Home Blog Page 271

Samsung Galaxy M47.. దీని ప్రాసెసర్ గురించి తెలిస్తే WOW అంటారు..

Samsung Galaxy M47 specifications
Samsung Galaxy M47 specifications

Samsung Galaxy M47 specifications: Samsung కంపెనీ నుంచి కొత్త మొబైల్స్ మార్కెట్లోకి వస్తుందంటే కొందరు ఉత్సాహంగా ఉంటారు. ఈ కంపెనీ తన పాపులర్ మిడ్ రేంజ్ ‘M’ సిరీస్‌లో భాగంగా సరికొత్త Samsung Galaxy M47 5G మొబైల్‌ను మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధమవుతోంది. ఇటీవల లీకైన గీక్‌బెంచ్ (Geekbench) రిపోర్ట్స్ ప్రకారం.. ఈ ఫోన్ శక్తివంతమైన Qualcomm Snapdragon 6 Gen 3 ప్రాసెసర్‌తో రానున్నట్లు స్పష్టమైంది. ఈ సరికొత్త చిప్‌సెట్ కారణంగా మొబైల్ పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్‌లో ఉండబోతోంది. ఈ ప్రాసెసర్ ఎలాంటి పనితీరును చూపిస్తుంది? ఈ మొబైల్ లో ఇంకా ఏమేం ఫీచర్స్ ఉంటాయి?

శామ్‌సంగ్ గెలాక్సీ M47 లో ఉపయోగించబోయే స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 3 చిప్‌సెట్ 4nm (నానోమీటర్) ఆర్కిటెక్చర్‌పై తయారైంది. అంటే ఇది తక్కువ బ్యాటరీని వాడుకుంటూ ఎక్కువ పవర్‌ను ఇస్తుంది. ఈ ఆక్టా-కోర్ ప్రాసెసర్‌లో హై-పర్ఫార్మెన్స్ కోసం 2.40 GHz స్పీడ్ గల 4 కోర్లు, సాధారణ పనుల కోసం 1.80 GHz స్పీడ్ గల 4 ఎఫిషియన్సీ కోర్లు ఉన్నాయి. దీనివల్ల ఫోన్ హ్యాంగ్ అవ్వకుండా స్మూత్‌గా రన్ అవుతుంది.

ఈ చిప్‌సెట్‌తో పాటు ఇందులో Adreno 710 GPU గ్రాఫిక్స్ కార్డ్‌ను అందించారు. గీక్‌బెంచ్ ఓపెన్ సిఎల్ టెస్టుల్లో ఇది 2,256 స్కోర్‌ను సాధించింది. దీనివల్ల BGMI ఫ్రీ ఫైర్ వంటి హెవీ గ్రాఫిక్స్ గేమ్స్ కూడా ఎలాంటి లాగ్స్ లేకుండా, హై ఫ్రేమ్ రేట్స్‌తో ఆడుకోవచ్చు. మల్టీటాస్కింగ్ యాప్స్ ఓపెన్ చేసేటప్పుడు ఫోన్ చాలా వేగంగా స్పందిస్తుంది.

శామ్‌సంగ్ గెలాక్సీ M47 మొబైల్ సరికొత్త Android 16 ఆధారిత One UI సాఫ్ట్‌వేర్‌తో రానుంది. అంతేకాకుండా, ఇందులో బేస్ వేరియంట్ లోనే 8GB RAM, 128GB స్టోరేజ్ అందించే అవకాశం ఉంది. ఈ లేటెస్ట్ సాఫ్ట్‌వేర్ భారీ ర్యామ్ కలయిక వల్ల బ్యాక్‌గ్రౌండ్‌లో ఎన్ని యాప్స్ రన్ అవుతున్నా ఫోన్ ఎక్కడా స్లో అవ్వదు.

కొన్ని లీక్స్ ప్రకారం ఈ ఫోన్ కేవలం ప్రాసెసర్ పరంగానే కాకుండా మిగిలిన ఫీచర్లలోనూ అదరగొట్టనుంది. ఇందులో 120Hz రిఫ్రెష్ రేట్ తో కూడినAMOLED డిస్‌ప్లే ఉండే అవకాశం ఉంది. ఫోటోగ్రఫీ కోసం వెనుక వైపు 50MP ప్రధాన కెమెరా, ఫ్రంట్ వైపు 32MP సెల్ఫీ కెమెరా ఉండొచ్చు. ఇక బ్యాటరీ విషయానికి వస్తే, శామ్‌సంగ్ ‘M’ సిరీస్ మార్కుకు తగ్గట్టుగా ఇందులో 6000mAh భారీ బ్యాటరీ ఉండగా.. దీనికి 25W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఇచ్చే అవకాశం ఉంది.

మొత్తంగా శామ్ సంగ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 3 చిప్‌సెట్‌తో రాబోతున్న శామ్‌సంగ్ గెలాక్సీ M47 మొబైల్.. బడ్జెట్ ధరలో (సుమారు రూ. 20,000 నుంచి రూ.23,000 లోపు) బెస్ట్ పర్ఫార్మెన్స్ ఆశించే గేమర్స్‌కు మరియు యూజర్స్‌కు ఒక అద్భుతమైన ఆప్షన్ కానుంది.

లష్కర్‌ కీలక కమాండర్‌ను లేపేసిన అజ్ఞాత సాయుధులు.. తర్వాత ఎవరు?

Mir Shukr Khan Raisani
Mir Shukr Khan Raisani

Mir Shukr Khan Raisani: పాకిస్తాన్‌లో అన్నీ అధోగతికి వెళ్తున్నాయి. రెండు విషయాలు మాత్రం రోజు రోజుకూ పెరుగుతున్నాయి. మొదటిది ఆర్థిక సంక్షోభం. ఎన్ని ప్రయత్నాలు చేసిన పాకిస్తాన్‌ రోజు రోజుకూ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతోంది. రెండోది అజ్ఞాత సాయుధలు కడతేర్చే భారత వ్యతిరేక, జిహాదీ మతోన్మాదన ఉగ్రవాదులను లేపేస్తున్నారు. పాకిస్తాన్‌ ఆర్థిక సమస్యలను పరిష్కరించడం లేదు. ఇదే సమయంలో అజ్ఞాత సాయుధులను కూడా పట్టించుకోవడం లేదు. తాజాగా మరో దాడి జరిగింది.

సంబురాల వేళ కీలక కమాండర్‌..
తాజాగా పాకిస్తాన్‌ పది రోజుల పండుగ చేసుకుంటోంది. గతేడాది భారత్‌ నిర్వహించిన ఆపరేషన్‌ సిందూర్‌లో విజయం సాధించామని చెప్పుకుంటూ ఈ పండుగ చేసుకుంటోంది. భారత దాడుల్లో పాకిస్తాన్‌లోని ఉగ్ర స్థావరాలు ధ్వంసమయ్యాయి. వంద మందికిపైగా ఉగ్రవాదులు హతమయ్యారు. ఇక పాకిస్తాన్‌ ప్రతిదాడులను కూడా భారత్‌ సమర్థవంతంగా తిప్పికొట్టింది. ఇదే సమయంలో ఆ దేశంలోని వైమానిక స్థావరాలను ధ్వంసం చేసింది. ఎయిర్‌ బేస్‌లు తుక్కుతుక్కు అయ్యాయి. ప్యాచ్‌లు వేసుకుని కవర్‌ చేసింది. కానీ పాక్‌ ప్రజలను ఏమార్చేందుకు తామే విజయం సాధించినట్లు పండుగ చేస్తోంది.

బలూచ్‌ వేడుకల్లో..
పాకిస్తాన్‌లోని అతిపెద్ద రాష్ట్రం బలూచిస్తాన్‌ రాజధాని ఖ్వెట్టాలో తాజాగా మర్కయా హఖ్‌ పేరుతో సంబురాలు నిర్వహించింది. ఇందులో లష్కర్‌ ఎ తోయిబా కీలక నేత బలూచిస్తాన్‌ ఇన్‌చార్జి హఫీజ్‌ ఇంద్రిస్‌ మోహల్‌తోపాటు భారత దేశంలో అనేక దాడులు నిర్వహించిన కరుడుగట్టిన జిహాదీ ఉగ్రవాది మీర్‌ షుకర్‌ఖాన్‌ రైసా ఉన్నాడు. వేడుకలు ఘనంగా జరిగాయి. భారత వ్యతిరేక నినాదాలు చేశారు. పటాకులు కాల్చారు. రాత్రి సమావేశం ముగిసింది. కుర్చీలు తీస్తుండగా మీర్‌ షుకర్‌ఖాన్‌ రైసా శవమై కనిపించాడు. ఎవరు చంపారో తెలియదు. కానీ లేపేశారు.

పాక్‌ సైనికులు కూడా..
ఇదిలా ఉంటే బలూచిస్తాన్‌ లిబరేషన్‌ ఆర్మీకి చెందిన సాయుధలు పాకిస్తాన్‌ సైనికులను కూడా ఇదే సమయంలో లేపేశారు. ఒకవైపు ఉగ్రవాది మతమవ్వగా మరోవైపు మర్కయా హఖ్‌ బలూచిస్తాన్‌ పేరుతో బీఎల్‌ఏ సైనికులను చంపేసింది.

అజ్ఞాత సాయుధులకు భయపడి ఇప్పటికే ఉగ్రవాద సంస్థల కీలక నాయకులు అజ్ఞాతంలో ఉన్నారు. అజ్ఞాత సాయుధులకు భయపడుతున్నారు. ఇప్పటికే వందకుపైగా భారత వ్యతిరేక, ఉగ్రవాదులు అజ్ఞాత సాయుధుల చేతిలో చనిపోయారు. మరోవైపు హఫీజ్‌ ఇంద్రిస్‌ మోహల్‌ అజ్ఞాతంలోకి వెళ్లారు. మొత్తానికి అజ్ఞాత సాయుధులు పాకిస్తాన్‌లోని ఉగ్రవాదులతో ఉ*చ్చ పోయిస్తున్నారు.

బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ని అలా వాడేస్తున్న జగన్!

Byreddy Siddharth Reddy
Byreddy Siddharth Reddy

Byreddy Siddharth Reddy YSRCP role: కర్నూలు జిల్లాలో రాజకీయాలు మారుతున్నాయి. ముఖ్యంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ యువనేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి యాక్టివ్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఇటీవల కర్నూలు నగరంలో పర్యటించారు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి. మంత్రిగా ఉన్న టీజీ భరత్ పైనే ఆరోపణలు చేశారు. అనేక రకాల విమర్శలు చేశారు. అదే స్థాయిలో టిడిపి నుంచి ఆయనపై కౌంటర్ అటాక్ ప్రారంభం అయింది. ఏదైనా వివాదం సృష్టించాలి అనుకుంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి రంగంలోకి దిగుతారు అనేది టిడిపి నేతలు వాదన. జగన్మోహన్ రెడ్డి వాడుకుంటున్న మనిషిగా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పై ఒక విమర్శ ఉంది. దానినే గుర్తు చేస్తున్నారు టిడిపి నేతలు. ఆయన కంటే వెనుక రాజకీయాల్లోకి వచ్చిన ఆయన సోదరి, అంటే పెదనాన్న బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కుమార్తె శబరి ప్రస్తుతం ఎంపీగా ఉన్నారు. కానీ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మాత్రం చట్టసభలకు ఇంతవరకు ఎన్నిక కాలేకపోయారు.

రాజకీయంగా ప్రత్యేక ప్రస్థానం..
కర్నూలు జిల్లాలో బైరెడ్డి కుటుంబానికి ప్రత్యేక రాజకీయ ప్రస్థానం ఉంది. ఆ ఫ్యామిలీ ఆది నుంచి తెలుగుదేశం పార్టీలో కొనసాగుతూ వచ్చింది. బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి తండ్రి కూడా ఎమ్మెల్యేగా వ్యవహరించారు. మంత్రి పదవి చేపట్టారు. బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి సైతం టిడిపి ద్వారా ఎన్నో పదవులు పొందారు. చట్టసభలకు ఎన్నికయ్యారు. బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి తమ్ముడు కుమారుడే సిద్ధార్థ రెడ్డి. ఆయనపై పలుమార్లు కేసులు నమోదయ్యాయి. ఫ్యాక్షన్ తరహాలో కామెంట్స్ చేస్తుంటారు. తనకు జైలు జీవితం కొత్త కాదు అన్నట్టు మాట్లాడుతుంటారు. తెలుగుదేశం పార్టీలో కొనసాగిన బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి తర్వాత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ సమయంలోనే సిద్ధార్థ రెడ్డి సైతం వైసీపీలో చేరారు. అయితే రాజశేఖర్ రెడ్డి తిరిగి బిజెపిలోకి వచ్చి అక్కడి నుంచి.. టిడిపిలో చేరిపోయారు. ప్రస్తుతం ఆయన కుమార్తె ఎంపీగా ఉన్నారు.

మూడు ఎన్నికల్లోను అవకాశం లే
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. పిట్ట కథలతో ప్రత్యర్థులపై విరుచుకుపడుతుంటారు. అయితే చట్టసభలకు ఇంతవరకు ఛాన్స్ ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి. పక్క జిల్లాల్లో సైతం చాలామంది నేతలకు అవకాశం కల్పించింది జగన్మోహన్ రెడ్డి. అటువంటిది ఉద్దేశపూర్వకంగానే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి పట్టించుకోవడం లేదన్న విమర్శ ఉంది. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి సొంత నియోజకవర్గం నందికొట్కూరు ఎస్సీలకు రిజర్వ్ చేయబడింది. మరి అటువంటిప్పుడు సిద్ధార్థ రెడ్డికి ఎంపీ సీటు ఇవ్వచ్చు కదా. లేకుంటే వేరే అసెంబ్లీ నియోజకవర్గం కేటాయించవచ్చు కదా? అనే ప్రశ్న వినిపిస్తూ ఉంటుంది. 2014లో ఛాన్స్ దక్కలేదు. 2019లో అవకాశం ఇవ్వలేదు. 2024లో పరిగణలోకి తీసుకోలేదు. అయితే సిద్ధార్థ రెడ్డి మాత్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కోసం గట్టిగానే తపన పడుతున్నారు. ఎక్కడైనా వివాదాస్పద అంశాలను హైలెట్ చేయాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని ప్రయోగిస్తారన్న టాక్ ఉంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.

ఓటరు జాబితా ప్రక్షాళన.. వైసీపీకి షాక్

YSR Congress Party
YSR Congress Party

Shock to YCP: రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రక్షాళన ప్రారంభం కానుంది. గతంలో తప్పుడుగా నమోదు చేసిన ఓట్లు, బినామీ ఓట్లు, చనిపోయిన వారి ఓట్లు తొలగించనున్నారు. ఎటువంటి లోపాలకు తావివ్వకుండా పూర్తిస్థాయి సాంకేతిక పరిజ్ఞానంతో ఈ ప్రక్రియ చేపట్టనున్నారు. దీనిని అడ్డుకునేందుకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తోంది. దొంగ ఓట్ల తొలగింపు అనేది ఆహ్వానించ దగ్గది అయినా.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎందుకో భయపడుతోంది. అయితే గతంలో తమ హయాంలో నమోదైన ఓట్లు తొలగిస్తారు అన్న భయం ఆ పార్టీని వెంటాడినట్టు ఉంది. అయితే కచ్చితంగా అవి పారదర్శకమైన ఓట్లు అయితే ఎవరూ తొలగించలేరు. ఇప్పుడు వైసీపీ భయం చూస్తుంటే మాత్రం.. ఆ ఓట్లపై అనుమానం కలుగుతోంది.

ప్రత్యర్థి ఓట్ల తొలగింపు..
అప్పట్లో ఐపాక్ ద్వారా ప్రత్యర్థి పార్టీల సానుభూతి పరుల ఓట్లను తొలగించారు. ఇతర రాష్ట్రాల నుంచి ఫారం 7 సమర్పించి చాలా తప్పిదాలకు పాల్పడ్డారు. అదే సమయంలో పెద్ద ఎత్తున దొంగ ఓట్లు నమోదు చేయించారన్న ఆరోపణలు అప్పట్లోనే వినిపించాయి. కానీ ఇప్పుడు అటువంటి ఓట్లకు చెక్ పడే అవకాశం ఉంది. అదే జరిగితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందులు తప్పవు. అందుకే సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పుడు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. ఈ ఓటర్ల తొలగింపు ప్రక్రియపై కోర్టుల్లో పిటిషన్లు వేయించేందుకు ఆయన సిద్ధపడుతున్నట్లు సమాచారం. అయితే తమ ఓట్లు పోతాయి అనేదానికంటే.. ఎందుకో భయపడుతున్నట్టు అర్థం అవుతోంది. అప్పట్లో నమోదు చేసిన ఓట్లు తొలగిస్తారు అన్న ఆందోళన స్పష్టమవుతోంది.

ఆ 40 శాతం లో గల్లంతయితే..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తనకు 40 శాతం ఓట్లు వచ్చినట్లు సగర్వంగా చెబుతోంది. అవే ఓట్లు తమకు ఈసారి స్థిరంగా ఉండి.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు తమకు చిక్కి అధికారంలోకి వస్తామని భావిస్తోంది. అయితే ఇప్పుడు ఓటరు జాబితా ప్రక్షాళనతో ప్రతి నియోజకవర్గంలో వేల ఓట్లు తొలగించే అవకాశం ఉంది. అందులో వైసిపి హయాంలో నమోదు చేసినవి రద్దు అయితే మాత్రం వైసీపీకి ఇబ్బందికరమే. పైగా ఈ ఓటర్ జాబితా ప్రక్షాళన అనేది అధికార పార్టీకి అనుకూలంగా ఉంటుంది. ఆపై కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక భాగస్వామి. ఈ కారణాల దృష్ట్యా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఆందోళన మొదలైంది. అందుకే ఈ ప్రక్రియ పై కోర్టుకు వెళ్లేందుకు ఆ పార్టీ అన్ని రకాల ఏర్పాట్లు చేస్తోంది.

జగన్ కోసం చండీగఢ్ జ్యోతిష్యుడు!

