Home Blog Page 37

'ఓజీ 2' నుండి ప్రకాష్ రాజ్ అవుట్.. ఆ స్థానంలోకి రాబోతున్న నటుడు ఎవరంటే..

OG Prakash Raj Character
OG Prakash Raj Character

OG 2 : పవన్ కళ్యాణ్ అభిమానులు , ప్రేక్షకులు ‘ఓజీ 2’ మూవీ గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఏ రేంజ్ లో ఊగిపోతుంటారో మన కళ్లారా చూస్తూనే ఉన్నాం. కేవలం ఈ సినిమాకు సంబంధించిన ప్రకటన వీడియో రాగానే సోషల్ మీడియా మొత్తం ఊగిపోయింది. వేల సంఖ్యలో ఎడిటింగ్స్ తో అభిమానులు సోషల్ మీడియా ని షేక్ చేసి వదిలారు. ఒక టీజర్, లేదా ట్రైలర్ విడుదలైతే ఏ రేంజ్ రెస్పాన్స్ వస్తుందో , ఆ రేంజ్ రెస్పాన్స్ కేవలం ప్రకటన కి సంబంధించిన వీడియో కి వచ్చింది. దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు , ఈ సినిమా రేంజ్ ఏంటి అనేది . ఇకపోతే ఈ ‘ఓజీ’ చిత్రం లో ప్రకాష్ రాజ్ సత్య దాదా గా నటించిన సంగతి అందరికీ తెలిసిందే.

ఓజాస్ గంభీర కి గాడ్ ఫాదర్ రోల్ లో ఆయన అద్భుతంగా నటించారు. అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పై ప్రకాష్ రాజ్ రాజకీయ పరంగా ఏ రేంజ్ విబేధాలు పెట్టుకున్నారో మన కళ్లారా చూస్తూనే ఉన్నాం. రాజకీయ పరంగా ప్రకాష్ రాజ్ హద్దులు దాటి మరీ పవన్ కళ్యాణ్ ని ‘వాడు..వీడు’ అంటూ సంబోధించారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ప్రకాష్ రాజ్ ని పట్టించుకోలేదు. ఇప్పటికీ ఆయన్ని ఒక నటుడిగా గౌరవిస్తూనే ఉన్నారు. అయితే ‘ఓజీ 2’ లో ప్రకాష్ రాజ్ తో కలిసి నటించడానికి ఇప్పటికీ పవన్ కళ్యాణ్ కి ఎలాంటి ఇబ్బంది లేకపోయినా, ఆయన అభిమానులకు మాత్రం అసలు ఇష్టం లేదు. ఎట్టి పరిస్థితి లోనూ ప్రకాష్ రాజ్ ని ఈ సినిమా నుండి తొలగించాల్సిందే అంటూ మండిపడుతున్నారు. అయితే ఈమధ్య కాలంలో పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా ని బాగా ఉపయోగిస్తున్నారు. బయట జరిగే వాస్తవాలను తెలుసుకుంటున్నారు.

అందుకే ‘ఓజీ 2’ లో ప్రకాష్ రాజ్ పాత్రని తొలగించాల్సిందిగా డైరెక్టర్ సుజిత్ కి ఆదేశించినట్టు తెలుస్తోంది. అంటే ‘ఓజీ 2’ లో సత్య దాదా పాత్ర చనిపోయినట్టుగా చూపించే ఆలోచనలో ఉన్నారట. ఒకవేళ ఆ పాత్ర అత్యవసరం అనిపిస్తే , ఆయన స్థానం లోకి బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ని తీసుకోవాల్సిందిగా సూచించారట పవన్ కళ్యాణ్. ఇందులో ఎంత మాత్రం నిజముందో రాబోయే రోజుల్లో తెలియనుంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో ఫుల్ బిజీ గా ఉన్నారు డైరెక్టర్ సుజిత్. ఈ ఏడాది నవంబర్ నుండి ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ప్రారంభం కానుంది.

విజయ్ దేవరకొండ ఇచ్చిన మాటని నిలబెట్టుకోలేదు అంటూ ఎమోషనల్ అయిపోయిన నిర్మాత..

Vijay Deverakonda
Vijay Deverakonda

Vijay Deverakonda : విజయ్ దేవరకొండ హీరో గా నటించిన సినిమాల్లో ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చిన చిత్రం ‘వరల్డ్ ఫేమస్ లవర్’. అప్పట్లో భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా , కనీసం ఫుల్ రన్ లో 10 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను కూడా రాబట్టలేకపోయింది. ఆ కారణం చేత నిర్మాతకు భారీ రేంజ్ లో నష్టం వచ్చింది. ఈ చిత్రాన్ని నిర్మించింది మరెవరో కాదు , అభిషేక్ నామా. ఈయన గతం లో ‘కత్తికేయ 2’ చిత్రాన్ని నిర్మించారు. ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. రీసెంట్ గా ఆయన ‘నాగబంధం’ అనే చిత్రాన్ని నిర్మిస్తూ దర్శకత్వం కూడా వహించారు. రేపు ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్లో గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రొమోషన్స్ లో భాగంగా ఆయన అనేక ఇంటర్వ్యూస్ ఇచ్చారు.

ఒక ఇంటర్వ్యూ లో ఆయన విజయ్ దేవరకొండ పై చాలా తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఆయన మాట్లాడుతూ ‘విజయ్ దేవరకొండ తో నేను వరల్డ్ ఫేమస్ లవర్ అనే చిత్రాన్ని నిర్మించాను. భారీ డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది. నేను చాలా పెద్ద మొత్తమే నష్టపోయాను. అయినప్పటికీ నేను విజయ్ దేవరకొండ కి ఇచ్చిన రెమ్యూనరేషన్ లో ఒక్క పైసా కూడా వెనక్కి ఇవ్వమని అడగలేదు. ఆ నష్టాన్ని రీకవర్ చేసుకోవడానికి మా బ్యానర్ లో ఒక సినిమా చేస్తానని ఆయన మాట ఇచ్చారు. 3 సంవత్సరాలు దాటింది , ఇప్పటి వరకు ఆ అంశం పై కనీస స్పందన లేదు’ అంటూ చెప్పుకొచ్చారు అభిషేక్ నామా. అయితే ఒక్కోసారి కమిట్మెంట్స్ లో భాగంగా మర్చిపోయి ఉండొచ్చు , ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ చూసే విజయ్ దేవరకొండ స్వయంగా అభిషేక్ కి ఫోన్ చేసి సినిమా చేద్దామని చెప్పొచ్చేమో చూద్దాం అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఇక ఆయన దర్శకత్వం వహించిన ‘నాగబంధం’ సినిమా విషయానికి వస్తే , ఇందులో హీరో హీరోయిన్లు గా విరాట్ కర్ణ, నభా నటేష్ నటించారు. అనంత పద్మనాభస్వామి ఆలయ రహస్యాన్ని ఆధారంగా తీసుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. బడ్జెట్ దాదాపుగా 100 కోట్ల రూపాయిల వరకు ఖర్చు చేసి ఉంటారని అంచనా. ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ కూడా భారీ గానే జరిగింది. మరి రేపు ఆడియన్స్ నుండి ఈ చిత్రం ఎలాంటి రెస్పాన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి.

'ఓజీ 2' ఫోటో షూట్ లో పాల్గొన్న పవన్ కళ్యాణ్.. వైరల్ అవుతున్న క్రేజీ వీడియో..

Pawan Kalyan OG 2 Video
Pawan Kalyan OG 2 Video

Pawan Kalyan OG 2 Video: పవన్ కళ్యాణ్ కి సినిమాలపై ప్రస్తుతం ఒకప్పుడు ఉన్న ఆసక్తి లేదు అనే విషయం అందరికీ తెలిసిందే. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత కేవలం ఆయన పార్ట్ టైం యాక్టర్ గా మాత్రమే కొనసాగుతున్నారు. తన తోటి హీరోలు లాగా పాన్ ఇండియన్ ప్రాజెక్ట్స్ చేసేంత సమయం ఆయనకు ప్రస్తుతం లేదు. ఎందుకంటే ప్రస్తుతం ఆయన ఉపముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు. ఆయన ప్రతీ క్షణం జనాలకు సంబంధించినదే. ఇలాంటి సమయంలో షూటింగ్స్ కి ఒకప్పటి లాగా డేడికేటెడ్ గా సమయాన్ని కేటాయించలేని పరిస్థితి , ఎదో డబ్బుల కోసం , నెల రోజుల డేట్స్ లో చుట్టేసే రేంజ్ కథలను మాత్రమే ఆయన ఎంచుకుంటూ వెళ్తున్నారు. కానీ సరైన టాలెంటెడ్ డైరెక్టర్ దొరికితే మాత్రం , ఆయన పూర్తి స్థాయిలో డెడికేషన్ చూపిస్తున్నారు. అందుకు బెస్ట్ ఉదాహరణ ‘ఓజీ’.

ఈ సినిమా కోసం కేవలం ఆయన 28 రోజుల డేట్స్ ని మాత్రమే కేటాయించారు. అయినప్పటికీ కూడా డైరెక్టర్ సుజిత్ తన అద్భుతమైన టేకింగ్ తో , పవన్ కళ్యాణ్ ని నెవెర్ బిఫోర్ రేంజ్ లో చూపించి , బాక్స్ ఆఫీస్ ని షేక్ అయ్యేలా చేశారు. సుజిత్ టాలెంట్ కి ముగ్దుడైన పవన్ కళ్యాణ్ , ‘ఓజీ 2’ చేయడానికి సిద్దమయ్యాడు. రీసెంట్ గానే ఈ క్రేజీ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ అధికారికంగా ప్రకటించారు కూడా. అందుకు ఫ్యాన్స్ , ఆడియన్స్ నుండి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. సోషల్ మీడియా మొత్తం ఒక రేంజ్ లో ఊగిపోయింది. ఈ సినిమాపై పవన్ కళ్యాణ్ ఎంత ఆసక్తితో ఉన్నాడంటే , ప్రత్యేకంగా ఫోటో షూట్స్ కూడా ఇచ్చేంత అన్నమాట. సుజిత్ తో మీటింగ్ జరిగిన రోజే ఆయన ఒక ఫోటో షూట్ ఇచ్చారు. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.

పవన్ కళ్యాణ్ ఇలా ఒక సినిమాకు ప్రత్యేకంగా ఫోటో షూట్ ఇవ్వడం జరిగింది ‘పంజా’ కి మాత్రమే. ఆ తర్వాత ‘ఓజీ’ మూవీ షూటింగ్ సమయం లో కూడా ముంబై బీచ్ వద్ద ఆయన ఫోటో షూట్ లో పాల్గొన్నాడట , కానీ ఈ రేంజ్ లో మాత్రం కాదట. పవన్ కళ్యాణ్ ఫోటో షూట్ కి సంబంధించిన విజువల్స్ ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి. అభిమానులకు ఈ విజువల్స్ ఒక కనులపండుగ లాంటిది. ఇకపోతే ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది నవంబర్ నెల నుండి ప్రారంభం అవ్వబోతుందట. సెప్టెంబర్ 2 న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ని విడుదల చేసే ఆలోచనలో ఉన్నారట మేకర్స్.

'పెద్ది' 4 వారాల (28 రోజులు) వరల్డ్ వైడ్ వసూళ్లు.. క్రేజీ టార్గెట్ మిస్ అయ్యేలా ఉందే..

Peddi 28 Days Collections
Peddi 28 Days Collections

Peddi 28 Days Collections: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ చిత్రం విడుదలై విజయవంతంగా 28 రోజులు పూర్తి అయ్యింది. అంటే నాలుగు వారాలు అన్నమాట. రేపు కొత్త చిత్రాలు విడుదల కావడంతో , ఈ సినిమాని అనేక ప్రధాన నగరాల్లో ఎత్తేస్తున్నారు. అంటే దాదాపుగా ఈ చిత్రం థియేట్రికల్ రన్ క్లోజింగ్ కి వచ్చినట్టే. అభిమానులు థియేటర్స్ లో మంచి ఆక్యుపెన్సీ లతో రన్ అవుతున్నప్పటికీ, ఎత్తేయడం అసలు ఏ మాత్రం బాగోలేదని , ఇది చాలా అన్యాయం అంటూ సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు. అత్యధిక థియేటర్స్ లో ఈ వారం కూడా కొనసాగిస్తే, కచ్చితంగా ఈ చిత్రం గ్రాస్ కొత్త సినిమాల గ్రాస్ కంటే ఎక్కువ ఉంటుందని సవాలు చేస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే ఈ నాలుగు వారాల్లో ఈ చిత్రం ప్రాంతాల వారీగా ఎంత వసూళ్లను రాబట్టిందో ఒకసారి చూద్దాం.

నైజాం ప్రాంతం లో ఈ చిత్రానికి నాలుగు వారాలు కలిపి 54 కోట్ల 85 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. అదే విధంగా సీడెడ్ ప్రాంతం నుండి 21 కోట్ల 20 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు రాగా, ఉత్తరాంధ్ర ప్రాంతం నుండి 23 కోట్ల 11 లక్షలు , ఈస్ట్ గోదావరి నుండి 13 కోట్లు , వెస్ట్ గోదావరి నుండి 9 కోట్ల 20 లక్షలు, గుంటూరు జిల్లా నుండి 12 కోట్ల 72 లక్షలు , కృష్ణ జిల్లా నుండి 10 కోట్ల 34 లక్షలు వచ్చాయి. ఇక రామ్ చరణ్ కి కంచుకోటగా పిలవబడే నెల్లూరు జిల్లా నుండి ఈ చిత్రానికి 5 కోట్ల 94 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.

ఈ వీకెండ్ తో నెల్లూరు జిల్లాలో ఈ చిత్రం 6 కోట్ల షేర్ మార్కుని అందుకునే అవకాశాలు ఉన్నాయి. అయితే రామ్ చరణ్ కి కంచుకోటలుగా పిలవబడే సీడెడ్ , నెల్లూరు ప్రాంతాల్లో నష్టాలు రావడం గమనార్హం. మిగిలిన ప్రాంతాల్లో కూడా నిర్మాతలు రిటర్న్ జీఎస్టీ ఇస్తేనే బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకునే అవకాశాలు ఉంటాయట. ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి 150 కోట్ల 36 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు , 233 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయట. మిగిలిన ప్రాంతాల విషయానికి వస్తే కర్ణాటక నుండి 15 కోట్ల 30 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు రాగా, తమిళనాడు + కేరళ నుండి 2 కోట్ల 40 లక్షలు , హిందీ + రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 12 కోట్ల 15 లక్షలు వచ్చాయి. ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి 204 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు , 349 కోట్ల 40 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.

'మా ఇంటి బంగారం' 13 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ఇదేమి బ్యాటింగ్ బాబోయ్..ఇప్పట్లో ఆగేలా లేదు..

Maa Inti Bangaram 13 Days Collections
Maa Inti Bangaram 13 Days Collections

Maa Inti Bangaram 13 Days Collections: సమంత ‘మా ఇంటి బంగారం’ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఇప్పటికీ స్టడీ కలెక్షన్స్ ని రాబడుతూ , చాలా సాలిడ్ మూడవ వీకెండ్ ని సూచిస్తూ ముందుకు దూసుకెళ్తోంది. ఈ రేంజ్ స్టడీ రన్ ఈమధ్య కాలం లో స్టార్ హీరోలకు కూడా రాలేదు అనడం లో అతిశయోక్తి లేదు. ఫ్యామిలీ ఆడియన్స్ బలం వల్లే , ఈ చిత్రం ఈ రేంజ్ వసూళ్లను రాబడుతుందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. రేపు విడుదలయ్యే కొత్త సినిమాల్లో ఒక్క దానికి సూపర్ హిట్ టాక్ వచ్చినా , ‘మా ఇంటి బంగారం’ వసూళ్లపై కాస్త ప్రభావం పడొచ్చు. అలా కాకుండా , ఫ్లాప్ టాక్ , లేదా డివైడ్ టాక్ వంటివి వస్తే మాత్రం ఈ వీకెండ్ ని కూడా ‘మా ఇంటి బంగారం’ దంచి కొట్టేస్తుంది , అందులో ఎలాంటి సందేహం లేదని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.

వాళ్ళు అందిస్తున్న సమాచారం ప్రకారం చూస్తే , ఈ చిత్రానికి 11 వ రోజున తెలుగు రాష్ట్రాల నుండి 85 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు రాగా , 12 వ రోజున కూడా 85 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టి స్ట్రాంగ్ హోల్డ్ ని కనబర్చుకుంది. ఇక 13 వ రోజున అయితే కేవలం 10 లక్షల రూపాయిల డ్రాప్స్ ని సొంతం చేసుకున్న ఈ చిత్రం, ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల నుండి 75 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. ఇంతటి స్టడీ రన్ స్టార్ హీరోలకు కూడా దక్కలేదు , అందుకు రీసెంట్ ఉదాహరణ పెద్ది. ఇక ప్రాంతాల వారీగా ఈ చిత్రానికి వచ్చిన వసూళ్లను ఒకసారి పరిశీలిస్తే నైజాం ప్రాంతం నుండి 13 కోట్ల 40 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు రాగా, సీడెడ్ + ఆంధ్ర ప్రాంతం నుండి 10 కోట్ల 21 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.

ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల నుండి ఈ చిత్రానికి 23 కోట్ల 61 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు , 45 కోట్ల 60 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అదే విధంగా తమిళనాడు నుండి 1 కోటి 84 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు రాగా , కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 4 కోట్ల 90 లక్షలు , ఓవర్సీస్ నుండి 10 కోట్ల 20 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ వరల్డ్ వైడ్ గా ఈ చిత్రానికి 40 కోట్ల 55 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు , 82 కోట్ల 20 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. లాభాలు 28 కోట్ల 55 లక్షల వరకు వచ్చాయి, పరిస్థితి చూస్తుంటే కచ్చితంగా ఈ చిత్రం 100 కోట్ల గ్రాస్ ని రాబట్టడం పెద్ద కష్టమేమి కాదని అనిపిస్తోంది.

నిన్న మావిగన్.. నేడు విజయవాడ.. జగన్ మళ్ళీ..!

Y S Jagan Mohan Reddy
Y S Jagan Mohan Reddy

Jagan Mohan Reddy: రాష్ట్ర రాజధాని విషయంలో జగన్మోహన్ రెడ్డి యూటర్న్ తీసుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. నిన్ననే మావిగన్ రాజధాని అంటూ తేల్చి చెప్పిన జగన్మోహన్ రెడ్డి.. ఒక్కరోజు గడవకముందే ఇప్పుడు అమరావతి కాదు.. విజయవాడ మన రాజధాని అంటూ తేల్చి చెప్పారు. నిన్ననే మీడియా ముందుకు వచ్చి మావిగన్ అజెండాతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు వెళ్తుందని ప్రకటించారు. అదే మీడియా సమావేశంలో విశాఖ పరిస్థితి ఏంటి అని జర్నలిస్టులు అడిగితే సమాధానమివ్వకుండా జారుకున్నారు. అందుకే సోషల్ మీడియాకు ఆయన టార్గెట్ అయ్యారు. మీమ్స్ ఓ రేంజ్ లో పేలుతున్నాయి. మళ్లీ ఈరోజు మరోసారి నోరు జారి వారికి అడ్డంగా దొరికిపోయారు జగన్. వాస్తవానికి మన రాజధాని అమరావతి కాదు.. విజయవాడ మన రాజధాని అంటూ జగన్ చేసిన తాజా కామెంట్లకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

* పరామర్శ చేసిన క్రమంలో..
తాజాగా మరో పరామర్శ చేశారు జగన్మోహన్ రెడ్డి. కృష్ణలంక మాజీ సిఐ నాగరాజు వేధింపులతో తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నానంటూ క్రాంతి కుమార్ అనే వ్యక్తి సెల్ఫీ సూసైడ్ వీడియో విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో క్రాంతి కుమార్ కుటుంబాన్ని గురువారం పరామర్శించారు. విజయవాడలో ఆయన కుటుంబాన్ని పరామర్శించే క్రమంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఇదంతా కూడా సో కాల్డ్ క్యాపిటల్, సో కాల్ టు రాజధానిలో జరుగుతోందని జగనన్నారు. చంద్రబాబు కూడా పక్కనే ఉంటారని.. అమరావతి కాదు మన రాజధాని.. సో కాల్డ్.. వాస్తవం చెప్పాలంటే విజయవాడ మన రాజధాని అని జగన్ చెప్పారు. కళ్లెదుటే పోలీస్ స్టేషన్, సిపి కార్యాలయం, డిజిపి ఆఫీస్, హోం మంత్రి ఆఫీస్.. సీఎం అందరం ఇక్కడే ఉంటామని అన్నారు.

* ఒక్క రోజులోనే మారిన మాట..
వాస్తవానికి జగన్ సో కాల్డ్ రాజధాని అమరావతి అని చెబుతూనే విజయవాడ మన రాజధాని అని అన్నారు. అంటే అమరావతి సో కాల్డ్ రాజధాని అయినప్పుడు.. విజయవాడ కూడా సో కాల్డ్ రాజధాని అన్న ఉద్దేశంతో జగన్ ఆ కామెంట్స్ చేసి ఉండవచ్చు. కానీ ఇలా పూటకో సారి రాజధాని విషయంలో జగన్ మాట మారుస్తుండడంతో.. రాజధాని విషయంపై జగన్కు క్లారిటీ లేదన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు సైతం ఇది ఎంత మాత్రం మింగుడు పడడం లేదు. రాజధాని విషయంలో జగన్ తీసుకుంటున్న యూటర్న్ లపై నెటిజెన్లు మీమ్స్ పండుగ చేసుకుంటున్నారు.

సభ్య సమాజం తలదించుకునేలా దళిత క్రైస్తవ శంఖారావ సభ

Dalit Christian Sankharava Sabha

Dalit Christian Sankharava Sabha : దళిత క్రైస్తవ శంఖారావ సభ.. ఏలూరులో జరిగింది. సభ ఉద్దేశం వేరు.. అక్కడ జరిగింది వేరు. దళిత క్రైస్తవులకు ఎస్సీ రిజర్వేషన్ కల్పించాలన్నది ఈ సభ ప్రధాన ఉద్దేశం. ఈ సమావేశంలో పవన్ కళ్యాణ్ ను తిట్టడం.. జడ శ్రవణ్ కుమార్, ప్రశ్న రావణ్ లు సభ్య సమాజం తలదించుకునేలా మాట్లాడారు. ఇదేనా రిజర్వేషన్లు సాధించే మార్గం.. రిజర్వేషన్లు సాధించాలంటే జనాలను ఎడ్యూకేట్ చేయాలి. ఎలా దళిత క్రైస్తవులకు రిజర్వేషన్లు సాధించాలో ప్లాన్ చేయాలి. కానీ సుప్రీంకోర్టు స్వయంగా దళిత క్రైస్తవులకు రిజర్వేషన్లు కల్పించకూడదు అని స్పష్టం చేసింది.

సభ ఉద్దేశం ఒకటైతే.. వేదికపై వినిపించిన మాటలు మరోలా ఉంటే అసలు సమస్యే పక్కదారి పడుతుంది. ఏలూరులో జరిగిన దళిత క్రైస్తవ శంఖారావ సభ కూడా ఇప్పుడు అదే చర్చకు కారణమైంది. దళిత క్రైస్తవులకు ఎస్సీ రిజర్వేషన్లు కల్పించాలనే ప్రధాన డిమాండ్‌తో నిర్వహించిన ఈ సమావేశం, ఆ అంశంపై నిర్మాణాత్మక చర్చకు వేదిక కావాల్సింది. కానీ సభలో కొందరు చేసిన రాజకీయ విమర్శలు, వ్యక్తిగత వ్యాఖ్యలే ఎక్కువగా హైలైట్ కావడంతో అసలు లక్ష్యం మరుగున పడిపోయిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రజాస్వామ్యంలో ఏ వర్గానికైనా తమ హక్కుల కోసం పోరాడే హక్కు ఉంది. రిజర్వేషన్ల వంటి సున్నితమైన అంశాలపై తమ వాదనను వినిపించడం కూడా రాజ్యాంగబద్ధమైన హక్కే. అయితే అలాంటి డిమాండ్లకు బలం చేకూరాలంటే భావోద్వేగాల కంటే వాస్తవాలు, చట్టపరమైన అంశాలు, గణాంకాలు, సామాజిక న్యాయం వంటి అంశాల ఆధారంగా ప్రజలను చైతన్యపరచడం అవసరం. వ్యక్తులపై విమర్శలు లేదా వివాదాస్పద వ్యాఖ్యలు సమస్య పరిష్కారానికి దోహదం చేయవు.

దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలా వద్దా అనే అంశం ఇప్పటికే న్యాయ, రాజ్యాంగ, సామాజిక కోణాల్లో విస్తృత చర్చకు గురైంది. ఈ అంశంపై వివిధ న్యాయస్థానాల్లో విచారణలు జరిగాయి. ఇలాంటి నేపథ్యంలో ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే చట్టపరమైన మార్గాలు, ప్రజల్లో అవగాహన పెంపు, ప్రభుత్వంపై విధానపరమైన ఒత్తిడి వంటి అంశాలపై దృష్టి పెట్టడం మరింత ప్రయోజనకరంగా ఉంటుంది.

ఏ ఉద్యమమైనా తన లక్ష్యాన్ని చేరుకోవాలంటే సందేశం స్పష్టంగా ఉండాలి. వేదికలు సమస్య పరిష్కారానికి మార్గాలు సూచించాలి కానీ కొత్త వివాదాలకు కేంద్రబిందువుగా మారకూడదు. సమాజంలో చర్చించాల్సిన అసలు అంశం రిజర్వేషన్లపై విధానం కావాలి గానీ, సభలో ఎవరు ఎవరిని ఏమన్నారు అనేది కాకూడదు. అదే జరిగితేనే ఉద్యమం తన అసలు ఉద్దేశాన్ని నెరవేర్చగలదు.

సభ్య సమాజం తలదించుకునేలా దళిత క్రైస్తవ శంఖారావ సభ.. దీనిపై రామ్ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

సత్యదేవ్ 'రావు బహదూర్' బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఎన్ని కోట్లు రాబట్టాలో తెలుసా..

Rao Bahadur 4 Days Collection
Rao Bahadur 4 Days Collection

రేపు ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో విడుదల అవ్వబోతున్న కొత్త సినిమాల్లో , ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తిని రేకెత్తించిన చిత్రం ‘రావు బహదూర్’. తన ప్రతీ సినిమాతో ప్రేక్షకులకు కొత్త రకమైన సినిమాటిక్ అనుభూతిని కలిగించాలని తపన పడే సత్యదేవ్ ఈ చిత్రం లో హీరో గా నటించగా, ‘కేర్ ఆఫ్ కంచెరపాలెం’ ఫేమ్ వెంకటేష్ మహా దర్శకత్వం వహించారు. ఇక మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమాని ఆయన తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ప్రమోట్ చేయడమే కాదు , ట్రైలర్ కి వాయిస్ ఓవర్ ని కూడా అందించారు. ఇలా ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన ఆసక్తిని కలిగించిన ఈ సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా బలంగానే జరిగింది. సత్యదేవ్ కి సోలో హీరో గా ఇప్పటి వరకు స్థిరమైన మార్కెట్ లేదు అనేది వాస్తవం.

ఆయన నటించిన సినిమాలకు ఓటీటీ లో మంచి ఆదరణ దక్కాయి కానీ , థియేట్రికల్ ఆదరణ మాత్రం దక్కలేదు. అయినప్పటికీ కూడా ఈ చిత్రానికి మార్కెట్ లో 10 కోట్ల రూపాయిల రేంజ్ లో ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఇప్పటి వరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ ఆసక్తికరంగా ఉండడం తో పాటు , వెంకటేష్ మహా , సూపర్ స్టార్ మహేష్ బాబు బ్రాండ్ ఇమేజ్ కూడా ఈ చిత్రానికి కలిసొచ్చింది. దీంతో ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకొని లాభాల్లోకి అడుగుపెట్టాలంటే 11 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టాల్సి ఉంటుంది. మరి ఆ రేంజ్ వసూళ్లు వస్తాయా అంటే , అవుననే అంటున్నారు ట్రేడ్ పండితులు. ఎందుకంటే అడ్వాన్స్ బుకింగ్స్ చాలా ప్రామిసింగ్ గా ఉన్నాయి. ఒక్క నార్త్ అమెరికా నుండే ఈ చిత్రానికి లక్ష డాలర్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.

ఇది సాధారణమైన విషయం కాదు. టాక్ వస్తే కచ్చితంగా ఈ చిత్రం 1 మిలియన్ గ్రాస్ వసూళ్లను కూడా రాబడుతుంది , అందులో ఎలాంటి సందేహం లేదు. ‘కేర్ ఆఫ్ కంచెరపాలెం’ చిత్రం లో డైరెక్టర్ వెంకటేష్ మహా ఇచ్చే కొన్ని ట్విస్టులకు ఆడియన్స్ కి మైండ్ బ్లాక్ అయ్యింది. ఇదేంటి బాబు , అసలు ఊహించలేకపోయాము, టేకింగ్ లో ఇది మాస్టర్ పీస్ రేంజ్ అని ఈ చిత్రాన్ని చూసిన ప్రతీ ఒక్కరు కామెంట్ చేశారు. హీరో సత్య దేవ్ ‘రావు బహదూర్’ లో అంతకు మించిన ట్విస్టులు , షాకింగ్ ఎలిమెంట్స్ చాలా ఉంటాయని చెప్పుకొచ్చారు. అదే కనుక నిజమైతే , బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా వసూళ్ల సునామీ ని సృష్టించబోతోంది అనొచ్చు , అందులో ఎలాంటి సందేహం లేదు.

'బిగ్ బాస్ 10 ' లో కంటెస్టెంట్స్ అలాంటి పనులు చేస్తే 10 లక్షలు జరిమానా..!

Bigg Boss 10 Telugu
Bigg Boss 10 Telugu

Bigg Boss 10 Telugu: బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ‘బిగ్ బాస్ 10’ ఫెవర్ మొదలైంది. ఈ ఏడాది సెప్టెంబర్ 6 నుండి ఈ సీజన్ గ్రాండ్ గా ప్రారంభం కానుంది. గత ఏడాది లాగానే ఈ ఏడాది లో కూడా ‘అగ్నిపరీక్ష’ షో ద్వారా సామాన్యులను ఎంచుకొని బిగ్ బాస్ షో లోకి పంపబోతున్నారు. అందుకోసం ప్రారంభించిన దరఖాస్తుల ప్రక్రియ కూడా ముగిసింది. భారీ రేంజ్ లో అప్లికేషన్స్ వస్తాయని ఊహించారు కానీ , ఆ రేంజ్ లో మాత్రం రాలేదు. గత సీజన్ లో లాగానే , ఈ సీజన్ లో కూడా 8 మంది సామాన్యులను ఎంపిక చేసి బిగ్ బాస్ హౌస్ లోకి పంపబోతున్నారు. సెలబ్రిటీల జాబితా 12 నుండి 14 మంది వరకు ఉండొచ్చు. ఈసారి మోస్ట్ పాపులర్ సెలబ్రిటీలను దించాలనే చూస్తున్నారు.

త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు బయటకు రానున్నాయి. ఇదంతా పక్కన పెడితే ఈమధ్య కాలం లో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ మధ్య వాగ్వాదాలు తారా స్థాయికి చేరుకుంటున్నాయి. గత సీజన్స్ లో నేరుగా ఒకరిని ఒకరు బూతులు తిట్టుకోవడం వంటివి కూడా మనం కళ్లారా చూశాము. ముఖ్యంగా ఇలాంటి షోస్ ని ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా చూస్తుంటారు , వాళ్లకు ఇలాంటి బూతులు వినడం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అంతే కాకుండా గత సీజన్స్ లో మతాల కార్డుని ఉపయోగించుకున్న వాళ్ళు ఉన్నారు , అదే విధంగా తెలుగు వెర్సస్ కన్నడ వాదన కూడా తీసుకొచ్చారు. ప్రతీ సీజన్ కి ఇలాంటివి బాగా పెరిగిపోతున్నాయి. అందుకే వీటిని తగ్గించడం కోసం బిగ్ బాస్ టీం ఒక సరికొత్త నిర్ణయం తీసుకున్నట్టు ఇండస్ట్రీ వర్గాల్లో ఒక గాసిప్ వినిపిస్తోంది. అదేమిటంటే బూతులు మాట్లాడిన, ఫిజికల్ గా ఎవరిపైన అయినా చెయ్యి చేసుకున్నా , విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా కంటెస్టెంట్స్ ప్రవర్తించిన జరిమానా భారీ రేంజ్ లో విధించబోతున్నారని టాక్.

రెమ్యూనరేషన్ నుండి రెండు , మూడు వారాలు కట్ చేయడమో , లేదంటే 10 లక్షల రూపాయిల రేంజ్ లో జరిమానా విధించడమో జరుగుతుందట. మన సీజన్స్ లో ఇప్పటి వరకు ఉద్దేశపూర్వకంగా కొట్టడం వంటివి జరగలేదు కానీ , తమిళ , హిందీ బిగ్ బాస్ సీజన్స్ లో మాత్రం ఇలాంటి సంఘటనలు జరిగాయి. అక్కడి హోస్టులు కంటెస్టెంట్స్ కి రెడ్ కార్డు ఇచ్చి బయటకు పంపేసేవారు. మన తెలుగు బిగ్ బాస్ లో రెడ్ కార్డు మాత్రమే కాకుండా, ఇలా జరిమానా కూడా విధించాలని అనుకుంటున్నారట. మరి ఇందులో ఎంత మాత్రం నిజముందో చూడాలి.

'రంగస్థలం' ఇప్పుడు విడుదల అయ్యుంటే ఇండియా షేక్ అయ్యేది : అక్కినేని అఖిల్

Akhil Akkineni
Akhil Akkineni

Akkineni Akhil: ‘ మెగా అభిమానుల్లో ఎప్పటి నుండో ఒక చిన్న నిరాశ , అసంతృప్తి దాగుంది. అదేమిటంటే రామ్ చరణ్ కెరీర్ లో ల్యాండ్ మార్క్ లాగా నిల్చినటువంటి ‘రంగస్థలం’ చిత్రాన్ని కేవలం ప్రాంతీయ బాషా చిత్రం గా మిగిల్చడమే. ఈ సినిమాకు పాన్ ఇండియా లెవెల్ లో ‘పుష్ప’ రేంజ్ వసూళ్లు సునామీ ని సృష్టించేంత సత్తా ఉంది. అయినప్పటికీ మేకర్స్ ఎందుకో ఆ సాహసం చేయలేదు. అప్పటికే బాహుబలి సిరీస్ కారణంగా మన టాలీవుడ్ కి పాన్ ఇండియా మార్కెట్ కూడా వచ్చేసింది. అయినప్పటికీ మేకర్స్ ఆసక్తి చూపించలేదు. ఆరోజుల్లోనే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 230 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది , ఇది సాధారణమైన విషయం కాదు. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి వచ్చిన లాంగ్ రన్ ని చూసి ట్రేడ్ పండితులు కూడా మెంటలెక్కిపోయారు.

ఒక్కమాటలో చెప్పాలంటే మన టాలీవుడ్ లో అత్యధిక సెంటర్స్ లో వంద రోజులు ఆడిన చివరి చిత్రం ఇదే అనొచ్చు. అయితే అభిమానుల్లో ఎలాంటి ఫీలింగ్ ఉందో , ఈ సినిమాపై ప్రముఖ యంగ్ హీరో అక్కినేని అఖిల్ లో కూడా అలాంటి ఫీలింగే ఉంది. రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో ‘రంగస్థలం చిత్రం మన తెలుగు చలనచిత్ర పరిశ్రమలోనే వన్ ఆఫ్ ది కల్ట్ క్లాసిక్ అనొచ్చు. ఈ చిత్రం ఇప్పుడు విడుదల అయ్యుంటే ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద వండర్స్ క్రియేట్ చేసి ఉండేది. ‘పుష్ప’ తరహా లోనే ఇండియా లో బిగ్గెస్ట్ బ్రాండ్ అయ్యేది’ అంటూ చెప్పుకొచ్చారు అక్కినేని అఖిల్. ఆయన మాటలను ఏకీభవిస్తూ రామ్ చరణ్ ఫ్యాన్స్ కూడా పోస్టులు పెడుతున్నారు. వాస్తవానికి ఈ సినిమాని నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్ కి అప్పట్లో పాన్ ఇండియా లెవెల్ లో సినిమాలను రిలీజ్ చేసేంత ధైర్యం లేదు.

‘పుష్ప’ చిత్రాన్ని కూడా మొదట్లో పాన్ ఇండియా లెవెల్ లో విడుదల చెయ్యాలని అనుకోలేదు. రాజమౌళి ఈ సినిమాకు ముంబై లో మంచి క్రేజ్ ఉందని, అందరూ ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారని , మీరు కచ్చితంగా నార్త్ ఇండియా లో విడుదల చేయాలనీ , లేదంటే చాలా నష్టపోతారని ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పడంతో , అల్లు అర్జున్ నిర్మాతలపై ఒత్తిడి చేసి ఈ చిత్రాన్ని నార్త్ ఇండియా లో విడుదల చేయించారు. ఇక ఆ తర్వాత హిస్టరీ ఏంటో తెలిసిందే. ‘పుష్ప’ చిత్రంతో అల్లు అర్జున్ నార్త్ ఇండియా లో ప్రభంజనం సృష్టించిన మాస్ ప్రాంతాల్లో కల్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్నారు. ఒకవేళ రామ్ చరణ్ కూడా ఇదే విధంగా ఒత్తిడి చేసి రంగస్థలం చిత్రాన్ని నార్త్ ఇండియా లో విడుదల చేయించి ఉండుంటే ఈరోజు పరిస్థితి ఎలా ఉండేదో అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

రాజమౌళి కి దక్కిన అరుదైన గౌరవం.. జీవితాంతం గుర్తించుకోదగ్గ జ్ఞాపకం ఇది.

SS Rajamouli
SS Rajamouli

SS Rajamouli: దర్శక ధీరుడు రాజమౌళి కి మరో అరుదైన గౌరవం దక్కింది. ఇటీవలే ఆయన ఫ్రాన్స్ దేశంలోని లియోన్ నగరం లో పర్యటించారు. ఆ నగరం లోని ప్రఖ్యాతి గాంచిన ‘లూమినర్ మ్యూజియం’ ని సందర్శించగా , అక్కడ ఆయనకు అరుదైన సత్కారం లభించింది. మార్టిన్గ్ స్కోర్సెస్ , క్లింట్ ఈస్ట్ వుడ్, క్వేన్టిన్ టొరంటీనో , ఫ్రాన్సిస్ ఫోర్డ్ కొప్పోలా వంటి ప్రపంచ సినిమా ఇండుస్త్రీలను శాసించిన ప్రపంచ దిగ్గజాల పేర్లు ఉన్న గోడపై రాజమౌళి పేరు కూడా శాశ్వతంగా చెక్కబడింది. ఈ విషయాన్ని ఆయన తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలుపుతూ బాగా ఎమోషనల్ అయ్యారు. అక్కడి ప్రేక్షకులు తన #RRR, ఈగ చిత్రాలను బాగా ఆదరించారని , లూమియార్ ఇన్స్టిట్యూట్ , కేన్స్ ఫిలిం ఫెస్టివల్ డైరెక్టర్ థియరీ ఫ్రిమాక్స్ నన్ను ఎంతో మర్యాదపూర్వకంగా తమ ప్రేక్షకులకు పరిచయం చేయడం మర్చిపోలేని అనుభూతి అంటూ ఈ సందర్భంగా ఆయన చెప్పుకొచ్చారు.

ఆ తర్వాత ఆయన నాకు ఇచ్చిన సరప్రైజ్ ని జీవితం లో ఎప్పటికీ మర్చిపోలేను. ఈ ప్రపంచం లో సినిమా పుట్టిన వీధిలో నన్ను నడిపించుకుంటూ తీసుకెళ్లారు. తన చుట్టూ జరుగుతున్న ఈ సంఘటనలను చూసి చాలా ఎమోషనల్ కి గురయ్యాను అని , ఇక ఆ తర్వాత ప్రపంచం లో ప్రఖ్యాతి గాంచిన దిగ్గజ దర్శకుల మధ్యలో తన పేరు ఉండడం చూసి షాక్ కి గురయ్యాను అని రాజమౌళి వివరించారు . ఇలాంటి గౌరవాన్ని ఇచ్చినందుకు తన నోటి నుండి మాట కూడా రాలేదని , వాళ్లకు కేవలం కృతఙ్ఞతలు మాత్రమే చెప్పగలనని , వాళ్లపై గౌరవంతో మనస్ఫూర్తిగా నా తలవంచి నమస్కరాలు అందిస్తున్నామని చెప్పుకొచ్చారు రాజమౌళి. ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది, నెటిజెన్స్ తో పాటు గా సినీ సెలబ్రిటీలు కూడా రాజమౌళి కి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసారు.

ఇకపోతే ప్రస్తుతం రాజమౌళి ‘వారణాసి’ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. సినిమాలోని మేజర్ యాక్షన్ సన్నివేశాలకు సంబంధించిన చిత్రీకరణ ఇప్పటికే పూర్తి అయ్యిందని , ఈ అక్టోబర్ నెలలో ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లోనూ విడుదల చేస్తామని రాజమౌళి రీసెంట్ గానే చెప్పుకొచ్చారు. ఈ నెల 6 వ తేదీ నుండి హైదరాబాద్ లో వేసిన భారీ సెట్స్ లో , ఈ చిత్రానికి సంబంధించిన యాక్షన్ సీక్వెన్స్ ని తెరకెక్కించనున్నారు రాజమౌళి. ఈ షెడ్యూల్ లో ప్రధాన తారాగణం తో పాటు 3000 మంది జూనియర్ ఆర్టిస్టులు కూడా నటించబోతున్నారు. ఏప్రిల్ 7 న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు రాజమౌళి.

పెద్ద రిస్క్ చేస్తున్న మెగాస్టార్ చిరంజీవి.. 2023 రిపీట్ కానుందా? మరోసారి పరువు పోనుందా..

Chiranjeevi
Chiranjeevi

Chiranjeevi: 2023 వ సంవత్సరం మెగా ఫ్యాన్స్ కి ఆరంభం లో సంక్రాంతి సీజన్ ఏ రేంజ్ కిక్ ఇచ్చిందో, అదే ఏడాది సెకండ్ హాఫ్ మెగా అభిమానులకు అదే రేంజ్ నిరాశను మిగిలించింది. ఆ ఏడాది లో ఆగస్టు 11 మెగా ఫ్యాన్స్ కి ఒక పీడకల లాంటిది. ఎందుకంటే ఆరోజున మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘భోళా శంకర్’ చిత్రం విడుదలైంది. తమిళం లో అప్పుడెప్పుడో సూపర్ హిట్ గా నిల్చిన ‘వేదలమ్’ చిత్రానికి రీమేక్ గా ఈ చిత్రాన్ని మెహర్ రమేష్ తెరకెక్కించారు. ఈ సినిమా విడుదలైన రోజునే సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘జైలర్’ చిత్రం విడుదలైంది. ఫలితం ఏంటో అందరికీ తెలిసిందే. భోళా శంకర్ చిత్రం ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిలబడగా, ‘జైలర్’ చిత్రం సౌత్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసి వదిలింది.

ప్రపంచవ్యాప్తంగా 650 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రానికి, తెలుగు వెర్షన్ నుండి 90 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. మరోపక్క ‘భోళా శంకర్’ చిత్రం మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత తక్కువ వసూళ్లను రాబట్టిన సినిమాగా నిల్చింది. ప్రపంచవ్యాప్తంగా కనీసం పాతిక కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను కూడా రాబట్టలేకపోయింది. ఇంకా చెప్పాలంటే మన చిన్నతనం లో విడుదలైన ‘మృగరాజు’ చిత్రానికి ఈ సినిమాకంటే ఎక్కువ వసూళ్లు కొన్ని సెంటర్స్ లో వచ్చాయి. 2026 కూడా అదే సీన్ రిపీట్ అవ్వనుందా? అని అంటున్నారు నెటిజెన్స్. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి లాంగ్ అవైటెడ్ మూవీ ‘విశ్వంభర’ చిరాన్ని అక్టోబర్ 16 న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా విడుదలయ్యే ముందు రోజు , అనగా అక్టోబర్ 15 న రజినీకాంత్ ‘జైలర్ 2’ చిత్రం విడుదల కానుంది.

ఈ సినిమా పై ఆడియన్స్ లో ఎలాంటి హైప్ ఉందో అందరికీ తెలిసిందే. ఇప్పటి వరకు ఈ చిత్రం నుండి ఒక్క కంటెంట్ కూడా బయటకు రాలేదు, అయినప్పటికీ ఈ రేంజ్ క్రేజ్ ఉందంటే, ఇక టీజర్ , పాటలు విడుదల తర్వాత ఏ రేంజ్ హైప్ క్రియేట్ అవుతుందో మీరే ఊహించుకోండి. మరోపక్క విశ్వంభర చిత్రాన్ని మెగా ఫ్యాన్స్ కూడా పూర్తిగా మర్చిపోయారు. విడుదల చేసిన ప్రమోషనల్ కంటెంట్ ఒక్కటి కూడా క్లిక్ అవ్వలేదు. ఇలాంటి మూవీ ని జైలర్ 2 వంటి భారీ హైప్ ఉన్న మూవీ కి పోటీగా విడుదల చేస్తే 2023 ఫీట్ రిపీట్ అవుతుందని స్వయంగా మెగా ఫ్యాన్స్ అంటున్నారు, మరి ఏమి జరగబోతుందో చూడాలి.

ఈ ఆకుల టీ తో కీళ్ల నొప్పులు మాయం.. అయితే ఇవి తప్పనిసరి..

parijat tea benefits : ఇంటి ఆవరణలో ఉండే కొన్ని పూల చెట్లు సువాసనలు వెదజల్లడమే కాదు… మంచి ఆరోగ్యాన్ని కూడా ప్రసాదిస్తాయి. వీటిలో పారిజాత చెట్టు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఈ చెట్టుకు ఉండే ఆకులు, పువ్వులు, బెరడు వంటి భాగాలను వివిధ ఆరోగ్య సమస్యలకు ఉపయోగిస్తుంటారు. ముఖ్యంగా ఉత్తరాఖండ్‌లోని బాగేశ్వర్‌తో పాటు పలు కొండ ప్రాంతాల్లో పారిజాత ఆకులతో తయారు చేసిన కషాయాన్ని తరతరాలుగా గృహ వైద్యంగా ఉపయోగిస్తున్నారు. అయితే పారిజాతం టీ తాగడం వల్ల కీళ్ల నొప్పులు మటుమాయం అవుతాయని కొందరు చెబుతున్నారు. అసలు ఈ పారిజాతం టీ ని ఎలా తయారు చేస్తారు?

పారిజాతం టీ..
ఉత్తరాఖండ్‌కు చెందిన ఆయుర్వేద నిపుణుడు డాక్టర్ అజెల్ పటేల్ వివరాల ప్రకారం.. పారిజాత టీ తయారీ చాలా సులభం. రెండు గ్లాసుల నీటిలో కొన్ని తాజా, శుభ్రంగా కడిగిన పారిజాత ఆకులను వేసి తక్కువ మంటపై మరిగించాలి. నీరు సగానికి తగ్గిన తర్వాత వడకట్టి గోరువెచ్చగా తాగాలి. ఈ కషాయంలో చక్కెర కలపకూడదని సూచిస్తున్నారు. అవసరమైతే కొద్దిగా చల్లారిన తర్వాత మాత్రమే వైద్యుల సలహాతో కొద్దిగా తేనె కలుపుకోవచ్చు.

ఎప్పుడు తాగితే మంచిది?
సాంప్రదాయంగా పారిజాత ఆకుల కషాయాన్ని ఉదయం ఖాళీ కడుపుతో లేదా తేలికపాటి అల్పాహారం చేసిన తర్వాత తీసుకుంటారు. ఇలా తీసుకోవడం వల్ల శరీరానికి ఇందులోని సహజ గుణాలు బాగా అందుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అయితే ప్రతి ఒక్కరి శరీర తత్వం భిన్నంగా ఉండటంతో దీన్ని అలవాటుగా తీసుకునే ముందు వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.

ఆయుర్వేదం చెప్పే ఆరోగ్య ప్రయోజనాలు
ఆయుర్వేద గ్రంథాల ప్రకారం పారిజాత ఆకుల్లో వాపును తగ్గించడంలో సహాయపడే సహజ జీవక్రియాశీల సమ్మేళనాలు (Bioactive Compounds) ఉంటాయి. అందువల్ల కీళ్ల నొప్పులు, ఆర్థరైటిస్, కీళ్ల వాపు వంటి సమస్యల్లో ఇది కొంత ఉపశమనం కలిగించవచ్చని భావిస్తారు. కొన్ని ప్రాంతాల్లో జ్వరాలు, శరీర నొప్పులు వంటి సమస్యల సమయంలో కూడా దీనిని సంప్రదాయ వైద్యంగా ఉపయోగించే ఆనవాయితీ ఉంది.

శాస్త్రీయ ఆధారాలు ఇంకా పరిమితమే
పారిజాత ఆకుల వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆయుర్వేదంలో ప్రస్తావించినప్పటికీ, వాటిని పూర్తిస్థాయిలో నిర్ధారించే శాస్త్రీయ పరిశోధనలు ప్రస్తుతం పరిమితంగానే ఉన్నాయి. అందువల్ల దీనిని అద్భుత ఔషధంగా లేదా అన్ని వ్యాధులకు శాశ్వత పరిష్కారంగా భావించడం సరైంది కాదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

మందులకు ప్రత్యామ్నాయం కాదు
ఆర్థరైటిస్, యూరిక్ యాసిడ్, కీళ్ల వాపు లేదా ఇతర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ ఇప్పటికే వైద్యుల సూచన మేరకు మందులు వాడుతున్నవారు వాటిని స్వయంగా ఆపేయకూడదు. పారిజాత టీని సహాయకంగా మాత్రమే పరిగణించాలి. ఇది వైద్య చికిత్సకు ప్రత్యామ్నాయం కాదని ఆయుర్వేద నిపుణులు హెచ్చరిస్తున్నారు.

జాగ్రత్తలు తప్పనిసరి
ఏదైనా మూలికా కషాయం అయినప్పటికీ ప్రతి ఒక్కరికి ఒకే విధంగా ప్రయోజనం కలుగుతుందని చెప్పలేం. గర్భిణీలు, బాలింతలు, చిన్నపిల్లలు, అలర్జీలు ఉన్నవారు లేదా ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు వైద్యుల సలహా లేకుండా పారిజాత టీని తీసుకోకపోవడం మంచిది.

'ఇసకపట్నం' వెబ్ సిరీస్ రివ్యూ : ఇదేమి కాన్సెప్ట్ బాబోయ్.. అసలు ఊహించలేదు

Isakapatnam Web Series Review
Isakapatnam Web Series Review

Isakapatnam Web Series Review: ఒక పక్క సినిమాలు , మరోపక్క వెబ్ సిరీస్ లు చేస్తూ ఆడియన్స్ ని ఎల్లప్పుడూ ఎంటర్టైన్ చేస్తూ ఉండే హీరోయిన్స్ లో ఒకరు ఐశ్వర్య రాజేష్. ఆమె ఏ జానర్ సినిమాని ఎంచుకున్నా, తనకు నటనకు స్కోప్ ఉండేలా చూసుకుంటూ వస్తోంది. ‘సంక్రాంతి వస్తున్నాం’ వంటి భారీ హిట్ తర్వాత ఆమె ప్రధాన పాత్ర పోషించిన వెబ్ సిరీస్ ‘ఇసకపట్నం’. నిన్న అమెజాన్ ప్రైమ్ వీడియో లో స్ట్రీమింగ్ అయినటువంటి ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో ఒకసారి ఈ రివ్యూ లో చూద్దాం.

కథ :

నాయుడు(సముద్రఖని) అనే వ్యక్తి తన భార్య , పిల్లలతో కలిసి ఇసకపట్నం అనే గ్రామం లో కూలీగా అడుగుపెడతాడు. కుట్ర, కుతంత్రాల ఆలోచనలతో ఉన్న నాయుడు , ఆ ఊరిలో ప్రజల మనిషిగా మంచి పేరు తెచ్చుకున్న చిన్నారావు (రాజీవ్ కనకాల) ని చెంపేసి నాయకుడిగా ఎదుగుతాడు. ఇక అప్పటి నుండి నాయుడు అరాచకాలకు హద్దు అదుపు లేకుండా పోయింది. ఆ ఊర్లో ఆయన చెప్పిందే వేదం , అతనికి ఎవరైనా ఎదురు తిరిగితే చంపేస్తుంటాడు. తండ్రి చేసే దుర్మార్గాలను అతని కూతురు భారతి ‘ఐశ్వర్య రాజేష్’ వ్యతిరేకిస్తూ ఉంటుంది. నాయుడి దగ్గర పని చేసే సూరి (సుధాకర్ కొమాకుల) అనే వ్యక్తిని ప్రేమిస్తుంది . కానీ నాయుడు మాత్రం తన అధికారాన్ని కాపాడుకోవడం కోసం తన ప్రత్యర్థి అయినటువంటి ప్రతాప్ వర్మ(రవివర్మ) తో పెళ్లి జరిపిస్తాడు. అయితే తనకు ఇష్టం లేని పెళ్లి చేసుకున్నందుకు ఆవేశం తో రగిలిపోయిన భారతి తన భర్త ప్రతాప్ వర్మ ని చంపేస్తుంది. ఆ తర్వాత ఏమైంది అనేది స్టోరీ , స్క్రీన్ ప్లే.

విశ్లేషణ : నాయుడు పాత్రలో సముద్రఖని నటించలేదు జీవించాడు అనే చెప్పాలి. తనదైన హావబాలతో , డైలాగ్స్ తో విలనిజాన్ని పీక్ రేంజ్ కి తీసుకెళ్లాడు. ఇక ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్ పాత్ర ప్రదమైన హైలైట్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇన్ని రోజులు కేవలం పాజిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో కనిపించిన ఐశ్వర్య రాజేష్ , ఇందులో నెగెటివ్ షేడ్స్ లో కూడా కనిపించి సర్ప్రైజ్ కి గురి చేసింది. ఇక పోలీస్ ఆఫీసర్ గా సునీల్ అదరగొట్టేసాడు. చాలా కాలం తర్వాత ఆయనకు మంచి పాత్ర దొరికింది. ఆరంభం ఎపిసోడ్స్ లో పాత్రలను పరిచయం చేయడానికి ఎక్కువ సమయం తీసుకున్న దర్శకుడు , రెండో ఎపిసోడ్ నుండి కథలోకి ప్రేక్షకులని తీసుకెళ్లి ఎంటర్టైన్ చేయడం లో సక్సెస్ అయ్యాడు. ఒక్క మాటలో చెప్పాలంటే , ఇసుకపట్నం మంచి పొలిటికల్ ఎంగేజింగ్ థ్రిల్లర్ సిరీస్. ఐశ్వర్య రాజేష్ , సముద్ర ఖని ఈ సిరీస్ లో పోటాపోటీగా నటించారు. కచ్చితంగా ఈ సిరీస్ ని థ్రిల్లర్ జానర్ సినిమాలను ఇష్టపడే వాళ్ళు చూడొచ్చు.

మావిగన్ వాదనతో ఓటమిని ముందుగానే ఖాయం చేసుకున్న జగన్

Amaravati Capital Issue

Amaravati Capital Issue : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాజధాని అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి. “మావిగన్‌ను ఒప్పుకునే వారు నాకు ఓటు వేస్తారు.. అమరావతిని ఒప్పుకునే వారు చంద్రబాబుకు ఓటు వేస్తారు” అని ఆయన చేసిన వ్యాఖ్యలు, రాబోయే ఎన్నికలను రాజధాని అంశం చుట్టూ తిప్పే ప్రయత్నంగా కనిపిస్తున్నాయి.

అయితే ఇక్కడ ప్రధాన ప్రశ్న ఏమిటంటే… పార్లమెంట్ చట్టబద్ధ ప్రక్రియలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన అమరావతి రాజధానిని మళ్లీ మార్చే రాజకీయ, చట్టపరమైన అవకాశం జగన్‌కు ఉందా? రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినా కేంద్రం అటువంటి నిర్ణయానికి అంగీకరిస్తుందా? ఈ ప్రశ్నలకు స్పష్టమైన సమాధానం ఇప్పటివరకు కనిపించడం లేదు.

మరోవైపు జాతీయ పార్టీలు అయిన బీజేపీ, కాంగ్రెస్ రెండూ అమరావతినే రాజధానిగా అంగీకరిస్తున్నాయి. అలాంటి పరిస్థితిలో జగన్ మళ్లీ కొత్త రాజధాని ఆలోచనను ముందుకు తీసుకురావడం ఎంతవరకు ఆచరణ సాధ్యమనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

జగన్ తన వాదనలో “నేను అమరావతికి వ్యతిరేకం కాదు… అక్కడ జరిగిన అవినీతికి మాత్రమే వ్యతిరేకం” అని చెబుతున్నారు. అదే సమయంలో భూములు ఇచ్చిన రైతులకు న్యాయం చేస్తామని చెబుతూనే, గతంలో భూములు ఇవ్వొద్దని చెప్పిన విషయాన్ని రాజకీయ ప్రత్యర్థులు గుర్తుచేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజల్లో అమరావతి విషయంలో వైసీపీ అసలు వైఖరి ఏమిటనే సందేహం మరింత బలపడుతోంది.

ఇంకా ఒక కీలక అంశం… గతంలో వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల సిద్ధాంతాన్ని ప్రకటించింది. అందులో విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధానిగా ప్రతిపాదించింది. ఇప్పుడు ఆ అంశాన్ని పక్కనబెట్టి “మావిగన్” అనే కొత్త నినాదాన్ని ముందుకు తేవడం వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటన్న ప్రశ్న తలెత్తుతోంది. ఇది కొత్త రాజకీయ వ్యూహమా? లేక గత నిర్ణయాల నుంచి వైదొలిగిన సంకేతమా? అనే చర్చ సాగుతోంది.

రాజధాని అంశం ఇప్పటికే ఎన్నో రాజకీయ, చట్టపరమైన మలుపులు చూసింది. అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతుల ఆందోళనలు, కోర్టు తీర్పులు, కేంద్ర ప్రభుత్వ వైఖరి వంటి పరిణామాల తర్వాత మళ్లీ కొత్త రాజధాని ప్రతిపాదనను ప్రజలు ఎంతవరకు స్వీకరిస్తారనేది ఎన్నికల్లో కీలక అంశంగా మారే అవకాశం ఉంది.

ప్రస్తుతం కనిపిస్తున్న రాజకీయ పరిస్థితులను బట్టి చూస్తే, “మావిగన్ వర్సెస్ అమరావతి” అనే పోరును ఎన్నికల ప్రధాన అజెండాగా మార్చాలని జగన్ ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే ఈ వ్యూహం ఆయనకు రాజకీయంగా లాభం చేకూరుస్తుందా? లేక ఇప్పటికే స్థిరపడిన అమరావతి అంశంపై మళ్లీ వివాదం సృష్టించడం ద్వారా ప్రతికూల ఫలితాలు ఎదుర్కొంటారా? అనేది రాబోయే రోజుల్లో తేలనుంది.

రాజధాని వంటి సున్నితమైన అంశంలో ప్రజలు భావోద్వేగాలకన్నా ఆచరణ సాధ్యత, చట్టబద్ధత, రాష్ట్ర అభివృద్ధి వంటి అంశాలనే ఎక్కువగా పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది. అందుకే ఈ ఎన్నికల్లో రాజధాని రాజకీయాలు మరోసారి కీలక పాత్ర పోషించబోతున్నాయి.

మావిగన్ వాదనతో ఓటమిని ముందుగానే ఖాయం చేసుకున్న జగన్.. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

'జైలర్ 2' టీజర్ వచ్చేసింది .. అనిరుద్ మరోసారి విశ్వరూపం చూపించేశాడుగా..!

Jailer 2 teaser Review

Jailer 2 teaser : సౌత్ ఇండియన్ మూవీ లవర్స్ ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న ‘జైలర్ 2’ అప్డేట్ వచ్చేసింది. రీసెంట్ గానే షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని అక్టోబర్ 15 న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్టు , ఒక చిన్న బ్లాస్టింగ్ టీజర్ తో ప్రకటించారు మేకర్స్. ఈ టీజర్ లో నెల్సన్ మార్క్ టేకింగ్ కనిపించింది. ‘జైలర్’ టీజర్ అప్పుడు కూడా ఆయన ఇదే ఫార్మటు ని అనుసరించారు. క్యారెక్టర్స్ ని పూర్తి స్థాయి లో రివీల్ చేయకుండా , కేవలం రజినీకాంత్ ని మాత్రమే చూపించారు. కానీ ఈ టీజర్ లో క్యారెక్టర్స్ ని రివీల్ చేయలేదు , అదే విధంగా రజినీకాంత్ ని కూడా చూపించలేదు. దూరం నుండి ఆయన వెనక్కి తిరిగి నిల్చున్న షాట్ ని మాత్రమే చూపించారు.

అయితే ఈ టీజర్ లో అనిరుద్ మరోసారి తన విశ్వరూపం చూపించాడు అనే చెప్పాలి. ‘జైలర్’ థీమ్ మ్యూజిక్ ని మోడిఫై చేస్తూ తన సరికొత్త అప్డేటెడ్ వెర్షన్ కి సోషల్ మీడియా లో నెటిజెన్స్ నుండి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. అనిరుద్ ఇలాంటి విషయాల్లో అసలు వెనక్కి తగ్గడు , మరోసారి ఆయనకు ఎందుకు సౌత్ ఇండియా లో ఇంత డిమాండ్ ఉంది అనేది ఈ ఒక్క బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో చెప్పకనే చెప్పారు. ఇకపోతే ఈ టీజర్ లో సినిమా కథ ఎక్కడి నుండి మొదలు అవుతుందో చెప్పుకొచ్చారు డైరెక్టర్. మొదటి భాగం క్లైమాక్స్ లో విలన్ చనిపోయే ముందు కొన్ని మాటలు అంటాడు గుర్తుందా?, నన్ను చంపి ఎంత పెద్ద తప్పు చేయబోతున్నావో నీకు తెలియదు , ఇదొక మహాసముద్రం , నా వెనుక ఎవరెవరు ఉన్నారో తెలుసా? అని అంటాడు. అక్కడి నుండే ఈ చిత్రం మొదలు అవుతుంది.

అవినీతి మార్గం లోకి వెళ్తే కన్నకొడుకుని కూడా కనికరం లేకుండా చంపేసిన హీరో కి , ఈ మాఫియా నుండి ఎదురైనా సమస్యలు ఏంటి?, దాని నుండి ఆయన ఎలా బయటపడ్డాడు అనేదే స్టోరీ గా తీసినట్టు టీజర్ ని చూస్తుంటే అర్థం అవుతోంది. ఇకపోతే మొదటి భాగం లో శివరాజ్ కుమార్ , మోహన్ లాల్ పాత్రలు కనిపించింది చాలా తక్కువసేపు అయినప్పటికీ, బలమైన ప్రభావం చూపించారు , ఈ చిత్రం లో కూడా వాళ్ళ పాత్రలు ఉంటాయట, అదే విధంగా బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్ కూడా ఈ చిత్రం లో బలమైన పవర్ ఫుల్ గెస్ట్ రోల్ లో కనిపించబోతున్నారట. రెండు రోజుల క్రితమే ఆయన పాత్రకు సంబంధించిన షూటింగ్ ని కూడా పూర్తి చేశారు. ‘జైలర్’ తో ఏకంగా 650 కోట్ల రూపాయిలకు పైగా గ్రాస్ వసూళ్లను కొల్లగొట్టిన సూపర్ స్టార్ రజినీకాంత్ ‘జైలర్ 2’ తో వెయ్యి కోట్లు అందుకుంటాడా లేదా అనేది చూడాలి.

బాత్రూంలో జారిపడిన అక్కినేని అఖిల్.. తీవ్ర గాయాలు.. 42 కుట్లు.. వీడియో వైరల్..

akhil-akkineni-reveals-bathroom-accident-42-stitches-lenin-movie-interview

Akhil Akkineni Injury : అక్కినేని అభిమానులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న ‘లెనిన్’ చిత్రం ఈ నెల 10 న ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా ఈ సినిమా ప్రొమోషన్స్ లో భాగంగా అఖిల్ అనేక ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు. ఈ ఇంటర్వ్యూస్ లో ఆయన ‘లెనిన్’ చిత్రం గురించి మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ముఖ్యంగా అభిమానులు తనపై ఎంత కోపంగా ఉన్నారో చెప్పుకొచ్చారు. కెరీర్ మొత్తం మీద సరైన బ్లాక్ బస్టర్ హిట్ లేదు , ఇలాంటి సమయం లో మూడేళ్లు గ్యాప్ ఇచ్చేసరికి అక్కినేని ఫ్యాన్స్ సోషల్ మీడియా లో అఖిల్ ని ట్యాగ్ చేసి తిట్టడం మొదలు పెట్టారు. ఇదే అంశాన్ని ఒక ఇంటర్వ్యూ లో యాంకర్ అడుగుతారు. ఇంత గ్యాప్ ఇచ్చినందుకు ఫ్యాన్స్ మీ మీద కోపం గా ఉన్నారు, వాళ్లకు ఏమి సమాధానం చెప్తారు అని అడుగుతారు.

అందుకు అఖిల్ సమాధానం చెప్తూ ‘వాళ్లకు కోపం రావడం లో తప్పు లేదు. నా వైపు కొంత మిస్టేక్ ఉంది , అదే విధంగా టెక్నీకల్ వాల్యూస్ పరంగా కొంత ఆలస్యం అయ్యింది. నేను కావాలని మాత్రం ఆలస్యం చేయలేదు , బాత్రూం లో ఒకరోజు జారీ ఒక గ్లాస్ అడ్డం మీద పడ్డాను , తీవ్రమైన గాయాలు అయ్యాయి, రెండు సర్జరీలు జరిగాయి, 42 కుట్లు పడ్డాయి. ఆ కారణం చేత 16 నెలలు షూటింగ్ కి బ్రేక్ తీసుకోవాల్సి వచ్చింది. అంతే కాకుండా సరైన కథ వచ్చేంత వరకు సినిమా చేయకూడదు అని అనుకున్నాను. 16 నెలల తర్వాత నేను పూర్తిగా కోలుకొని , జిమ్ లో వర్కౌట్స్ చేసి , బలాన్ని రప్పించుకోవడానికి అనేక ప్రయత్నాలు చేసి , ఈరోజు మీ ముందు ఇలా ఉన్నాను’ అంటూ చెప్పుకొచ్చారు.

దీంతో అక్కినేని ఫ్యాన్స్ నువ్వు సినిమాల పట్ల సీరియస్ గా లేవని తప్పుగా అపార్థం చేసుకున్నాము , దయచేసి మమ్మల్ని క్షమించు అంటూ ట్వీట్లు వేస్తున్నారు. ప్రతీ సినిమాకు అఖిల్ తన వైపు నుండి నూటికి నూరు శాతం బెస్ట్ ఇవ్వాలనే ప్రయత్నం చేస్తూ వస్తున్నారు, డ్యాన్స్ బాగా వేస్తారు , ఫైట్స్ అద్భుతంగా చేస్తారు , నటన కూడా పర్వాలేదు అనిపించుకున్నారు , కానీ స్క్రిప్ట్ సెలక్షన్ సరిగా లేకపోవడం వల్ల, ఆయన వరుసగా ఫ్లాప్స్ ని ఎదురుకోవాల్సి వచ్చింది. కానీ ‘లెనిన్’ పట్ల అఖిల్ చాలా నమ్మకంతో ఉన్నారు , ఆయన మాటల్లోని కాన్ఫిడెన్స్ , ఉత్సాహం చూస్తుంటే ఈసారి కుంభస్థలం బద్దలు కొట్టడం ఖాయం అనిపిస్తోంది.