Home Blog Page 287

వైసిపి అనుకూల విశ్లేషకుల యూటర్న్.. మనీ మేటర్

YSRCP
YSRCP

YSRCP Analysts: సమకాలీన రాజకీయ అంశాలపై చాలామంది విశ్లేషిస్తుంటారు. రాజకీయ పార్టీల తప్పు ఒప్పులను ఎత్తిచూపుతుంటారు. ప్రభుత్వ వైఫల్యాలను, గొప్పతనాన్ని వివరిస్తూ ఉంటారు. అయితే గతంలో పత్రికలు, టీవీ డిబేట్లో మాత్రమే ఈ విశ్లేషణలు కనిపించేవి. కానీ ఇప్పుడు సోషల్ మీడియా, డిజిటల్ మీడియా పుణ్యమా అని ఎవరికి వారే స్వతంత్రంగా యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకొని మరీ విశ్లేషిస్తుంటారు. ప్రధాన మీడియా కంటే యూట్యూబ్ చానల్స్ లో విశ్లేషణలకే ప్రజలు అధిక ప్రాధాన్యమిస్తున్నారు. కేవలం ఈ ఒక్క కారణంతోనే రాజకీయ పార్టీలు విశ్లేషకులకు ప్యాకేజీల రూపంలో కొంత మొత్తం అందిస్తున్నాయని విమర్శలు ఉన్నాయి. తద్వారా ఆ రాజకీయ పార్టీలకు, ప్రభుత్వాలకు అనుకూల విశ్లేషణలు వస్తున్నాయి. ప్రత్యర్థులపై వ్యతిరేక విశ్లేషణలు చేస్తున్నారు. ఈ విశ్లేషణలు ప్రజల్లోకి బలంగా వీలుతుండడంతో రోజురోజుకు యూట్యూబ్ ఛానల్స్ పుట్టుకొస్తున్నాయి. అయితే ఈ విశ్లేషణలు బట్టి ఫలానా రాజకీయ పార్టీకి అనుకూలం అని ఇట్టే చెప్పవచ్చు.

* చెల్లింపులు నిలిచిపోవడంతోనే?
అయితే ఏపీలో పేరు మోసిన విశ్లేషకులు, జర్నలిస్టులు ఎక్కువగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా విశ్లేషణలు చేస్తుంటారు. వారిలో ఫ్లేవర్ కనిపిస్తుంది. ఫేవర్ కూడా స్పష్టమౌతూ వస్తోంది. ప్రధాన మీడియాలో పనిచేసిన చాలా మంది జర్నలిస్టులు విశ్లేషకుల అవతారం ఎత్తారు. అటువంటి వారు చాలామంది వైసీపీకి అనుకూలంగా విశ్లేషిస్తుంటారు. కానీ గత కొంతకాలంగా ఈ విశ్లేషకులు యూ టర్న్ తీసుకోవడం హాట్ టాపిక్ అవుతోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై నేరుగా వ్యతిరేకంగా మాట్లాడడం లేదు కానీ. వైఫల్యాలపై మాట్లాడడం ప్రారంభించారు. దీనిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆశించిన స్థాయిలో చెల్లింపులు లేకపోవడంతోనే వారు యూటర్న్ తీసుకున్నట్లు పొలిటికల్ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.

* సాక్షిని తపేల ఛానల్ తో పోల్చుతూ..
సాక్షితోపాటు యూట్యూబ్ ఇంటర్వ్యూలో ఎక్కువగా కనిపిస్తారు కె ఎస్ ప్రసాద్, పాషా. అయితే ఇప్పుడు వారు సాక్షి ఛానల్ కు వెళ్లడం లేదు. ఇకనుంచి వెళ్ళమని కూడా తేల్చి చెప్పారు. కేఎస్ ప్రసాద్ అయితే సాక్షిని తపేల ఛానల్ తో పోల్చారు. అయితే వారు మాత్రమే కాదు చాలామంది వైసిపి అనుకూల విశ్లేషకులు తీరు మారింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విధానాలను తప్పుపడుతూ.. ప్రభుత్వం కొనసాగినప్పుడు జరిగిన వైఫల్యాలను బయట పెడుతున్నారు. అయితే వీరికి చెల్లింపుల విషయంలో జరిగిన బ్రేక్ కారణంగానే వీరంతా ఎదురు తిరిగినట్లు అర్థమవుతోంది. అయితే దాదాపు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా విశ్లేషించే అందరూ.. వ్యతిరేకంగా మారడం చూస్తుంటే ఈ అనుమానాలకు బలం చేకూరుతోంది.

జగన్ పై అభిమానుల తిరుగుబాటు!

YS Jagan Fans
YS Jagan Fans

YS Jagan Fans: వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీలో అధినేత జగన్ అంటే వల్లమాలిన అభిమానం. ప్రత్యేక పరిస్థితుల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేశారు జగన్మోహన్ రెడ్డి. అందుకే విపరీతమైన అభిమానులు ఆ పార్టీకి సొంతం. వారికి అధినేత జగన్మోహన్ రెడ్డి ఏం చేసినా ఇట్టే నచ్చేస్తూ వచ్చింది. కానీ మొన్నటి ఓటమితో అభిమానుల్లో సైతం ఆగ్రహం కట్టలు తెచ్చుకుంటోంది. ఇప్పుడు జగన్ అనుసరిస్తున్న రాజకీయ వ్యూహం సైతం వారికి నచ్చడం లేదు. అందుకే ఆయనతో విభేదిస్తున్నారు. కొందరు సైలెంట్ అయ్యారు. మరికొందరు అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. కానీ పార్టీతో పాటు అధినేతపై అభిమానం పెంచుకున్న వారు మాత్రం అదే పార్టీలో కొనసాగుతున్నారు. అయితే ఇటీవల జగన్మోహన్ రెడ్డి తో పాటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న వ్యూహం మాత్రం ఎవరికీ నచ్చడం లేదు. అందుకే సోషల్ మీడియా వేదికగా ఓపెన్ అవుతున్నారు. తాజాగా ఓ కార్యకర్త అయితే.. జగన్మోహన్ రెడ్డి తీరుపై నిప్పులు చెరిగారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

* అప్పట్లో సైనికుల్లా..
2014 నుంచి 2019 మధ్య వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సైనికుల్లా పనిచేశారు. సొంత కుటుంబాలను వదిలి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేయాలన్న కసితో పని చేశారు. దాని ఫలితమే 2019 ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏకపక్ష విజయం. అయితే 2019లో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి తీరు మాత్రం సరిగా లేదు. వలంటీర్లకు బాధ్యతలు కట్టబెట్టి తన విజయం కోసం పని చేసిన వారిని పక్కన పెట్టేశారు. అస్పష్ట విధానాలతో ముందుకు సాగడంతో ఏపీ ప్రజలు జగన్ పాలనకు విసిగి వేసారి పోయారు. అందుకే 2024 ఎన్నికల్లో దారుణంగా ఓడించారు. ఇప్పటికీ జగన్ తో పాటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తీరు మారకపోవడంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో అధికారంలోకి వస్తామన్న ధీమా సన్నగిల్లుతోంది.

* జగన్ అస్పష్ట విధానాలతో..
జాతీయ పార్టీల విషయంలో జగన్మోహన్ రెడ్డికి ఒక స్టాండ్ లేదు. ఏ కూటమిలతో సంబంధం లేదు. ఏపీలో మిగతా రాజకీయ పార్టీలతో చెలిమి లేదు. జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి రావడం లేదు.. అనుకున్న కార్యక్రమాలు ఏవి పార్టీలో జరగడం లేదు. ఇవన్నీ పార్టీ శ్రేణుల్లో ఒక రకమైన గందరగోళాన్ని రేపుతున్నాయి. అనవసరంగా జగన్మోహన్ రెడ్డిని నమ్ముకొని పార్టీలో కొనసాగి.. ఆయన నాయకత్వాన్ని అడ్డగోలుగా సమర్థించిన వారు తట్టుకోలేకపోతున్నారు. సోషల్ మీడియా ద్వారా తమ బాధను వ్యక్తం చేస్తున్నారు. ఓ అభిమాని అధికారికంగానే చేసిన వీడియో సగటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమాని బాధను తెలియజేస్తోంది.

మోడీ దేశ ప్రజలకిచ్చిన సలహాల్లో తప్పేముంది?

Modi fuel security call : మోడీ నిన్న హైదరాబాద్ సభలో మాట్లాడుతూ దేశ ప్రజలకు ఓ సంచలన పిలుపునిచ్చాడు. ఇంధన భద్రత పాటించండి.. విదేశీ మారకద్రవ్యం కరిగిపోతోంది.. రూపాయి విలువ పడిపోతోంది. కాబట్టి పెట్రోల్ డీజిల్ వాడకం తగ్గించండి.. బంగారం కొనుగోలును సంవత్సరం తగ్గించండి.. విదేశాల్లో పెండ్లీలు, పేరంటాలు ఫంక్షన్లను రద్దు చేసుకొని ఇండియాలోనే చేసుకోండి.. ఎలక్రిక్ వాహనాలు వాడండి.. మెట్రో లాంటి సర్వీసులను ఉపయోగించుకోండి..దేశ వస్తువులను కొనండి.. ఇక్కడే అన్నింటిని చేసుకోండి అంటూ మోడీ పిలుపునిచ్చారు.

ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగినా.. మన దేశంలో మోడీ సర్కార్ పెంచలేదు. ఆ విషయాన్ని కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు గుర్తించవు. మోడీ ఎంత చేసినా విమర్శలు చేస్తూనే ఉంటుంది..

కేంద్రం ఎంత ప్రయత్నించినా దేశ ప్రజలుగా మనకు మనం మన దేశం కోసం కొన్ని పాటించాలి. మోడీతోపాటు ప్రజలంతా కలిస్తేనే దేశం ముందుకు వెళుతుంది. భారత్ దాదాపు 80 శాతం ఇంధన దిగుమతిపైనే ఆధారపడింది. దానివల్ల చాలా సమస్యలు వస్తున్నాయి. ఫారిన్ ఎక్స్చేంజీల మధ్య ఒత్తిడి పెరుగుతోంది.

బంగారం విషయంలోనూ ప్రజలు విపరీతంగా కొనేస్తున్నారు. దానివల్ల మన సంపద , పెట్టుబడి కింద కొంటూ దేశ ప్రజల సంపదను విదేశాలకు తరలిపోతోంది. సాధ్యమైనంత వరకూ ఆ భారం పడకుండా ప్రభుత్వం ధరలు పెంచకుండా భరిస్తోంది. అందుకే మోడీ దేశ ప్రజలకు ఈ పిలుపునిచ్చారు.

మోడీ దేశ ప్రజలకిచ్చిన సలహాల్లో తప్పేముంది ? దీనిపై ’రామ్‘ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

హీరోయిన్ త్రిష కి మరో బంపర్ ఆఫర్.. అదృష్టం అంటే ఇదే భయ్యా..

Trisha Krishnan
Trisha Krishnan

Trisha Krishnan New Movie: హీరోయిన్ త్రిష కి ప్రస్తుతం జాతకం మామూలు రేంజ్ లో నడవడం లేదు. తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఆమెకు త్వరలోనే భర్త కాబోతున్నాడు, మరోపక్క సినీ కెరీర్ కూడా దూసుకుపోతుంది. సాధారణంగా 40 ఏళ్ళ వయస్సులోకి అడుగుపెట్టిన ఏ హీరోయిన్ కూడా క్రేజీ ప్రాజెక్ట్స్ లో అవకాశాలు సంపాదించుకోలేరు. కానీ త్రిష మాత్రం వరుసగా క్రేజీ పాన్ ఇండియన్ సినిమాల్లో హీరోయిన్స్ రోల్స్ ని సొంతం చేసుకుంటూ ముందుకు దూసుకుపోతుంది. అందం తో పాటు, అద్భుతంగా నటించగలదు కాబట్టే , ఆమెకు ఈ స్థాయిలో అవకాశాలు వస్తున్నాయి, పైగా సీఎం కి అత్యంత సన్నిహితం కాబట్టి , ఆమె కెరీర్ కి మరో పదేళ్ల పాటు ఎలాంటి డోకా లేదు. రీసెంట్ గా ఆమె హీరోయిన్ గా నటించిన ‘కరప్పు’ చిత్రం మే 14 న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ అవ్వబోతుంది.

సూర్య హీరో గా నటించిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రం సంగతి కాసేపు పక్కన పెడితే హీరోయిన్ త్రిష ఖాతాలో మరో బంపర్ ఆఫర్ వచ్చి చేరింది. త్వరలోనే సూపర్ స్టార్ రజినీకాంత్, కమల్ హాసన్ కాంబినేషన్ లో మల్టీస్టార్రర్ చిత్రం తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ‘జైలర్’ ఫేమ్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించబోతుండగా, అనిరుద్ సంగీతం అందించబోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన ప్రకటన వీడియో కి కూడా సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ చిత్రంలో ఒక హీరోయిన్ పాత్ర కోసం త్రిష ని ఎంచుకున్నారట, రీసెంట్ గానే ఆమె అగ్రిమెంట్ మీద కూడా సంతకం చేసిందని టాక్. మరో హీరోయిన్ పాత్ర కోసం ఎవరిని తీసుకోబోతున్నారు అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ఈ ఏడాది లోనే ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లబోతుందట.

ఒకపక్క తనకు బాగా కావాల్సిన వాళ్ళు రాజకీయాల్లో పెద్ద స్థాయిలో ఉన్నారు, త్వరలో ఆమె కూడా ఒక బలమైన బాధ్యతలను చేప్పట్టబోతోంది , మరోపక్క సినీ కెరీర్ పరంగా కూడా పీక్ రేంజ్ ని ఎంజాయ్ చేస్తోంది. నటిగా, మనిషిగా ఇంతకు మించిన ఆనందం, సక్సెస్ ఏమి ఉంటుంది చెప్పండి?, రాబోయే రోజుల్లో త్రిష మేనియా ఏ స్థాయిలో ఉండబోతుందో చూడాలి. ఇకపోతే తెలుగు లో త్రిష విశ్వంభర చిత్రం చేసింది. మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన ఈ సోషియో ఫాంటసీ చిత్రం ఈ ఏడాది జులై నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

'ధురంధర్' నిర్మాతలను పీడించిన రణవీర్ సింగ్.. క్లారిటీ ఇచ్చిన నటుడు..

Dhurandhar
Dhurandhar

Dhurandhar: ఒక సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన విజయం సాధించినప్పుడు, దాని గురించి ప్రశంలతో పాటు, విమర్శలు కూడా ఉంటాయి. కానీ రీసెంట్ గా విడుదలై ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించిన ‘ధురంధర్’ సిరీస్ కి మాత్రం ఎవ్వరూ కూడా ఎలాంటి వంకలు పెట్టలేదు. ఆ చిత్రానికి సంబంధించిన స్క్రీన్ ప్లే , స్టోరీ , నటీనటుల నటన ఆ రేంజ్ లో ఉంది మరీ. క్రాఫ్ట్స్ మీద ఎలాంటి వంకలు చూపించే అవసరం లేకపోవడం తో , ఇప్పుడు కొంతమంది నేరుగా రణవీర్ సింగ్ నే టార్గెట్ చేస్తున్నారు. పలు విషయాల్లో ఆయన్ని టార్గెట్ చేసి ఒక రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. ఈ ట్రోల్స్ పై aa చిత్రం లో నటించిన ప్రముఖ నటుడు గౌరవ్ క్లారిటీ ఇచ్చాడు. సోషల్ మీడియా లో జరిగే ఈ ప్రచారాలను ఆయన కొట్టిపారేశాడు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే, సినిమా చివర్లో రోలింగ్ టైటిల్స్ పడేటప్పుడు ‘రణవీర్ సింగ్ వ్యాన్’, ‘రణవీర్ సింగ్ స్టాఫ్ వ్యాన్’, ‘రణవీర్ సింగ్ నార్మల్ వ్యాన్’ అంటూ షూటింగ్ కోసం ఆయన మూడు క్యార వ్యాన్ లు వాడాడు , నిర్మాతలను ఆయన ఈ రేంజ్ లో వేధించి , విపరీతంగా ఖర్చు చేయించాడు అంటూ సోషల్ మీడియా లో కామెంట్స్ చేశారు. దీనిపై గౌరవ్ చాలా ఘాటుగానే స్పందించాడు. రీసెంట్ గానే ఆయన ప్రముఖ బాలీవుడ్ దర్శకురాలు ఫరా ఖాన్ నిర్వహిస్తున్న ఒక టాక్ షోలో పాల్గొన్నాడు. ఈ షోలో ఫరా ఖాన్ సోషల్ మీడియా లో జరిగే ఈ ప్రచారాన్ని గౌరవ్ దృష్టికి తీసుకొచ్చింది. దానికి గౌరవ్ స్పందిస్తూ ‘నేను రణవీర్ సింగ్ తోనే షూటింగ్ జరిగినన్ని రోజులు ఉన్నాను. నేను అయితే ఆయా అన్ని వ్యాన్ లు ఉపయోగిస్తున్నట్టు చూడలేదు’.

‘రణవీర్ సింగ్ చాలా సరదా మనిషి , అందరితోనూ చాలా సరదాగా ఉండేవాడు. చిన్న నటుడు పెద్ద నటుడు అనే తేడా చూపడు. నాతో కూడా చాలా ఫన్నీ గా ఉండేవాడు. షూటింగ్ బ్రేక్ సమయంలో , ఫన్నీ వాయిస్ తో ‘చుటికీ , నువ్వు కూడా నాతో పాటు వాష్ రూమ్ కి వస్తావా’ అని ఆట పట్టించేవాడు. అంతటి అల్లరి , ఫన్ చేసేవాడు. అలాంటి వ్యక్తిపై ఇలాంటి రూమర్స్ రావడం దురదృష్టకరం. దయచేసి విమర్శించొద్దు’ అంటూ చెప్పుకొచ్చాడు గౌరవ్. ఇకపోతే ‘ధురంధర్’ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద 1370 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబడితే , ‘ధురంధర్ 2’ కి 1840 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఈ చిత్రం ఈ నెల 15 నుండి జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.

దేశంలో ఏ సీఎం కూడా ఇలాంటి నిర్ణయం తీసుకోలేదు.. విజయ్ కి సెల్యూట్ చెయ్యాల్సిందే..

CM Vijay
CM Vijay

CM Vijay: తమిళ హీరో విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రి గా బాధ్యతలు చేపట్టి సరిగ్గా 48 గంటలు మాత్రమే అయ్యింది. ఈ 48 గంటల్లో ఆయన ఎలాంటి రాజకీయాలకు తెరలేపాడో మనమంతా చూస్తూనే ఉన్నాం. దేశంలో ఏ నాయకుడు కూడా ముఖ్యమంత్రి గా గెలిచినప్పుడు ప్రధాన ప్రతిపక్షాన్ని కలవడం చేయలేదు. కానీ విజయ్ ప్రధాన ప్రతిపక్ష నేత ఇంటికి వెళ్లి మరీ ఆయన్ని గౌరవించడం , ఆ తర్వాత ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతీ పార్టీ నేత ఇంటికి వెళ్లి కలిసి, వాళ్ళను ప్రత్యేకంగా గౌరవించి ప్రేమతో మాట్లాడడం వంటివి చేశాడు. పాజిటివ్ రాజకీయాలకు తెరలేపాడు. ఇవన్నీ పక్కన పెడితే , మరో పక్క ఆయన పాలన పరంగా కూడా సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నాడు. దేశం లో ఏ ముఖ్యమంత్రి కూడా ఇప్పటి వరకు ఇలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇంతకీ అదేంటో చూద్దాం.

మన తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల చూసే ఉంటాము, దేవాలయాలు ఉన్న సమీపం లో కానీ , విద్య సంస్థలు , బాస్ స్టాప్స్ ఉన్న సమీపాల్లో కానీ , మందు షాపులు ఉండడం. చాలా మంది రిక్వెస్ట్ కూడా చేశారు , ఇలాంటి ప్రాంతాల్లో మందు షాప్స్ దూరంగా ఉండేలా చేయమని , కానీ పెద్దగా పట్టించుకోలేదు మన ప్రభుత్వాలు. కానీ విజయ్ అలాంటివి అసలు ప్రోత్సహించడం లేదు. దేవాలయాలు , చర్చీలు , మసీదులు, విద్యాసంస్థలు, బస్సు స్టేషన్స్ ఉన్న ప్రదేశాల్లో 500 మీటర్ల రేడియస్ లో మందు షాప్స్ ఉండరాదని , రెండు వారాల్లో ఆ ఖాళీ చెయ్యాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తూ ఒక జీవో ని విడుదల చేశాడు. తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా 4 వేలకు పైగా మద్యం దుకాణాలు ఉంటే, అందులో 717 మద్యం దుకాణాలు ఇలాంటి ప్రదేశాల్లో ఉన్నట్టు గుర్తించారు.

ఇప్పుడు వాటిని రెండు వారాల్లోపే మూసి వేయబోతున్నారు అధికారులు. ఇది సీఎం గా విజయ్ తీసుకున్న సంచలనాత్మక నిర్ణయం అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు. అధికారం చేపట్టిన రెండు రోజుల్లోనే ఇలాంటి విప్లవాత్మక నిర్ణయాన్ని తీసుకోవడం అనేది సాధారణమైన విషయం కాదు. జనాలకు నిజమైన సర్వీస్ చెయ్యాలి అని కోరుకునేవాళ్ళు చేసే పనులు ఇలాగే ఉంటాయి. విజయ్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని భవిష్యత్తులో ఇతర రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు కూడా తీసుకోవచ్చు. మరోపక్క విజయ్ తీసుకున్న ఈ నిర్ణయం పై పార్టీలకు అతీతంగా ప్రతీ ఒక్కరు హర్షిస్తూ మెచ్చుకుంటున్నారు. విజయ్ పాలన ఇదే మార్క్ తో కొనసాగిస్తే ఆయనకు తిరుగే ఉండదు అనడంలో ఎలాంటి సందేహం లేదు.

మా మధ్య గొడవలు జరుగుతూనే ఉంటాయి అంటూ సూర్య తో రిలేషన్ గురించి కార్తీ హాట్ కామెంట్స్..

Karthi Comments On Suriya
Karthi Comments On Suriya

Karthi Comments On Suriya: వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ లో ఉన్న హీరో సూర్య , ఇప్పుడు లేటెస్ట్ గా ‘కరప్పు’ అనే చిత్రం తో మన ముందుకు రాబోతున్నాడు. తెలుగు లో ఈ సినిమా ‘వీరభద్రుడు’ అనే టైటిల్ తో విడుదల కాబోతుంది. తమిళనాడు లో ఈ చిత్రానికి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ని కూడా మొదలు పెట్టగా, ఆడియన్స్ నుండి కావాల్సినంత రెస్పాన్స్ మాత్రం రావడం లేదు. ఇకపోతే ఈ సినిమా తెలుగు వెర్షన్ థియేట్రికల్ రైట్స్ ని అక్కినేని నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ సొంతం చేసుకుంది. సూర్య ఫ్యామిలీకి అన్నపూర్ణ స్టూడియోస్ లక్కీ హ్యాండ్ అనే చెప్పాలి. గతంలో ఈ సంస్థ కొనుగోలు చేసిన ‘ఖైదీ’, ‘సర్దార్’ చిత్రాలు కమర్షియల్ గా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. ఇప్పుడు ఈ సినిమా కూడా సూపర్ హిట్ అవుతుందనే నమ్మకం తో ఉన్నారు.

ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ని హైదరాబాద్ లో ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్ కి సూర్య తో పాటుగా , ఆయన తమ్ముడు కార్తీ కూడా హాజరయ్యాడు. ప్రస్తుతం కార్తీ మ్యాడ్ డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ తో కలిసి ఒక సినిమా హైదరాబాద్ లో చేస్తున్నాడు, ఎలాగో హైదరాబాద్ లోనే ఈవెంట్ జరుగుతుంది కాబట్టి , సూర్య పిలవగానే వచ్చేశాడు. అయితే ఈ ఈవెంట్ లో వీళ్ళిద్దరితో యాంకర్ సుమ జరిపిన ఫన్నీ సంభాషణ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. యాంకర్ సుమ ఒక ప్రశ్న అడుగుతూ ‘మీకు కార్తీ మీద బాగా కోపం వచ్చినప్పుడు ఏమని తిడుతారు’ అని సూర్య ని అడగ్గా, దానికి కార్తీ మైక్ అందుకొని ‘మా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతూనే ఉంటాయి, తిట్లు ఉండవు, కేవలం యాక్షన్ మాత్రమే ఉంటుంది’ అంటూ చెప్పుకొచ్చాడు.

మీ ఇద్దరిలో మీ అమ్మ గారికి ఎవరంటే ఎక్కువ ఇష్టం అని సుమ కార్తీ ని అడగ్గా, కచ్చితంగా మా అన్నయ్యే , పెద్ద బాబు కదా ఎంతైనా అంటూ చెప్పుకొచ్చాడు కార్తీ. ఇద్దరిలో ఎవరికీ కోపం ఎక్కువ అని అడగ్గా, మా అన్నయ్యకే కోపం ఎక్కువ, కానీ దెబ్బలు మా చేతిలో ఎక్కువగా నాకే పడేవి అంటూ చెప్పుకొచ్చాడు. ఇలా వీళ్ళ మధ్య జరిగిన ఈ ఫన్నీ సంభాషణకు సంబంధించిన వీడియో ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి. అయితే ఇన్నేళ్లు అయినప్పటికీ కూడా సూర్య ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నాకు తెలుగు రాదు అని చెప్పడం బాధాకరం అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ అంటున్నారు. వరుస ఫ్లాప్స్ లో ఉన్న సూర్య , ఈ చిత్రం తో కం బ్యాక్ ఇస్తాడో లేదో తెలియాలంటే మే 14 వరకు ఆగాల్సిందే.

 

 

చంద్రబాబు ఓపికకు హాట్సాఫ్!

AP CM Chandrababu
AP CM Chandrababu

AP CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబు( AP CM Chandrababu) వయసుకు మించి కష్టపడుతున్నారు. ఒకవైపు రాష్ట్ర పాలన చూస్తూనే మరోవైపు జాతీయ స్థాయిలో సైతం నిత్య పర్యటనలు చేస్తున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించే క్రమంలో వరుసగా భేటీలు జరుపుతున్నారు. నిత్య సమీక్షలు కొనసాగుతున్నాయి. ఢిల్లీలో సంప్రదింపులు జరుపుతున్నారు. ఎన్ డి ఏ సమావేశాలకు హాజరవుతున్నారు. బిజెపితో పాటు ఎన్డీఏ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ప్రభుత్వాలు కొలువు తీరుతున్న సమయంలో ప్రమాణ స్వీకార కార్యక్రమాలకు హాజరవుతున్నారు. గత వారం రోజులుగా సీఎం చంద్రబాబు షెడ్యూల్ ను పరిశీలిస్తే.. క్షణం తీరిక లేకుండా గడుపుతున్న పరిస్థితి. ఈ వయసులో కూడా ఆయన కష్టపడుతున్న తీరు మాత్రం ఆకట్టుకుంటుంది.

* కోల్కత్తాలో ప్రత్యేక ఆకర్షణగా..
పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. 15 సంవత్సరాల మమతా పాలనను తెరదించుతూ కాషాయ జండా ఎగురవేసింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా సువేందూ అధికారి ప్రమాణం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీతో పాటు ఎన్డీఏ రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. ఏపీ సీఎం చంద్రబాబు కు ప్రత్యేక ఆహ్వానం అందింది. దీంతో కార్యక్రమానికి హాజరైన చంద్రబాబుకు కేంద్ర పెద్దలు గౌరవభావంతో చూశారు. చాలా ప్రాధాన్యం ఇచ్చారు. బిజెపిలో కొనసాగుతున్న బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి చంద్రబాబుకు పాదాభివందనం చేశారు.

* ఢిల్లీ బాట..
పశ్చిమ బెంగాల్ సీఎం ప్రమాణ స్వీకారం నుంచి హైదరాబాద్ చేరుకున్నారు చంద్రబాబు. అదే సమయంలో హైదరాబాద్ వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ నేరుగా చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు. అక్కడ గంటపాటు గడిపారు మోడీ. అయితే ఆ పర్యటన ముగిసిన వెంటనే ఢిల్లీ బాట పట్టారు చంద్రబాబు. నిన్న రోజంతా కేంద్ర మంత్రులను కలిసి ఏపీలో కీలక ప్రాజెక్టుల కు సంబంధించిన అంశాలను చర్చించారు. సాయంత్రం ఉన్నత స్థాయి సదస్సులో సైతం పాల్గొన్నారు. ఢిల్లీలోనే రాత్రి బస చేశారు. ఈరోజు అస్సాం లో సీఎం ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. ఇలా క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు సీఎం చంద్రబాబు. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వ పాలనలో క్షణం తీరిక లేకుండా ఉంటూనే.. జాతీయస్థాయిలో సైతం అన్ని కార్యక్రమాలకు హాజరవుతున్నారు. నిజంగా చంద్రబాబు ఓపికకు హాట్సాఫ్ చెప్పాల్సిందే.

ఆ ముగ్గురు స్టార్ హీరోలతో సినిమాలు చేయబోతున్న టాప్ డైరెక్టర్...

Top Director Telugu Cinema
Top Director Telugu Cinema

Top Director Telugu Cinema: తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు దూసుకెళ్తుంది. ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో పెను సంచలనాలను క్రియేట్ చేస్తున్న దర్శకులందరు మనవాళ్లే కావడం విశేషం… ఇక హీరోలైతే వరుస విజయాలతో ఇండియన్ సినిమా బాక్సాఫీస్ ని షేక్ చేస్తున్నారు.బాలీవుడ్ ఇండస్ట్రీకి సైతం చెమటలు పట్టించే విధంగా మనవాళ్లు చేస్తున్న సినిమాలు ప్రేక్షకుల నుంచి విశేషమైన ఆదరణను సంపాదించుకుంటున్నాయి… ఇక ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సక్సెస్ లు సాధించిన రాని గుర్తింపు మనవాళ్లు చేస్తున్న వరుస సినిమాలతో తెచ్చుకొంటున్నారు… రాజమౌళి లాంటి దర్శకుడు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లను పెట్టి చేసిన ‘త్రిబుల్ ఆర్’ సినిమా భారీ విజయాన్ని సాధించింది.

ఇప్పుడు ముగ్గురు హీరోలతో మల్టీ స్టారర్ సినిమాని ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది… ఇంతకీ ఆ దర్శకుడు ఎవరు అంటే సందీప్ రెడ్డి వంగా కావడం విశేషం… మహేష్ బాబు, ప్రభాస్, రామ్ చరణ్ లను పెట్టి ఆయన ఒక భారీ మల్టీ స్టారర్ సినిమా చేయడానికి కథను కూడా రెడీ చేస్తున్నారట.

ప్రస్తుతానికి ప్రభాస్ తో స్పిరిట్ సినిమా చేస్తున్న ఆయన తొందరలోనే ఈ సినిమాకి ముహూర్తం పెట్టబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఏది ఏమైనా కూడా స్పిరిట్ సినిమా భారీ విజయాన్ని సాధిస్తే ప్రభాస్ నెక్స్ట్ లెవెల్ గుర్తింపును సంపాదించుకున్న వాడవుతాడు. లేకపోతే మాత్రం ఆయన చాలావరకు డీలాపడిపోయే ప్రమాదమైతే ఉంది…ఇక ఇప్పటికే వరుస సినిమాలు చేస్తున్న మన హీరోలు మల్టీ స్టారర్ సినిమాలు చేయడానికి కూడా ఆసక్తి చూపిస్తున్నారు. కాకపోతే కథలు బాగుండాలి.

ఇక ఇంతకుముందు రామ్ చరణ్, ఎన్టీఆర్ చేసిన ‘త్రిబుల్ ఆర్’ సినిమా భారీ విజయాన్ని సాధించింది కాబట్టి ఇప్పుడు అందరు మల్టీ స్టారర్ సినిమాల వైపు అడుగులు వేస్తున్నారు…ఇక సందీప్ రెడ్డి వంగ మాత్రం ఒకే ఫ్రేమ్ లో ముగ్గురు మహేష్ బాబు, ప్రభాస్, రామ్ చరణ్ ముగ్గురు హీరోలను చూపించి పెను సంచలనాన్ని క్రియేట్ చేయాలని చూస్తున్నాడు. తను అనుకున్నట్టుగానే ఈ సినిమా వీలైనంత తొందరగా పట్టాలెక్కితే మంచిదని ఇండస్ట్రీలో ఉన్న అన్ని రికార్డులు బ్రేక్ అవుతాయని చాలామంది కామెంట్లు చేస్తున్నారు…

ఏపీలో విద్యార్థులకు అలెర్ట్.. ఆ పని తప్పనిసరి!

Student Aadhaar Mandatory Update
Student Aadhaar Mandatory Update

Student Aadhaar Mandatory Update: ఏపీలో విద్యార్థులకు కీలక సూచన చేస్తున్నారు అధికారులు. ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ చేసుకోవాలని సూచిస్తున్నారు. ఈనెల 12 నుంచి 15 వరకు.. అలాగే 19 నుంచి 22 వరకు రాష్ట్రంలో ప్రత్యేక ఆధార్ క్యాంపులను నిర్వహిస్తున్నారు. ఆధార్ బయోమెట్రిక్ పెండింగ్ లో ఉన్నవారు వెంటనే అప్డేట్ చేసుకోవాలని సూచిస్తున్నారు. 15 ఏళ్లలోపు విద్యార్థులు ఈ ప్రక్రియను పూర్తి చేయాలని సూచిస్తున్నారు అధికారులు. నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు కార్యాలయాలలో స్పెషల్ ఆధార్ క్యాంపులు నిర్వహిస్తున్నారు. ఆధార్ క్యాంప్ షెడ్యూల్ కోసం స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డులను సంప్రదించాలని సూచిస్తున్నారు. కేవలం సచివాలయాల్లోనే కాదు అంగన్వాడి కేంద్రాల్లో కూడా ఈ క్యాంపులు నిర్వహిస్తున్నారు.
* ఈనెల 12 నుంచి 15 వరకు తొలి విడతగా.. ఈనెల 19 నుంచి 22 వరకు ఏంటో విడతగా క్యాంపులు నిర్వహిస్తున్నారు.
* నిబంధనల ప్రకారం ఐదు సంవత్సరాల నుంచి 15 ఏళ్ల వయసు దాటిన తర్వాత ఆధార్ లో బయోమెట్రిక్ వివరాలను అప్డేట్ చేసుకోవాలి. ఆధార్ వివరాలను సైతం అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది.
* రాష్ట్రంలో ఇప్పటికీ లక్షలాదిమంది ఆధార్లో యుఐడిఏఐ నిబంధనల ప్రకారం బయోమెట్రిక్ వివరాలను అప్డేట్ చేసుకోవాల్సి ఉంది. అందుకే వీరి కోసం ఈ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నారు. ఉచితంగానే ఈ అప్డేట్ ప్రక్రియ ఉంటుంది.
* వేలిముద్రలు, ఐరిస్ అప్డేట్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. స్వర్ణ గ్రామం/ స్వర్ణ వార్డు కేంద్రాలతో పాటు అంగన్వాడీ కేంద్రాల్లో ఈ సేవలు అందుబాటులో ఉంటాయి.
* ఒకవేళ ఆధార్ వివరాలు అప్డేట్ చేసుకోకపోతే విద్యార్థులు పై చదువులకు వెళ్లే సమయంలో,, పోటీ పరీక్షలకు హాజరయ్యే సమయంలో, ధ్రువీకరణ పత్రాల వెరిఫికేషన్ చేసే సమయంలో ఇబ్బందులు ఎదురవుతాయి.

తెలుగు స్టార్ హీరోలను వాడేసుకుంటున్న వైయస్సార్ కాంగ్రెస్

YSR Congress Party
YSR Congress Party

YSR Congress Party: వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ రాజకీయాలు చాలా విచిత్రంగా ఉంటాయి. వ్యూహాత్మకంగా కూడా ఉంటాయి. ముఖ్యంగా సోషల్ మీడియా ద్వారా చేసే ప్రయత్నాలు బాగా ఆకట్టుకుంటాయి. ప్రధానంగా సినీ హీరోల అభిమానులను తన వైపునకు తిప్పుకునే ప్రయత్నంలో వైసిపి చేసే రాజకీయం మామూలుగా ఉండదు. ప్రస్తుతం టాలీవుడ్ ప్రముఖ హీరోల అభిమానులను వారికి తెలియకుండానే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ టర్న్ చేసుకోగలదు. అంత గొప్ప వ్యూహం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సొంతం. టిడిపి కూటమికి సినీ గ్లామర్ ఉంది. నందమూరి తో పాటు ఇతర సినీ పెద్దల అభిమానం ఉంది. జనసేనకు మెగా కాంపౌండ్ వాల్ నుంచి బలమైన సపోర్ట్ లభిస్తోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఆ స్థాయిలో లేదు. అందుకే ప్రముఖ హీరోల అభిమానులను వైసీపీ వైపు తిప్పుకునేందుకు సోషల్ మీడియాలో పెద్ద ప్రయత్నమే చేసింది. ఆ హీరోలంతా జగన్మోహన్ రెడ్డికి అభిమానులు అన్నట్టు సోషల్ మీడియాలో బిల్డప్ ఇస్తోంది.

* ప్రభాస్ తమ వాడేనంటూ..
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ విషయంలో అటువంటి ప్రచారమే చేసింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికీ చేస్తూనే ఉంది. ప్రభాస్ పెదనాన్న రెబల్ స్టార్ కృష్ణంరాజు. ఆయన బిజెపిలో ఉండేవారు. బిజెపి నేతగానే చనిపోయారు. ఒకానొక దశలో కృష్ణం రాజు జనసేనలో చేరుతారని అప్పట్లో ప్రచారం నడిచింది. అయితే ఆయన అకాల మృతి చెందారు. ఆ సమయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కృష్ణంరాజు స్వగ్రామంలో పెద్ద కర్మ నిర్వహించారు. ఆ సమయంలో అయితే రాజశేఖర్ రెడ్డి పై కృష్ణంరాజుకు ఎంతో అభిమానం ఉండేదన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ చేశారు. సహజంగానే రాజకీయ సినీ రంగాలకు దగ్గర సంబంధాలు ఉంటాయి. అప్పట్లో కృష్ణంరాజును రాజా అని రాజశేఖర్ రెడ్డి సంబోధించేవారని స్వయంగా రెబల్ స్టార్ ప్రకటించారు. దానిని పట్టుకొని యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తమ వాడే అన్నట్టు సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. అయితే దీనిని గుర్తించిన కృష్ణంరాజు భార్య ఏకంగా కూటమికి మద్దతు ప్రకటించడంతోపాటు ప్రచారం చేశారు. అయినా సరే ఇప్పటికీ ప్రభాస్ అభిమానులను వైసీపీ వైపు తిప్పుకోవడానికి ఆ పార్టీ చేయని ప్రయత్నం అంటూ లేదు.

* జూనియర్ ఎన్టీఆర్ విషయంలో..
మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులను సైతం వైసీపీ నిత్యం ఆకర్షిస్తూనే ఉంటుంది. నందమూరి, నారా ఫ్యామిలీలతో జూనియర్ ఎన్టీఆర్ కు గ్యాప్ ఉందంటూ ప్రచారం చేయడంలో వైయస్సార్ కాంగ్రెస్ సోషల్ మీడియా ముందుంటుంది. మంత్రి నారా లోకేష్ కోసం జూనియర్ ఎన్టీఆర్ ను పార్టీలో తొక్కేశారు అంటూ ప్రచారం చేయడంలో కూడా వైయస్సార్ కాంగ్రెస్ పాత్ర ఉంది. సినిమాలే ప్రపంచం గా బతుకుతున్నారు జూనియర్ ఎన్టీఆర్. రాజకీయాల గురించి పట్టించుకునే స్థాయిలో లేరు ఆయన. అయితే అయిన దానికి కానీ దానికి ఫ్యాన్స్ మధ్య విభజన రేఖ గీసి.. వారిని తమ వైపు తిప్పుకునే పనిలో ఉంటుంది వైయస్సార్ కాంగ్రెస్. ఎప్పటికప్పుడు చంద్రబాబుతో పాటు లోకేష్ కు చెక్ పెట్టాలని జూనియర్ ఎన్టీఆర్ పేరును తెరపైకి తీసుకొస్తూ వివాదాలు సృష్టించేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

* మెగా ఫ్యామిలీ నుంచి అల్లు అర్జున్..
అల్లు అర్జున్ విషయంలో అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అతిగా వ్యవహరించింది అని చెప్పవచ్చు. మెగా కాంపౌండ్ వాల్ నుంచి అల్లు అర్జున్ ను వేరుచేసి చూపడంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పాత్ర ఉంది. మొన్నటి ఎన్నికలకు ముందు తనకు అత్యంత ఆత్మీయుడైన ఓ వైసిపి అభ్యర్థికి సంఘీభావం తెలుపుతూ మద్దతు ప్రకటించారు అల్లు అర్జున్. అది మొదలు అల్లు అర్జున్ తమ వాడే అని చెప్పుకునేందుకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చేయని ప్రయత్నం అంటూ లేదు. ఆయన సినిమాలు విడుదలైనప్పుడు హంగామా చేస్తూనే ఉంది. కేవలం పవన్ కళ్యాణ్ ను దృష్టిలో పెట్టుకొని.. మెగా ఫ్యామిలీతో అల్లు అర్జున్ కు విభేదాలు ఉన్నాయని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం వెనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. అలా అల్లు అర్జున్ అభిమానులను తమ వైపునకు తిప్పుకునే ప్రయత్నం అన్నమాట.

* పాత అనుబంధంతో మహేష్ బాబు పై..
మహేష్ బాబును సైతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వదల్లేదు. వైయస్ రాజశేఖర్ రెడ్డి తో సూపర్ స్టార్ కృష్ణకు మంచి సంబంధం ఉండేది. కృష్ణ వియ్యపురాలు గల్లా అరుణ కుమారి కాంగ్రెస్ పార్టీలో ఉండేవారు. కృష్ణ సిఫారసులతో రాజశేఖర్ రెడ్డి అప్పట్లో ఆమెను క్యాబినెట్లో తీసుకున్నారని కూడా ఒక టాక్ ఉంది. పైగా స్వతహాగా ఎన్టీఆర్ను వ్యతిరేకించిన కృష్ణ కాంగ్రెస్ పార్టీలోనే సుదీర్ఘకాలం కొనసాగారు. అయితే రాజశేఖర్ రెడ్డి పై ఉన్న గౌరవంతోనే కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావు జగన్ వెంటే అడుగులు వేశారు. అక్కడ తగినంత ప్రాధాన్యం లేకపోవడంతోనే ఆదిశేషగిరిరావు టిడిపిలోకి వచ్చేసారు. గల్లా అరుణ కుమారి తో పాటు ఆమె కుమారుడు జయదేవ్ సైతం టిడిపిలోకి వచ్చారు. జయదేవ్ స్వయానా మహేష్ బాబు బావ. రెండుసార్లు గుంటూరు ఎంపీగా గెలిచిన జయదేవ్ ను వెంటాడారు జగన్మోహన్ రెడ్డి. అందుకే మొన్నటి ఎన్నికలకు ముందు ప్రత్యక్ష రాజకీయాలకు దూరమయ్యారు జయదేవ్. అయినా సరే మహేష్ బాబును తమ వాడిగా చూపి ఓట్లు కొల్లగొట్టాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తోంది. అయితే సోషల్ మీడియా యుగం కాబట్టి ప్రజలకు అన్ని తెలుసు. ముఖ్యంగా హీరోల అభిమానులకు సైతం నేటి రాజకీయాల పట్ల స్పష్టమైన అవగాహన ఉంది. అయినా సరే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమానుల ఓట్ల కోసం తపన పడుతోంది.

రామ్ చరణ్ పై తీవ్రమైన అసహనంతో ఫ్యాన్స్.. పాన్ ఇండియన్ సినిమాలు ఆపేయ్ అంటూ కామెంట్స్..

Ram Charan
Ram Charan

Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ చిత్రం వచ్చే నెల 4 న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కాబోతుంది. ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని ఈ నెల 18 న విడుదల చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ముంబై లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ఇదంతా పక్కన పెడితే రామ్ చరణ్ అభిమానులు రామ్ చరణ్ పై సోషల్ మీడియా లో తీవ్రమైన అసహనం ని వ్యక్తం చేస్తూ సంచలన కామెంట్స్ చేస్తున్నారు. ఎందుకంటే ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ గ్రాస్ పై చాలా ఆశలు పెట్టుకున్నారు. ఎందుకంటే చాలా కాలం తర్వాత రామ్ చరణ్ సినిమా పై ఆడియన్స్ లో మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఓజీ, దేవర, సలార్, కల్కి రేంజ్ లో అడ్వాన్స్ బుకింగ్స్ ని ఊహిస్తే , గేమ్ చేంజర్, హరి హర వీరమల్లు రేంజ్ బుకింగ్స్ ఉన్నాయి.

ఇలా ఇంత తక్కువ అడ్వాన్స్ బుకింగ్స్ ఉండడానికి కారణం మేకర్స్ అలసత్వమే అని అంటున్నారు ఫ్యాన్స్. పాటలు , గ్లింప్స్ వీడియో ద్వారా వచ్చిన భారీ హైప్ ని మేకర్స్ క్యాష్ చేసుకోలేకపోయారని, వరుసగా వాయిదాలు పడడం వల్ల సినిమా మీద గతం లో ఉన్నటువంటి హైప్ ఆవిరి అయిపోయిందని, ఇప్పుడు మళ్లీ బజ్ క్రియేట్ చేయడానికి మూవీ టీం ఎలాంటి ప్రొమోషన్స్ చేయడం లేదని , రామ్ చరణ్ కనీసం పట్టించుకోవడం లేదని , ఇతర పాన్ ఇండియన్ హీరోలకు ఉన్నటువంటి కసి ఈయనతో లేదని అభిమానులు బాధపడుతున్నారు. వాళ్ళ ఆవేశం లో కూడా అర్థం ఉంది కానీ, ఫైనల్ ఔట్పుట్ బెస్ట్ గా ఉంటేనే కదా సినిమా కి మంచి పాజిటివ్ టాక్ వస్తుంది లాంగ్ రన్ భారీ లెవెల్ లో ఉంటుంది అనేది అర్థం చేసుకోవాలి అంటున్నారు విశ్లేషకులు.

హైప్ తగ్గడం వల్ల ఓపెనింగ్స్ పై ప్రభావం పడొచ్చు, కానీ ఆడియన్స్ , ప్రేక్షకులు జీవితాంతం గుర్తుపెట్టుకునే రేంజ్ లాంగ్ రన్ కావాలంటే , ఔట్పుట్ కోసం కొన్ని కచ్చితమైన అంశాలు చూసుకోవాల్సి ఉంటుంది, అందుకే వాయిదా వేశారని అంటున్నారు. ప్రొమోషన్స్ ఏ మూవీ కి కూడా మేకర్స్ ప్రతీ రోజు భారీ లెవెల్ లో ప్లాన్ చేయలేదు. కానీ ‘పెద్ది’ కి రాబోయే రోజుల్లో బోలెడన్ని ఈవెంట్స్ ఉన్నాయి. ముంబై లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఉంది, భోపాల్ లో గొప్ప మ్యూజికల్ ఈవెంట్ ఉంది, ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంది , దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ భారీ ప్రమోషనల్ ప్లాన్ ఉంది , కచ్చితంగా ఈ నెల 18 నుండి ‘పెద్ది’ ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ ఎవ్వరూ ఊహించని రేంజ్ లో పెరుగుతాయని బలమైన నమ్మకం తో ఉన్నాయి ట్రేడ్ వర్గాలు , మరి ఏమి జరగబోతుందో చూడాలి.

వైయస్సార్ కాంగ్రెస్ నుంచి ఆ బుల్లితెర నటి ఔట్

Shyamala
Shyamala

Shyamala: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. పార్టీలో వివాదాస్పదం ముద్ర లేకుండా చూడాలని నాయకత్వం భావిస్తున్నట్లు అర్థమవుతోంది. ముఖ్యంగా టీవీ యాంకర్ శ్యామల లాంటి వారిని పార్టీకి దూరంగా ఉంచుతున్నట్లు ప్రచారం నడుస్తోంది. ఇటీవల ఆమె వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం లేదు. అయితే పార్టీ ఆమెను గడప తొక్కనీయడం లేదన్న కామెంట్స్ పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తున్నాయి. బుల్లితెరను విడిచిపెట్టి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన శ్యామల ఆ పార్టీకి ఫైర్ బ్రాండ్ గా మారుతారని అంతా భావించారు. అయితే గత పది నెలలుగా వైయస్సార్ కాంగ్రెస్ కార్యాలయంలో ఆమె పెద్దగా కనిపించడం లేదు. ప్రస్తుతం ఆ పార్టీలో ఆమె అధికార ప్రతినిధిగా ఉన్నారు. కానీ ప్రెస్ మీట్ పెట్టలేకపోతున్నారు.

* అధికార ప్రతినిధి హోదా..
యాంకర్ శ్యామల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో అధికార ప్రతినిధి హోదా దక్కించుకోవడం చాలా మందికి ఇష్టం లేదు. పార్టీలోనే ఆమెకు వ్యతిరేక వర్గం ఒకటి ఉంది. గత పది నెలల కాలంలో ఆమె రాకపోవడం వెనుక ప్రత్యర్థుల హస్తము ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. అయితే ఇటీవల ఆమెను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్టించుకోలేదన్న విమర్శ బయటకు రావడంతో జాగ్రత్త పడ్డారు. తనపై జరుగుతున్న ప్రచారానికి కౌంటర్ ఇచ్చారు. అయితే అది పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ ద్వారా కాకుండా.. సోషల్ మీడియా ద్వారా చెప్పడం ఈ అనుమానాలకు మరింత బలం చేకూరుస్తుంది. ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి పై తనకు ఎంతటి విధేయత ఉందో.. చెప్పేందుకు శ్యామల సుదీర్ఘమైన వీడియో పెట్టడం హాట్ టాపిక్ అవుతోంది. అంత విధేయత ప్రదర్శించాల్సిన అవసరం ఇప్పటికిప్పుడు శ్యామలకు ఏర్పడిందన్నమాట. అంటే తెరవెనుక చాలా జరిగిందని ఇట్టే అర్థమవుతోంది.

* పార్టీలో ప్రత్యర్థి వర్గం..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో నోరున్న నేతలది పెత్తనం. అక్కడ గుర్తింపు రావాలంటే గట్టిగా మాట్లాడాలి. అయితే యాంకర్ శ్యామలకు పార్టీతో పాటు అధినేత వద్ద ప్రాధాన్యత పెరుగుతుండడంతో కొంతమంది తట్టుకోలేక పోయారు. అయితే ఆమె సోషల్ మీడియాకు అడ్డంగా బుక్ అవుతుండడం కూడా పార్టీకి మైనస్ గా మారుతుంది. అందుకే ఆమెను ప్రాధాన్యత క్రమంలో పక్కన పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రచారం నడుస్తోంది. పది నెలలుగా ఒక్కసారి కూడా పార్టీ తరఫున మాట్లాడే ఛాన్స్ ఆమెకు దక్కలేదు. దీంతో తన విధేయత వీడియో జగన్మోహన్ రెడ్డి వద్దకు వెళ్తే.. ఆయన కొంత మెత్తబడి మళ్లీ అవకాశం ఇస్తారని ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. శ్యామల పని అయిపోయిందని పార్టీలోని ఒక వర్గం గట్టిగా నమ్ముతోంది. కానీ ఆమె మాత్రం నేను ఇక్కడే ఉన్నానని నిరూపించుకోవడానికి తంటాలు పడుతున్నారు.

బిజెపి విషయంలో స్టాండ్ మార్చుకున్న వైయస్సార్ కాంగ్రెస్

YSR Congress Party
YSR Congress Party

YSR Congress Party: బిజెపి విషయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చాలా పొదుపుగా వ్యవహరిస్తుంది. ఏపీ రాష్ట్ర నాయకులను మాత్రం విమర్శిస్తూ.. కేంద్ర నాయకత్వాన్ని మాత్రం గౌరవిస్తూ వస్తుంది. ప్రధాని నరేంద్ర మోడీ పాలన గురించి కానీ.. కేంద్ర ప్రభుత్వ విధానాల గురించి కానీ బాహాటంగా విమర్శలు చేసే సాహసం చేయదు. ఎందుకంటే కేంద్రం కన్నెర్ర చేస్తే జగన్మోహన్ రెడ్డికి ఇబ్బందులు తప్పవని తెలుసు. అందుకే బిజెపి పెద్దల విషయంలో నోరు తెరిచేందుకు ఎవరూ సాహసించరు. కానీ ఆ సాహసం చేశారు పేరుని నాని. హైదరాబాద్ వేదికగా ప్రధాని మోదీ చేసిన పొదుపు మాటలపై కౌంటర్ ఇచ్చారు పేర్ని నాని. తనదైన శైలిలో సెటైర్లు కూడా వేశారు. అయితే నాని కాదు.. ఇదే విషయాన్ని జగన్ మోహన్ రెడ్డి చెబితే బాగుంటుంది అనేది నెటిజెన్ల సూచన. ప్రధాని లాంటి నేతపై పేర్ని నాని వ్యాఖ్యానించడం ఏమిటని.. అదేదో జగన్మోహన్ రెడ్డి చెప్పవచ్చు కదా అన్నవారు ఉన్నారు.

* ప్రధాని సూచనలపై..
ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాదులో పర్యటించిన సంగతి తెలిసిందే. పశ్చిమ ఆసియాలో యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవడానికి ప్రజలు విదేశీ ప్రయాణాలు, బంగారం కొనుగోలు తగ్గించుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ సూచించారు. అయితే ప్రధాని వ్యాఖ్యలపై పేర్ని నాని ఘాటుగా స్పందించారు. ప్రజలను బంగారం కొనొద్దు.. విదేశాలకు వెళ్లొద్దు… పెట్రోల్ వాడకం తగ్గించుకోమని చెబుతున్న ప్రధాని.. ఆయన ఆచరణలో ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రజలకు నీతులు చెప్పేముందు ప్రధాని ఆచరించి చూపాలని సూచించారు పేర్ని నాని. అంతటితో ఆగకుండా ప్రధాని నరేంద్ర మోడీ ప్రయాణ ఖర్చులపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

* తరచూ ప్రయాణాలపై విమర్శలు..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏపీ పాలకులపై కూడా అదే తరహా ఆరోపణలు చేస్తూ వచ్చింది. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ప్రయాణాలపై అప్పటికప్పుడు ఆరోపణలు చేస్తూ వస్తోంది ఆ పార్టీ. ఇప్పుడు ఏకంగా ప్రధాని మోదీ ప్రయాణాలకు ఖర్చులపై పేర్ని నాని మాట్లాడడం హాట్ టాపిక్ అవుతుంది. ప్రధాని నరేంద్ర మోడీ సాధారణ పౌరుల మాదిరిగా రైళ్లలో లేదా కమర్షియల్ ఫ్లైట్లో ప్రయాణించాలని సూచించారు. పశ్చిమ ఆసియా యుద్ధాన్ని సాకుగా చూపి సామాన్యుడిపై నియంత్రణలు విధించడం సరికాదని నాని అభిప్రాయపడ్డారు. అయితే మోడీని విమర్శించేందుకు వైసిపి నేతలు ముందుకు రారు. కానీ ఇటీవల తమిళనాడులో విజయ్ వ్యవహారంతో మళ్లీ కాంగ్రెస్ పార్టీకి దగ్గరవుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. వైయస్సార్ కాంగ్రెస్ కార్యాలయంలోనే ప్రెస్ మీట్ పెట్టి నాని విమర్శించారంటే… బిజెపి విషయంలో వైసీపీ స్టాండ్ మారినట్లు స్పష్టమవుతోంది.

పవన్ పాలనకు కేంద్రం కితాబు!

Andhra Pradesh Panchayat Awards
Andhra Pradesh Panchayat Awards

Andhra Pradesh Panchayat Awards: ఏపీ ( Andhra Pradesh)మరో అరుదైన గౌరవం దక్కించుకుంది. జాతీయస్థాయిలో మరోసారి మెరిసింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయతీ సతత్ వికాస్ జాతీయ అవార్డుల్లో ఏపీ పంచాయతీ రాజ్ శాఖ అగ్రస్థానంలో నిలిచింది. గతంలో 24వ స్థానంలో ఉండే ఏపీ.. ఇప్పుడు ప్రథమ స్థానానికి రావడం నిజంగా విశేషం. రెండున్నర సంవత్సరాలలోనే రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ స్థానానికి చేరుకోవడం శుభపరిణామం. ఇదంతా పవన్ కళ్యాణ్ క్రెడిట్. ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులే ఈ విజయానికి పునాది అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

* గ్రామీణ శాఖలను తీసుకుని..
ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చింది. భాగస్వామిగా ఉన్న పవన్ కళ్యాణ్ పట్టుబట్టి తనకు గ్రామీణ, పంచాయతీరాజ్ శాఖలను దక్కించుకున్నారు. గ్రామీణ అభివృద్ధితో పాటు స్థానిక సంస్థల బలోపేతం పై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. రాష్ట్రవ్యాప్తంగా 13326 గ్రామపంచాయతీలు ఒకేరోజు గ్రామసభలు నిర్వహించి ప్రపంచ రికార్డు సృష్టించారు. ప్రజాభాగస్వామ్యంతో సుమారు రూ.4500 కోట్ల విలువైన ఉపాధి హామీ పనులకు రూపకల్పన చేశారు. పారదర్శక విధానాలతో నిధుల దుర్వినియోగం తగ్గించి.. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనపై దృష్టి పెట్టారు. వేల కిలోమీటర్ల సిసి రహదారులు, మెరుగైన డ్రైనేజీ వ్యవస్థలతో రూపురేఖలను మార్చారు.

* జాతీయ స్థాయిలో సప్త..
పవన్ కళ్యాణ్ నేతృత్వంలో విప్లవాత్మక మార్పులతో ఇప్పటికే పల్లెలు అన్ని విధాలా గుర్తింపు పొందాయి. పేదరిక నిర్మూలన- జీవనోపాధి మెరుగుదల విభాగంలో వైయస్సార్ కడప జిల్లాలోని చెమ్ముళ్లపల్లి దేశంలోనే రెండో స్థానాన్ని దక్కించుకుందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. గ్రామీణాభివృద్ధికి సంబంధించి వివిధ విభాగాల్లో ఏపీలోని చాలా గ్రామాలు ర్యాంకులను సొంతం చేసుకున్నాయి. పంచాయితీరాజ్ శాఖకు చెందిన దాదాపు పదివేల మంది ఉద్యోగులకు పదోన్నతులు ఇవ్వడం ద్వారా ఆ వ్యవస్థలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టారు పవన్ కళ్యాణ్. రాజాగా జాతీయస్థాయిలో దక్కిన ఈ గుర్తింపు పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు దార్శనికత, ప్రధాని నరేంద్ర మోడీ సహకారంతోనే పల్లెల్లో నిజమైన స్వరాజ్యం తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్టు పవన్ కళ్యాణ్ వెల్లడించారు.

ఆలూ లేదు.. చూలూ లేదు.. ఇప్పుడు ఇషాన్ కిషన్ అట..

Ishan Kishan
Ishan Kishan

Ishan Kishan: దున్నపోతు ఈనిందంటే దొడ్లో కట్టేయమన్నాడట వెనుకడికి ఒకడు.. ఇప్పుడు కొంతమంది సూడో స్పోర్ట్స్ ఎనలిస్టుల పరిస్థితి కూడా అలానే తయారయింది. క్రికెట్ చూడటం.. తమకు తామే మేధావులు అని చెప్పుకోవడం.. ఏదోక సోషల్ మీడియాలో పేజీ క్రియేట్ చేయడం.. అందులో చవకబారు కంటెంట్ పోస్ట్ చేయటం కామన్ అయిపోయింది.. ఇటువంటివారు ఎలా తయారయ్యారంటే.. చివరికి బీసీసీఐ నిర్ణయాలు కూడా వీరే తీసుకుంటున్నారు. తీసుకోవడం మాత్రమే కాదు అమలు జరిగిపోయాయి అన్నట్టుగా చెబుతున్నారు.

టీమిండియా మేనేజ్మెంట్ టి20 క్రికెట్లో మార్పులకు శ్రీకారం చుట్టినట్టు ఇటీవల మీడియాలో వార్తలు వచ్చాయి. అందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు. పైగా అయ్యర్ కు సారధ్య బాధ్యతలు అప్పగిస్తారని ప్రచార జరుగుతుంది. దీనిని ఆమోదించిన వారు లేరు. అలాగని ఖండించిన వారు కూడా లేరు. అయ్యర్ ను పక్కనబెట్టి ఏకంగా సంజు శాంసన్ కు జట్టు పగ్గాలు ఇస్తున్నారని వార్తలు రాయడం మొదలుపెట్టారు. వాస్తవానికి సంజు ఇటీవల టి20 క్రికెట్లో అద్భుతంగా ఆడుతున్నాడు. టి20 వరల్డ్ కప్ లో సత్తా చూపించాడు. వరుసగా మూడు హాఫ్ సెంచరీలు చేశాడు. టీమిండియా టి20 వరల్డ్ కప్ సాధించడంలో ముఖ్యపాత్ర పోషించాడు.

సంజు మాత్రమే కాదు సూర్య కుమార్ యాదవ్ కూడా అత్యంత విజయవంతమైన కెప్టెన్ గా టి20 ఫార్మాట్లో నిలిచాడు. ఇతడి నాయకత్వంలో టీమిండియా ఒక్క ట్రోఫీ కూడా కోల్పోలేదు. 2024లో టి20 వరల్డ్ కప్ సాధించిన తర్వాత టీమిండియా పగ్గాలు అందుకున్న సూర్యకుమార్ యాదవ్.. ఆటగాడిగా విఫలమైనప్పటికీ.. నాయకుడిగా మాత్రం నూటికి నూరు శాతం మార్కులు వేసుకున్నాడు. కొంతకాలంగా అతడు సరిగ్గా ఆడలేక పోతున్నప్పటికీ.. నాయకుడిగా మాత్రం అతడు అద్భుతంగానే రాణిస్తున్నాడు. వాస్తవానికి అతడిని తప్పిస్తున్నట్టు ఇటీవల మేనేజ్మెంట్ లీకులు ఇచ్చినట్టు కొంతమంది వార్తలు రాశారు కానీ.. అందులో వాస్తవం లేదు. ఎందుకంటే సూర్యకుమార్ యాదవ్ నాయకత్వం మీద మేనేజ్మెంట్ బలమైన నమ్మకంతో ఉంది. అలాంటప్పుడు అతడిని ఎందుకు పక్కన పెడుతుంది.

సూర్య కుమార్ యాదవ్ ను పక్కన పెట్టినట్టు.. అయ్యర్ కు నాయకత్వ బాధ్యతలు అప్పగించినట్లు.. సంజు శాంసన్ కు కెప్టెన్సీ కేటాయించినట్టు వార్తలు రాసిన కొంతమంది సూడో స్పోర్ట్స్ అనలిస్టులు.. ఇప్పుడు ఇషాన్ కిషన్ వైపు దృష్టి సారించారు. ఐపీఎల్ లో అతడు గొప్పగా ఆడుతున్న నేపథ్యంలో.. అతడికి నాయకత్వ బాధ్యతలు అప్పగించేందుకు బీసీసీఐ నిర్ణయించినట్టు వార్తలు రాయడం మొదలుపెట్టారు. దీనినే ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అంటారని.. నిజమైన స్పోర్ట్స్ జర్నలిస్టులు చెబుతున్నారు. ఏదైనా రాస్తే నమ్మే విధంగా ఉండాలి. ముఖం మీద ఉమ్మే విధంగా ఉండకూడదని వారు ఉమ్మి వేస్తూ మరీ చెబుతున్నారు.

48 గంటల్లోనే 10 లక్షలు.. ఇదీ "విజిల్ పోడు" విజయ్ రేంజ్..

CM Vijay Social Media Followers
CM Vijay Social Media Followers

CM Vijay Social Media Followers: రాజకీయంగా ఎలా ఉన్నా సరే.. తమిళనాడు విజయ్ కి సోషల్ మీడియాలో మాత్రం విపరీతమైన ముఖ్యమంత్రి పాపులారిటీ ఉంటుంది.అతనికి బలమైన అభిమానులు ఉన్నారు.అతడు రాజకీయాలకు రాకముందే ఒక అభిమాన సంఘాన్ని ఏర్పాటు చేశాడు.దానిద్వారా సేవ కార్యక్రమాలు నిర్వహించారు.ఆ తర్వాత ఆ అభిమాన సంఘం పేరుతో విజయ్ తండ్రి రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తే ఒప్పుకోలేదు. చివరికి తన తండ్రి మీదనే విజయ్ పోలీస్ కేసు పెట్టాడు. ఆ తర్వాత కొద్ది రోజులపాటు విజయ్, ఆయన తండ్రి మాట్లాడుకోలేదు. ఆ సమయంలో విజయ్ తల్లి మధ్యవర్తి పాత్ర పోషించారు.

తమిళనాడు ముఖ్యమంత్రిగా స్వీకారం చేసిన తర్వాత విజయ్ గురించి స్థానిక మీడియా మాత్రమే కాదు నేషనల్ మీడియా కూడా విపరీతంగా ప్రయత్నిస్తోంది. ఇటీవల విజయ్ ప్రమాణ స్వీకారానికి సంబంధించిన లైవ్ ను దేశంలో ఉన్న అన్ని జాతీయ మీడియా సంస్థలు టెలికాస్ట్ చేశాయి. ఆ టెలికాస్ట్ సోషల్ మీడియాలో సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేసింది. విపరీతమైన వ్యూస్ లభించడంతో విజయ్ నేషనల్ సెలబ్రిటీ అయిపోయాడు. రాజకీయాలలో ఎటువంటి దురుద్దేశపూర్వక వ్యాఖ్యలు చేయబడలేదు. ఇటీవల విజయ్ ప్రమాణ స్వీకారానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ఆ సమయంలో వారిద్దరు ఒకరిని ఒకరు బ్రదర్ అంటూ సంభోదించారు.

విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయనకు సంబంధించిన డైలీ అప్‌డేట్‌లు తెలుసుకోవడానికి అభిమానులు విపరీతమైన ఆసక్తిని చూపిస్తున్నారు. ఈ చెల్లింపు తమిళనాడు సీఎంఓ పేజీకి గతంలో 4.4 లక్షల మంది ఫాలోవర్లు మాత్రమే ఉండేవారు. సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 48 గంటల్లోనే ఆ పేజీ రికార్డు స్థాయిలో ఫాలోవర్లు పెరిగాయి. ఇప్పుడు ఆ సంఖ్య అంతకుమించి అనే స్థాయికి చేరుకుంది. దాదాపు పది లక్షల మంది కొత్త యూజర్లు యాడ్ అయ్యారు.ఎక్స్ పేజీకి మిలియన్ యూజర్లు యాడ్ అయ్యారు. దీనితో ఆ సంఖ్య రెండు మిలియన్లను దాటేసింది.విజయ్ కి ఉన్న అపారమైన అభిమాన గణానికి ఇది ఒక నిదర్శనం అని రాజకీయ విశ్లేషకులు చూస్తున్నారు.

విజయ్ ప్రమాణ స్వీకార సమయంలో మాట్లాడిన మాటలు చాలా హుందాగా ఉన్నాయి.తమిళ సంస్కృతిని ప్రతిబింబించే విధంగా ఉన్నాయి.ప్రతి సందర్భంలోనూ తమిళనాడు ముఖ్యమంత్రి అనే అహాన్ని విజయ్ చూపించలేదు. ప్రభుత్వం ఎలా పనిచేస్తుంది.. ఎలా పని చేస్తుందనే విషయాలపై స్పష్టత ఇచ్చారు. విజయ్ తమిళనాడు రాజకీయాలలో సరికొత్త చరిత్ర సృష్టించేందుకు సిద్ధంగా ఉన్నానంటూ ప్రజలకు సంకేతాలు ఇచ్చారు