YS Jagan astrologer consultation
YS Jagan astrologer consultation

YS Jagan astrologer consultation: తమిళనాడులో విజయ్ గెలుపుతో సంబరాలు చేసుకుంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టుకుని ప్రచారం చేయడం వల్ల అక్కడ విజయ్ అధికారంలోకి వచ్చారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రచారం చేసుకుంటున్నాయి. జగన్మోహన్ రెడ్డి మాదిరిగానే డ్రెస్ సెన్స్ విజయ్ ది అని మాజీ మంత్రి రోజా కూడా చెప్పుకొచ్చారు. అయితే ఒక్క గెలుపు లోనే కాదు.. ఆ గెలుపు వెనుక ఉన్న వ్యూహాలను ఇప్పుడు ఏపీలో అమలు చేస్తున్నారు జగన్ మోహన్ రెడ్డి. విజయ్ తన వ్యక్తిగత జ్యోతిష్యుడు వల్ల.. ఆయన ఇచ్చిన సూచనలు పాటించడం వల్ల తక్కువ వ్యవధిలోనే అధికారంలోకి వచ్చారు అని జగన్మోహన్ రెడ్డికి తెలిసిందట. అందుకే ఇప్పుడు ఇతర రాష్ట్రాల నుంచి జ్యోతిష్యుడిని రప్పించి తన భవిష్యత్తును తెలుసుకునే పనిలో ఉన్నారట జగన్మోహన్ రెడ్డి. తాడేపల్లి కి వచ్చిన ప్రముఖ జ్యోతిష్యుడు ఒకరు జగన్మోహన్ రెడ్డికి కీలక సూచనలు చేసినట్లు తెలుస్తోంది. తప్పకుండా అధికారం వరిస్తుందని భరోసా ఇచ్చినట్లు సమాచారం.

విజయ్ గెలుపుతో..
విజయ్ గెలుపు వెనుక ఒక జ్యోతిష్యుడు ఉన్నారు అనేది పొలిటికల్ వర్గాల్లో ప్రచారం. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చండీగఢ్ నుంచి రుద్ర కరణ్ ప్రతాప్ అనే జ్యోతిష్యుని ప్రత్యేకంగా తాడేపల్లి కి పిలిపించుకొని పలు అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఆ జ్యోతిష్యుడు జగన్మోహన్ రెడ్డిని కలిసిన విషయాన్ని బయటపెట్టారు. ఇప్పుడు రాజకీయ వ్యూహకర్తలను మరిచి.. జ్యోతిష్యులను జగన్మోహన్ రెడ్డి నమ్ముకున్నట్టు కనిపిస్తున్నారు ఈ వ్యవహారంతో. అయితే గతంలోనూ ఈ జ్యోతిష్యుడు వచ్చి జగన్మోహన్ రెడ్డి 2024 ఎన్నికల్లో.. కచ్చితంగా సీఎం అవుతారని.. అధికారంలోకి వస్తారని తేల్చి చెప్పారు. కానీ అది జరగలేదు. అయినా సరే ఇప్పుడు పిలిచారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

గతంలో ప్రత్యేకంగా..
గతంలో జగన్మోహన్ రెడ్డికి విశాఖ శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానంద పూజలు చేయించేవారు. అటు తరువాత చాలామంది జ్యోతిష్యులు జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా జ్యోతిష్యం చెప్పేవారు. ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి తరచూ జగన్మోహన్ రెడ్డి కోసమే అన్నట్టు మాట్లాడేవారు. మొన్నటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గెలుపు ఖాయమని తేల్చి చెప్పారు. దారుణ ఓటమికి గురికావడంతో ట్రోల్స్ కు గురయ్యారు. ఒకటి రెండుసార్లు వేణు స్వామి జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనతో పాటే వాహనాల్లో ప్రయాణం చేశారు. అంతలా ప్రాధాన్యం ఉండేది జ్యోతిష్యులకు జగన్మోహన్ రెడ్డి హయాంలో. అయితే ఇప్పుడు ఏకంగా ఉత్తరాది రాష్ట్రాల నుంచి జ్యోతిష్యుని దించారు. గెలుపు అందుకోవాలని చూస్తున్నారు. అన్నింటికీ మించి తన వ్యక్తిగత కేసుల విషయంలో సైతం ఏం జరుగుతుందో తెలుసుకున్నారు. అందుకు సంబంధించి దోష నివారణపై కూడా ఆయన నుంచి కొన్ని వివరాలు తెలుసుకున్నారట. మొత్తానికి అయితే పొలిటికల్ స్ట్రాటజిస్టులు పోయి ఆస్ట్రాలజిస్టులు వచ్చారన్నమాట.

ఈ కారుతో పెట్రోల్ ధరల నుంచి ఉపశమనం! వెంటనే త్వరపడండి..

Hyundai HE1i electric car
Hyundai HE1i electric car

Hyundai HE1i electric car: రోజురోజుకూ పెరుగుతున్న పెట్రోల్ ధరల వల్ల సామాన్యుడి నెలవారీ బడ్జెట్ తలకిందులవుతోంది. ప్రస్తుతం పెట్రోల్ కారులో ఒక కిలోమీటర్ ప్రయాణించాలంటే సుమారు రూ. 7 నుంచి రూ.9 వరకు ఖర్చవుతుంది. దీనిని దృష్టిలో ఉంచుకొని హ్యుందాయ్ కంపెనీ కొత్తగా ఎలక్ట్రిక్ SUV కారును తీసుకురాబోతుంది. ఈ కారు ఒక కిలోమీటర్ ప్రయాణానికి కేవలం 80 పైసల నుంచి రూ. 1.20 మాత్రమే ఖర్చవుతుందని అంచనా. అంటే, పెట్రోల్ కారుతో పోలిస్తే దాదాపు 80% వరకు ఇంధన ఖర్చులను ఆదా చేసుకోవచ్చు. ఇది ఉద్యోగులకు, వ్యాపారవేత్తలకు మరియు ప్రతిరోజూ సిటీలో ప్రయాణించే వారికి ఒక గొప్ప వరంగా మారుతుంది. ఈ కారు గురించి పూర్తి వివరాల్లోకి వెళితే..

ప్రస్తుతం భారత ఆటోమొబైల్ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల(EV)కు డిమాండ్ భారీగా పెరుగుతోంది. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలను దృష్టిలో ఉంచుకుని ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ (Hyundai ‘HE1i’) అనే కోడ్ పేరుతో ఒక కొత్త ఎలక్ట్రిక్ మైక్రో SUVని రూపొందిస్తోంది. ఇది ప్రస్తుతం మార్కెట్లో ఉన్న హ్యుందాయ్ ఎక్స్టర్ (Exter)మోడల్‌ను పోలి ఉంటుందని అంచనా.

హ్యుందాయ్ ఈ ‘HE1i’ ఎలక్ట్రిక్ కారును సామాన్యులకు అందుబాటులో ఉండేలా ‘బడ్జెట్’ ధరలో లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తోంది. తాజా సమాచారం ప్రకారం, ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ.10 లక్షల నుండి రూ.15 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది. ఇది టాటా పంచ్ ఈవీ (Tata Punch EV) వంటి కార్లకు గట్టి పోటీని ఇవ్వనుంది. ప్రభుత్వం ఇచ్చే ఫేమ్ (FAME) సబ్సిడీలు కూడా తోడైతే, ఈ కారు ధర ఇంకా తగ్గే అవకాశం ఉంది.

ఎలక్ట్రిక్ కార్లలో వినియోగదారులు ప్రధానంగా చూసేది రేంజ్. హ్యుందాయ్ HE1i లో సుమారు 25 kWh నుండి 30 kWh సామర్థ్యం గల బ్యాటరీ ప్యాక్‌ను వాడే అవకాశం ఉంది. దీనివల్ల ఈ కారు ఒకసారి పూర్తి ఛార్జ్ చేస్తే సుమారు 300 కిలోమీటర్ల నుండి 350 కిలోమీటర్ల వరకు మైలేజీని (రేంజ్) ఇస్తుందని నిపుణులు భావిస్తున్నారు. సిటీ లోపల ప్రయాణాలకు, అప్పుడప్పుడు చేసే చిన్నపాటి లాంగ్ జర్నీలకు ఈ మైలేజీ సరైనది.

హ్యుందాయ్ HE1i కేవలం బడ్జెట్ కారుగానే కాకుండా, ఆధునిక ఫీచర్లతో రాబోతోంది. ఇందులో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, మల్టిపుల్ ఎయిర్‌బ్యాగ్స్ మరియు కనెక్టెడ్ కార్ టెక్నాలజీ వంటి ఫీచర్లు ఉండనున్నాయి. ఈ కారు 2026 చివరిలో భారత మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. భారీ పెట్రోల్ ఖర్చుల నుండి విముక్తి పొందాలనుకునే వారికి హ్యుందాయ్ ‘HE1i’ ఒక పవర్‌ఫుల్ అండ్ ఎకనామికల్ ఆప్షన్ కానుంది.

‘బండి’ దక్కని రిలీఫ్‌.. అరెస్టు తప్పదా?

Bandi Bhageerath arrest
Bandi Bhageerath arrest

Bandi Bhageerath arrest: తనపై నమోదైన పోక్సో కేసు కొట్టేయాలని బండి భగీరథ్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై రాష్ట్ర హైకోర్టు వెకేషన్‌ బెంచ్‌ విచారణ జరిపింది. ఇరుపక్షాల వాదనలు వినకుండా తీర్పు ఇవ్వడం కుదరదని న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఇక ముందస్తు బెయిల్‌ ఇవ్వాలని దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం హైకోర్టు విచారణ జరిపింది. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి ఈ పిటిషన్‌లోనూ రిలీఫ్‌ ఇవ్వలేదు.

తుది తీర్పు వరకు బెయిల్‌ కుదరదు..
బండి భగీరథ్‌ పిటిషన్‌ హైకోర్టు మొదట విచారించి, తీర్పు వరకూ మధ్యంతర బెయిల్‌ ఇవ్వడానికి కుదరదని న్యాయమూర్తి స్పష్టం చేశారు. మరోవైపు పోలీసులు ఆ నిర్ణయం వచ్చే వరకూ అతన్ని అరెస్టు చేయాలని వేగంగా ముందుకు వెళ్లే ఆలోచనలో ఉన్నారు.

ఈనెల 21న తుది ఉత్తర్వులు..
భగీరథ్‌ పిటిషన్‌పై ఈనెల 21న తుది ఉత్తర్వులు ఇస్తామని కోర్టు స్పష్టం చేసింది. 3 గంటలకుపైగా వాదనలు జరిగాయి. అయినా హడావుడిగా ఉత్తర్వులు ఇవ్వడం కుదరదని న్యాయమూర్తి పేర్కొన్నారు. గత తీర్పులను సమగ్రంగా పరిశీలించాల్సి ఉంటుందని తెలిపారు. వచ్చే గురువారం వరకు అరెస్టు చేయకుండా ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషనర్‌ తరఫు న్యాయవాది కోరగా, అందుకు కూడా కోర్టు నిరాకరించింది.

అరెస్ట్‌ తప్పదా?
సిట్‌ ఇప్పటికే భగీరథ్‌ను విచారణకు పిలిచింది. కానీ ఆయన రెండు రోజులు గడువు కోరుతూ సిట్‌కు లేఖ రాశారు. ఈసారి భగీరథ్‌ విచారణకు హాజరైతే అరెస్టు చేసే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మైనర్‌పై లైంగిక దాడి చేసినట్లు పోలీసులకు బాధితురాలి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో సాధారణ వ్యక్తులు అయితే ఇప్పటికే అరెస్టు చేసేవారు. అయితే బాధితురాలు మైనర్‌ కాదని, పోక్సో కేసు కొట్టేయాలని నిందితుడు కోర్టును ఆశ్రయించడం గమనార్హం. దీంతో కేంద్ర మంత్రి కొడుకు కావడంతో పోలీసులు జాప్యం చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

వైసిపి 'కాపు' రాజకీయాన్ని పసిగట్టిన పవన్ కళ్యాణ్!

Pawan Kalyan on YCP Kapu politics
Pawan Kalyan on YCP Kapu politics

Pawan Kalyan on YCP Kapu politics: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇటీవల కాపులపై దృష్టి పెట్టింది. కాపులను టార్గెట్ చేస్తూ రాజకీయాలు చేస్తోంది. ఆ మధ్యన అంబటి రాంబాబు అరెస్టు సమయంలో సైతం కాపు నేతలను రంగంలోకి రాజకీయాలు మొదలుపెట్టింది. మొన్నటి ఎన్నికల్లో కాపులు దూరం కావడంతోనే ఓటమి ఎదురైందని గుర్తించింది. అందుకే ఇలా కాపు రాజకీయం మొదలుపెట్టింది. తాజాగా ఈ అంశంపై మాట్లాడారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. జనసేన ను ఒక కులానికి ఆపాదించి ఇబ్బంది పెట్టాలని చూస్తున్న విషయాన్ని కూడా ప్రస్తావించారు. కాపుల అంశంపై కూడా ఫుల్ క్లారిటీ ఇచ్చారు.. ఆ సామాజిక వర్గం విషయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యవహార శైలిని గుర్తు చేశారు. తద్వారా కాపుల ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని చూసిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాన్ని ఆదిలోనే అడ్డుకున్నారు పవన్ కళ్యాణ్.

ఐదేళ్ల కాలంలో అంతులేని నిర్లక్ష్యం
వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో కాపు సామాజిక వర్గం పై నిర్లక్ష్యం కొనసాగింది. ఆ సామాజిక వర్గాన్ని పెద్దగా లెక్క చేయలేదు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే కాపులు మొన్నటి ఎన్నికలకు ముందు నుంచి పవన్ కళ్యాణ్ వైపు మొగ్గు చూపుతున్నట్లు సంకేతాలు వచ్చాయి. అయితే కాపులను వదులుకోవడం ద్వారా వేరే సామాజిక వర్గాలతో ఆ స్థానాన్ని భర్తీ చేయాలని భావించారు జగన్మోహన్ రెడ్డి. అందుకే కాపు సామాజిక వర్గానికి వ్యతిరేకంగా నిర్ణయాలు వచ్చేవి అప్పట్లో. దీంతో జగన్మోహన్ రెడ్డి తో పాటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్ల విపరీతమైన ద్వేషాన్ని పెంచుకున్నారు కాపులు. దాని పర్యవసానాలే మొన్నటి ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దారుణ పరాజయం. అయితే ఈ సత్యాన్ని గ్రహించిన జగన్మోహన్ రెడ్డి కాపు రాజకీయానికి తెర తీశారు. దానికి ఆదిలోనే చెక్ పెట్టారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.

కాపులకు పరోక్ష సంకేతాలు..
జనసేన విస్తృత స్థాయి సమావేశంలో పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాపులను దారుణంగా అవమానించింది మీరు కాదా అని ప్రశ్నించారు. వైసిపి ఐదేళ్ల పాలనలో కాపుల పట్ల నిర్లక్ష్యం కొనసాగిన విషయాన్ని గుర్తు చేశారు. తద్వారా కాపులకు స్పష్టమైన సంకేతాలు పంపారు పవన్ కళ్యాణ్. జనసేనపై కాపు కుల ముద్ర వేసేందుకు ప్రయత్నాలు చేశారని.. కొన్ని వర్గాలను దూరం చేసేందుకు ఎత్తుగడవేశారని.. తనది అన్ని వర్గాల పార్టీగా అభివర్ణించారు. అదే సమయంలో వైసీపీ కాపు రాజకీయాన్ని ప్రస్తావిస్తూ దానిని తప్పుపట్టారు. ఇది సత్యం గ్రహించండి అంటూ పరోక్షంగా కాపులకు సంకేతాలు పంపగలిగారు పవన్ కళ్యాణ్. అయితే కాపుల ద్వారా మళ్లీ రాజకీయ పూర్వవైభవం కోసం తహతహలాడుతున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఇది ఇబ్బందికర పరిస్థితి. మరి ఆ పార్టీ కాపు రాజకీయాన్ని నమ్ముకుని ముందుకు వెళ్తుందా? పవన్ కళ్యాణ్ కు కౌంటర్ ఇవ్వగలదా? అన్నది చూడాలి.

మహానాడు.. నెల్లూరు నుంచి మంగళగిరి కి షిఫ్ట్!

Mahanadu 2026 venue change
Mahanadu 2026 venue change

Mahanadu 2026 venue change: తెలుగుదేశం పార్టీకి వార్షిక పండుగ మహానాడు. ఆ పార్టీ ఆవిర్భావం నుంచి ఎన్టీఆర్ పుట్టినరోజు నాడు మహానాడు నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఎన్టీఆర్ చనిపోయిన తర్వాత ఆయన జయంతి నాడు ఈ ప్రక్రియ కొనసాగుతూ వస్తోంది. ఈ ఏడాది కూడా నెల్లూరులో ఘనంగా నిర్వహించాలని ఏర్పాట్లు ప్రారంభించారు. అయితే కేంద్ర ప్రభుత్వం పొదుపు సూచనల నేపథ్యంలో ఖర్చు తగ్గించుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ పరిస్థితిల్లో అట్టహాసంగా మహానాడు నిర్వహించడం అనేది తప్పుడు సంకేతంగా వెళుతుందని టిడిపి హై కమాండ్ భావించింది. అందుకే హైబ్రిడ్ విధానంలో మహానాడు ను నిర్వహించాలని నిర్ణయించింది. వర్చువల్ విధానంలోనే మహానాడు జరగనుంది ఈ ఏడాది. మంగళగిరిలో టిడిపి కేంద్ర కార్యాలయంలో పరిమిత సంఖ్యలో నేతలతో మహానాడు కొనసాగనుంది. జిల్లాల్లో నాయకులు పాల్గొనున్నారు. క్లస్టర్ స్థాయిలో కార్యకర్తలు హాజరవుతారు. వర్చువల్ విధానానికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తోంది టిడిపి నాయకత్వం.

నెల్లూరులో ఏర్పాట్లు..
తొలుత శ్రీకాకుళం జిల్లాలో మహానాడు నిర్వహణకు మొగ్గుచూపింది టిడిపి హై కమాండ్. మహానాడు వేదిక కోసం స్థలాల పరిశీలన కూడా జరిగింది. కానీ త్వరలో భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోడీ హాజరుకానున్నారు. దీంతో అప్పట్లో భారీగా జన సమీకరణ చేయాలని నిర్ణయించారు. ప్రధాని పర్యటన ఉండగా ఉత్తరాంధ్రలో మహానాడు నిర్వహించడం మంచిది కాదన్న నిర్ణయానికి వచ్చిన టిడిపి నాయకత్వం… మహానాడు ను నెల్లూరు జిల్లాకు తరలించింది. దాదాపు రెండు వేల ఎకరాల్లో మహానాడు నిర్వహణకు సంబంధించి ఏర్పాట్లు ప్రారంభం అయ్యాయి. కానీ మొన్న ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ పర్యటనలో 8 రకాల పొదుపు అంశాలపై పిలుపునిచ్చారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. దుబారా ఖర్చు తగ్గించేందుకు నిర్ణయించింది. అందులో భాగంగా ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకు తమ కాన్వాయ్ లో వాహన శ్రేణిని తగ్గించుకున్నారు. అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పరంగా మహానాడులో ఖర్చు తగ్గించుకోవాలని చూసి ఈ నిర్ణయానికి వచ్చారు.

పరిమిత సంఖ్యలో నేతలకు..
తెలుగుదేశం పార్టీలో పొలిట్ బ్యూరో విభాగం పెద్దది. అందుకే ఆ విభాగం సభ్యులతో పాటు కేంద్ర, రాష్ట్ర విభాగం ప్రతినిధులు, ఆపై అధికార ప్రతినిధుల కు మాత్రమే మంగళగిరి పార్టీ కార్యాలయంలో జరిగే మహానాడుకు ఆహ్వానించాలని నిర్ణయించారు. రాష్ట్రవ్యాప్తంగా వర్చువల్ విధానంలో మహానాడు ను పూర్తి చేయాలని భావిస్తున్నారు. జిల్లాలోని పార్టీ కార్యాలయాల్లో ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1800కు పైగా ఉన్న క్లస్టర్ల పరిధిలో కార్యకర్తలు వర్చువల్ విధానంలో మహానాడులో పాల్గొనే వీలుగా ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఏటా ఘనంగా నిర్వహించే మహానాడు ఇలా హైబ్రిడ్ విధానంలోకి మార్చడం మాత్రం అందర్నీ ఆకట్టుకుంటుంది.

వైసిపి గాలి తీసేసిన పవన్!

Pawan Kalyan
Pawan Kalyan

Pawan Kalyan criticism YCP: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్ని విధాల ప్రయత్నాలు చేస్తున్నా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాత్రం మెత్తబడటం లేదు. పైగా వారి ప్రయత్నాలను గుర్తించి పార్టీ శ్రేణులను అలెర్ట్ చేస్తున్నారు. తమిళనాడులో విజయ్ గెలుపుతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏపీలో సంబరాలు చేసుకుంది. అంతటితో ఆగకుండా విజయ్ మాదిరిగా ఒంటరి పోరాటం చేయవచ్చు కదా అని ప్రశ్నించింది కూడా. మాజీ మంత్రి రోజా లాంటి వారు అయితే పవన్ కళ్యాణ్ ను జనాలు ఇచ్చి పడేసారంటూ విజయ్ విజయాన్ని గుర్తు చేస్తూ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. విపరీతంగా ట్రోల్ చేసింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. అయితే జనసైనికులు కూడా విజయ్ గెలుపుతో ఒంటరి పోరాటం ఆలోచన వారి మదిలో మెదిలింది. అయితే ఈ ప్లాన్ వెనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందన్న విషయాన్ని చాలామంది మరిచిపోయారు. సోషల్ మీడియాలో ప్రచారానికి ప్రభావితం అయ్యారు. అయితే పవన్ కళ్యాణ్ దీనిపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టి.. పార్టీ శ్రేణులకు క్లారిటీ ఇచ్చేశారు.

వైసిపి పై ఓ రేంజ్ లో..
ఊర్లో పెళ్లికి కుక్కల హడావిడి అన్నంత ఈజీగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితిని తేల్చి చెప్పారు పవన్. తమిళనాడులో విజయ్ గెలవడం ఏంటి? వీరు సంబరాలు చేసుకోవడం ఏంటి అని అర్థం వచ్చేలా.. పరోక్ష వ్యాఖ్యలు చేశారు పవన్. అక్కడ మాదిరిగా ఏపీలో రాజకీయాలు చేస్తామంటే కుదరని పనిగా తెల్చేశారు. అక్కడ సమీకరణలు వేరు.. ఇక్కడ సమీకరణలు వేరు అన్న విషయాన్ని ప్రస్తావించారు. లేనిపోని ప్రచారాలను నమ్మవద్దని హితవు పలికారు. తప్పుడు ప్రచారాలకు ప్రభావితం కావొద్దని కూడా సూచించారు. 2019లో రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయిన విషయాన్ని ప్రస్తావించారు. మరోసారి అటువంటి పరిస్థితి తేవడానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కుట్రగా అభివర్ణించారు. అందుకే పార్టీ శ్రేణులకు హితోపదేశం చేశారు పవన్ కళ్యాణ్.

ప్రయత్నాలు వికటిస్తూ..
అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంతగా జనసేన ను టార్గెట్ చేసుకుంటే.. అంతలా బదులు ఇచ్చేస్తున్నారు పవన్ కళ్యాణ్. వారి ప్రయత్నాలకు మించి అన్నట్టు ఫుల్ క్లారిటీ ఇస్తున్నారు. పొత్తు ఎందుకు ఉండాలో కూడా పార్టీ శ్రేణులకు ఒప్పిస్తున్నారు. రోజురోజుకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు జఠిలం అవుతూనే ఉన్నాయి. ఎందుకంటే ఎన్నికలకు ముందు నుంచి ఇప్పటివరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తూనే ఉంది. టిడిపి నుంచి జనసేన ను వేరు చేసేందుకు చేయని ప్రయత్నం అంటూ లేదు. చివరకు చాలామంది నేతల ద్వారా ప్రయత్నించి విఫలమయింది. దీంతో వారు జనసేన ను వీడాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ అదే అజెండాతో ఉన్నారు. పొత్తు కొనసాగితేనే జనసేన అన్నట్టు వ్యవహరిస్తున్నారు. అయితే వైయస్సార్ కాంగ్రెస్ ప్రయత్నాలు కూటమిలో జనసేనను మరింత స్ట్రాంగ్ చేస్తున్నాయి. పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఇచ్చి పడేయడంతో వైసిపి తోక ముడవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

మొబైల్ లో పడుకునే ముందు ఆ వీడియోలు చూస్తే మీ పని ఖతమే..

mobile phone before sleep : ప్రస్తుత కాలంలో రాత్రి పడుకునే ముందు మొబైల్ ఫోన్ స్క్రోల్ చేయడం చాలా మందికి అలవాటైపోయింది. సోషల్ మీడియా పోస్టులు చూడటం, రీల్స్ చూస్తూ టైమ్ గడపడం, వీడియోలు, షార్ట్ క్లిప్స్, న్యూస్ హెడ్‌లైన్స్ చెక్ చేయడం సాధారణమైపోయింది. అయితే ఈ అలవాటు నిద్ర నాణ్యతను తీవ్రంగా దెబ్బతీస్తోందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. బయటకు చూస్తే 7-8 గంటలు నిద్రపోయినట్టే కనిపించినా, మెదడు మాత్రం పూర్తిగా విశ్రాంతి దశలోకి వెళ్లడం లేదని చెబుతున్నారు. అసలు నిద్రపోయే ముందు మొబైల్ చూస్తే ఎలాంటి సమస్యలు వస్తాయి?

వైద్యులు చెబుతన్న ప్రకారం.. మొబైల్‌లో వచ్చే నోటిఫికేషన్లు, వేగంగా మారే వీడియోలు, భావోద్వేగాలను రెచ్చగొట్టే కంటెంట్ మెదడును ఎప్పటికప్పుడు అప్రమత్త స్థితిలో ఉంచుతాయి. ముఖ్యంగా రాత్రి వేళల్లో ఇలాంటి కంటెంట్ చూడడం వల్ల నాడీ వ్యవస్థ పూర్తిగా రిలాక్స్ కావడం కష్టమవుతుంది. ఫలితంగా శరీరం పడుకున్నా మెదడు మాత్రం యాక్టివ్ మోడ్ లోనే కొనసాగుతుందని నిపుణులు వివరిస్తున్నారు.

సోషల్ మీడియా రీల్స్‌లో ప్రతి కొన్ని సెకన్లకోసారి మారే విజువల్స్, పెద్ద శబ్దాలు, ఆకట్టుకునే టైటిల్స్ మెదడులో డోపమైన్ విడుదలను పెంచుతాయి. ఇది తాత్కాలిక ఉత్సాహాన్ని కలిగించినా, తరువాత మెదడుకు విశ్రాంతి దొరకకుండా చేస్తుంది. అందుకే రాత్రి నిద్రపోయినా ఉదయం లేవగానే అలసటగా ఉండటం, ఒత్తిడి తగ్గకపోవడం, ఏకాగ్రత లోపించడం వంటి సమస్యలు వస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు.

అలాగే మొబైల్ స్క్రీన్ నుంచి వెలువడే బ్లూ లైట్ మన శరీరంలో నిద్రను నియంత్రించే మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. దీంతో నిద్ర ఆలస్యంగా రావడం, మధ్యలో పలుమార్లు మేలుకోవడం, గాఢ నిద్ర తగ్గిపోవడం వంటి ఇబ్బందులు ఎదురవుతాయి. దీర్ఘకాలంలో ఇది మానసిక ఒత్తిడి, ఆందోళన, చిరాకు వంటి సమస్యలకు దారితీసే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ప్రత్యేకంగా ఎమోషనల్ లేదా నెగటివ్ కంటెంట్ రాత్రి సమయంలో చూడడం మెదడుపై మరింత ప్రభావం చూపుతుందని సైకాలజిస్టులు చెబుతున్నారు. ప్రమాదాలు, వివాదాలు, భయపెట్టే వార్తలు లేదా ఆందోళన కలిగించే వీడియోలు చూసిన తర్వాత మెదడు ఆ భావోద్వేగాలను నిద్రలో కూడా ప్రాసెస్ చేస్తూ ఉంటుంది. అందుకే కొందరికి రాత్రిళ్లు గాఢ నిద్ర లేకపోవడం, విచిత్రమైన కలలు రావడం, ఉదయం మానసికంగా భారంగా అనిపించడం జరుగుతుందని అంటున్నారు.

వైద్యులు చెబుతున్న ప్రకారం.. నిద్రకు కనీసం గంట ముందు మొబైల్ ఫోన్, ల్యాప్‌టాప్, టీవీ వంటి స్క్రీన్‌లకు దూరంగా ఉండాలి. ఈ సమయంలో పుస్తకం చదవడం, ధ్యానం చేయడం, అందమైన సంగీతం వినడం, కుటుంబ సభ్యులతో మాట్లాడడం వంటి అలవాట్లు మెదడును ప్రశాంత స్థితిలోకి తీసుకెళ్తాయని చెబుతున్నారు. అలాగే పడుకునే గదిలో మొబైల్ నోటిఫికేషన్లు ఆఫ్ చేయడం కూడా మంచిదని సూచిస్తున్నారు. మంచి నిద్ర అనేది కేవలం గంటల సంఖ్యపై ఆధారపడదు. మెదడు నిజంగా విశ్రాంతి పొందేలా నిద్రపోవడం చాలా ముఖ్యం. అందుకే డిజిటల్ డిటాక్స్ ను రాత్రి జీవనశైలిలో భాగం చేసుకుంటే శారీరక, మానసిక ఆరోగ్యం రెండూ మెరుగుపడతాయని వైద్యులు సూచిస్తున్నారు.

పెళ్లిళ్లు, గృహప్రవేశాలు బ్రేక్.. ఈ అధిక మాసంలో ఏం చేయవద్దంటే..

Adhika Masam 2026

Adhika Masam 2026 : గత కొన్ని నెలలుగా పెళ్లిళ్లు, గృహప్రవేశాలు, శుభకార్యాలతో కళకళలాడిన వాతావరణానికి ఇప్పుడు తాత్కాలిక విరామం ఏర్పడింది. హిందూ పంచాంగం ప్రకారం ప్రస్తుతం (మే 16 నుంచి) అధిక జ్యేష్ఠ మాసం కొనసాగుతుండటంతో జూన్ 18 వరకు మంచి ముహూర్తాలు లేవని పండితులు చెబుతున్నారు. దీంతో వివాహాలు, కొత్త ఇళ్లలో ప్రవేశాలు, ఆస్తుల కొనుగోళ్లు, వ్యాపార ప్రారంభోత్సవాలు వంటి శుభకార్యాలు చాలావరకు వాయిదా పడుతున్నాయి. అసలు అధిక మాసం అంటే ఏమిటీ?

హిందూ సంప్రదాయంలో అధిక మాసానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. చంద్ర సంవత్సరానికి, సౌర సంవత్సరానికి మధ్య వచ్చే తేడాను సరిచేయడానికి సుమారు మూడు సంవత్సరాలకు ఒకసారి అదనంగా వచ్చే నెలను అధిక మాసం గా పరిగణిస్తారు. దీనిని ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పూజలు, దానధర్మాలకు అనుకూలంగా భావిస్తారు. అయితే వివాహాలు, శుభారంభాలు వంటి మంగళకార్యాలకు మాత్రం ఈ కాలాన్ని నివారించడం ఆనవాయితీగా కొనసాగుతోంది.

పండితులు చెబుతున్న ప్రకారం.. ఈ కాలంలో శుభకార్యాలు చేయకుండా దేవారాధన, వ్రతాలు, పుణ్యక్షేత్ర దర్శనాలు చేయడం మంచిదని చెబుతున్నారు. ముఖ్యంగా పెళ్లిళ్లు, గృహప్రవేశాలు, నూతన వ్యాపార ప్రారంభాలు, వాహన కొనుగోళ్లు, భూముల రిజిస్ట్రేషన్లు వంటి పనులను ముహూర్తాలు ప్రారంభమైన తర్వాతే చేయాలని సూచిస్తున్నారు. దీంతో ఇప్పటికే బుక్ చేసుకున్న కొన్ని కార్యక్రమాలు కూడా వాయిదా పడుతున్నాయని తెలుస్తోంది.

ఈ ప్రభావం కేవలం కుటుంబాలకే కాకుండా శుభకార్యాలపై ఆధారపడే అనేక వ్యాపార రంగాలపై కూడా పడుతోంది. ఫంక్షన్ హాళ్లు, కన్వెన్షన్ సెంటర్లు, డెకరేషన్ వ్యాపారులు, టెంట్ హౌస్ నిర్వాహకులు, క్యాటరింగ్ సర్వీసులు, బ్యాండ్ బాజా బృందాలు, ఫోటోగ్రాఫర్లు, మేకప్ ఆర్టిస్టులు వంటి వారికి నెలరోజులపాటు పనులు తగ్గనున్నాయి. సాధారణంగా ఈ సీజన్‌లో బిజీగా ఉండే ఈ రంగాలు ఇప్పుడు వెలవెలబోయే పరిస్థితి ఏర్పడింది.

ప్రత్యేకంగా వివాహ సీజన్‌పై ఆధారపడే చిన్న వ్యాపారులు ఈ గ్యాప్ వల్ల ఆదాయం తగ్గుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొందరు వ్యాపారులు ఇప్పటికే అడ్వాన్స్‌లు తీసుకున్న కార్యక్రమాలను జూన్ చివరి వారానికి మార్చినట్లు చెబుతున్నారు. మరోవైపు మంచి ముహూర్తాలు మళ్లీ ప్రారంభమైన తర్వాత భారీగా పెళ్లిళ్లు, శుభకార్యాలు ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో కూడా అధిక మాసాన్ని చాలా మంది భక్తి, ఆధ్యాత్మికతకు కేటాయిస్తారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు, పారాయణాలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం సాధారణంగా కనిపిస్తుంది. ఈ సమయంలో శుభకార్యాల కంటే ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారని పెద్దలు చెబుతున్నారు.

జూన్ 18 తర్వాత మళ్లీ మంచి ముహూర్తాలు ప్రారంభం కానుండటంతో అప్పటి నుంచి వివాహాలు, గృహప్రవేశాలు, ఇతర శుభకార్యాల సందడి మళ్లీ మొదలయ్యే అవకాశముంది. ఇప్పటికే చాలామంది కుటుంబాలు ఆ తేదీల కోసం ఫంక్షన్ హాళ్లు, క్యాటరింగ్ సేవలు ముందుగానే బుక్ చేసుకునే పనిలో ఉన్నట్లు సమాచారం.

ఈ వారం 'మ్యాడ్ ఫర్ ఈచ్ అథర్' నుండి ఎలిమినేట్ అయ్యే 2 జంటలు ఇవే.. ఇంత అన్యాయమా..

Mad For Each Other show eliminated couples
Mad For Each Other show eliminated couples

Mad For Each Other elimination : స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న ‘మ్యాడ్ ఫర్ ఈచ్ అథర్’ షో ఇప్పుడు చివరి లెవెల్ కి చేరింది. వచ్చే వారం గ్రాండ్ ఫినాలే తో ఈ షో ముగియబోతుంది. ఈ షో లో ఇప్పటి వరకు జరిగిన ఎలిమినేషన్ ఏది కూడా ప్రేక్షకులకు అసలు నచ్చలేదు. బాగా ఆడే జంటలు చాలానే ఎలిమినేట్ అయ్యాయి. ఈ కారణం చేత , ఆడియన్స్ లో ఈ షో తీవ్రమైన నెగెటివిటీ ని ఏర్పాటు చేసుకుంది. నటరాజ్ మాస్టర్ ఎలిమినేషన్ కి వచ్చిన ప్రతీ వారం ఎలిమినేషన్ ని రద్దు చేయడం , అతని ఎన్ని మాటలు మాట్లాడినా బాండ్ క్రెడిట్స్ ఇవ్వడం వంటివి చేస్తూ వచ్చారు జడ్జీలు. ముఖ్యంగా షో ఫార్మటు పై ఇతను చేసినన్ని కామెంట్స్ ఇప్పటి వరకు ఏ జంట కూడా చేయలేదు.

ఏ షో ద్వారా అయితే పాపులారిటీ ని సంపాదించుకున్నాడో , అదే షో పై పదే పదే విమర్శలు చేస్తున్నా కూడా ఆయన్ని సింహం అంటూ పిలవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. గత వారం ఎలిమినేషన్ ని రద్దు చేయడం వల్ల, ఈ వారం బాగా జంటలు ఎలిమినేట్ అవ్వబోతున్నాయి. అందులో మొదటి జంట సిద్దు – సోనియా. ఈ జంటకు సోషల్ మీడియా లో విపరీతమైన క్రేజ్ ఉంది , వాళ్ళ ఆట తీరుని కూడా అందరూ మెచ్చుకుంటున్నారు. కానీ వీళ్ళు ఈ వారం ఆటల్లో డేంజర్ జోన్ లోకి వచ్చారు , ఆ కారణం చేత ఎలిమినేట్ అవ్వబోతున్నారు. వీళ్ళు ఈ వారం గేమ్స్ ఓడిపోయింది నటరాజ్ మాస్టర్ -నీతూ జంట చేతుల్లోనే. వీళ్ళు గత వారమే ప్రక్రియ ప్రకారం ఎలిమినేట్ అయ్యుంటే , నేడు సిద్దు – సోనియా లాంటి టాప్ కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యేవాళ్ళు కాదు కదా.

అదే విధంగా వీళ్ళతో పాటు ఎలిమినేట్ అవ్వబోయే మరో జంట ఆమీర్ – అభిమానికా . వీళ్ళు ఈ వారం టాస్కులు గెలిచారు , అయినప్పటికీ కూడా వీళ్ళు ఎలిమినేట్ అయ్యారు. ఇలా అన్యాయమైన ఎలిమినేషన్స్ చేస్తూ , షో ఆసక్తికరంగా సాగుతున్నప్పటికీ కూడా , తీవ్రమైన నెగెటివిటీ ని మూటగట్టుకోవాల్సి వస్తుంది. మేకర్స్ తీరు చూస్తుంటే నటరాజ్ మాస్టర్ చేతుల్లోనే కప్ పెట్టెలాగా ఉన్నారని సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు, చూడాలి మరి వచ్చే వారం ఏమి జరగబోతుంది అనేది.

ఈ రాశుల వారికి శని దేవుడి ఆశీస్సులు.. అన్ని విషయాల్లో విజయం వీరిదే..

Today 6 July 2026 Horoscope
Today 6 July 2026 Horoscope

Today horoscope in telugu : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారం ద్వాదశరాసులపై భరణి నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఇదే రోజు శని జయంతి సందర్భంగా కొన్ని రాశుల వారికి అనుకూలమైన ఫలితాలు ఉండనున్నాయి. మరికొన్ని రాశుల వారు జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

మేష రాశి (అశ్విని, భరణి,1,2,): ఈ రాజు వారికి ఈరోజు ప్రత్యేకమైన ప్రయోజనాలు కలిగి అవకాశం ఉంటుంది. శనిదేవుడి అనుగ్రహం వల్ల ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు. వ్యాపారులకు గణనీయమైన లాభాలు ఉంటాయి. ఉద్యోగులకు అధికారుల మద్దతు ఉండడంతో అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేయగలుగుతారు. అయితే కొన్ని విషయాల్లో టెన్షన్ వాతావరణం ఏర్పడుతుంది. ఇలాంటి సమయంలో ఓపికతో వ్యవహరించాలి.

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారు ఈరోజు ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. కుటుంబ శ్రేయస్సు కోసం కొన్ని ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఖర్చులను కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. జీవిత భాగస్వామితో అన్యోన్యంగా ఉంటారు.

మిథున రాశి( మృగశిర 3,4 ): ఈ రాశి వారికి ఆర్థికంగా మెరుగైన ఫలితాలు ఉంటాయి. శని దేవుడి అనుగ్రహం ఉండడంతో కొత్త పనులను ప్రారంభిస్తారు. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఇప్పుడు లాభాలు పొందుతారు. అధికారుల నుంచి వేధింపులు తగ్గిపోతాయి. అన్ని పనులు పూర్తికావడంతో మనశ్శాంతి లభిస్తుంది. కుటుంబ సభ్యులతో సరదాగా ఉంటారు.

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారు ఈ రోజు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. వ్యాపారులకు గతంలో కంటే ఇప్పుడు లాభాలు ఎక్కువగా ఉంటాయి. కొందరు కొన్ని విషయాల్లో ఒత్తిడి పెంచే అవకాశం ఉంటుంది. ఇలాంటి సమయంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. కొన్ని రోజులు వెయిట్ చేయడం మంచిది.

సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారికి ఈ రోజు అన్ని శుభ ఫలితాలే ఉండనున్నాయి. అయితే శని దేవుడు ఒక్కోసారి సహనం పరీక్షించే అవకాశం ఉంటుంది. ఇలాంటి సమయంలో కోపాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధించే అవకాశం ఉంటుంది. కొన్ని విషయాలను రహస్యంగా ఉంచుకోవడమే మంచిది. జీవిత భాగస్వామి కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు.

కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారికి కొన్ని సమస్యలు బాధపెడతాయి. అనవసరపు వివాదాల్లోకి తలదూర్చకుండా ఉండాలి. పెద్దల ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ప్రశాంతమైన జీవితం కోసం ప్రయత్నించాలి. ఎటువంటి విషయాల్లో కూడా ఆందోళన చెందవద్దు. ఎందుకంటే కొన్ని రోజుల తర్వాత పరిస్థితులు చెక్కబడతాయి. ఆధ్యాత్మిక వాతావరణంలో మునిగి ఉంటారు.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : తులా రాశి వారికి శని దేవుడి ఆశీస్సులు ఉంటాయి. బంధువులతో సంబంధాలు మెరుగుపడతాయి. గతంలో కంటే ఇప్పుడు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. సమయపాలన సందర్భంగా తొందరగా పూర్తి చేయడం అవసరం. నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తలు వ్యవహరించాలి.

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : . ఈ రాశి వారు ఈ రోజు కొన్ని శుభవార్తలో విని అవకాశం ఉంటుంది. నిరుద్యోగులు కొత్త అవకాశాలను పొందుతారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లడం వల్ల కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం ఉండడంతో అన్ని శుభ ఫలితాలే ఉంటాయి.

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారు ఈ రోజు ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. వ్యాపారులకు గణనీయమైన లాభాలు ఉంటాయి. కష్టానికి తగిన ఫలితాన్ని పొందుతారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వీరికి దేవుడి ఆశీస్సులు ఉండడం వల్ల కొన్ని ముఖ్యమైన పనులు పూర్తవుతాయి.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారు ఈ రోజు అన్ని ప్రయోజనాలు పొందుతారు. కొత్తగా పెట్టుబడులు పెట్టాల్సి వస్తే పెద్దలను సంప్రదిస్తారు. పూర్వీకుల ఆస్తికి సంబంధించి శుభవార్తలు వింటారు. ఆరోగ్య విషయంలో ఎలాంటి నిర్లక్ష్యంగా ఉండకూడదు. నాణ్యమైన ఆహారాన్ని తీసుకోవాలి. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి.

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారు ఈ రోజు కెరీర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. ప్రశాంతమైన వాతావరణం లో గడిపేందుకు ప్రయత్నం చేస్తారు. శని దేవుడి అమావాస్య సందర్భంగా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వీరు చేసే కొన్ని పనులకు అధికారుల మద్దతు ఉండడంతో వెంటనే పూర్తవుతాయి.

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : శని దేవుడి జయంతి సందర్భంగా ఈ రాశి వారికి ఈ రోజు అన్ని రకాలుగా శుభాలే జరుగుతాయి . అయితే తప్పుడు మార్గంలో వెళ్లకుండా ఉండాలి. ముఖ్యమైన పనులను పూర్తి చేయడానికి ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లాలి. ఉద్యోగులు తోటి వారి సహాయంతో అన్ని పనులను పూర్తి చేస్తారు.

పవన్ కళ్యాణ్ కి ఇన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నాయా.. అభిమానులను కంటతడి పెట్టిస్తున్న లేటెస్ట్ స్పీచ్..

Pawan Kalyan Health
Pawan Kalyan Health

Pawan Kalyan health issues : సైనస్ ఆపరేషన్ కారణంగా గత కొంత కాలం నుండి విశ్రాంతి తీసుకుంటున్న పవన్ కళ్యాణ్ , నేడు తొలిసారి మీడియా ముందుకు వచ్చాడు. జనసేన పార్టీ కార్యకర్తలతో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశం లో పాల్గొన్న ఆయన , నేడు మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా అంతటా బాగా వైరల్ గా మారాయి. ముఖ్యంగా ఉద్యమి సభ్యత్వాలను అత్యధిక శాతం చేయించిన కార్యకర్తలను ఆయన ప్రత్యేకంగా అభినందించాడు. ఇదంతా పక్కన పెడితే , తన ఆరోగ్య పరిస్థితి పై పవన్ కళ్యాణ్ చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు అభిమానులను కాస్త ఆందోళనకు గురి చేస్తోంది. ఇన్ని సమస్యలను పెట్టుకొని ఒక పక్క సినిమాలు , మరోపక్క రాజకీయాలు ఎలా మ్యానేజ్ చేస్తున్నావ్ అన్నా అని ఆయన అభిమానులు సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ పవన్ కళ్యాణ్ ఏమి మాట్లాడాడో ఒకసారి చూద్దాం.

ఆయన మాట్లాడుతూ ‘ప్రస్తుతానికి నా ఆరోగ్యం నిలకడగానే ఉంది. ఎన్నికల సమయం లో బాగా తిరగడం తో పాటు , నాకు కరోనా వచ్చినప్పుడు ఏర్పడిన లంగ్ ఇన్ఫెక్షన్ అలాగే ఉండిపోయింది. ఆ తర్వాత దుమ్ము , ధూళి లో తిరగడం వల్ల , సైనస్ ప్రాంతాల్లో ఆ డస్ట్ బాగా గట్టి పడింది, అది కాలక్రమేణా వాచిపోయేలా చేసింది. ఆ కారణం చేత ఒక రోజు నా కళ్ళు కనిపించకుండా పోయింది. ఈ కారణాల చేత భీమవరం లో ఒక ప్రోగ్రాం ఉన్నప్పటికీ క్యాన్సిల్ చేసి , హైదరాబాద్ కి వెళ్లి , ఇవన్నీ సరిచేసుకొని రావడానికి ఒక నెల రోజుల సమయం పట్టింది. డాక్టర్లు నా రెండు భుజాల మధ్య కూడా టెర్ వచ్చేసిందని అన్నారు. ఎందుకు ఇలా వచ్చింది అని డాక్టర్లు అడగ్గా, క్యాంపైన్ కి వెళ్ళినప్పుడు అభిమానులు చేతులు పట్టుకొని లాగేస్తుంటారు , కన్దతెగిపోయేంత లాగేస్తారు’ అంటూ చెప్పుకొచ్చాడు. ఆయన మాట్లాడిన మాటలకు సంబంధించిన వీడియో ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి. ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ కి ఎలాంటి ఆరోగ్య సమస్య లేదు అనేది స్పష్టమైంది , రాబోయే రోజుల్లో ఆయన సినిమాలను , రాజకీయాలను ఎలా బ్యాలన్స్ చేస్తాడో చూడాలి.

2034 వరకూ నేనే సీఎం .. తర్వాత జాతీయ రాజకీయాలు ఏలుతా.. రేవంత్ మనసులో మాట

Revanth reddy

Revanth Reddy : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తాజా వ్యాఖ్యలు చూస్తే.. ఆయన రాజకీయ వ్యూహం కేవలం రాష్ట్ర పరిపాలనకే పరిమితం కాకుండా, దీర్ఘకాలిక జాతీయ లక్ష్యాల వైపు సాగుతున్నట్లు స్పష్టమవుతోంది. “2034 వరకు నేనే సీఎం” అనే వ్యాఖ్యతో రాష్ట్ర రాజకీయాల్లో తన ఆధిపత్యాన్ని కొనసాగించాలనే సంకేతం ఇచ్చిన రేవంత్.. ఆ తర్వాత జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశిస్తానని ప్రకటించడం ద్వారా కాంగ్రెస్‌లో తన భవిష్యత్ పాత్రపై క్లారిటీ ఇచ్చారు.

“అసంతృప్తే నా ఎనర్జీ” అనే వ్యాఖ్య ఆయన రాజకీయ శైలిని ప్రతిబింబిస్తోంది. నిరంతర ఒత్తిడి, విమర్శల మధ్య కూడా దూకుడుగా పనిచేసే నాయకుడిగా తనను ప్రొజెక్ట్ చేసుకునే ప్రయత్నం కనిపిస్తోంది. అదే సమయంలో సంక్షేమాన్ని “నిరంతర ప్రక్రియ”గా అభివర్ణించడం ద్వారా ప్రజా సంక్షేమం ఆగని బాధ్యత అని చెప్పినా.. అభివృద్ధి మాత్రం దీర్ఘకాలిక ప్రణాళికలతోనే సాధ్యమని సూచించారు.

ఆర్టీసీ, ఈవీ బస్సులు, “తెలంగాణ రైజింగ్” పాలసీ, పారిశ్రామిక జోన్ల అభివృద్ధి వంటి అంశాలను ప్రస్తావించడం ద్వారా తన ప్రభుత్వాన్ని అభివృద్ధి-ఆధారిత మోడల్‌గా ప్రజల ముందుంచే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా ఓఆర్ఆర్-ఆర్ఆర్ఆర్ పరిధిలో ఇండస్ట్రియల్ జోన్‌ల ప్రస్తావన పెట్టుబడులు, ఉపాధి లక్ష్యాలపై ఫోకస్‌ను చూపిస్తోంది.

మరోవైపు మూసీ ప్రక్షాళన, ఆక్రమణల తొలగింపుపై ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా వివాదాస్పదంగా మారే అవకాశముంది. అభివృద్ధి పేరుతో కఠిన నిర్ణయాలు తీసుకోవడంలో వెనుకాడనని ఆయన స్పష్టం చేసినా.. ప్రభావిత వర్గాల అసంతృప్తి భవిష్యత్తులో రాజకీయ ప్రభావం చూపే అవకాశం ఉంది.

డ్రగ్స్‌పై కఠిన హెచ్చరికలు, సినీ వర్గాలపై పరోక్ష వ్యాఖ్యలు చేయడం ద్వారా చట్టవ్యవస్థ విషయంలో కఠిన నాయకుడి ఇమేజ్‌ను బలపరిచే ప్రయత్నం చేశారు. అలాగే బీఆర్ఎస్, బీజేపీలపై విమర్శలతో ప్రతిపక్షాలపై దాడి కొనసాగించారు.

జాతీయ రాజకీయాల విషయంలో రాహుల్ గాంధీ పై తన విధేయతను మరోసారి ప్రకటించిన రేవంత్.. కాంగ్రెస్‌లో తాను కీలక పాత్ర పోషించాలని భావిస్తున్న సంకేతాలు ఇచ్చారు. మొత్తం మీద ఆయన వ్యాఖ్యలు చూస్తే.. తెలంగాణలో దీర్ఘకాల అధికారాన్ని లక్ష్యంగా పెట్టుకుని, తర్వాత జాతీయ రాజకీయాల్లో స్థానం సంపాదించాలనే స్పష్టమైన రాజకీయ రోడ్‌మ్యాప్ కనిపిస్తోంది.

థియేటర్లో త్రిషకి ఎదురైన ఊహించని పరిణామం.. విజయ్ పేరు ఎత్తగానే ముసిముసి నవ్వులు.. వీడియో వైరల్..

Trisha unexpected moment
Trisha unexpected moment

Trisha unexpected moment: తమిళనాడు సీఎం విజయ్ , హీరోయిన్ త్రిష కి మధ్య ఉన్న రిలేషన్ ఇక సీక్రెట్ కాదు , ఎన్నికల ముందే ఈ జంట మేమిద్దరం కలిసే ఉన్నాం అని జనాలకు చెప్పకనే చెప్పారు. ఇక విజయ్ సీఎం గా గెలిచిన వెంటనే త్రిష ఆయన ఇంటికి వెళ్లి అభినందించడం , ఇక సీఎం గా ప్రమాణస్వీకారం చేసే రోజున త్రిష కూడా కుటుంబ సభ్యులతో కలిసి హాజరవ్వడం వంటివి మనమంతా చూసాము. వీళ్లిద్దరు జనాలకు మేము కలిసే ఉన్నాము , త్వరలో పెళ్లి చేసుకుంటాము అని జనాలకు చెప్పకనే చెప్పేశారు. మరి పెళ్లి బహిరంగంగా చేసుకుంటారా?, లేదా ఇలాగే లివింగ్ రిలేషన్ షిప్ లో ఉంటారా అనేది తెలియాల్సి ఉంది. ఇదంతా పక్కన పెడితే నేడు త్రిష హీరోయిన్ గా నటించిన ‘కరుప్పు’ అనే చిత్రం తెలుగు , తమిళ భాషల్లో గ్రాండ్ గా విడుదలైంది.

తెలుగు లో ఈ చిత్రం ‘వీరభద్రుడు’ అనే టైటిల్ తో విడుదలైంది. రెండు భాషల్లోనూ ఈ చిత్రానికి మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. అయితే తమిళనాడు లోని ఒక థియేటర్ లో హీరోయిన్ త్రిష , డైరెక్టర్ ఆర్జే బాలాజీ మరియు కార్తీ కలిసి ఈ చిత్రాన్ని వీక్షించారు. త్రిష సినిమాని చూసి బయటకు వచ్చి కారు ఎక్కిన సమయం లో ఒక అభిమాని త్రిష తో మాట్లాడుతూ ‘తలపతి విజయ్ ని అడిగాము అని చెప్పండి’ అంటాడు. అందుకు త్రిష తల దించుకొని ముసిముసి నవ్వులు నవ్వుతుంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది. కొంతమంది ఈ వీడియో పై ట్రోల్స్ కూడా చేస్తున్నారు. ఇద్దరు భార్య భర్తల మధ్యలో దూరి , వాళ్ళ కాపురాన్ని కూల్చేసి విజయ్ జీవితం లోకి వచ్చిందే కాకుండా, ఇప్పుడు మూసి మూసి నవ్వులు నవ్వుతోంది చూడండి అంటూ కొంతమంది నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు.

అయితే ఎలాంటి సందర్భంలో వీళ్లిద్దరి మధ్య బంధం ఏర్పడింది అనేది ఎవరికీ తెలియదు కాబట్టి, వీళ్ళ రిలేషన్ పై నెగెటివ్ కామెంట్స్ చేయడం సరికాదు అంటూ సోషల్ మీడియా లో విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు. ఇక ‘కరుప్పు’ విషయానికి వస్తే, ఈ సినిమాకు హిట్ టాక్ రావడానికి త్రిష కూడా ఒక కారణం అని , ఆమె గోల్డెన్ లక్ రాజకీయాల్లో విజయ్ కి ఎలా కలిసొచ్చిందో , సినిమాల్లో సూర్య కి కూడా అలాగే కలిసొచ్చింది అంటున్నారు ఫ్యాన్స్. ఇక సోషల్ మీడియా లో బాగా వైరల్ అయినటువంటి నేటి త్రిష థియేటర్ వీడియో ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి.