AIADMK internal conflicts: చుక్కాని లేని నావ.. ఎటు ప్రయాణిస్తుందో తెలియదు. ఎక్కడ మునిగిపోతుందో కూడా తెలియదు. అందుకే దారి, దిశ లేని గమ్యం ఎప్పటికీ ప్రమాదకరమే. ఇప్పుడు తమిళనాడులోని అన్నాడీఎంకెలో పరిస్థితి కూడా ఇలానే ఉంది. ఎమ్మెల్యేలు వర్గాలుగా విడిపోయారు. పార్టీని నిర్దేశించేవారు లేకుండా పోయారు. ఏం జరుగుతుందో తెలియడం లేదు. ఎవరు ఉంటారో అర్థం కావడం లేదు. పరిస్థితులు ఇలానే ఉంటే.. అన్నా డీఎంకే కాలగర్భంలో కలిసిపోవడం ఖాయం .
జయలలిత బతికి ఉన్నప్పుడు అన్నా డీఎంకే లో క్రమశిక్షణ అద్భుతంగా ఉండేది. నాయకులు మాట దాటేవారు కాదు. పైగా అసంతృప్తికి అవకాశం ఇచ్చేవారు కాదు. జయలలిత కన్ను మూసిన తర్వాత పార్టీ పరిస్థితి దారుణంగా మారిపోయింది. ఎవరు పార్టీని నిర్దేశిస్తున్నారో అర్థం కావడం లేదు. ఇప్పటికే అధికారానికి దూరమై అన్న డిఎంకె పార్టీ పరిస్థితి దారుణంగా మారిపోయింది. ఇప్పుడు తమిళనాడులో టీ వీకే అధికారంలోకి రావడంతో అన్నాడీఎంకె పరిస్థితి దారుణంగా మారింది.
ఇటీవల ఎన్నికల ఫలితాలలో ప్రతిపక్ష హోదాను అన్నాడీఎంకే కోల్పోయింది. దీనికి తోడు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎదప్పాడి పలని స్వామి ని శాసనసభ నేతగా ఎన్నుకుంటూ 17 మంది ఎమ్మెల్యేలు ప్రోటెమ్ స్పీకర్ కు లెటర్ రాశారు. జరుగుతుండగానే సీనియర్ నాయకుడు వేలుమని ని శాసనసభ నాయకుడిగా, శన్ముగం ను డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా ఎన్నుకొని, 30 మంది ఎమ్మెల్యేలు సంతకాలు చేశారు. ఇది అన్నాడీఎంకెలో చీలిక ఏర్పడిన కారణమైంది. ఎన్నికల్లో చాలామంది నాయకులు బిజెపితో పొత్తును వ్యతిరేకించారు. టీవీకే తో పొత్తు కుదుర్చుకోవాలని సూచించారు. అయితే పలని స్వామికి వచ్చిన ఒత్తిడి మేరకు ఆయన బిజెపితో జత కట్టడానికి ఆసక్తి చూపించారు. విజయ్ పార్టీ అధికారంలోకి రావడంతో.. అసమ్మతి నాయకులు వేరే కుంపటి పెట్టారు. అన్న డీఎంకే ఎమ్మెల్యేలతో కాకుండా.. వారు వేరుగా కూర్చుంటున్నారు. కనీసం ఫలని స్వామితో మాట్లాడేందుకు కూడా వారు ఆసక్తిని చూపించడం లేదు. అదే కాదు ఆ నాయకులు మొత్తం విజయ్ కి సపోర్ట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. అంతే కాదు ఆ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో విజయ్ కి నమస్కరించడం విశేషం.
















సనాతన ధర్మాన్ని నాశనం చెయ్యాలి అంటూ మరోసారి నోరుజారిన ఉదయనిధి స్టాలిన్.. ఖండించని సీఎం విజయ్..
Udhayanidhi Stalin Sanatana Dharma remarks: అన్ని మతాలు కలిసి ఉండే ఈ దేశంలో , ఈమధ్య సెక్యులర్ వాదనతో కొంతమంది మతకల్లోలాలు సృష్టించడం సర్వ సాధారణం అయిపోయింది. పవిత్రమైన హిందూ సనాతన ధర్మాన్ని పదే పదే కొంతమంది రాజకీయ నాయకులు అవమానిస్తూ , అవహేళన చేస్తుంటే, వాటిని ప్రశ్నించడానికి పవన్ కళ్యాణ్ లాంటోళ్ళు ఎవరైనా ముందుకొస్తే , మతాల మధ్య చిచ్చు పెడుతున్నాడు అంటూ మతోన్మాదిగా ముద్ర వేసే ప్రయత్నం చేస్తుంటారు. ఎంత ధైర్యం లేకుంటే ప్రకాష్ రాజ్ లాంటి నటుడు పబ్లిక్ ఈవెంట్ లో శ్రీ రాముడి పై అత్యంత నీచమైన, హేయమైన కామెంట్స్ చేస్తాడు చెప్పండి?, ఇలా ఇతర మతాల మీద , ఇతర మతాలకు చెందిన దేవుళ్ళ మీద మాట్లాడే సాహసం చేస్తాడా?, ఇలాంటి వ్యక్తులపై ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోకపోవడం బాధాకరం. ఇకపోతే నేడు తమిళనాడు అసెంబ్లీ లో కూడా సనాతన ధర్మం అవమానానికి గురైంది.
శాసనసభ ప్రతిపక్ష నేత ఉదయ్ నిధి స్టాలిన్ మాట్లాడుతూ ‘సనాతన ధర్మం మనుషులను వేరు చేస్తోంది , దీనిని సమూలంగా నిర్మూలించాలి’ అంటూ వ్యాఖ్యానించాడు. దీనిని ఆ సభాపతి , తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ఖండించాడా అంటే , అది జరగలేదు , ఉదయ్ నిధి స్టాలిన్ మాటలను స్వాగతిస్తూ , ఆయనకు నమస్కరించాడు. ఇది అత్యంత నీచమైన చర్యగా పరిగణించొచ్చు. తాను ఒక సెక్యులర్ వాథాని అని , అన్ని మతాలను , కులాలను సమానంగా చూస్తానని చెప్పుకొని అధికారం లోకి వచ్చిన విజయ్ , హిందువులు పవిత్రమైన సనాతన ధర్మాన్ని ఎలా గౌరవిస్తారో తెలియదా?, అలా కోట్ల మంది పాటించే సనాతన ధర్మం పై నోటికి వచ్చినట్టు మాట్లాడే ఇలాంటోళ్ళ వ్యాఖ్యలను ఆయన ఖండించడా ?, ఇదేనా విజయ్ సెక్యులర్ వాదం అంటూ సోషల్ మీడియా లో విజయ్ పై తీవ్రమైన విమర్శలు వినిపిస్తున్నాయి.
ఇలా ఉదయ్ నిధి స్టాలిన్ సనాతన ధర్మం పై నోరు పారేసుకోవడం కొత్తేమి కాదు, అధికారం లో ఉన్నప్పుడు కూడా ఆయన సనాతన ధర్మం ఒక వైరస్ లాంటిది అని , దీనిని నిర్మూలిస్తే తప్ప దేశం బాగు పడదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు. ఇప్పుడు ఓడిపోయిన తర్వాత కూడా అతని తీరు ఏ మాత్రం మారలేదు, సనాతన ధర్మాన్ని ఇప్పటికీ అవహేళన చేస్తూనే ఉన్నాడు , అందుకు సీఎం విజయ్ కూడా మద్దతు తెలపడం అతనికి ఓట్లు వేసిన హిందువులు , ముఖ్యంగా బ్రాహ్మణులు చేసుకున్న దురదృష్టం. ఉదయ్ నిధి స్టాలిన్ పొగరుతో సనాతన ధర్మం పై చేసిన కామెంట్స్ కి సంబంధించిన వీడియో ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి.