. విజయవాడ మన రాజధాని అంటూ తేల్చి చెప్పారు. నిన్ననే మీడియా ముందుకు వచ్చి మావిగన్ అజెండాతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు వెళ్తుందని ప్రకటించారు. అదే మీడియా సమావేశంలో విశాఖ పరిస్థితి ఏంటి అని జర్నలిస్టులు అడిగితే సమాధానమివ్వకుండా జారుకున్నారు. అందుకే సోషల్ మీడియాకు ఆయన టార్గెట్ అయ్యారు. మీమ్స్ ఓ రేంజ్ లో పేలుతున్నాయి. మళ్లీ ఈరోజు మరోసారి నోరు జారి వారికి అడ్డంగా దొరికిపోయారు జగన్. వాస్తవానికి మన రాజధాని అమరావతి కాదు.. విజయవాడ మన రాజధాని అంటూ జగన్ చేసిన తాజా కామెంట్లకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
* పరామర్శ చేసిన క్రమంలో..
తాజాగా మరో పరామర్శ చేశారు జగన్మోహన్ రెడ్డి. కృష్ణలంక మాజీ సిఐ నాగరాజు వేధింపులతో తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నానంటూ క్రాంతి కుమార్ అనే వ్యక్తి సెల్ఫీ సూసైడ్ వీడియో విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో క్రాంతి కుమార్ కుటుంబాన్ని గురువారం పరామర్శించారు. విజయవాడలో ఆయన కుటుంబాన్ని పరామర్శించే క్రమంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఇదంతా కూడా సో కాల్డ్ క్యాపిటల్, సో కాల్ టు రాజధానిలో జరుగుతోందని జగనన్నారు. చంద్రబాబు కూడా పక్కనే ఉంటారని.. అమరావతి కాదు మన రాజధాని.. సో కాల్డ్.. వాస్తవం చెప్పాలంటే విజయవాడ మన రాజధాని అని జగన్ చెప్పారు. కళ్లెదుటే పోలీస్ స్టేషన్, సిపి కార్యాలయం, డిజిపి ఆఫీస్, హోం మంత్రి ఆఫీస్.. సీఎం అందరం ఇక్కడే ఉంటామని అన్నారు.
* ఒక్క రోజులోనే మారిన మాట..
వాస్తవానికి జగన్ సో కాల్డ్ రాజధాని అమరావతి అని చెబుతూనే విజయవాడ మన రాజధాని అని అన్నారు. అంటే అమరావతి సో కాల్డ్ రాజధాని అయినప్పుడు.. విజయవాడ కూడా సో కాల్డ్ రాజధాని అన్న ఉద్దేశంతో జగన్ ఆ కామెంట్స్ చేసి ఉండవచ్చు. కానీ ఇలా పూటకో సారి రాజధాని విషయంలో జగన్ మాట మారుస్తుండడంతో.. రాజధాని విషయంపై జగన్కు క్లారిటీ లేదన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు సైతం ఇది ఎంత మాత్రం మింగుడు పడడం లేదు. రాజధాని విషయంలో జగన్ తీసుకుంటున్న యూటర్న్ లపై నెటిజెన్లు మీమ్స్ పండుగ చేసుకుంటున్నారు.