Home Blog Page 301

YSRCP And DMK: అప్పుడు వైసిపి.. ఇప్పుడు డీఎంకే … ఏం తేడాలే!

YSRCP And DMK: తమిళనాడులో డిఎంకెతో ఏపీలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి సారూప్యత ఉంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాదిరిగానే తమిళనాడులో డీఎంకే కూడా ఓటమి చవిచూసింది. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాదిరిగా మాత్రం కాదు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. డీఎంకే గౌరవప్రదమైన స్థానాలు సాధించింది. అయితే డిఎంకె ఓటమికి అనేక కారణాలు ఉన్నాయి. తమ హయాంలో జరిగిన మంచి పనులు కంటే.. తప్పుడు విధానాలు ప్రజల్లోకి బలంగా వెళ్లాయి. పైగా డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ నోటి దూల ఆ పార్టీకి ఇబ్బందికరంగా మారింది. ఇక్కడ కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో అటువంటి నోటి దూల కలిగిన నేతలతోనే ఆ పార్టీ మూల్యం చెల్లించుకుంది.

* అడ్డదిడ్డంగా మాట్లాడి..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా హిందూ దేవాలయాల్లో విగ్రహాల ధ్వంసం జరిగింది. ఆ సమయంలో మంత్రిగా ఉన్న కొడాలి నాని ఏమయింది కొత్త విగ్రహం పెడతాం కదా అని చాలా తేలిగ్గా మాట్లాడారు. రథం దగ్ధమైతే మళ్లీ కొత్త రథం ఏర్పాటు చేస్తాం అన్నట్టు వ్యాఖ్యానించారు. కేసులు పెడితే తప్పేంటని ప్రశ్నించారు. చంద్రబాబును అరెస్టు చేస్తే జైలులో దోమలు కుడుతున్నాయని చెబితే.. ఆయన కోసం రంభ ఊర్వశిలు వస్తారా అని ఎద్దేవా చేశారు కూడా. అయితే ఇటువంటి ఘటనలు తటస్థ ఓటర్ల పై ప్రభావం చూపిస్తాయి. ఏపీలో అటువంటి ప్రభావం కనిపించింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై. అందుకే ఆ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. అచ్చం అలానే వ్యవహరించింది తమిళనాడులో డీఎంకే.

* మెరుగైన పాలన అందించినా..
అయితే ఏపీతో పోల్చుకుంటే తమిళనాడులో మెరుగైన పాలన అందించింది డిఎంకె ప్రభుత్వం. పరిశ్రమలు కూడా పెద్ద ఎత్తున వచ్చాయి. పెట్టుబడులు కూడా పెరిగాయి. కానీ డిప్యూటీ సీఎం గా ఉన్న ఉదయనిధి స్టాలిన్ మతపరంగా చేసిన కామెంట్స్ తో హిందూ మతం పూర్తిగా దూరమైంది. పైగా కొన్ని మీడియా సంస్థలు సైతం ఆయనకు దూరమయ్యాయి. ఏపీలో కూడా పరిస్థితి అదే. సాక్షితోపాటు అనుకూల మీడియాలను నమ్ముకొని ఏది పడితే అది మాట్లాడేసారు. అడ్డగోలుగా సమర్థించుకున్నారు. అందుకు మూల్యం చెల్లించుకున్నారు కూడా. ప్రధానంగా తాము మంచి చేసాం అని మాత్రమే బలంగా నమ్మారు. కానీ తమ పార్టీలో అస్తవ్యస్త విధానాలను మాత్రం నియంత్రించుకోలేకపోయారు. దాని ఫలితమే ఓటమి.

YSR Congress: వైసీపీకి టచ్ లోకి కూటమి ఎమ్మెల్యేలు!

YSR Congress: వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీకి కొంత మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారా? కూటమి పార్టీ ఎమ్మెల్యేలు ఆ పరిస్థితుల్లో ఉన్నారా? పొలిటికల్ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. కొంతమంది వైసీపీ సోషల్ మీడియా సైన్యం దీనిపైనే ప్రచారం చేస్తోంది. కూటమి తరుపున 164 మంది గెలిచారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఒకరిద్దరి ఎమ్మెల్యేల వ్యవహార శైలి అందరికీ తెలిసిందే. ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే పై లైంగికపరమైన ఆరోపణలు రావడంతో పార్టీ పక్కన పెట్టింది. మరోవైపు ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే వ్యవహారం కూడా వివాదాస్పదంగా మారింది. ఆయనను టిడిపి హై కమాండ్ పెద్దగా పట్టించుకోలేదు. అటువంటివారు వైసీపీకి టచ్ లోకి వెళ్లినా వెళ్లి ఉంటారు. తెలుగుదేశం పార్టీ నాయకత్వం పెద్దగా పట్టించుకునే స్థితిలో మాత్రం లేదు. కానీ అటువంటి వారితో వైసీపీ ఏం రాజకీయం చేయగలదు తెలియాలి మరి.

* అప్పట్లో నలుగురు.
సరిగ్గా వైసిపి అధికారంలో ఉన్నప్పుడే నెల్లూరు జిల్లాకు చెందిన ఇద్దరు సీనియర్ ఎమ్మెల్యేలు ఆ పార్టీ నాయకత్వంతో విభేదించారు. వారే ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. వైసిపి పాలనకు ఇంకా 16 నెలల కాలం ఉండగానే వారు ఆ పార్టీని…ప్రభుత్వాన్ని వ్యతిరేకించారు. వారితో పాటు అదే జిల్లాకు చెందిన మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, గుంటూరు జిల్లాకు చెందిన ఉండవల్లి శ్రీదేవి అసమ్మతి స్వరం వినిపించారు. అయితే అందులో ఆనం రామనారాయణరెడ్డి తో పాటు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీశారు. అయితే వారికి రాజకీయంగాను మంచి పట్టు ఉంది. అన్నింటికీ మించి క్రెడిబిలిటీ ఉంది. అయితే ఇప్పుడు వైసిపి ప్రచారం చేస్తున్నట్టుగా టిడిపి ఎమ్మెల్యేలు టచ్లోకి వచ్చారని అనుకుందాం. అయితే వారు టిడిపి వద్దనుకున్న తర్వాత మాత్రమే టచ్ లోకి వచ్చినట్లు అవుతుంది . అటువంటి వారు టచ్ లోకి వస్తే ఎంత? రాకపోతే ఎంత అనే వాదన వినిపిస్తోంది.

* ఎంతవరకు ప్రయోజనం..
ఎమ్మెల్యేలు పార్టీ మారడం వల్ల కొత్తగా వచ్చే ప్రయోజనం ఎవరికి ఉండదు. 2014 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత టిడిపిలోకి 23 మంది ఎమ్మెల్యేలు ఫిరాయించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. అటు తరువాత 2019 ఎన్నికల్లో అదే వైసిపి బంపర్ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. 2019లో అధికారంలోకి వచ్చిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి నలుగురు టిడిపి ఎమ్మెల్యేలు ఫిరాయించారు . కానీ 2024 ఎన్నికల్లో టిడిపి బంపర్ మెజారిటీతో గెలిచింది. ఎమ్మెల్యేలు పార్టీ మారినంత మాత్రాన వారితో వచ్చే ప్రయోజనం ఉండదు. కానీ రాజకీయంగా ప్రభావం చూపే నేతలతో మాత్రం కొంచెం ప్రయోజనం ఉంటుంది. అయితే ఎప్పటికీ ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి టచ్ లోకి వెళ్లాల్సిన పరిస్థితి ఎమ్మెల్యేలకు లేదు. ఒకరిద్దరూ పై టిడిపి హై కమాండ్ అనధికార బహిష్కరణ వేసిన నేపథ్యంలో.. వారికి పొలిటికల్ గా అంత ప్రాధాన్యత లేకపోయినా నేపథ్యంలో అటువంటి వారు టచ్లోకి వెళ్లిన ఆశ్చర్యపోనవసరం లేదు. అయితే వారితో వైసీపీకి వచ్చే ప్రయోజనం ఏమీ లేదు. లోలోపల ఆనందం తప్ప..

BJP Uttar Pradesh: యూపీలో హ్యాట్రిక్‌పై కన్నేసిన బీజేపీ.. ప్లాన్‌ రెడీ చేసిన కమలం పార్టీ!

BJP Uttar Pradesh: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. బెంగాల్‌లో బీజేపీ ఘన విజయం సాధించి చరిత్ర సృష్టించింది. ఈ గెలుపు తర్వాత ఇప్పుడు బీజేపీ ఉత్తరప్రదేశ్‌పై దృష్టిపెట్టింది. ఈ రాష్ట్రంలో 2027లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. యూపీ దేవంలో అతిపెద్ద రాష్ట్రం. ఇక్కడ అత్యధిక ఎంపీలు ఉన్నారు. ఇక్కడ గెలవడం బీజేపీకి అవసరం. ఇప్పటికే రెండుసార్లు వరుసగా గెలిచింది. వచ్చే ఏడాది కూడా గెలిచి హ్యాట్రిక్‌ కొట్టాలని చూస్తోంది. 2027 అసెంబ్లీ ఎన్నికల్లో యోగి ఆదిత్యనాథ్‌కు మూడోసారి అవకాశం కల్పించుకుని, 2029 లోక్‌సభలో ఘన విజయం లక్ష్యంగా పార్టీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. యూపీ అతిపెద్ద రాష్ట్రంగా 80+ లోక్‌సభ సీట్లతో కీలకం. ఇక్కడ హ్యాట్రిక్‌లే దేశ రాజకీయాల భవిష్యత్తు నిర్ణయిస్తుంది.

బెంగాల్‌ విజయం నేపథ్యం
పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ ప్రభుత్వం పతనం తర్వాత సువేందు అధికారి సీఎం కావడం బీజేపీకి భారీ ఆత్మవిశ్వాసం. ఈ గెలుపు హిందుత్వ, అభివృద్ధి వ్యూహాల విజయంగా మారింది. ఇప్పుడు యూపీలో 2017, 2022 విజయాలను మూడోసారి పునరావృతం చేయాలని పార్టీ లక్ష్యం. స్పంస్త్‌ గాంధీ, ప్రతిపక్షాల బలహీనతను పట్టుకుని బీజేపీ ముందస్తు చర్యలు ప్రారంభించింది.

కొత్త ఎన్నికల ఆయుధం
బీజేపీ యూపీలో పంచాయతీ, ఉప ఎన్నికల్లో ప్రయోగించిన ఫేషియల్‌ రికగ్నిషన్‌ సాంకేతికత గొప్ప విజయం వహించింది. ఓటర్‌ జాబితా డేటాబేస్‌తో ఏఐ పోలిక చేసి నకిలీ ఓట్లను ఆపడం సులభమైంది. తెలంగాణ స్థానిక ఎన్నికల్లోనూ విజయవంతమైంది. 2023–24 నుంచి పరీక్షల్లో ఒకరి పేరిట ఇతరుల రాతలను అరికట్టిన ఈ సాంకేతికత, 2027లో 2 లక్షలకుపైగా బూత్‌లలో అమలు చేస్తారు. ఈవీఎం, వీవీప్యాట్‌తో పాటు ఎస్‌వీఎన్‌(స్టేట్‌ వోటర్‌ నంబర్‌) అమలు తప్పుడు ఓట్లను పూర్తిగా తొలగిస్తుంది.

ఇప్పటికే సర్‌ అమలు..
ఉత్తరప్రదేశ్‌లో ఈసీ ఇప్పటికే సర్‌ పూర్తి చేసింది. దీంతో 15 శాతం ఓటర్లను తొలగించింది. ఇక వచ్చే ఎన్నికల్లో ఏఐ బేస్‌ ఫేషియల్‌ రికగ్నిషన్‌ అమలు చేయనుంది. దీంతో సమాజ్‌వాదీ పార్టీ బలంగా ఉన్న ప్రాంతాల్లో నకిలీ ఓట్లకు చెక్‌ పడుతుంది. దీంతో బీజేపీ గెలుపు ఈజీ అవుతుంది. ఈ సంస్కరణలు బీజేపీకి అనుకూలంగా పనిచేస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

బెంగాల్‌ విజయం బీజేపీకి యూపీలో హ్యాట్రిక్‌ అవకాశం తెచ్చిపెట్టింది. ఏఐ ఫేషియల్‌ రికగ్నిషన్‌ వంటి ఆధునిక సాంకేతికతలు నిస్పక్ష ఎన్నికలకు మార్గం సుగమం చేస్తాయి. ప్రతిపక్షాలు ఈ మార్పులకు తగ్గట్టు స్థానిక వ్యూహాలు రూపొందించాలి. యోగి మ్యాజిక్‌ మూడోసారి పునరావృతం అవుతుంది. 2029 లోక్‌సభలో బీజేపీ ఆధిపత్యం మరింత బలపడుతుంది. టెక్నాలజీ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తుందనే సందేశం ఈ ప్రయోగాల్లో స్పష్టంగా కనిపిస్తోంది.

Akhilesh Yadav Bengal Tour: అఖిలేష్‌ ఆకస్మిక బెంగాల్‌ పర్యటన… కీలక అగ్రిమెంట్‌ క్యాన్సిల్‌!

Akhilesh Yadav Bengal Tour: పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించిన తృణమూల్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని గవర్నర్‌ రద్దు చేశారు. తాను రాజీనామా చేసేది లేదన్న మమతా బెనర్జీతోపాటు ప్రభుత్వం మొత్తాన్ని రద్దు చేస్తున్నట్లు గరవ్నర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో మే 7వ తేదీ అర్ధరాత్రితో మమత పాలన అంతమైంది. రాజ్యాంగంలోని 174 అధికరణ, క్లాస్‌ 2, సబ్‌క్లాస్‌ 3 ఆధారంగా రద్దు చేశారు. మే 9న సువేందు అధికారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

ఎన్నికల ఓటమి నేపథ్యం..
ఏప్రి. 23, 29 తేదీల్లో రెండు దశల్లో జరిగిన ఎన్నికల్లో 92.47 శాతం పోలింగ్‌ రికార్డు సృష్టించింది. బీజేపీ ఎగ్జిట్‌ పోల్స్‌ ప్రకారాలను అధిగమించి స్పష్ట ఆధిక్యత సాధించింది. మమతా ‘ఓడలేదు, కుట్ర జరిగింది‘ అంటూ ఎన్నికల కమిషన్, కేంద్ర బలగాలపై ఆరోపణలు చేసి రాజీనామా నిరాకరించారు. రాహుల్‌ గాంధీ సమర్థనతో ధైర్యం చెందిన ఆమె, 15 సభ్యుల వాస్తవ పరిశీలన కమిటీ ఏర్పాటు చేసి పోరాటం కొనసాగిస్తామని ప్రకటించారు. గవర్నర్‌ రాజ్యాంగ పరిధుల్లో చర్య తీసుకుని ప్రజల ఆశీస్సులకు అందుకున్నారు.

అఖిలేష్‌–మమత రహస్య చర్చలు..
ఓటమి తర్వాత మమత పదవి తొలగించే కొన్ని గంటల ముందు ఆమె ఇంటికి అఖిలేష్‌ యాదవ్‌ వచ్చారు. మమతను ఓదార్చారు. అంతా మమత కోసమే వచ్చారనుకున్నారు. కానీ అఖిలేష్‌ వెళ్లిపోయిన తర్వాత పార్టీ చేసిన ప్రకటన ఆశ్చర్యానికి గురిచేసింది. ఐప్యాక్‌తో (ప్రశాంత్‌ కిశోర్, వీణా దీ) ఉన్న ఒప్పందాన్ని రద్దు చేస్తుమని ప్రకటించారు. మమత సమాజ్‌వాదీ పార్టీ వ్యూహాల ఫైల్‌ అందజేసి, 2027 యూపీ ఎన్నికలకు ముందుగా ఐప్యాక్‌ను తప్పించుకున్నారు. దీనికోసమే అఖిలేష్‌ వచ్చారని వర్గాల విశ్లేషణ.

ఐప్యాక్‌ మేనేజ్‌మెంట్‌ క్షీణత
2012–14లో బీజేపీ మోదీ తేజస్సును ఎత్తిచూపిన ఐప్యాక్‌ తర్వాత వ్యతిరేక పక్షాలకు మారి విఫలమైంది. బెంగాల్, డీఎంకే, వైసీపీ, ఏపీలో పార్టీలు–సీఎంలు ఘోరంగా ఓడిపోయారు. ఈడీ దాడులు, గెలిచినవారికి క్రెడిట్‌ ఆపాదన వల్ల నమ్మకం పోయింది. బీజేపీ 2014 తర్వాత దూరం చేసింది. చైతన్య, నారాయణ విద్యా సంస్థల్లా ‘మంచి విద్యార్థులను మరింత మెరుగుపరచి క్రెడిట్‌ తీసుకునే‘ వ్యూహం ఐప్యాక్‌కు కూడా వర్తించింది. ఇప్పుడు అది కాలం చెల్లిన సంస్థగా మారింది.

మమతా పతనం ప్రజాస్వామ్య విజయం, రాజ్యాంగ ఆధారాలపై గెలుపు. అఖిలేష్‌ ఆచరణాత్మకత రాష్ట్రీయ రాజకీయాల్లో కొత్త మార్గం. ఐప్యాక్‌ వంటి ’మ్యాజిక్‌ బులెట్‌’లపై ఆధారపడకుండా స్థానిక వ్యూహాలే గెలుపు రహస్యం. బీజేపీ ధైర్యం పెరిగినా, ప్రతిపక్షాలు అలయన్స్‌లతో ప్రతిఘటించాలి. లేకపోతే, దేశ విధానాలు ఏకపక్షంగా సాగతాయి.

Sakshi Media: సాక్షిని తగులుకున్న ఆ ఇద్దరు!

Sakshi Media: మీడియాలో కూడా విభజన రేఖ కనిపిస్తోంది. రాజకీయ పార్టీలకు అనుకూలంగా మీడియా మారుతోంది. పార్టీకి ఒక ఛానల్, ఒక పత్రిక అన్నట్టు పరిస్థితి మారింది. అందుకే మీడియాపై కూడా.. ఎల్లో మీడియా, నీలి మీడియా, కూలి మీడియా అంటూ ముద్రలు వేస్తున్నారు. అయితే ఏపీలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి కరపత్రంగా మారిపోయింది సాక్షి. మిగతా రాజకీయ పార్టీలకు అనుకూలంగా మీడియాలు ఉన్నా.. సాక్షి మీడియా మాత్రం అడ్డగోలుగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి కరపత్రమే. అయితే ఆ మీడియా వైసీపీకి లాభం కంటే నష్టం ఎక్కువ అని కామెంట్స్ వినిపిస్తున్నాయి. అది కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుకూల విశ్లేషకుల నుంచి.. తరచూ ఆ మీడియా డిబేట్ లలో పాల్గొనే విశ్లేషకుల నోటి నుంచి. నిత్యం సాక్షిలో కనిపించే కేఎస్ ప్రసాద్, పాషాలు సాక్షిని ఓ రేంజ్ లో వేసుకుంటున్నారు. సాక్షి మీడియాతో వైసిపికి నష్టం అని వాదిస్తున్నారు.

* రాజశేఖర్ రెడ్డి సీఎం అయిన తర్వాత..
రాజశేఖర్ రెడ్డి (Y S Rajasekhara Reddy ) ముఖ్యమంత్రి అయిన తర్వాత సాక్షి మీడియా తెరపైకి వచ్చింది. తన కుమారుడు జగన్మోహన్ రెడ్డితో సాక్షి పత్రికను పెట్టించారు. ఆపై సాక్షి టీవీ ఛానల్ కూడా అందుబాటులోకి వచ్చింది. అప్పటివరకు ఈనాడు, ఆంధ్రజ్యోతి హవా నడిచేది. వాటికి చెక్ పెట్టి.. ఈనాడు కుమించి చూపించాలన్న ప్రయత్నంలో.. చాలా రకాల ప్రయోగాలు చేశారు. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి సాక్షి పత్రికను రూపాయికి విక్రయించేవారు. అయితే తాను ఒక్కడినే కాదు మిగతా పత్రికలు కూడా ధరలను తగ్గించాలని కోరేవారు. అయితే వైసిపి ఆవిర్భావం తర్వాత సాక్షి పత్రిక, మీడియా స్వరూపమే మారిపోయింది. రాజశేఖర్ రెడ్డి ఫోటోను ప్రచురించి వేసుకునేవారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సర్క్యులేషన్ పెంచేందుకుగాను ఉచితంగా అందించేవారు. ఇలా రకరకాల ప్రయోగాలతో ప్రత్యర్థి పత్రికలతో పాటు టీవీ ఛానళ్లను దెబ్బతీయాలని చూసారు. కానీ అవేవీ వర్కౌట్ కాలేదు.

* విశ్లేషకులు గా ఆ ఇద్దరు..
సాక్షి మీడియా( Sakshi media) అనేసరికి దిగ్గజ జర్నలిస్టులు కనిపించే వారు కాదు. ముఖ్యంగా టీవీ ఛానల్ డిబేట్లకు కొంతమంది ఎంపిక చేసిన వారే వచ్చేవారు. అందులో కేఎస్ ప్రసాద్ ఒకరు. మరొకరు పాషా. మంచి వాగ్దాటితో ఇద్దరు విశ్లేషకులుగా చలామణి అయ్యారు సాక్షి టీవీ ద్వారా. కానీ ఇటీవల వారిని తప్పించి.. కొత్తగా కొంతమంది విశ్లేషకులను ఛానల్ కు రప్పించి డిబేట్లో మాట్లాడిస్తున్నారు. కేఎస్ ప్రసాద్ తో పాటు పాషాను పక్కన పెట్టినట్లు మీడియా వర్గాల్లో ప్రచారం నడుస్తోంది. అయితే ఆ ఇద్దరూ ఇప్పుడు సాక్షితో పాటు వైసీపీకి వ్యతిరేకంగా గళం ఎత్తుతున్నారు. సాక్షితో వైసిపికి నష్టమే కానీ ఎటువంటి ప్రయోజనం లేదని తేల్చి చెబుతున్నారు. వారికి చెల్లింపుల విషయంలో తేడా రావడం.. గతం మాదిరిగా ప్రాధాన్యం ఇవ్వకపోవడం వంటి కారణాలతోనే ఆ ఇద్దరూ ఇప్పుడు ఎదురు తిరిగినట్లు తెలుస్తోంది.

Janasena Key Appointments: జనసేనలో కీలక నియామకాలు!

Janasena Key Appointments: జనసేన అధినేత పవన్ కళ్యాణ్( deputy CM Pawan Kalyan) కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. పార్టీ బలోపేతం పై ఫుల్ ఫోకస్ పెట్టారు. అందులో భాగంగా రాష్ట్రస్థాయిలో 11 మందితో కమిటీలను ఏర్పాటు చేశారు. డీలిమిటేషన్ ప్రక్రియతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ కమిటీలు పార్టీ శ్రేణులతో సమావేశం అవుతాయి. హై కమాండ్ కు నివేదికలు అందిస్తాయి. త్వరలో 175 నియోజకవర్గాల ఇన్చార్జిలతో పాటు జిల్లాల అధ్యక్షులను సైతం నియమిస్తారు. అంతకుముందు జిల్లాల వారీగా బాధ్యతలు కట్టబెట్టారు పవన్ కళ్యాణ్. పార్టీలో సీనియర్లతో పాటు ఎమ్మెల్యేలకు సైతం ఈ కమిటీలు స్థానం కల్పించారు. ప్రాంతాలవారీగా నేతలకు ఈ బాధ్యతలు కట్టబెట్టారు.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి జనసేన లోకి వచ్చిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి, సామినేని ఉదయభాను కు సైతం బాధ్యతలు కట్టబెట్టారు.
* ఉమ్మడి అనంతపురం, కడప, కర్నూలు, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల బాధ్యతలను మాజీమంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి, ఆరణి శ్రీనివాస్, టిసి వరుణ్ లను నియమించారు.
* ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లా బాధ్యతలను కొణతాల రామకృష్ణ, వంశీకృష్ణ శ్రీనివాస్, పంచకర్ల రమేష్ బాబులకు అప్పగించారు.
* పశ్చిమ, తూర్పుగోదావరి జిల్లాల బాధ్యతలను పంతం నానాజీ, బొలిశెట్టి శ్రీనివాస్, కొటికలపూడి గోవిందరావు లకు అప్పగించారు.
* ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల బాధ్యతలను నాదెండ్ల మనోహర్, సామినేని ఉదయభానులకు అప్పగించారు.
* వచ్చేవారం రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల ఇన్చార్జిలు, జిల్లాల అధ్యక్షులను నియమించనున్నారు.

Balineni Srinivasa Reddy: బాలినేని పై ఆ ప్రచారానికి చెక్ పెట్టిన పవన్

Balineni Srinivasa Reddy: వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీకి గుడ్ బై చెప్పి జనసేనలో చేరారు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి. అయితే చేరి చాలా రోజులు అవుతున్న జనసేనలో పెద్దగా ప్రాధాన్యం లేదు. ఎటువంటి పదవి కూడా దక్కలేదు. దీంతో బాలినేని తీవ్ర అసంతృప్తికి గురైనట్లు వార్తలు వచ్చాయి. బాలినేని భార్యతో పాటు కుమారుడు జగన్మోహన్ రెడ్డి వద్దకు వెళ్లి మళ్లీ పార్టీలోకి వస్తామని విజ్ఞప్తి చేసినట్లు కూడా ప్రచారం నడిచింది. జగన్మోహన్ రెడ్డి అందుకు అంగీకరించలేదన్న టాక్ కూడా వచ్చింది. ఎందుకంటే బాలినేని జగన్మోహన్ రెడ్డికి సమీప బంధువు. దీంతో బాలినేని మరోసారి జగన్మోహన్ రెడ్డి గూటికి చేరిపోతారన్న ప్రచారం పెద్ద ఎత్తున సాగింది. అయితే దానికి చెక్ చెబుతూ పవన్ కళ్యాణ్ బాలినేని శ్రీనివాస్ రెడ్డి కి కీలక బాధ్యతలు కట్టబెట్టారు. మరో ఇద్దరి నేతలతో కలిసి దాదాపు 6 జిల్లాల బాధ్యతలను అప్పగించారు. అయితే స్థానిక సంస్థల ఎన్నికల తో పాటు డీ లిమిటేషన్ పై పార్టీ శ్రేణుల అభిప్రాయాలు తెలుసుకునేందుకు గాను కమిటీలు ఏర్పాటు చేశారు. అందులో బాలినేనికి చోటిచ్చారు.

* సుదీర్ఘ నేపథ్యం..
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో సుదీర్ఘకాలం రాజకీయాలు చేశారు బాలినేని శ్రీనివాస్ రెడ్డి. 2004లో తొలిసారిగా కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి గెలిచారు. రాజశేఖర్ రెడ్డి ప్రోత్సాహంతో యువజన కాంగ్రెస్ లో ఉన్న బాలినేనికి అలా అవకాశం దక్కింది. 2009లో రెండోసారి పోటీ చేసిన ఆయనకు విజయం దక్కడంతో మంత్రిగా ఛాన్స్ ఇచ్చారు రాజశేఖర్ రెడ్డి. ఇంతలోనే రాజశేఖర్ రెడ్డి అకాల మరణం.. తర్వాత కాంగ్రెస్ పార్టీని విభేదించి జగన్మోహన్ రెడ్డి సొంత పార్టీని ఏర్పాటు చేసుకోవడంతో.. మంత్రి పదవిని వదులుకొని మరి బాలినేని శ్రీనివాస్ రెడ్డి జగన్ వెంట అడుగులు వేశారు. అందుకే జగన్మోహన్ రెడ్డి 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి పదవి కట్టబెట్టారు బాలినేనికి.

* వైసీపీలోకి వెళ్లిపోతారని ప్రచారం
బాలినేని శ్రీనివాస్ రెడ్డి అనూహ్య పరిస్థితుల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన చాలా రోజుల తర్వాత ఆ పార్టీని వీడి జనసేనలో చేరారు. జగన్మోహన్ రెడ్డిని విభేదించి మరి పార్టీలో చేరిన ఆయన అదే జగన్ పై తీవ్ర విమర్శలు కూడా చేశారు. అయితే ఏ పదవి ఆశించి జనసేనలో చేరారో తెలియదు కానీ.. బాలినేనికి అనుకున్నంత ప్రాధాన్యత తగ్గలేదు జనసేనలో. తిరిగి వైసీపీలోకి వెళ్లిపోతారని పెద్ద ఎత్తున ప్రచారం మాత్రం జరిగింది. ఒకరిద్దరూ పెద్దలు కలుగజేసుకుని తిరిగి బాలినేనిని వైసీపీలోకి తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నట్లు కూడా ఇచ్చింది. అటు బాలినేని రాకను జనసేన వర్గాలు వ్యతిరేకిస్తున్నాయి. ఒంగోలు టిడిపి ఎమ్మెల్యే సైతం వ్యతిరేకిస్తున్నారు. పెద్దగా ప్రభుత్వంలో ప్రాధాన్యం లేకుండా పోవడంతో బాలినేని తిరిగి వైసీపీలో చేరుతారని టాక్ నడిచింది. కానీ ఇప్పుడు ఆరు జిల్లాల బాధ్యతలను ఆయనకు కట్టబెట్టడం చూస్తుంటే.. మున్ముందు మరిన్ని బాధ్యతలు ఇచ్చే అవకాశం ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో..

YSR Congress: వైసీపీకి టచ్ లోకి కూటమి ఎమ్మెల్యేలు!

YSR Congress: వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీకి కొంత మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారా? కూటమి పార్టీ ఎమ్మెల్యేలు ఆ పరిస్థితుల్లో ఉన్నారా? పొలిటికల్ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. కొంతమంది వైసీపీ సోషల్ మీడియా సైన్యం దీనిపైనే ప్రచారం చేస్తోంది. కూటమి తరుపున 164 మంది గెలిచారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఒకరిద్దరి ఎమ్మెల్యేల వ్యవహార శైలి అందరికీ తెలిసిందే. ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే పై లైంగికపరమైన ఆరోపణలు రావడంతో పార్టీ పక్కన పెట్టింది. మరోవైపు ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే వ్యవహారం కూడా వివాదాస్పదంగా మారింది. ఆయనను టిడిపి హై కమాండ్ పెద్దగా పట్టించుకోలేదు. అటువంటివారు వైసీపీకి టచ్ లోకి వెళ్లినా వెళ్లి ఉంటారు. తెలుగుదేశం పార్టీ నాయకత్వం పెద్దగా పట్టించుకునే స్థితిలో మాత్రం లేదు. కానీ అటువంటి వారితో వైసీపీ ఏం రాజకీయం చేయగలదు తెలియాలి మరి.

* అప్పట్లో నలుగురు.
సరిగ్గా వైసిపి అధికారంలో ఉన్నప్పుడే నెల్లూరు జిల్లాకు చెందిన ఇద్దరు సీనియర్ ఎమ్మెల్యేలు ఆ పార్టీ నాయకత్వంతో విభేదించారు. వారే ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. వైసిపి పాలనకు ఇంకా 16 నెలల కాలం ఉండగానే వారు ఆ పార్టీని…ప్రభుత్వాన్ని వ్యతిరేకించారు. వారితో పాటు అదే జిల్లాకు చెందిన మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, గుంటూరు జిల్లాకు చెందిన ఉండవల్లి శ్రీదేవి అసమ్మతి స్వరం వినిపించారు. అయితే అందులో ఆనం రామనారాయణరెడ్డి తో పాటు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీశారు. అయితే వారికి రాజకీయంగాను మంచి పట్టు ఉంది. అన్నింటికీ మించి క్రెడిబిలిటీ ఉంది. అయితే ఇప్పుడు వైసిపి ప్రచారం చేస్తున్నట్టుగా టిడిపి ఎమ్మెల్యేలు టచ్లోకి వచ్చారని అనుకుందాం. అయితే వారు టిడిపి వద్దనుకున్న తర్వాత మాత్రమే టచ్ లోకి వచ్చినట్లు అవుతుంది . అటువంటి వారు టచ్ లోకి వస్తే ఎంత? రాకపోతే ఎంత అనే వాదన వినిపిస్తోంది.

* ఎంతవరకు ప్రయోజనం..
ఎమ్మెల్యేలు పార్టీ మారడం వల్ల కొత్తగా వచ్చే ప్రయోజనం ఎవరికి ఉండదు. 2014 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత టిడిపిలోకి 23 మంది ఎమ్మెల్యేలు ఫిరాయించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. అటు తరువాత 2019 ఎన్నికల్లో అదే వైసిపి బంపర్ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. 2019లో అధికారంలోకి వచ్చిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి నలుగురు టిడిపి ఎమ్మెల్యేలు ఫిరాయించారు . కానీ 2024 ఎన్నికల్లో టిడిపి బంపర్ మెజారిటీతో గెలిచింది. ఎమ్మెల్యేలు పార్టీ మారినంత మాత్రాన వారితో వచ్చే ప్రయోజనం ఉండదు. కానీ రాజకీయంగా ప్రభావం చూపే నేతలతో మాత్రం కొంచెం ప్రయోజనం ఉంటుంది. అయితే ఎప్పటికీ ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి టచ్ లోకి వెళ్లాల్సిన పరిస్థితి ఎమ్మెల్యేలకు లేదు. ఒకరిద్దరూ పై టిడిపి హై కమాండ్ అనధికార బహిష్కరణ వేసిన నేపథ్యంలో.. వారికి పొలిటికల్ గా అంత ప్రాధాన్యత లేకపోయినా నేపథ్యంలో అటువంటి వారు టచ్లోకి వెళ్లిన ఆశ్చర్యపోనవసరం లేదు. అయితే వారితో వైసీపీకి వచ్చే ప్రయోజనం ఏమీ లేదు. లోలోపల ఆనందం తప్ప..

Bajaj Chetak: అప్పట్లో కలల స్కూటర్.. ఇప్పుడు ఫుల్ డిమాండ్.. జనాలు కొనేందుకు ఎగబడుతున్నారు..

0

Bajaj Chetak: స్కూటర్ విభాగంలో Bajaj కంపెనీ ప్రజల మనసును దోచుకుంది. ముఖ్యంగా నేటి కాలంలో ఎక్కువగా స్కూటర్లను ఆదరిస్తున్న తరుణంలో ఈ కంపెనీ నుంచి Chetak మార్కెట్లోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే మొదట్లో దీని ఆదరణ తక్కువగా ఉన్నప్పటికీ.. ఆ తర్వాత అమ్మకాల్లో ఊహించని అభివృద్ధి సాధిస్తుంది. ఇది మార్కెట్లోకి వచ్చిన ఆరేళ్లలో 7 లక్షలకు పైగా స్కూటర్లను విక్రయించి ప్రత్యేకత సాధించింది. ముఖ్యంగా గత రెండు సంవత్సరాల్లోనే అత్యధిక అభివృద్ధి సాధించడం విశేషం. ఈ స్కూటర్ గురించి పూర్తి వివరాల్లోకి వెళితే..

Bajaj కంపెనీ నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్ ను 2020లో మార్కెట్లోకి తీసుకువచ్చారు. అయితే ఈ సమయంలో అప్పటికే మార్కెట్లో ఓలా, Ather వంటి స్కూటర్ లో అత్యధికంగా అనే అవుతున్నాయి. కొత్తలో వీటి ధాటికి తట్టుకోలేకపోయిన chetak 2025 నుంచి అమ్మకాలు జోరందుకున్నాయి. 2025 ఆర్థిక సంవత్సరంలో ఈ స్కూటర్ అమ్మకాలు 114 శాతం వృద్ధి సాధించడం విశేషం. 2024 ఆర్థిక సంవత్సరంలో 1.11 లక్షల స్కూటర్లు విక్రయిస్తే.. 2025 లో 2.39 లక్షల యూనిట్లలో సేల్స్ చేశారు. 2026 ఆర్థిక సంవత్సరంలో 2.98 లక్షల స్కూటర్లు అమ్ముడుపోయాయి. దీంతో ఈ స్కూటర్ మొత్తం 7,27,779 యూనిట్లు విక్రయించినట్లు అయింది.

ఇప్పటివరకు ఓలా ఎలక్ట్రిక్, టీవీఎస్ మోటార్స్ మాత్రమే 7 లక్షల మార్క్ ను దాటాయి. ఇప్పుడు వాటి సరసన బజాజ్ చేతక్ చేరడం విశేషం. అంతేకాకుండా 2026 లో ప్రముఖ ఎలక్ట్రిక్ కంపెనీ Ather కంటే పై చేయి సాధించడం విశేషంగా చెప్పుకుంటున్నారు. ఈ స్కూటర్ కు ఆదరణ పెరగడానికి ఇందులో ఉండే స్పెషల్ ఫీచర్లే కారణం అని అంటున్నారు. ఇందులో C సిరీస్ పేరుతో మెరుగైన ఫీచర్లను అమర్చారు. ఈ సిరీస్ ప్రకారం గంటకు 80 కిలోమీటర్ల టాప్ స్పీడ్ తో ప్రయాణం చేయవచ్చు. దీనిని ఒక్కసారి చార్జింగ్ చేస్తే 113 నుంచి 155 కిలోమీటర్ల వరకు మైలేజ్ ను అందిస్తాయి. అంతేకాకుండా సి సిరీస్ ప్రకారం హిల్ హోల్డ్ అసిస్టు ఉండనుంది. అలాగే ఎకో, స్పోర్ట్ రైడింగ్ మోడ్స్ తో ఉండనున్నాయి.

ఫీచర్లు మాత్రమే కాకుండా ఈ స్కూటర్ ధర కూడా మిగతా వాటి కంటే తక్కువగా ఉండడంతో ప్రజల నుంచి ఆదరణ పెరిగింది. ప్రస్తుతం దీనిని రూ.96,504 నుంచి రూ.1.39 లక్షల వరకు విక్రయిస్తున్నారు.

Nithin: నితిన్ మూవీ ఆగిపోయిందా…అతనికే ఎందుకిలా జరుగుతుంది…

Nithin: తెలుగు సినిమా ఇండస్ట్రీలో గత 25 సంవత్సరాలుగా ఎనలేని సేవలను అందిస్తూ ముందుకు దూసుకెళ్తున్న నటుడు నితిన్…జయం సినిమాతో మొదటి సక్సెస్ ని సాధించిన ఆయన అప్పటినుంచి ఇప్పటివరకు వరుస సినిమాలు చేస్తూనే ఉన్నాడు. మధ్యలో కొన్ని ప్లాప్ లు వచ్చినా కూడా తను పట్టు వదలని విక్రమార్కుడిలా సినిమాలను చేస్తూనే వచ్చాడు. మొత్తానికైతే 13 ప్లాప్ ల తర్వాత ఇష్క్ సినిమాతో బ్రేక్ వచ్చింది. అప్పటినుంచి ఆయనకు ఒక సక్సెస్ వస్తే నాలుగైదు ఫ్లాపులు రావడం ఆనవాయితీగా మారిపోయింది. ఇక ప్రస్తుతం వరుసగా 6 ప్లాపులను మూట గట్టుకున్న ఆయన ఇప్పుడు చేసే సినిమాల విషయంలో ఆచితూచి మరి అడుగులు వేస్తున్నాడు. విఐ ఆనంద్ డైరెక్షన్ లో ఒక సినిమా చేయడానికి సిద్ధమైన నితిన్ ఆ మూవీలో గ్రాఫిక్స్ వర్క్ ఎక్కువగా ఉండటం వల్ల సినిమా బడ్జెట్ అయితే విపరీతంగా పెరిగిపోతుందట. దానివల్ల ప్రొడ్యూసర్స్ సేఫ్ జోన్ లో ఉండాలంటే నితిన్ మార్కెట్ ను మించి బడ్జెట్ ను పెట్టే అవకాశం లేదని తేల్చి చెప్పినట్టుగా తెలుస్తుంది.

ఇక ఇలాంటి క్రమంలోనే ఆ కథని వదులుకోవడం నితిన్ కి ఇష్టం లేకపోయిన అంత తక్కువ బడ్జెట్లో సినిమా చేయడం విఐ ఆనంద్ కి నచ్చలేదట. దానివల్ల ఈ సినిమా అయితే తాత్కాలికంగా ఆగిపోయింది. దాంతో నితిన్ నాగ వంశీ బ్యానర్ లో ఒక సినిమా చేయాల్సి ఉంది.

అందుకోసం ఒక కొత్త దర్శకుడు చెప్పిన కథ నాగవంశీ కి బాగా నచ్చడంతో నితిన్ కి ఆ కథను వినిపించి ఆ కథను లాక్ చేశాడు. మొత్తానికైతే ఇప్పుడు నాగ వంశీ బ్యానర్లో నితిన్ ఒక సినిమా చేస్తున్నాడు. విఐ ఆనంద్ డైరెక్షన్లో చేయాల్సిన సినిమా ప్రస్తుతానికైతే ఆగిపోయింది. వేరే ప్రొడ్యూసర్ ను తీసుకొని వచ్చి నితిన్ తో ఈ సినిమా చేయగలుగుతాడా?

లేదంటే వేరే హీరోతో ఈ సినిమా చేసే అవకాశం ఉందా అనేది తెలియాల్సి ఉంది… ఇదంతా చూసిన ప్రేక్షకులు మాత్రం నితిన్ విషయంలోనే ఎందుకిలా జరుగుతుంది. ప్రతి సినిమా విషయంలో అతనికి బ్యాడ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. సినిమాలు ప్లాప్ అవ్వడం, సినిమాలు ఆగిపోవడం ఇవన్నీ అతనికే జరుగుతున్నాయంటూ మరి కొంతమంది కామెంట్లు చేస్తున్నారు…

BLA Attacks: బలూచ్‌ దెబ్బ.. పాకిస్తాన్‌ అబ్బ.. ఉ*చ్ఛ పోసుకుంటున్న ఆర్మీ!

BLA Attacks: పాకిస్తాన్‌లో బలూచ్‌ స్వాతంత్య్ర సైనికుల దాడులు ఆ దేశ ఐక్యతకు తీవ్ర ఆధిపత్య ముప్పుగా మారాయి. ఏప్రిల్‌ 25 నుంచి మే 4 వరకు 11 చోట్ల గెరిల్లా దాడులతో పాక్‌ సైన్యం, పంజాబ్‌ నాయకత్వం దెబ్బలు తాకుతున్నాయి. ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్‌ సరిహద్దుల్లో ఉండి, గ్వాదర్‌ పోర్టు, పస్ని బేస్‌తో కీలకమైన ఈ ప్రాంతం విడిపోతే పాకిస్తాన్‌ ఆర్థిక–కాంటినెంటల్‌ ఆధారాలు కుప్పకూలే ప్రమాదం ఉంది.

భారీగా ఆస్తినష్టం..
బలూచ్‌ లిబరేషన్‌ ఆర్మీ (బీఎల్‌ఏ) ఆధ్వర్యంలో టెలికామ్‌ టవర్లు, మిలిటరీ క్యాంపులు, ప్రభుత్వ ఆస్తులపై దాడులు జరిగాయి. నాలుగు ఐఈడీ దాడులతో 11 మంది సైనికులు మరణించారు. ముగ్గురు ఇంటెలిజెన్స్‌ అధికారులు బందీలుగా పట్టుపడ్డారు. పంచ్‌గుర్‌ మెయిన్‌ రోడ్‌ను రెండు రోజులు దిగ్బంధనం చేసి, సంపద తరలణ ట్రక్కులను దగ్ధం చేశారు. దల్‌బందీ, కళాత్, చండీ, లోడీ, అల్మా ప్రాంతాల్లో గ్రెనేడ్, కాల్పుల దాడులు జరిగాయి. బలూచ్‌ వైపు కేవలం ముగ్గురు (అసద్‌ జమాలుద్దీన్, షకీల్‌ రహ్మాన్, షేక్‌ మింగల్‌) మరణించారు, వీరిని అమరులుగా ప్రకటించారు.

పాక్‌ సైన్య ప్రతిస్పందన
పాక్‌ ప్రభుత్వం అదనపు సైన్యం పంపాలని ఆలోచిస్తోంది, బందీల విడుదలకు ప్రయత్నాలు లేవు. పఠాన్‌ సైనికులకు ‘పోరాడండి, చావండి‘ ఆదేశాలు జారీ చేసి, సెలవులు రద్దు చేశారు. అమాయక బలూచ్‌ యువకులు, వృద్ధులు, పిల్లలను కిడ్నాప్‌ చేసి ఐదారు వేల మందిని చంపేశారని ఆరోపణలు ఉన్నాయి. మే 1న భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు.

బలూచ్‌ ఆస్తులు దోచుకుంటోందని..
బలూచిస్తాన్‌ సంపద (గ్యాస్, కనీమాలు) పంజాబ్‌ చొరబడి తీసుకుంటోందని బలూచ్‌ ఆరోపణలు. చైనా సీపీఈసీ ప్రాజెక్టు ద్వారా ప్రాంతాన్ని ఆక్రమించాలనే ప్రయత్నం తిరుగుబాటును ఊపింది. పాక్‌ సైన్యం బలూచ్, పఠాన్‌ల మధ్య విభేదాలను పెంచుతూ, అణచివేతకు పాల్పడుతోంది.

పాకిస్తాన్‌ ఈ తిరుగుబాటును అణచివేయాలంటే రాజకీయ సంభాషణలే మార్గం. సైనిక దాడులు విభజనను వేగవంతం చేస్తాయి. అంతర్జాతీయ సమాజం ఈ మానవ హక్కుల ఉల్లంఘనలపై దృష్టి పెట్టాలి. లేకపోతే, పాక్‌ మరో బంగ్లాదేశ్‌లా విడిపోతుంది.

West Bengal Violence: తీరని టీఎంసీ రక్తదాహం.. ఎన్నిల్లో ఓడినా ఆగని దాడులు..

West Bengal Violence: పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీజేపీ కార్యకర్తలపై తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ) మద్దతుదారుల దాడులు ఆగకపోవడం రాష్ట్ర రాజకీయాల్లో ఆందోళన పెంచుతోంది. ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజు నుంచే టీఎంసీ నేతలు బీజేపీ కార్యకర్తలే లక్ష్యంగా దాడులు చేస్తున్నారు. ఇప్పటికే నలుగురిని హత్య చేశారు. సీసీటీవీల ద్వారా నిందితులు గుర్తించబడటం ఈ దాడుల వెనుక రాజకీయ కుట్రలను సూచిస్తోంది. ఇది ప్రజాస్వామ్య విలువలపై ప్రత్యక్ష దాడి, రాష్ట్రంలో భద్రతా వ్యవస్థ బలహీనతను బయటపెడుతోంది.

ఎన్నికల హింసా దండయాత్ర
ఎన్నికల సమయంలో హౌరా, బీర్భూమ్‌ ప్రాంతాల్లో బీజేపీ–టీఎంసీ మద్దతుదారుల మధ్య ఘర్షణలు జరిగాయి. ఫలితాల తర్వాత మాల్దా జిల్లా ఇల్లిస్‌ బజార్‌లో ముస్లిం మెజారిటీ ప్రాంతంలో 28 ఏళ్ల కిషన్‌ హల్దార్‌ను టీఎంసీ సానుభూతి గల వ్యక్తులు చంపేశారు. సీసీటీవీలు గులామ్‌ హైదర్‌ కుమారుడు సుమన్‌ హైదార్‌తోపాటు మరికొందరిని గుర్తించాయి. కొందరు అరెస్టయ్యారు, మిగతా నిందితులు పరారీలో ఉన్నారు. ఇక బీజేపీ నేత సువేందు అధికారి పీఏ చంద్రకాంత్, రోహిత్‌ను చంపేశారు. టీఎంసీ నేత మధు మండల్‌ బీజేపీ కార్యకర్త కమల్‌ మండల్‌ను చంపేశాడు. మొత్తంగా నలుగురు మరణించారు. ఐదుగురు భద్రతా సిబ్బంది గాయపడ్డారు.

రాజకీయ ఆరోపణలు..
బీజేపీ నేతలు టీఎంసీ ’పార్టీ సొసైటీ’ వ్యవస్థను ఈ హింసకు మూల కారణంగా చెబుతున్నారు. ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిన నిర్దిష్ట ప్రాంతాల్లో ఈ దాడులు ఎక్కువగా జరుగుతున్నాయి. టీఎంసీ మాత్రం వీటిని వ్యక్తిగత కక్షలు, బీజేపీ కుట్రలుగా వర్గీకరిస్తోంది. సీసీటీవీలు, పోలీసు చర్యలు ఈ ఆరోపణలకు ఆధారాలు అందిస్తున్నాయి.

కేంద్ర ప్రతిస్పందన
పోలీసులు సీసీటీవీ ఫుటేజీలతో నిందితులను గుర్తించి అరెస్టులు చేశారు. ఎన్నికల సమయంలోనూ ఇలాంటి ఘటనలు జరిగి, ఇప్పుడు కొనసాగుతున్నాయి. కేంద్రం ఈ హింసపై ఆందోళన వ్యక్తం చేస్తూ, పోలీసులకు భద్రతా సలహాలు ఇచ్చింది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రభుత్వం ఈ దాడులను అరికట్టడంలో విఫలమవుతోందని విమర్శలు ఎక్కువవుతున్నాయి.

ఈ హింస ఎన్నికల పరాజయాన్ని జీర్ణించుకోలేని టీఎంసీ భయానికి చిహ్నం. ప్రజాస్వామ్యంలో విజయం–పరాజయాలు సహజం. దాడులు మాత్రం అసహ్యం. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వెంటనే ఈ గూండా రాజ్‌ను అరికట్టాలి. కేంద్రం, సుప్రీం కోర్టు జోక్యం తప్పనిసరి. లేకపోతే, బెంగాల్‌ ప్రజల భద్రతా హక్కులు మాయమవుతాయి.

Prashant Kishor: ప్రశాంత్ కిషోర్ కోసం వైసిపి భగీరథ ప్రయత్నం!

Prashant Kishor: ఏ రంగంలోనైనా క్రెడిబిలిటీ ( credibility) ముఖ్యం. అది కోల్పోతే మాత్రం ఎవరు నమ్మరు. నమ్మే పరిస్థితి ఉండదు. ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అలానే ఉంది. మొన్నటి ఎన్నికల్లో ఓటమితో ఆ పార్టీ పూర్తిగా జీరో అయింది. ఆ పార్టీతో కలిసి వచ్చేవారు కూడా కరువవుతున్నారు. చివరకు సలహాలు ఇచ్చేందుకు కూడా ఎవరు ముందుకు రాని పరిస్థితి. అయితే ఇప్పుడు ఒకప్పటి తన వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆశ్రయించినట్లు తెలుస్తోంది. వందల కోట్ల రూపాయలు ఆఫర్ పెట్టినట్లు పొలిటికల్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలం, బలహీనత తెలిసిన వ్యక్తిగా ప్రశాంత్ కిషోర్ అయితే గట్టెక్కించగలరు అనేది ఆ పార్టీ నమ్మకం. అయితే వరుసగా ఇటీవల ప్రశాంత్ కిషోర్ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. యూట్యూబ్ ఇంటర్వ్యూలలో ఇకముందు జగన్మోహన్ రెడ్డికి పనిచేసేది లేదని తేల్చి చెప్పారు. కానీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రం పట్టు వదలని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తూనే ఉంది.

* మంచి ట్రాక్ రికార్డ్..
ప్రశాంత్ కిషోర్ కు( Prashant Kishore ) మంచి ట్రాక్ రికార్డు ఉంది. ఆయన వ్యూహాలతో ఎన్నో రాజకీయ పార్టీలు అధికారంలోకి వచ్చాయి. ముఖ్యంగా 2019లో జగన్మోహన్ రెడ్డి అద్భుత విజయం వెనుక పీకే వ్యూహాలు పనిచేశాయి అనేది బహిరంగ రహస్యం. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత అదే ప్రశాంత్ కిషోర్ ను పట్టించుకోవడం మానేశారు జగన్మోహన్ రెడ్డి.. వారిద్దరి మధ్య తీవ్ర మనస్పర్ధలు కూడా వచ్చాయి. అందుకే ప్రశాంత్ కిషోర్ మొన్నటి ఎన్నికల్లో కూటమికి అనుకూలంగా వ్యాఖ్యానాలు చేశారు. జగన్మోహన్ రెడ్డి తప్పకుండా ఓడిపోతారని జోష్యం చెప్పారు. మనస్పర్ధలు కారణంగానే ఆయన చంద్రబాబుతో నేరుగా భేటీ అయ్యారు. కూటమికి అనుకూలంగా కొన్ని రకాల సంకేతాలు పంపారు. అయితే తాజాగా తమిళనాడులో విజయ్ విజయం వెనుక పీకే సలహాలు సూచనలు ఉన్నాయి. అందుకే ఇప్పుడు పీకే కోసం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చాలా రకాల ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.

* పార్టీ ఫండింగ్ కోసం..
ప్రశాంత్ కిషోర్ తన సొంత రాష్ట్రం బీహార్లో జన్ సూరజ్ ( Jan Suraj )పార్టీని ఏర్పాటు చేసుకున్నారు. అయితే అక్కడ విజయం అందుకునే క్రమంలో చతికిల పడ్డారు. మొన్నటి ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయారు. తన వ్యూహాలతో ఎంతోమందికి విజయం అందించిన ఆయన మాత్రం.. స్వీయ విజయాన్ని పొందలేకపోయారు. అయితే తన ప్రాంతీయ పార్టీని కాపాడుకునేందుకుగాను ఆయనకు ఇప్పుడు డబ్బులు అవసరం. ఎట్టి పరిస్థితుల్లో జన్ సూరజ్ కొనసాగుతుందని.. ఆస్తులు అమ్ముకొని అయినా పార్టీని నడిపిస్తానని ప్రశాంత్ కిషోర్ ప్రకటన చేశారు. అయితే ఈ ఒక్క కారణాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుంటోంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. భారీ మొత్తంలో ప్రశాంత్ కిషోర్ కు ఆఫర్ చేసినట్లు పొలిటికల్ వర్గాల్లో ప్రచారం నడుస్తోంది. అయితే రాజకీయాల్లో విలువలు విశ్వసనీయతలకు కొంత పెద్దపీట వేయాల్సి ఉంటుంది. ఎన్నో రాజకీయ పక్షాలకు విజయాలు అందించిన ప్రశాంత్ కిషోర్ కు ఇది తెలియంది కాదు. అందుకే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆఫర్లను సున్నితంగా తిరస్కరిస్తున్నట్లు ప్రచారంలో ఉంది. కానీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రం అదే పనిగా ప్రయత్నాలు చేస్తోంది ప్రశాంత్ కిషోర్ కు. మరి ఆయన ఎలా వ్యవహరిస్తారో చూడాలి..

Mahesh Babu: మహేష్ బాబు కోసం ఎన్టీఆర్ ఆ మూవీని చేయకుండా వదిలేశాడా…

Mahesh Babu: తెలుగు సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబుకి చాలా మంచి క్రేజ్ ఉంది. ఆయన చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశమైతే ఉంటుంది. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ స్టార్ట్ చేసిన మహేష్ బాబు ‘రాజకుమారుడు’ సినిమాతో ఫుల్ టైం హీరోగా మారాడు. ఈ సినిమా మంచి విజయాన్ని సాధించడంతో అతనికి హీరోగా గుర్తింపైతే వచ్చింది. అప్పటినుంచి ఇప్పటివరకు వెను తిరిగి చూడకుండా వరుస సక్సెస్ లను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తుండడం విశేషం… ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ‘వారణాసి’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో ఎలాగైనా సరే భారీ సక్సెస్ ను తన ఖాతాలో వేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడున్న హీరోల్లో మహేష్ బాబు – జూనియర్ ఎన్టీఆర్ మధ్య చాలా మంచి ఫ్రెండ్షిప్ ఉందనే విషయం మనందరికి తెలిసిందే. నందమూరి ఫ్యామిలీ మూడోవ తరం హీరోగా ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్ సైతం చాలా తక్కువ సమయంలోనే టాప్ హీరోగా మారిపోయాడు. ఇప్పటికి మహేష్ బాబుకి జూనియర్ ఎన్టీఆర్ కి మధ్య చాలా మంచి ఫ్రెండ్షిప్ ఉంది. ఎన్టీఆర్ – మహేష్ బాబుని అన్నా అని పిలుస్తూ ఉంటాడు.

ఇలాంటి క్రమంలోనే మహేష్ బాబు చేసిన సినిమా మొదట జూనియర్ ఎన్టీఆర్ వద్దకు వెళ్లిందట. అయితే ఎన్టీఆర్ ఆ కథ మీద ఇంట్రెస్ట్ చూపించినప్పటికి అప్పటికే మహేష్ బాబు ఆ కథను విని ఓకే చేయాలా వద్దా అనే డైలమా లో ఉన్నాడట. మొత్తానికైతే జూనియర్ ఎన్టీఆర్ ఆ కథని వదిలేయడంతో మహేష్ బాబు ఆ సినిమాని చేశాడు.

ఇంతకీ ఆ సినిమా ఏంటంటే మహేష్ బాబు హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘అతిధి’ సినిమా కావడం విశేషం…ఇక ఎన్టీఆర్ తో ‘అశోక్’ సినిమా చేసి ఫ్లాప్ ని అందించిన సురేందర్ రెడ్డి మరోసారి జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేయాలని అతిధి సినిమా కథను కూడా తనకే వినిపించాడట. ఆ కథ ఎన్టీఆర్ కి బాగా నచ్చింది.

అయితే అప్పటికే మహేష్ బాబుకి కూడా ఆ కథను వినిపించడంతో మహేష్ బాబు నేను ఆ సినిమా చేస్తానని జూనియర్ ఎన్టీఆర్ ని రిక్వెస్ట్ చేయడంతో ఎన్టీఆర్ ఆ మూవీ నుంచి తప్పుకున్నాడట…ఫైనల్ గా సినిమా డిజాస్టర్ టాక్ నైతే మూట గట్టుకుంది. కానీ మహేష్ బాబు లుక్స్ పరంగా గానీ, యాక్షన్ ఎపిసోడ్స్ లో గాని ఆయన చూపించిన తీరు చాలా వైవిధ్యంగా ఉందనే చెప్పాలి…

Varanasi Movie: వారణాసి మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ అన్ని వేల కోట్లు జరగబోతుందా…

Varanasi Movie: రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా వస్తున్న వారణాసి సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. 2027 ఏప్రిల్ నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా మీద ఇప్పటికే ప్రేక్షకుల్లో విశేషమైన అంచనాలైతే ఉన్నాయి. అయితే ఈ సినిమా కాన్సెప్ట్ ను తెలియజేస్తూ సినిమా యూనిట్ ఒక వీడియోనైతే రిలీజ్ చేశారు. ఆ వీడియో ప్రేక్షకులందరిని విపరీతంగా ఆకట్టుకుంది. అయితే మహేష్ బాబు ఇందులో మొదటిసారి 5 డిఫరెంట్ గెటపుల్లో నటించబోతున్నాడు… దాంతో ఈ సినిమా మీద భారీగా ఖర్చు పెట్టి విజువల్ వండర్ గా ఈ సినిమాని తెరకెక్కించాలనే ఉద్దేశ్యంలో రాజమౌళి ఉన్నాడు. కాబట్టి ప్రతి చిన్న విషయంలో కూడా ఆయన చాలావరకు కేర్ ఫుల్ గా వ్యవహరిస్తూ ముందుకు దూసుకెళ్తుండడం విశేషం…ఇక ఇప్పటివరకు రాజమౌళి చేసిన సినిమాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి.

కానీ ఇకమీదట చేయబోతున్న సినిమాల విషయంలో ఆయన ఇంకాస్త జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరమైతే ఉంది. ఎందుకంటే ఆయనకు పాన్ ఇండియాలో భారీ పాపులారిటి దక్కింది. ఇప్పుడు పాన్ వరల్డ్ లో సైతం తన సత్తా ఏంటో చూపించాలనే ప్రయత్నంలో ఉన్నాడు.

ఇక ఇదిలా ఉంటే వారణాసి సినిమా సెట్స్ మీద ఉండగానే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ భారీ రేంజ్ లో జరగబోతుంది అంటూ వార్తలైతే వస్తున్నాయి. నిజానికి ఈ మూవీ ఓటిటి రైట్స్ కోసం నెట్ ఫ్లిక్స్ సంస్థ 500 కోట్ల వరకు కేటాయిస్తుందంటూ మరికొంతమంది కామెంట్లు చేస్తున్నారు. నిజానికి ప్రముఖ ఓటీటి ప్లాట్ ఫామ్ అయిన నెట్ ఫ్లిక్స్ సంస్థ ఇండియాలో ఉన్న అన్ని భాషల్లో తమ సినిమాని స్ట్రీమింగ్ చేయడానికి వారణాసి టీమ్ కి 500 కోట్ల వరకు ఆఫర్ అయితే ఇచ్చినట్టుగా తెలుస్తుంది.

ఇక రాజమౌళి ఇప్పటికి ఆ విషయం మీద ఎలాంటి స్పందనను తెలియజేయడం లేదు. ఈ సినిమాకు భారీ క్రేజ్ క్రియేట్ అయిన తర్వాత ఆటోమేటిగ్గా ఇతర ఓటిటి సంస్థలు పోటీకి వస్తాయి. కాబట్టి అప్పుడు ఇంకా ఎక్కువ బిజినెస్ జరిగే అవకాశం ఉందనే ఉద్దేశంతో రాజమౌళి ఈ డీల్ అయితే కొట్టి పారేసినట్టుగా తెలుస్తుంది. ఇక అలాగే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 2500 కోట్ల వరకు బిజినెస్ ని జరుపుకునే అవకాశాలు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ఏది ఏమైనా కూడా రాజమౌళి ఈ సినిమా కోసం 1500 కోట్లు బడ్జెట్ ను కేటాయిస్తున్నాడు. కాబట్టి ఈ సినిమా భారీ విజయాన్ని సాధించాల్సిన అవసరమైతే ఉంది…

Ather EL01: Ather నుంచి మిడిల్ క్లాస్ స్కూటర్.. ధర ఎంతంటే..

0

Ather EL01: ఎలక్ట్రిక్ స్కూటర్ రంగంలో సరికొత్త ట్రెండ్ సృష్టించిన Ather కంపెనీ స్కూటర్లకు వినియోగదారుల నుంచి వపరీతమైన ఆదరణ లభిస్తోంది. ఈ కంపెనీ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ అవసరమైన మోడల్స్ ను మార్కెట్లోకి తీసుకువస్తోంది. ఇప్పటి వరకు ప్రీమియం స్కూటర్లను అందించిన ఏథర్ ఎనర్జీ ఇప్పుడు కొత్తగా లో-కాస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ ను అందుబాటులోకి తీసుకురానుంది. EL01 కోడ్ తో తయారవుతున్న ఈ స్కూటర్ 2026 పూర్తయ్యేనాటికి లాంచ్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మిడిల్ క్లాస్ పీపుల్స్ ను లక్ష్యంగా చేసుకుని అందుబాటులోకి తీసుకువచ్చే ఈ స్కూటర్ ఎలా ఉండబోతుందో చూద్దాం..

ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీదారు ఏథర్ ఎనర్జీ తన ప్రీమియం 450 సిరీస్ తో ఆకట్టుకుంది. ఆ తరువాత Rizta మోడళ్ల ద్వారా మరింత ఆదరణ పొందుతోంది. ఇప్పుడు తన మార్కెట్‌ను విస్తరించేందుకు EL01ను అభివృద్ధి చేస్తోంది. EL అనే కొత్త మాడ్యులర్ ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడి ఉండే ఈ స్కూటర్, స్టీల్ యూనిబాడీ ఫ్రేమ్‌తో తక్కువ ఉత్పత్తి ఖర్చును సాధిస్తుంది.

EL01లో 2kWh నుంచి 4kWh వరకు బ్యాటరీ ఆప్షన్లు ఉండే అవకాశం ఉంది. ఈ బ్యాటరీలు ఒక్కసారి చార్జ్‌ చేస్తే 100 నుంచి 120 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇచ్చే అవకాశం ఉంది. 14 అంగుళాల ముందు, 12 అంగుళాల వెనుక వీల్స్, స్వింగ్‌ఆర్మ్ మౌంటెడ్ మోటార్, టెలిస్కోపిక్ ఫోర్క్, డిస్క్/డ్రమ్ బ్రేక్‌లు ఫీచర్లు. ఫాస్ట్ చార్జింగ్‌తో 10 నిమిషాల్లో 30 కి.మీ రేంజ్ సాధ్యమవుతుంది.

ప్లాట్ ఫ్లోర్‌బోర్డ్, రెండు హెల్మెట్లు ఫిట్ అయ్యే అండర్‌సీట్ స్టోరేజ్, అన్ని LED లైటింగ్‌తో ఫ్యామిలీకి బాగా ఉపయోగపడుతుంది. AtherStack 7.0 సాఫ్ట్‌వేర్‌తో TFT డిస్‌ప్లే, వాయిస్ ఇంటరాక్షన్ , ఇన్ఫినిట్ క్రూజ్ (అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్), OTA అప్‌డేట్లు, గూగుల్ మ్యాప్స్ వంటివి ఇందులో కనిపిస్తాయి. ఈ స్కూటర్ ధర సుమారు రూ.99,000 నుంచి రూ.1.10 లక్షల వరకు ఉండొచ్చన్న అంచనాలు ఉన్నాయి. ఇది ఏథర్ లైనప్‌లో అతి తక్కువ ధర కలిగిన మోడల్. మహారాష్ట్రలోని శంభాజీనగర్ ప్లాంట్‌లో ఉత్పత్తి ప్రారంభం కానుంది, ఇది భారీ స్థాయి ఉత్పాదకతను సాధ్యం చేస్తుంది. ప్రభుత్వ సబ్సిడీలతో సహా మిడిల్ క్లాస్‌కు ఆకర్షణీయంగా ఉంటుంది.

ఓలా S1X, TVS iQube, బజాజ్ చేతక్ వంటి పోటీదారుల మధ్య EL01 బడ్జెట్ సెగ్మెంట్‌లో గేమ్ చేంజర్‌గా మారొచ్చని కంపెనీ ప్రతినిధులు పేర్కొంటున్నారు. పెరుగుతున్న EV డిమాండ్, పెట్రోల్ ధరలు దీన్ని ప్రమోట్ చేస్తాయి. ఏథర్ IPO సమయంలో ఇది కంపెనీ వృద్ధికి బూస్ట్ ఇస్తుందని పేర్కొంటున్నారు.

Zero Shadow Day Hyderabad: ఈరోజు హైదరాబాద్ లో ఖగోళ వింత.. చూడడానికి సిద్ధం కండి..

Zero Shadow Day Hyderabad: మండుటెండలో మన వెంట ఎప్పుడూ నీడ ఉంటుంది. కానీ ఎండలో ఉన్నా కూడా నీడ కనిపంచకపోవడం ఎప్పుడైనా గమనించారా..? ఒక్కసారిగా నీడ కనిపించకుండా పోతే ఎలా ఉంటుంది? ఇదే అరుదైన ఖగోళ వింత మే 9న Hyderabadలో కనిపించనుంది. మధ్యాహ్నం సుమారు 12.12 గంటల సమయంలో కొన్ని క్షణాల పాటు వస్తువుల నీడలు కనిపించకుండా పోతాయి. దీనిని శాస్త్రవేత్తలు ‘ జీరో షాడో డే’గా పిలుస్తారు. అసలు ఇలా ఎందుకు ఏర్పడుతుంది? గతంలో ఏ నగరంలో ఇలా జరిగింది..?

భూమి పరిభ్రమణం, సూర్యుడి కిరణాలు భూమిపై పడే కోణం కారణంగా ఈ అరుదైన ఘటన ఏర్పడుతుంది. సాధారణంగా సూర్యకిరణాలు ఒక కోణంలో పడటంతో మనకు నీడ కనిపిస్తుంది. కానీ సంవత్సరంలో కొన్ని ప్రత్యేక రోజుల్లో సూర్యుడు భూమిపై ఉన్న కొన్ని ప్రాంతాలకు నేరుగా తలపైకి వస్తాడు. ఆ సమయంలో సూర్యకిరణాలు సుమారు 90 డిగ్రీల కోణంలో నిటారుగా పడటంతో నీడ వస్తువుల కిందకు చేరిపోతుంది. దీంతో నీడ కనిపించకుండా పోయినట్టుగా అనిపిస్తుంది.

కర్కాటక రేఖ, మకర రేఖ మధ్య ఉన్న ప్రాంతాల్లోనే ఈ దృశ్యం కనిపిస్తుంది. భారతదేశంలోని అనేక నగరాల్లో ప్రతి ఏడాది ఒక్కసారి లేదా రెండుసార్లు ఈ జీరో షాడో డే కనిపిస్తుంది. ఈసారి Hyderabadలో ఈ వింత చోటుచేసుకోనుంది. అయితే గతంలో ఏప్రిల్ 24న బెంగుళూరు లో కూడా ప్రజలు ఈ అరుదైన దృశ్యాన్ని వీక్షించారు. ఇలాంటి సమయంలో నిలువుగా ఉన్న వస్తువులు ఉదాహరణకు స్తంభాలు, బాటిళ్లు, చెట్లు లేదా మనుషులు వాటి నీడలను స్పష్టంగా చూపించవు. కాసేపటి పాటు నీడలు పూర్తిగా మాయమైనట్టుగా కనిపిస్తాయి. విద్యార్థులు, ఖగోళ శాస్త్రంపై ఆసక్తి ఉన్నవారికి ఇది ఒక ప్రత్యేక అనుభవంగా భావిస్తారు.

జీరో షాడో డే అనేది ఎలాంటి అద్భుతం లేదా ప్రమాదకర ఘటన కాదు. ఇది పూర్తిగా ఖగోళ శాస్త్రానికి సంబంధించిన సహజ ప్రక్రియ మాత్రమే. భారతదేశంలో ఉన్న ఖగోళ పరిశోధనా సంస్థలు, సైన్స్ సెంటర్లు ప్రజలకు ఈ విషయంపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తుంటాయి. శాస్త్రవేత్తల ప్రకారం.. ఈ ఘటన ద్వారా భూమి అక్ష వంగుదల, సూర్యుడి స్థాన మార్పులు, ఋతు మార్పుల గురించి సులభంగా అర్థం చేసుకోవచ్చు. అందుకే ఈ రోజును ఖగోళ శాస్త్ర ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు.