YS Jagan Fans: వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీలో అధినేత జగన్ అంటే వల్లమాలిన అభిమానం. ప్రత్యేక పరిస్థితుల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేశారు జగన్మోహన్ రెడ్డి. అందుకే విపరీతమైన అభిమానులు ఆ పార్టీకి సొంతం. వారికి అధినేత జగన్మోహన్ రెడ్డి ఏం చేసినా ఇట్టే నచ్చేస్తూ వచ్చింది. కానీ మొన్నటి ఓటమితో అభిమానుల్లో సైతం ఆగ్రహం కట్టలు తెచ్చుకుంటోంది. ఇప్పుడు జగన్ అనుసరిస్తున్న రాజకీయ వ్యూహం సైతం వారికి నచ్చడం లేదు. అందుకే ఆయనతో విభేదిస్తున్నారు. కొందరు సైలెంట్ అయ్యారు. మరికొందరు అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. కానీ పార్టీతో పాటు అధినేతపై అభిమానం పెంచుకున్న వారు మాత్రం అదే పార్టీలో కొనసాగుతున్నారు. అయితే ఇటీవల జగన్మోహన్ రెడ్డి తో పాటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న వ్యూహం మాత్రం ఎవరికీ నచ్చడం లేదు. అందుకే సోషల్ మీడియా వేదికగా ఓపెన్ అవుతున్నారు. తాజాగా ఓ కార్యకర్త అయితే.. జగన్మోహన్ రెడ్డి తీరుపై నిప్పులు చెరిగారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
* అప్పట్లో సైనికుల్లా..
2014 నుంచి 2019 మధ్య వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సైనికుల్లా పనిచేశారు. సొంత కుటుంబాలను వదిలి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేయాలన్న కసితో పని చేశారు. దాని ఫలితమే 2019 ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏకపక్ష విజయం. అయితే 2019లో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి తీరు మాత్రం సరిగా లేదు. వలంటీర్లకు బాధ్యతలు కట్టబెట్టి తన విజయం కోసం పని చేసిన వారిని పక్కన పెట్టేశారు. అస్పష్ట విధానాలతో ముందుకు సాగడంతో ఏపీ ప్రజలు జగన్ పాలనకు విసిగి వేసారి పోయారు. అందుకే 2024 ఎన్నికల్లో దారుణంగా ఓడించారు. ఇప్పటికీ జగన్ తో పాటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తీరు మారకపోవడంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో అధికారంలోకి వస్తామన్న ధీమా సన్నగిల్లుతోంది.
* జగన్ అస్పష్ట విధానాలతో..
జాతీయ పార్టీల విషయంలో జగన్మోహన్ రెడ్డికి ఒక స్టాండ్ లేదు. ఏ కూటమిలతో సంబంధం లేదు. ఏపీలో మిగతా రాజకీయ పార్టీలతో చెలిమి లేదు. జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి రావడం లేదు.. అనుకున్న కార్యక్రమాలు ఏవి పార్టీలో జరగడం లేదు. ఇవన్నీ పార్టీ శ్రేణుల్లో ఒక రకమైన గందరగోళాన్ని రేపుతున్నాయి. అనవసరంగా జగన్మోహన్ రెడ్డిని నమ్ముకొని పార్టీలో కొనసాగి.. ఆయన నాయకత్వాన్ని అడ్డగోలుగా సమర్థించిన వారు తట్టుకోలేకపోతున్నారు. సోషల్ మీడియా ద్వారా తమ బాధను వ్యక్తం చేస్తున్నారు. ఓ అభిమాని అధికారికంగానే చేసిన వీడియో సగటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమాని బాధను తెలియజేస్తోంది.















వైసిపి అనుకూల విశ్లేషకుల యూటర్న్.. మనీ మేటర్
YSRCP Analysts: సమకాలీన రాజకీయ అంశాలపై చాలామంది విశ్లేషిస్తుంటారు. రాజకీయ పార్టీల తప్పు ఒప్పులను ఎత్తిచూపుతుంటారు. ప్రభుత్వ వైఫల్యాలను, గొప్పతనాన్ని వివరిస్తూ ఉంటారు. అయితే గతంలో పత్రికలు, టీవీ డిబేట్లో మాత్రమే ఈ విశ్లేషణలు కనిపించేవి. కానీ ఇప్పుడు సోషల్ మీడియా, డిజిటల్ మీడియా పుణ్యమా అని ఎవరికి వారే స్వతంత్రంగా యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకొని మరీ విశ్లేషిస్తుంటారు. ప్రధాన మీడియా కంటే యూట్యూబ్ చానల్స్ లో విశ్లేషణలకే ప్రజలు అధిక ప్రాధాన్యమిస్తున్నారు. కేవలం ఈ ఒక్క కారణంతోనే రాజకీయ పార్టీలు విశ్లేషకులకు ప్యాకేజీల రూపంలో కొంత మొత్తం అందిస్తున్నాయని విమర్శలు ఉన్నాయి. తద్వారా ఆ రాజకీయ పార్టీలకు, ప్రభుత్వాలకు అనుకూల విశ్లేషణలు వస్తున్నాయి. ప్రత్యర్థులపై వ్యతిరేక విశ్లేషణలు చేస్తున్నారు. ఈ విశ్లేషణలు ప్రజల్లోకి బలంగా వీలుతుండడంతో రోజురోజుకు యూట్యూబ్ ఛానల్స్ పుట్టుకొస్తున్నాయి. అయితే ఈ విశ్లేషణలు బట్టి ఫలానా రాజకీయ పార్టీకి అనుకూలం అని ఇట్టే చెప్పవచ్చు.
* చెల్లింపులు నిలిచిపోవడంతోనే?
అయితే ఏపీలో పేరు మోసిన విశ్లేషకులు, జర్నలిస్టులు ఎక్కువగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా విశ్లేషణలు చేస్తుంటారు. వారిలో ఫ్లేవర్ కనిపిస్తుంది. ఫేవర్ కూడా స్పష్టమౌతూ వస్తోంది. ప్రధాన మీడియాలో పనిచేసిన చాలా మంది జర్నలిస్టులు విశ్లేషకుల అవతారం ఎత్తారు. అటువంటి వారు చాలామంది వైసీపీకి అనుకూలంగా విశ్లేషిస్తుంటారు. కానీ గత కొంతకాలంగా ఈ విశ్లేషకులు యూ టర్న్ తీసుకోవడం హాట్ టాపిక్ అవుతోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై నేరుగా వ్యతిరేకంగా మాట్లాడడం లేదు కానీ. వైఫల్యాలపై మాట్లాడడం ప్రారంభించారు. దీనిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆశించిన స్థాయిలో చెల్లింపులు లేకపోవడంతోనే వారు యూటర్న్ తీసుకున్నట్లు పొలిటికల్ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.
* సాక్షిని తపేల ఛానల్ తో పోల్చుతూ..
సాక్షితోపాటు యూట్యూబ్ ఇంటర్వ్యూలో ఎక్కువగా కనిపిస్తారు కె ఎస్ ప్రసాద్, పాషా. అయితే ఇప్పుడు వారు సాక్షి ఛానల్ కు వెళ్లడం లేదు. ఇకనుంచి వెళ్ళమని కూడా తేల్చి చెప్పారు. కేఎస్ ప్రసాద్ అయితే సాక్షిని తపేల ఛానల్ తో పోల్చారు. అయితే వారు మాత్రమే కాదు చాలామంది వైసిపి అనుకూల విశ్లేషకులు తీరు మారింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విధానాలను తప్పుపడుతూ.. ప్రభుత్వం కొనసాగినప్పుడు జరిగిన వైఫల్యాలను బయట పెడుతున్నారు. అయితే వీరికి చెల్లింపుల విషయంలో జరిగిన బ్రేక్ కారణంగానే వీరంతా ఎదురు తిరిగినట్లు అర్థమవుతోంది. అయితే దాదాపు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా విశ్లేషించే అందరూ.. వ్యతిరేకంగా మారడం చూస్తుంటే ఈ అనుమానాలకు బలం చేకూరుతోంది.