Home Blog Page 272

చిరంజీవి - శ్రీకాంత్ ఓదెల కాంబోలో రాబోతున్న మూవీకి భారీ రెమ్యూనరేషన్ ఛార్జ్ చేస్తున్న మెగాస్టార్...

Chiranjeevi Srikanth Odela movie: చిరంజీవి హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఒక సినిమా రాబోతుంది. ప్రస్తుతం చిరంజీవి – బాబీ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అవ్వబోతుంది. ఈ ఇయర్ ఇప్పటికే ‘మన శంకర్ వరప్రసాద్’ సినిమాతో సూపర్ సక్సెస్ ను సాధించాడు. ఇక ప్రస్తుతం శ్రీకాంత్ చేస్తున్న ‘ప్యారడైజ్’ సినిమా ఆగస్ట్ 21 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరిలో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఈ మూవీ ప్రేక్షకులందరిలో ఒక ఇంపాక్ట్ ను క్రియేట్ చేయగలుగుతుందా? లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇక ఏది ఏమైనా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ ని శాసించగలిగే కెపాసిటి ఉన్న స్టార్ హీరోలందరు ఉన్నప్పటికి చిరంజీవితో సినిమా చేయడం అనేది ప్రతి ఒక్క దర్శకుడి కల…

అలాగే శ్రీకాంత్ ఓదెల సైతం చిన్నప్పటి నుంచి చిరంజీవి సినిమాలు చూసుకుంటూ పెరిగాడు. చిరంజీవి అంటే చాలా ఇష్టమట. కాబట్టి తనతో సినిమాలు చేయడానికి ఒక మంచి స్టోరీ ని చెప్పాడట. ప్రస్తుతం చిరంజీవి బాబీ తో చేస్తున్న సినిమా పూర్తి అయిన తర్వాత శ్రీకాంత్ తను చిరంజీవితో చేయబోయే సినిమాకు సంబంధించిన పూర్తి కథను చెబుతానని తను పలు సందర్భాల్లో చెప్పాడు. ప్రస్తుతం ప్యారడైజ్ రిజల్ట్ మీదనే శ్రీకాంత్ – చిరంజీవి సినిమా ఆధారపడి ఉంటుందని పలువురు సినిమా మేధావులు చెబుతున్నారు.

చిరంజీవి ఈ సినిమా కోసం భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ ఛార్జ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇంతకుముందు ఆయన 40 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకోగా ఈ సినిమా కోసం 60 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడట. ఈ సంవత్సరం ఇప్పటికే ‘మన శంకర్ వరప్రసాద్’ సినిమా 400 కోట్ల కలెక్షన్స్ ను రాబట్టింది.

ఇక చిరంజీవి కి ఒక మంచి కంటెంట్ తో సినిమా పడితే 500 నుంచి 600 కోట్ల వరకు కూడా కలెక్షన్స్ రాబట్టగలిగే సత్తా తనకు ఉందని మెగా ఫ్యాన్స్ సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఇక చిరంజీవి సైతం 70 సంవత్సరాల వయసులో కూడా ప్రేక్షకులకు వినోదాన్ని అందించడానికి తన శాయ శక్తుల ప్రయత్నం చేస్తున్నాడు. దీన్ని బట్టి చిరంజీవికి సినిమాలంటే ఎంత ఇష్టమో మనం అర్థం చేసుకోవచ్చు…

సూర్య 'కరుప్పు(వీరభద్రుడు)' కి సెన్సేషనల్ ఓపెనింగ్స్.. ఇంత గ్రాస్ అసలు ఊహించలేదు..

Karuppu Movie
Karuppu Movie

Karuppu sensational opening: చాలా కాలం నుండి సరైన బ్లాక్ బస్టర్ హిట్ లేకుండా ఇబ్బంది పడుతున్న సౌత్ ఇండియన్ స్టార్ హీరోల్లో ఒకరు సూర్య. తెలుగు , తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో , సూపర్ స్టార్ రజినీకాంత్ తర్వాత అంతటి మార్కెట్ ని ఏర్పాటు చేసుకున్న మొట్టమొదటి స్టార్ ఆయన. కానీ 2013 వ సంవత్సరం నుండి గత ఏడాది వరకు సూర్య చేసిన ప్రతీ సినిమా డిజాస్టర్ ఫ్లాప్ అవుతూ వచ్చింది. ముఖ్యంగా కరోనా లాక్ డౌన్ తర్వాత విడుదలైన సినిమాలు అయితే, సూర్య మార్కెట్ ని పాతాళం లోకి నెట్టేశాయి. అయితే నేడు విడుదలైన ‘కరుప్పు’ చిత్రానికి మొదటి ఆట నుండే బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. దీంతో ఈ చిత్రానికి ఓపెనింగ్స్ అదిరిపోయాయి. కేవలం తమిళనాడు ప్రాంతం లో మాత్రమే కాదు , తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి ఓపెనింగ్ వసూళ్లు వచ్చాయి.

బుక్ మై షో యాప్ లో ఈ చిత్రానికి తమిళ వెర్షన్ గంటకు 45 వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోయాయి. అదే విధంగా తెలుగు వెర్షన్ లో గంటకు 5 వేల టికెట్స్ అమ్ముడుపోయాయి , ఓవరాల్ గా ఈ చిత్రానికి బుక్ మై షో యాప్ లో రెండు వెర్షన్స్ కి కలిపి గంటకు 50 వేల టికెట్స్ అమ్ముడుపోయాయి. ఇది సాధారణమైన విషయం కాదు , ఇప్పటి వరకు తమిళం లో కేవలం రజినీకాంత్, విజయ్ లకు మాత్రమే ఈ రేంజ్ అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి , ఆ తర్వాతి స్థానం లో ఇప్పుడు సూర్య నిలిచాడు. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం చూస్తే , ఈ చిత్రానికి మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 30 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. కేవలం తెలుగు వెర్షన్ నుండి 5 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు రావొచ్చు అట.

అటు తమిళం లో , ఇటు తెలుగు లో గడిచిన నాలుగు నెలల నుండి సరైన కమర్షియల్ హిట్ లేకపోవడం కరుప్పు చిత్రానికి బాగా కలిసొచ్చింది అని చెప్పొచ్చు. ఆడియన్స్ మంచి సినిమా కోసం ఎదురు చూస్తున్నారని, అది కరుప్పు రూపం లో రావడంతో ఆడియన్స్ బ్రహ్మరథం పడుతున్నారని , మొదటి రోజు బుక్ మై షో లో ఈ చిత్రానికి 6 లక్షలకు పైగా టికెట్స్ అమ్ముడుపోయాయని అంటున్నారు. మరి ఇదే రేంజ్ ఫ్లో ని వీకెండ్ వరకు కొనసాగిస్తే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ మార్కుకి దాదాపుగా దగ్గరకు వెళ్ళినట్టే అనుకోవచ్చు. చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.

'ఊర్లో పెళ్ళికి అదేదో హడావిడి అంటారు కదా' అని సీఎం విజయ్ విజయం పై పవన్ కళ్యాణ్ హాట్ కామెంట్స్..

Pawan Kalyan comments on Vijay
Pawan Kalyan comments on Vijay

Pawan Kalyan comments on Vijay: `రీసెంట్ గా తమిళనాడు లో సినీ నటుడు విజయ్ సార్వత్రిక ఎన్నికల్లో సంచలన విజయం సాధించి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించిన సందర్భంగా, సోషల్ మీడియా లో పవన్ కళ్యాణ్ , విజయ్ లను పోలుస్తూ కొంతమంది ఏ రేంజ్ ట్రోల్స్ వేసారో మన కళ్లారా చూశాము . అభిమానులు సైతం 2024 లో పవన్ కళ్యాణ్ వేవ్ తారా స్థాయిలో ఉన్నింది , రిస్క్ చేసి పోటీ చేసుంటే కచ్చితంగా సీఎం అయ్యేవాడేమో అని కామెంట్స్ చేశారు. మొత్తం మీద తమిళనాడు లో సీఎం గా విజయ్ బాధ్యతలు చేపట్టడం , పవన్ కళ్యాణ్ పై సీఎం అవ్వాలనే ఒత్తిడి అభిమానుల నుండి తీవ్రస్థాయిలో మొదలైంది. అయితే నేడు ఆయన కార్యకర్తలతో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశం లో ఈ విషయం పై చాలా ఘాటుగానే స్పందించాడు.

ఆయన మాట్లాడుతూ ‘రీసెంట్ గానే పక్క రాష్ట్రంలో ఒకరు పార్టీ ని స్థాపించి , ముఖ్యమంత్రి అయిపోయారని, మీరు కూడా అలాగే అవ్వాల్సింది అంటూ ఎన్నో వేల మెసేజిలు వచ్చాయి. ఊర్లో పెళ్ళికి అదేదో హడావిడి అంటారు కదా, అలాగే ఉన్నాయి మీ మాటలు. మన రాష్ట్రంలో పరిస్థితులు ఎలాంటివో చూసి కూడా ఇలాంటి వ్యాఖ్యలు ఎలా చేస్తారు, పోనీ మీ మాటకు తగ్గట్టుగానే 2019 లో పోటీ చేస్తే ఏమి చేశారు , రెండు చోట్ల ఓడించారు. మన రాష్ట్ర పరిస్థితులను చూసి దశాబ్దం కాలం వరకు నలుగుతాను అని ఊహించే రాజకీయాల్లోకి అడుగుపెట్టాను. పదవి కోసం నేను ఏనాడూ కూడా రాజకీయాలు చెయ్యాలని అనుకోలేదు. అలా అనుకుంటే 2009 లోనే ఎంపీ గా పోటీ చేసి ఉండేవాడిని. 2014 లో ఎన్డీయే తో కలిసి ఉన్నప్పుడు , మల్కాజ్ గిరి స్థానం నుండి నేను పోటీ చేయాల్సి ఉంది , కానీ నాకు పార్టీ ని నడపడం ముఖ్యం, పార్టీ ని స్థాపించినప్పుడు నాతో పాటు నడిచిన వాళ్ళు , ఈరోజు చాలా మంది లేరు. ఓడిపోయిన వెంటనే పారిపోయారు. నాతో మొదటి నుండి ప్రయాణం చేసింది కేవలం జనసైనికులు మాత్రమే’ అంటూ చెప్పుకొచ్చాడు. సోషల్ మీడియా లో బాగా వైరల్ అవుతున్న ఈ వీడియో ని మీ కోసం క్రింద అందిస్తున్నాము చూడండి.

70 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్.. కానీ బుకింగ్స్ చూస్తే దారుణం..ఇలా అయితే కష్టమే 'పెద్ది'

Peddi break even target
Peddi break even target

Peddi break even target: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ చిత్రం వచ్చే నెల 4 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదల అవ్వబోతున్న సందర్భంగా, మేకర్స్ ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషనల్ కార్యక్రమాలను వేగవంతం చేశారు. సోషల్ మీడియా లో ఇప్పుడు ‘పెద్ది’ అనే పేరు తప్ప, మరో సినిమా పేరు కనిపించడం లేదు , ఆ రేంజ్ లో మేనియా క్రియేట్ అయిపోయింది. ఇదంతా పక్కన పెడితే భారీ అంచనాలు ఉండడం వల్ల, ఈ చిత్రానికి ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ కూడా కనీవినీ ఎరుగని రేంజ్ లో జరిగింది. ఉదాహరణకు ఓవర్సీస్ ప్రాంతం లో ఈ చిత్రానికి 10 మిలియన్ డాలర్లకు ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరిగింది. అంటే 100 కోట్ల రూపాయలకు పైమాటే. కేవలం ఒక్క నార్త్ అమెరికా లోనే ఈ చిత్రానికి 70 కోట్ల రూపాయిల బిజినెస్ జరగడం గమనార్హం.

ఈ రేంజ్ బిజినెస్ జరిగింది కాబట్టి , అడ్వాన్స్ బుకింగ్స్ కూడా అదే రేంజ్ లో ఉంటాయని అంతా అనుకున్నారు. కానీ బుకింగ్స్ మొదలు పెట్టి దాదాపుగా వారం రోజులు కావొస్తుంది , ఇప్పటి వరకు ఈ చిత్రానికి కేవలం 2 లక్షల 50 వేల డాలర్ల గ్రాస్ వసూళ్లు మాత్రమే బుకింగ్స్ ద్వారా వచ్చాయి. ఈ సినిమాకు ఉన్నటువంటి హైప్ కి ఇది చాలా తక్కువ గ్రాస్ అనే చెప్పాలి. ఇదే లెవెల్ హైప్ తో వచ్చిన పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ చిత్రానికి కేవలం 24 గంటల వ్యవధిలోనే 2 లక్షల 67 వేల డాలర్ల గ్రాస్ నమోదు అయ్యింది. దీనిని రామ్ చరణ్ అభిమానులు అవలీలగా బ్రేక్ చేయమని సవాళ్లు విసిరారు. ఎందుకంటే పెద్ది కి మొదటి 24 గంటల్లో 1 లక్షా 47 వేల డాలర్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి కాబట్టి.

కానీ ఆ తర్వాత వారం రోజులకు అదనంగా కేవలం 1 లక్ష డాలర్లు మాత్రమే వచ్చింది. ‘ఓజీ’ చిత్రం 24 గంటల్లో సాధించిన గ్రాస్ ని , ఈ చిత్రం ఇప్పటి వరకు అందుకోలేకపోయింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే మాత్రం , ఈ చిత్రానికి బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవడం చాలా కష్టమని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఎందుకంటే 7 మిలియన్ డాలర్లు లాంగ్ రన్ లో రాబట్టడం అనేది సాధారణమైన విషయం కాదు. ఇప్పుడు నార్త్ అమెరికా లో మన తెలుగు సినిమాలకు వీకెండ్ వరకు మాత్రమే భారీ గ్రాస్ వసూళ్లు నమోదు అవుతున్నాయి , ఆ తర్వాత భారీగా పడిపోతున్నాయి. ప్రస్తుతం ఉన్న స్పీడ్ చూస్తుంటే , ఈ చిత్రానికి 1.5 మిలియన్ నుండి 2 మిలియన్ డాలర్ల మధ్యలో గ్రాస్ వసూళ్లు నమోదు అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. చూడాలి మరి ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుంది అనేది.

పంచెకట్టు లో రెబల్ స్టార్ ప్రభాస్.. సోషల్ మీడియా ని షేక్ చేస్తున్న 'స్పిరిట్' లేటెస్ట్ లుక్..

Prabhas
Prabhas

Prabhas Spirit New Look: ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమాల్లో , ప్రభాస్ సినిమాలే ఎక్కువగా ఉన్నాయి. వాటిల్లో ప్రస్తుతానికి ‘స్పిరిట్’ చిత్రం మీద ఉన్నటువంటి అంచనాలు , ఏ సినిమా మీద కూడా లేవు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే సందీప్ రెడ్డి వంగ లాంటి కల్ట్ డైరెక్టర్, ప్రభాస్ లాంటి యాక్షన్ హీరో తో, పూర్తి స్థాయి పోలీస్ యాక్షన్ ఎంటర్టైనర్ తీస్తున్నాడు అంటే , ఆ మాత్రం క్రేజ్ ఉండడం లో ఆశ్చర్యం లేదు. ఇకపోతే ఈ చిత్రంలో ప్రభాస్ ఏకంగా మూడు డిఫరెంట్ గెటప్స్ లో కనిపించబోతున్నాడట. ఈ న్యూ ఇయర్ కి శరీరం నిండా గాయాలతో, చేతిలో మందు బాటిల్ ని పట్టుకున్న ప్రభాస్ ని మీరంతా చూశారు. త్వరలోనే జైలు బట్టల్లో గుండు లుక్ లో ఉన్న ప్రభాస్ లుక్ ని కూడా చూడబోతున్నారట.

ఈ సన్నివేశాలకు సంబంధించిన షూటింగ్ కూడా పూర్తి అయ్యినట్టు తెలుస్తోంది. అదే విధంగా రీసెంట్ గా ప్రభాస్ పంచెకట్టు లో కళ్ళజోడు ధరించి స్టైల్ గా నడుచుకుంటూ వచ్చే ఫోటో ఒకటి సోషల్ మీడియా లో లీక్ అయ్యింది. ఇది రీసెంట్ గా హైదరాబాద్ లో తెరకెక్కించిన సన్నివేశాలకు సంబంధించిన ఫోటో అని అంటున్నారు. కానీ కొంతమంది మాత్రం ఇది AI ద్వారా జెనెరేట్ చేయబడిన ఫోటో అని , కానీ ప్రభాస్ లుక్ ఈ చిత్రం లో ఇలాగే ఉండబోతుందని అంటున్నారు. ప్రస్తుతం ప్రభాస్ విదేశాల్లో ఉన్నాడని, రీసెంట్ గా అయితే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ హైదరాబాద్ లో ప్లాన్ చేయలేదని కొంతమంది అభిమానులు అంటున్నారు. వీటిల్లో ఏది నిజం అనేది తెలియాలంటే , స్వయంగా సందీప్ వంగ స్పందించాల్సిందే. ఇప్పటికే ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది మార్చి 5 న విడుదల చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు.

ప్లాన్ చేసిన విడుదల తేదీ ప్రకారమే షూటింగ్ షెడ్యూల్స్ ని నిర్వహించి , ఎట్టి పరిస్థితుల్లోనూ అనుకున్న తేదిలోనే విడుదల చెయ్యాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ షెడ్యూల్స్ అనుకున్న స్థాయిలో వేగంగా సాగకపోతే, వచ్చే ఏడాది డిసెంబర్ కి ఈ సినిమా షిఫ్ట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయట. ఇకపోతే ఈ చిత్రం లో హీరోయిన్ గా త్రిప్తి దిమిరి నటిస్తుండగా, విలన్స్ గా వివేక్ ఒబెరాయ్, ఐశ్వర్య మీనన్ నటిస్తున్నారు. రీసెంట్ గానే వీళ్లిద్దరి మీద కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కించారు. తదుపరి కొత్త షెడ్యూల్ ని డెహ్రాడూన్ లో ప్లాన్ చేశారట. ప్రస్తుతానికి విదేశాల్లో ప్రభాస్, ఇండియా కి తిరిగి రాగానే ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనబోతున్నట్టు సమాచారం.

 

View this post on Instagram

 

A post shared by TFI_FOREVER7 (@tfi_forever.7)

ఈ ఆహార పదార్థాలను రెండోసారి వేడి చేస్తే విషమే..

reheating food health risks
reheating food health risks

Reheating Food health risks: ప్రస్తుత కాలంలో చాలా మంది బిజీ వాతావరణంలో గడుపుతున్నారు. దీంతో ఒకేసారి ఎక్కువగా ఆహారాన్ని వండుకొని ఫ్రిజ్‌లో పెట్టి మళ్లీ వేడి చేసుకుని తినడం అలవాటు చేసుకున్నారు. అయితే కొన్ని రకాల ఆహారాలను పదేపదే వేడి చేయడం ఆరోగ్యానికి ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇలా చేయడం వల్ల వాటిలోని పోషకాలు తగ్గిపోవడమే కాకుండా కొన్ని సందర్భాల్లో విషపూరిత రసాయనాలు ఏర్పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఎలాంటి ఆహార పదార్థాలను మళ్లీ మళ్లీ వేడి చేయకూడదు? అలా చేస్తే ఏం జరుగుతుంది?

బంగాళదుంపలను వండి ఎక్కువసేపు గది ఉష్ణోగ్రతలో ఉంచి మళ్లీ వేడి చేస్తే బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా సరైన విధంగా నిల్వ చేయకపోతే వాటిలో హానికర సూక్ష్మక్రిములు అభివృద్ధి చెందుతాయి. దీంతో కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు వంటి సమస్యలు రావచ్చు.

గుడ్లను రెండోసారి వేడి చేయడం కూడా ప్రమాదకరమేనని వైద్యులు చెబుతున్నారు. గుడ్లలో అధికంగా ప్రోటీన్ ఉండటంతో పదేపదే వేడి చేస్తే వాటి నిర్మాణం మారి జీర్ణ సమస్యలు కలిగించవచ్చు. ఎక్కువసేపు బయట ఉంచిన గుడ్లలో బ్యాక్టీరియా పెరిగి ఫుడ్ పాయిజనింగ్‌కు దారితీసే ప్రమాదం కూడా ఉంటుంది.

పాలకూర వంటి ఆకుకూరల్లో నైట్రేట్లు అధికంగా ఉంటాయి. వీటిని మళ్లీ వేడి చేసినప్పుడు నైట్రేట్లు నైట్రైట్లుగా మారే అవకాశం ఉంది. ఇవి శరీరంలో హానికర ప్రభావాలు చూపవచ్చని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణీలు ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

పుట్టగొడుగులను తాజాగా ఉన్నప్పుడే తినడం మంచిదని వైద్యులు చెబుతున్నారు. వీటిలో ఉండే ప్రోటీన్లు మళ్లీ వేడి చేసినప్పుడు రసాయన మార్పులకు గురై జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపవచ్చు. కడుపు ఉబ్బరం, అజీర్ణం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.

చాలామందికి టీని మళ్లీ వేడి చేసి తాగే అలవాటు ఉంటుంది. అయితే ఎక్కువసేపు ఉంచిన టీని తిరిగి వేడి చేస్తే దాని రుచి, పోషకాలు తగ్గిపోతాయి. అలాగే బ్యాక్టీరియా పెరిగే అవకాశమూ ఉంటుంది. ముఖ్యంగా పాలు కలిపిన టీని ఎక్కువసేపు నిల్వ చేయడం మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు.

చికెన్‌ను సరైన ఉష్ణోగ్రతలో నిల్వ చేయకుండా మళ్లీ వేడి చేస్తే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. చికెన్‌లో ప్రోటీన్లు అధికంగా ఉండటంతో అవి తిరిగి వేడి చేసినప్పుడు రసాయన మార్పులకు గురవుతాయి. సరైన విధంగా వేడి చేయకపోతే బ్యాక్టీరియా పూర్తిగా నశించక ఫుడ్ పాయిజనింగ్‌కు దారితీయవచ్చు.

అన్నం విషయంలో మరింత జాగ్రత్త అవసరమని వైద్యులు చెబుతున్నారు. వండిన అన్నాన్ని ఎక్కువసేపు బయట ఉంచితే ‘బాసిల్లస్ సెరియస్’ అనే బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఉంటుంది. తర్వాత మళ్లీ వేడి చేసినా ఆ బ్యాక్టీరియా ఉత్పత్తి చేసిన విషపదార్థాలు పూర్తిగా నశించకపోవచ్చు. దీంతో వాంతులు, విరేచనాలు వచ్చే ప్రమాదం ఉంది.

అలాగే వాడిన నూనెను పదేపదే వేడి చేయడం అత్యంత ప్రమాదకరమని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. నూనెను మళ్లీ మళ్లీ వేడి చేస్తే అందులో ఫ్రీ రాడికల్స్, ట్రాన్స్ ఫ్యాట్స్ వంటి హానికర పదార్థాలు ఏర్పడతాయి. ఇవి గుండె జబ్బులు, క్యాన్సర్, కొలెస్ట్రాల్ సమస్యలకు కారణమయ్యే అవకాశముందని పరిశోధనలు చెబుతున్నాయి.

ఆహారాన్ని తాజాగా వండిన వెంటనే తీసుకోవడం ఆరోగ్యానికి ఉత్తమమని వైద్యులు సూచిస్తున్నారు. మిగిలిన ఆహారాన్ని తప్పనిసరిగా నిల్వ చేయాల్సి వస్తే వెంటనే ఫ్రిజ్‌లో పెట్టాలి. మళ్లీ వేడి చేసే సమయంలో పూర్తిగా వేడయ్యేలా చూసుకోవాలి. అయితే పదేపదే వేడి చేయడం మాత్రం పూర్తిగా నివారించడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.

 

త్వరలో రిలీజ్ కాబోతున్న Honor Win Turbo..ఇది ఎలా ఉందంటే..

Honor Win Turbo
Honor Win Turbo

Honor Win Turbo: స్మార్ట్‌ఫోన్ రంగంలో సరికొత్త ఆవిష్కరణలతో దూసుకుపోతున్న ప్రముఖ చైనీస్ బ్రాండ్ ‘ఆనర్’ (Honor).. మొబైల్ ప్రియుల కోసం మరో పవర్‌ఫుల్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేయడానికి సిద్ధమైంది. ఆనర్ సంస్థ తన సరికొత్త గేమింగ్ పెర్ఫార్మెన్స్ సిరీస్ అయిన ‘ఆనర్ విన్’ (Honor Win) లైనప్‌లో భాగంగా.. తాజాగా చైనాలో ‘ఆనర్ విన్ టర్బో’ (Honor Win Turbo) మోడల్‌ను అధికారికంగా టీజ్ చేసింది. స్పోర్టీ లుక్, కోణీయ అంచులతో కూడిన భారీ రెక్టాంగులర్ కెమెరా మాడ్యూల్ , వెనుక భాగంలో వెలిగిపోయే ‘Win’ బ్రాండింగ్‌తో ఈ ఫోన్ డిజైన్ చాలా అగ్రెసివ్‌గా ఉండబోతోంది. ఈ ఫోన్ గరించి పూర్తి వివరాల్లోకి వెళితే..

ఆనర్ విన్ టర్బో స్మార్ట్‌ఫోన్ పెర్ఫార్మెన్స్ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా రూపొందుతోంది. ఈ ఫోన్‌లో క్వాల్కమ్ సంస్థకు చెందిన మోస్ట్ పవర్‌ఫుల్ ఫ్లాగ్‌షిప్ చిప్‌సెట్ అయిన స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ (Snapdragon 8 Elite) లేదా దానికి సమానమైన హై-ఎండ్ ప్రాసెసర్‌ను ఉపయోగించనున్నారు. గేమింగ్ ఆడేటప్పుడు ఫోన్ వేడెక్కకుండా ఉండేందుకు ఇందులో ప్రత్యేకంగా ఇంటర్నల్ కూలింగ్ ఫ్యాన్ (Active Cooling Fan) టెక్నాలజీని కూడా జోడిస్తున్నారు.

ఇందులో ఇది దాదాపు 185Hz రిఫ్రెష్ రేట్ కలిగిన అమోలెడ్ (AMOLED) స్క్రీన్‌తో వచ్చే అవకాశం ఉంది. ఇది గేమింగ్ విజువల్స్‌ను మరింత స్మూత్‌గా మారుస్తుంది. సాధారణంగా గేమింగ్ ఫోన్లలో కెమెరాలకు అంత ప్రాధాన్యత ఇవ్వరు. కానీ ఆనర్ విన్ టర్బోలో కెమెరా విభాగంపై కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. దీని వెనుక భాగంలో 50 మెగాపిక్సెల్ (50MP) ప్రధాన కెమెరాతో పాటు అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్ , సెల్ఫీల కోసం ముందు భాగంలో 16 మెగాపిక్సెల్ కెమెరాను అమర్చినట్లు తెలుస్తోంది.

ఈ సిరీస్ యొక్క అతిపెద్ద హైలైట్ దీని బ్యాటరీ సామర్థ్యమే. ఆనర్ విన్ టర్బో మోడల్ భారీ బ్యాటరీ లైఫ్‌తో రానుంది. అంతేకాకుండా దీని తదుపరి వెర్షన్ అయిన ‘విన్ 2’ సిరీస్‌లో ఏకంగా 10,000mAh బ్యాటరీ మరియు 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను తీసుకురావడానికి కంపెనీ ప్లాన్ చేస్తోంది. దీనివల్ల ఒక్కసారి ఛార్జ్ చేస్తే రోజులకు రోజులు బ్యాటరీ బ్యాకప్ లభిస్తుంది.

ధర విషయానికి వస్తే, ఆనర్ ఇంకా అధికారికంగా ప్రకటించనప్పటికీ, ఈ సిరీస్ ఇదివరకు విడుదలైన ఆనర్ విన్ బేస్ మోడల్ ధరల ఆధారంగా చూస్తే.. ఇది సుమారు చైనీస్ కరెన్సీ ప్రకారం 3,500 నుండి 4,000 యువాన్ల వరకు ఉండవచ్చు. అంటే భారత కరెన్సీలో సుమారుగా రూ.45,000 నుంచి రూ. 52,000 మధ్య ఉండే ఫ్లాగ్‌షిప్ బడ్జెట్ పరిధిలో ఇది మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం చైనాలో ఈ ఫోన్ కోసం ఆన్‌లైన్ స్టోర్ ద్వారా ముందస్తు బుకింగ్స్ (Pre-orders) కూడా ప్రారంభమయ్యాయి.

అమ్మకాల్లో దూసుకెళ్తున్న జర్మనీ కారు.. కారణం ఇదే..

Volkswagen Taigun
Volkswagen Taigun

Volkswagen Taigun: భారతీయ మిడ్-సైజ్ SUV మార్కెట్లో జర్మన్ కార్ల తయారీ సంస్థ ఫోక్స్‌వ్యాగన్ (Volkswagen) తనదైన ముద్ర వేస్తోంది. ముఖ్యంగా ఆ సంస్థకు చెందిన ‘టైగన్’ (Taigun) సరికొత్త ఫేస్‌లిఫ్ట్ అవతారంలో మార్కెట్లోకి వచ్చిన తర్వాత అమ్మకాల పరంగా సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. అంతేకాకుండా ఇందులో ఆకర్షణీయమైన ఫీచర్లు ఉండడంతో దీనిని ఎక్కువగా ఇష్టపడుతున్నట్లు తెలుస్తోంది. మరి ఈ కారు కొనుగోళ్లు పెరగడానికి కారణం ఏంటీ? ఇందులో ఉండే ఫీచర్స్ ఏంటీ?

సరికొత్త ఫేస్‌లిఫ్ట్ డిజైన్:
కొత్త ఫోక్స్‌వ్యాగన్ టైగన్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ మునుపటి కంటే చాలా స్పోర్టీగా, ఆకర్షణీయంగా మారింది. కారు ముందు భాగంలో సరికొత్తగా డిజైన్ చేసిన గ్రిల్, రీ-ప్రొఫైల్డ్ ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్స్, స్టైలిష్ డేటైమ్ రన్నింగ్ లైట్స్ దీనికి ప్రత్యేకమైన గుర్తింపును ఇస్తున్నాయి. బంపర్ డిజైన్‌ను మరింత అగ్రెసివ్‌గా మార్చడంతో పాటు, కొత్త అల్లాయ్ వీల్స్, వెనుక భాగంలో కనెక్టెడ్ ఎల్‌ఈడీ టెయిల్ ల్యాంప్స్ కారుకు ప్రీమియం లుక్‌ను తీసుకువచ్చాయి. ఈ బోల్డ్ అప్పియరెన్స్ యువ కస్టమర్లను విశేషంగా ఆకట్టుకుంటోంది.

ఇంటీరియర్ & హైటెక్ ఫీచర్ల :
బయటి డిజైన్ మాత్రమే కాదు కారు లోపలి భాగం (Interior) కూడా పూర్తిగా మారిపోయింది. డ్యాష్‌బోర్డ్ లేఅవుట్‌ను మరింత ఆధునికంగా తీర్చిదిద్దారు. ఇందులో వైర్‌లెస్ ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో సపోర్ట్ చేసే సరికొత్త పెద్ద ఇన్ఫోటైన్‌మెంట్ డిజైన్ ఉంది. డ్రైవర్ కోసం పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ (Digital Cockpit) అందుబాటులోకి వచ్చింది. పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ సీట్లు, యాంబియంట్ లైటింగ్ మరియు వైర్‌లెస్ ఛార్జింగ్ వంటి సౌకర్యాలు ప్రయాణాన్ని మరింత విలాసవంతంగా మారుస్తున్నాయి.

ఈ కారు గత ఏప్రిల్ 2025లో కేవలం 1,155 యూనిట్లు మాత్రమే అమ్మడైంది. సరిగ్గా ఏడాది తిరిగే సరికి అంటే ఏప్రిల్ 2026 నాటికి 1,543 యూనిట్ల అమ్మకాలతో ఏకంగా 34 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేసింది. తీవ్రమైన పోటీ ఉన్న ఈ విభాగంలో టైగన్ ఇంత వేగంగా పుంజుకోవడానికి కారణం అందులో ప్రవేశపెట్టిన అత్యాధునిక మార్పులే అన్న విషయం తెలుస్తోంది.

ఫోక్స్‌వ్యాగన్ కార్లు అంటేనే సేఫ్టీకి మారుపేరు. గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్‌లో ఇదివరకే 5-స్టార్ రేటింగ్ సాధించిన టైగన్, ఇప్పుడు లేటెస్ట్ ఫేస్‌లిఫ్ట్‌లో మరింత సురక్షితంగా మారింది. కొత్త మోడల్‌లో అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ADAS) టెక్నాలజీని జోడించారు. దీనివల్ల లేన్ కీప్ అసిస్ట్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, అటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ వంటి ఫీచర్లు డ్రైవింగ్‌ను సులభతరం చేస్తూ ప్రాణ రక్షణ కల్పిస్తాయి. దీనితో పాటు శక్తివంతమైన 1.0 లీటర్, 1.5 లీటర్ TSI టర్బో పెట్రోల్ ఇంజన్లు మెరుగైన డ్రైవింగ్ అనుభూతిని (Driving Dynamics) అందిస్తున్నాయి.

టెక్నాలజీ, స్టైల్, సేఫ్టీల కలయికగా వచ్చిన ఈ మార్పుల ప్రభావం నేరుగా అమ్మకాలపై స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే ప్రస్తుత భారత ఆటోమొబైల్ మార్కెట్లో వేగంగా దూసుకుపోతున్న అత్యుత్తమ మిడ్-సైజ్ SUVలలో ఒకటిగా ఫోక్స్‌వ్యాగన్ టైగన్ నిలుస్తోంది.

 

ప్రధాని మోదీ కాన్వాయ్ రెండు కార్ల గురించి తెలుసా..

PM Modi convoy
PM Modi convoy

PM Modi convoy: దేశంలో అత్యంత పటిష్టమైన భద్రత ఉండేది భారత ప్రధాన మంత్రిగారికే. సాధారణంగా పీఎం కాన్వాయ్‌లో 12 నుంచి 15 వరకు అత్యాధునిక బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు, జామర్లు, అంబులెన్స్ వంటివి ఉంటాయి. అయితే, ఇంధన పొదుపు, నిరాడంబరతను ప్రోత్సహించే ఉద్దేశంతో ప్రధాని నరేంద్ర మోదీ తన కాన్వాయ్ ని కేవలం రెండు కార్లకు తగ్గించుకుని సరికొత్త నిర్ణయంతో అందరినీ ఆశ్చర్యపరిచారు. స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (SPG) భద్రతా నియమాలకు (Blue Book Protocols) ఎలాంటి విఘాతం కలగకుండా.. ప్రస్తుతం ఆయన కాన్వాయ్‌లో ఒకటి రేంజ్ రోవర్ సెంటినెల్, దానికి రక్షణగా ఒక టొయోటా ఫార్చ్యూనర్ వాహనాలు మాత్రమే నడుస్తున్నాయి. ఈ కార్ల పర్ఫామెన్స్ ఎలా ఉంటుందో చూద్దాం..

రేంజ్ రోవర్ సెంటినెల్ (Range Rover Sentinel):దీనిని కదిలే ఇనుప కోటగా పిలుస్తారు. ప్రధాని మోదీ ప్రయాణించే ఈ కారు సాధారణ రేంజ్ రోవర్ కాదు. ల్యాండ్ రోవర్ సంస్థకు చెందిన ‘స్పెషల్ వెహికల్ ఆపరేషన్స్’ విభాగం కదిలే బంకర్ తరహాలో ప్రత్యేకంగా తయారుచేసింది. ఈ కారుకు ‘VR8-Level’ బాలిస్టిక్ సర్టిఫికేషన్ ఉంది. అంటే దీనిపై AK-47 రైఫిళ్లతో కాల్పులు జరిపినా, ఆర్మర్-పియర్సింగ్ బుల్లెట్లు దూసుకువచ్చినా లోపల ఉన్నవారికి ఎలాంటి ప్రమాదం జరగత. కారు కింద లేదా పక్క భాగంలో 15 కిలోల బరువైన టి.ఎన్.టి (TNT) బాంబు పేలినా, గ్రెనేడ్లతో దాడి చేసినా ఇది తట్టుకోగలదు. ఒకవేళ కారుపై విషవాయువులు లేదా కెమికల్ దాడి జరిగితే, బయటి గాలి లోపలికి రాకుండా ఆటోమేటిక్‌గా క్యాబిన్ లాక్ అయిపోతుంది. ఈ కారు టైర్లు పేలిపోయినా లేదా శత్రువులు కాల్పులు జరిపి పంక్చర్ చేసినా.. గంటకు 80 కిలోమీటర్ల వేగంతో మరో 50 కిలోమీటర్ల దూరం వరకు కారును సురక్షితంగా ముందుకు తీసుకెళ్లవచ్చు.

ఈ కారు బరువు దాదాపు 4.4 టన్నులు . ఇందులో 5.0 లీటర్ల సూపర్ చార్జ్డ్ V8 పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. ఇంత భారీ బరువు, పవర్ఫుల్ ఇంజన్ ఉండటం వల్ల దీని మైలేజ్ చాలా తక్కువగా ఉంటుంది. ఇది లీటరుకు కేవలం 4 నుంచి 6 కిలోమీటర్ల మైలేజ్ మాత్రమే ఇస్తుంది. ప్రధాని భద్రత కోసం ప్రత్యేకంగా కస్టమైజ్ చేసిన ఈ రేంజ్ రోవర్ సెంటినెల్ కారు ధర సుమారు రూ.10 కోట్ల నుంచి రూ.12 కోట్ల వరకు ఉంటుందని అంచనా.

టొయోటా ఫార్చ్యూనర్ (Toyota Fortuner): ఎస్పీజీ కమాండోల రక్షణ కవచం
ప్రధాని కారుకు ఎస్కార్ట్‌గా (వెనుక రక్షణగా) వెళ్లే వాహనమే టొయోటా ఫార్చ్యూనర్. భారతదేశంలో అత్యంత నమ్మకమైన, కఠినమైన రోడ్లపై కూడా సులువుగా దూసుకెళ్లే SUVగా దీనికి పేరుంది. కాన్వాయ్‌లో ఉండే ఈ ఫార్చ్యూనర్ కారులో ఎస్పీజీ (SPG) కమాండోలు అత్యాధునిక ఆయుధాలతో ప్రయాణిస్తారు. సాధారణ మార్కెట్లో దొరికే ఫార్చ్యూనర్ లాగా కాకుండా, ఈ భద్రతా వాహనాన్ని కూడా బుల్లెట్ ప్రూఫ్‌గా మారుస్తారు. ఇందులో హై-టెక్ కమ్యూనికేషన్ గ్యాడ్జెట్లు, శాటిలైట్ కనెక్టివిటీ వ్యవస్థలు ఉంటాయి. అత్యవసర పరిస్థితుల్లో ప్రధాని కారుకు ఎలాంటి ఇబ్బంది ఎదురైనా, ఈ ఫార్చ్యూనర్ కారు శత్రువులను అడ్డుకుని రక్షణ కవచంలా నిలుస్తుంది. ఇది 4-వీల్ డ్రైవ్ (4WD) సామర్థ్యం కలిగి ఉండటం వల్ల ఎలాంటి కఠినమైన దారుల్లోనైనా వేగంగా దూసుకెళ్లగలదు.

ఇందులో శక్తివంతమైన 2.8 లీటర్ల డీజిల్ ఇంజన్ ఉంటుంది. బుల్లెట్ ప్రూఫ్ మోడిఫికేషన్ల వల్ల దీని బరువు పెరిగినప్పటికీ.. ఇది లీటరుకు సుమారు 7 నుంచి 9 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది.సాధారణ ఫార్చ్యూనర్ ధర రూ. 40 లక్షల నుంచి రూ.50 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. కానీ ప్రధాని కాన్వాయ్ కోసం చేసే బుల్లెట్ ప్రూఫింగ్, సెక్యూరిటీ మోడిఫికేషన్లు మరియు కమ్యూనికేషన్ సిస్టమ్స్ వల్ల దీని విలువ రూ.1 కోటికి పైగానే ఉంటుంది.

 

మొబైల్ లో ఛార్జింగ్ లేదు.. ఛార్జర్ లేదు.. ఇలా చేస్తే నో టెన్షన్..

Mobile Charging Problem
Mobile Charging Problem

Mobile Charging Problem: మొబైల్ ఫోన్‌లో ఛార్జింగ్ కేవలం 1 శాతం మాత్రమే ఉండి.. చుట్టుపక్కల ఛార్జర్ పెట్టుకునే సదుపాయం లేనప్పుడు చాలామంది కంగారుపడుతుంటారు. ఇలాంటి సమయంలో ముఖ్యమైన ఫోన్ కాల్స్ మిస్ అవుతాయేమోననే ఆందోళన మొదలవుతుంది. అయితే ఇలాంటి క్లిష్ట సమయంలో ‘కాల్ ఫార్వర్డింగ్’ (Call Forwarding) ఫీచర్ ఒక అద్భుతమైన సంజీవనిలా పనిచేస్తుంది. మీ ఫోన్ పూర్తిగా స్విచ్ఛాఫ్ అవ్వడానికి ముందే ఈ ఆప్షన్ యాక్టివేట్ చేసుకుంటే, మీ నెంబరుకు వచ్చే ఇంపార్టెంట్ కాల్స్‌న్నింటినీ మీ వద్ద ఉన్న మరో ప్రత్యామ్నాయ నెంబరుకు లేదా మీ స్నేహితులు, కుటుంబ సభ్యుల మొబైల్‌కు మళ్లించవచ్చు. దీనివల్ల ఫోన్ ఆఫ్ అయినా సరే, మీరు ఎలాంటి ముఖ్యమైన సమాచారాన్ని మిస్ అవ్వకుండా ఉంటారు. మరి దీనిని ఎలా సెట్ చేసుకోవాలి?

కాల్ ఫార్వర్డ్:
ఈ ఫీచర్‌ను సెట్ చేసుకోవడానికి రెండు సులువైన పద్ధతులు ఉన్నాయి. మొదటిది మొబైల్ సెట్టింగ్స్ ద్వారా, రెండోది ఒక చిన్న సీక్రెట్ కోడ్ (USSID Code) ద్వారా. మీ ఫోన్ ఛార్జింగ్ చాలా వేగంగా అయిపోతుంటే, కింద పేర్కొన్న కోడ్ పద్ధతి ద్వారా కేవలం కొన్ని సెకన్లలోనే ఈ పని పూర్తి చేయవచ్చు.

సీక్రెట్ కోడ్ ద్వారా యాక్టివేట్ చేసుకోవాలని అనకుంటే మీ మొబైల్‌లోని డయల్ ప్యాడ్ (Dial Pad) ఓపెన్ చేయండి.*21 [పది అంకెల మొబైల్ నెంబర్] # అని టైప్ చేయండి. (ఉదాహరణకు: మీ ప్రత్యామ్నాయ నెంబరు 9876543210 అయితే, మీరు **21*9876543210# అని డయల్ చేయాలి). ఆ తర్వాత కాల్ బటన్ నొక్కండి. స్క్రీన్ పై ‘Call Forwarding Registration Was Successful’ అని మెసేజ్ వస్తుంది. అంటే మీ కాల్స్ విజయవంతంగా డైవర్ట్ అయ్యాయని అర్థం.

మొబైల్ సెట్టింగ్స్ ద్వారా.. మీ ఫోన్ Settings ఓపెన్ చేసి, Apps లేదా Call Settings లోకి వెళ్లండి (కొన్ని ఫోన్లలో నేరుగా ఫోన్ యాప్ ఓపెన్ చేసి, పైన ఉన్న మూడు చుక్కలపై క్లిక్ చేస్తే సెట్టింగ్స్ కనిపిస్తాయి). అక్కడ Calling Accounts లేదా Supplementary Services పై క్లిక్ చేయండి. ఇప్పుడు Call Forwarding ఆప్షన్‌ను ఎంచుకుని, అందులో Voice Calls సెలెక్ట్ చేసుకోండి. అక్కడ మీకు కొన్ని ఆప్షన్లు కనిపిస్తాయి. అందులో Always Forward అనే ఆప్షన్‌ను ఎంచుకుని, మీరు ఏ నెంబరుకైతే కాల్స్ వెళ్లాలో ఆ నెంబర్ టైప్ చేసి ‘Turn On’ లేదా ‘Enable’ క్లిక్ చేయండి.

కాల్ ఫార్వర్డ్‌ను డీయాక్టివేట్ చేయడం ఎలా?
మీకు మళ్లీ ఛార్జర్ అందుబాటులోకి వచ్చి, ఫోన్ ఆన్ చేసిన తర్వాత ఈ కాల్ ఫార్వర్డింగ్ ఆప్షన్‌ను ఖచ్చితంగా తీసేయాలి. లేదంటే మీ నెంబరుకు వచ్చే కాల్స్ అన్నీ పాత నెంబరుకే వెళ్తుంటాయి. దీనిని రిమూవ్ చేయడం కూడా చాలా సులభం.

సీక్రెట్ కోడ్ ద్వారా మీ మొబైల్ డయల్ ప్యాడ్ ఓపెన్ చేయండి. ##21# అని టైప్ చేసి కాల్ బటన్ నొక్కండి. వెంటనే స్క్రీన్ పై ‘Call Forwarding Erasure Successful’ లేదా ‘Service has been disabled’ అని వస్తుంది. దీంతో కాల్ ఫార్వర్డ్ ఆప్షన్ పూర్తిగా రద్దయిపోతుంది.

సెట్టింగ్స్ ద్వారా మీరు పైన కాల్ ఫార్వర్డ్ యాక్టివేట్ చేయడానికి వెళ్లినట్లే.. Settings, Call Settings, Call Forwarding లోకి వెళ్లండి.అక్కడ Always Forward ఆప్షన్ యాక్టివ్‌గా ఉన్నట్లు చూపిస్తుంది. దానిపై క్లిక్ చేసి ‘Disable’ లేదా ‘Turn Off’ బటన్ నొక్కితే సరిపోతుంది.

ఈ చిన్న ట్రిక్ ఫాలో అవ్వడం ద్వారా ఛార్జింగ్ లేనప్పుడు కూడా మీ ముఖ్యమైన కాల్స్ మిస్ అవ్వకుండా జాగ్రత్తపడవచ్చు.

కన్నడ హీరో దర్శన్ కి ఊహించని షాక్ ఇచ్చిన సుప్రీం కోర్టు..ఇక జైలులోనే జీవితం..

Darshan Supreme Court shock
Darshan Supreme Court shock

Darshan Supreme Court shock: కన్నడ స్టార్ హీరో దర్శన్ , రేణుక స్వామి హత్య కేసులో అరెస్ట్ అయ్యి , కొన్ని రోజుల తర్వాత బెయిల్ మీద విడుదలై , గడువు పూర్తి అవ్వగానే మళ్లీ అరెస్ట్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. ప్రస్తుతానికి ఆయన జైలులోనే ఉన్నాడు. అయితే కర్ణాటక హై కోర్టు దర్శన్ కి రీసెంట్ గానే బెయిల్ నిరాకరించగా, ఆయన నేరుగా సుప్రీమ్ కోర్టుని ఆశ్రయించాడు. దీనిపై నేడు జస్టీస్ పార్థివాలా , జస్టీస్ బిష్ణోయ్ లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ పిటీషన్ పై తుది తీర్పుని ఇస్తూ , దర్శన్ కి బెయిల్ ని నిరాకరించింది. అంతే కాదు , ట్రయిల్ కోర్టు లో ఈ కేసు నత్త నడకన సాగుతుండడం పై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఈ కేసుకి సంబంధించిన దాదాపుగా 150 మంది సాక్షులు ఉన్నారు , వీళ్లందరినీ విచారించాల్సి ఉంది.

కానీ గడిచిన 7 నెలల్లో కేవలం 10 మందిని మాత్రమే విచారించారట , దీనిని ధర్మాసనం తప్పుబట్టింది. వచ్చే ఏడాది లో విచారణ వేగవంతం అయితేనే, బెయిల్ కి దరఖాస్తు చేసుకోవాలని దర్శన్ కి సుప్రీం కోర్టు సూచించినట్టు తెలుస్తోంది. అంటే దీని అర్థం మరో ఏడాది వరకు ఆయనకు బెయిల్ వచ్చే అవకాశాలే కనిపించడం లేదు. 7 నెలల్లో 10 మందిని విచారించారంటే , ఇక ఏడాది లో మహా అయితే మరో 10 మందిని మాత్రమే విచారించగలరని , ఇలా అయితే దర్శన్ బెయిల్ మీద బయటకు వచ్చే లోపు పుణ్య కాలం కాస్త గడిచిపోతుందని దర్శన్ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విచారణ వాయిదాలు వేయకుండా , రోజుకు ఒకరిని కచ్చితంగా విచారించేలా ప్రణాళికలు చేయాల్సిందిగా ట్రయిల్ కోర్టు కి సుప్రీమ్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

ప్రస్తుతం ట్రయిల్ కోర్టు జడ్జి అదనపు బాధ్యతల్లో ఉండడం వల్ల, విచారణ కు చాలా సమయం పడుతుందని, దర్శన్ తరుపున న్యాయవాది ముకుల్ సుప్రీమ్ కోర్టుకి వివరించారు. దీంతో వెంటనే రెగ్యులర్ ప్రిసైడింగ్ ఆఫీసర్ ని నియమించాలని కర్ణాటక హై కోర్టుకు సుప్రీం కోర్టు సూచించింది. తనకు జైలులో అవసరమయ్యే కనీసం వసతులను కూడా నిరాకరిస్తున్నారని సుప్రీమ్ కోర్టు కి దర్శన్ విన్నవించుకోవడం తో , రూల్స్ ప్రకారం దర్శన్ కి అందాలన్సిన అన్ని వసతులు ఇవ్వాలని , అలా అని ఆయనకు వీఐపీ ట్రీట్మెంట్ ఇవ్వరాదని సుప్రీం కోర్టు ఆదేశించింది. తన ప్రియురాలు పవిత్ర గౌడ కి , రేణుక స్వామి అనే 33 ఏళ్ళ అభిమాని, అసభ్యకరంగా మెసేజిలు పెట్టాడనే కారణంతో , దర్శన్ తన అనుచరులతో రేణుక స్వామి ని కిడ్నాప్ చేసి హత్య చేసాడని ఆరోపణలు ఉన్న నేపథ్యం లో 2024 జూన్ 11 న దర్శన్ ని అరెస్ట్ చేశారు . అప్పటి నుండి ఆయన జైలులోనే ఉంటున్నాడు , మధ్యలో ఒకసారి బెయిల్ లభించింది కానీ , సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉండడంతో సుప్రీం కోర్టు బెయిల్ రద్దు చేసింది.

పిడుగుల నుంచి ఇలా తప్పించుకోండి ..

Lightning Safety Tips
Lightning Safety Tips

Lightning Safety Tips: వేసవి కాలంలో పిడుగుపాటు ప్రాణహానిగా మారుతోంది. ముఖ్యంగా ఉపాధి హామీ పనులు, వ్యవసాయ పనులకు వెళ్లే శ్రామికులు ఈ సమస్యలను ఎక్కవగా ఎదుర్కొంటారు. మే నుంచి జూన్‌ నెలలో ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు చోటుచేసుకోవడంతో ఉరుములు, మెరుపులు సంభవిస్తుంటాయి. ఈ సమయంలో బహిరంగ ప్రదేశాల్లో ఉండేవారు ప్రమాదాలకు గురవుతుంటారు. ఇలాంటి సమయంలో పిడుగుల నుంచి రక్షణ పొందడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

వాతావరణ నిపుణుల ప్రకారం పిడుగు అనేది సహజ ప్రకృతి విపత్తు. అయినప్పటికీ సరైన జాగ్రత్తలు పాటిస్తే ప్రాణనష్టం నుంచి తప్పించుకోవచ్చు. ఆకాశంలో మెరుపు కనిపించిన తర్వాత 30 సెకన్లలోపు ఉరుములు వినిపిస్తే ప్రమాదం చాలా దగ్గర్లోనే ఉందని అర్థం చేసుకోవాలి. అలాంటి సమయంలో వెంటనే పనులు ఆపేసి సురక్షిత ప్రదేశానికి వెళ్లాలని సూచిస్తున్నారు. చివరి ఉరుమ వినిపించిన తర్వాత కనీసం 30 నిమిషాల వరకు బయటకు రాకపోవడం మంచిదని చెబుతున్నారు.

పిడుగులు ఎక్కువగా ఎత్తయిన వస్తువులను తాకే అవకాశం ఉంటుంది. అందువల్ల మెరుపులు, ఉరుములు వినిపించే సమయంలో చెట్ల కింద నిలబడటం చాలా ప్రమాదకరం. ఒకే ప్రదేశంలో గుంపుగా నిలబడటం కూడా ప్రమాదానికి దారితీయొచ్చు. పిడుగు పడినప్పుడు విద్యుత్ ప్రభావం ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే అవకాశం ఉంటుంది. అందువల్ల కూలీలు గుంపులుగా కాకుండా దూరంగా ఉండటం మంచిదని సూచిస్తున్నారు. ముఖ్యంగా పొలాల్లో పని చేసే రైతులు వర్ష సూచనలు కనిపించగానే వ్యవసాయ పరికరాలు, ట్రాక్టర్లు వదిలి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలి.

అయితే సురక్షితమైన ప్రదేశాలు అనగా పక్కాగా నిర్మించిన ఇళ్లు, పైకప్పు ఉన్న భవనాల్లోకి వెళ్లడం మంచిది. అలాంటి ప్రదేశాలు అందుబాటులో లేకపోతే తక్కువ ఎత్తు ఉన్న ప్రాంతానికి వెళ్లాలి. పొలంలోనే చిక్కుకుపోయిన పరిస్థితుల్లో నేలపై పూర్తిగా పడుకోకుండా, చేతులు నేలను తాకకుండా మోకాళ్లపై వంగి ఉండటం ద్వారా ప్రమాదాన్ని కొంతవరకు తగ్గించవచ్చని నిపుణులు చెబుతున్నారు.

ఉపాధి హామీ పనులకు వెళ్లే శ్రామికులు వాతావరణ పరిస్థితులపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఆకాశంలో నల్లటి మబ్బులు కమ్ముకోవడం, గాలులు వేగంగా వీచడం, మెరుపులు కనిపించడం వంటి సంకేతాలు కనిపించగానే పని నిలిపివేయాలి. ప్రాణాల కంటే పని ముఖ్యం కాదనే అవగాహన గ్రామీణ ప్రాంతాల్లో మరింత పెరగాల్సిన అవసరం ఉంది.

ఇదిలా ఉండగా పిడుగుపాటుతో మరణించిన ఉపాధి హామీ శ్రామికుల కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తోంది. ఉపాధి హామీ పథకం కింద ప్రస్తుతం రూ.2 లక్షల పరిహారం మంజూరు చేస్తున్నారు. గతంలో ఈ సాయం రూ.50 వేలుగా ఉండగా ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దానిని రూ.2 లక్షలకు పెంచారు. ఈ పరిహారం పొందాలంటే స్థానిక ఫీల్డ్ అసిస్టెంట్‌ ద్వారా ఘటనకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు సేకరించి ఎంపీడీవో కార్యాలయానికి ప్రతిపాదనలు పంపాల్సి ఉంటుంది.

Vivo X300 Ultra మొబైల్ లో Zeiss కెమెరా స్పెషల్ ఇదే..

vivo x300 ultra zeiss camera
vivo x300 ultra zeiss camera

vivo x300 ultra zeiss camera: ప్రస్తుత కాలంలో మొబైల్ కొనేటప్పుడు కెమెరా పనితీరు గురించి కచ్చితంగా తెలుసుకుంటున్నారు. కస్టమర్లకు అనుగుణంగా కొన్ని కంపెనీలు సైతం అద్భుతమైన పర్ఫామెన్స్ తో కెమెరా ఉన్న పోన్లను మార్కెట్లోకి తీసుకువస్తున్నాయి. ఇందులో భాగంగా Vivo X300 Ultra స్మార్ట్‌ఫోన్ గురించి ఆసక్తికరంగా చర్చ సాగుతోంది. ఈ మొబైల్ ZEISS టైటిల్‌తో మార్కెట్‌లోకి వచ్చింది. అంటే ఇందులో టాప్‑ఎండ్ క్యామెరా ఫ్లాగ్‌షిప్ కెమెరాను అమర్చారు. ఈ కెమెరా ఏ విధంగా బెస్ట్ పెర్ఫామెన్స్ ఇస్తుంది? పూర్తి వివరాల్లోకి వెళితె..

Vivo X300 Ultra వెనక భాగంలో మూడు కెమెరాలు ఉంటాయి. ఈ కెమెరాలన్నింటిపై Zeiss ఆప్టిక్స్, కో‑ఇంజినీరింగ్ లేబుల్ ఉంటుంది. ఇందులో ప్రధాన కెమెరాగా 200MP Sony LYTIA ఉండనుంది. ఇది gimbal‑style OIS సపోర్ట్‌తో ఉండి ఎక్కువగా కాంతిలేని ప్రదేశంలో కూడా డీటెయిల్ డీప్ ఫోటోలు తీయడానికి రీజనబుల్ హెల్ప్ చేస్తుంది.

ఈ కెమెరాలో 200MP టెలిఫోటో కెమెరా కూడా ఉంటుంది. ఇది 3.7x ఆప్టికల్ జూమ్ తో పాటు ఫుల్‑రేంజ్ OIS, multi‑directional PDAF సపోర్ట్‌తో వస్తోంది. ఇది మ్యాక్రో మోడ్‌లో 3.4:1 మ్యాగ్నిఫికేషన్ సామర్థ్యం కూడా ఇస్తుంది. ఇలా ఈ ఫోన్ విస్తృత జూమ్ రేంజ్‌లో క్లియర్ ఫోటోలు తీయడానికి సపోర్ట్ చేస్తుంది.

మూడవ కెమెరాగా 50MP అల్ట్రావైడ్ సెటప్ తో పనిచేస్తుంది. ఇది డయల్ పిక్సెల్ PDAF, OIS సపోర్ట్‌తో ల్యాండ్‌స్‌కేప్, గ్రూప్ షాట్‌లలో కూడా స్టెబుల్ ఇమేజెస్ తీయవచ్చు. ఈ ట్రిపుల్ కెమెరా సిస్టమ్ కలిపి Vivo VS1+ ఇమేజింగ్ చిప్‌తో కలసి హై‑రెజ్ ఫోటోలు, HDR, నైట్ మోడ్ మరియు వీడియో స్టేబిలైజేషన్‌లో మంచి పనితీరు చూపిస్తుంది.

X300 Ultra కేవలం ఇంటిగ్రేటెడ్ కెమెరాతో మాత్రమే కాకుండా Zeiss‑బ్రాండెడ్ ఎక్స్ టర్నల్ టెలిఫోటో ఎక్స్టెండర్ కిట్‌తో కూడా కంప్యూటరైజ్డ్ చేస్తుంది. ఇందులో ఉండే ఎక్వివలెంట్ లెన్స్ అక్సెసరీ ద్వారా స్మార్ట్‌ఫోన్ నుంచి సుమారు 8x ఆప్టికల్ జూమ్ వరకు సాధ్యమవుతుంది.

Vivo X300 Ultra హార్డ్‌వేర్ పరంగా చాలా ముందు వరుసలో ఉంటుంది, కానీ కొన్ని రివ్యూ సంస్థల ప్రకారం ప్రాక్టికల్ కెమెరా పర్ఫామెన్స్ కొంతవరకు X300 Pro కంటే ముందుకు వెళ్లలేదని తేలింది. అయితే, 200MP ప్రైమరీ సెన్సర్ నుంచి సాధారణంగా 25MP రెజొల్యూషన్‌లో షూట్ చేసినప్పుడు డీటెయిల్ మరియు డైనమిక్ రేంజ్ బాగా ఉంటాయి.

 

సీఎం విజయ్ తో మెగాస్టార్ చిరంజీవి కీలక ఫోన్ కాల్ సంభాషణ.. ఇది నిజంగా ఎవ్వరూ ఊహించనిది..

Chiranjeevi Vijay phone call
Chiranjeevi Vijay phone call

Chiranjeevi Vijay phone call: ఇండియా లోనే బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ లో ఒకరిగా పేరు తెచ్చుకున్నప్పటికీ , ఇసుమంత గర్వం కూడా లేని హీరోల లిస్ట్ తీస్తే అందులో మెగాస్టార్ చిరంజీవి ముందు వరుసలో ఉంటాడు. తన తోటి హీరోలు సూపర్ హిట్ కొడితే మనస్ఫూర్తిగా అభినందిస్తాడు , అదే విధంగా కొత్త టాలెంట్ ని ప్రోత్సహించడం లో ఎప్పుడూ ముందు ఉంటాడు. అందుకే మెగాస్టార్ చిరంజీవి ని చూసి కొత్త తరం నటీనటులు కూడా ఎన్నో విషయాలను నేర్చుకుంటుంటారు. తాజాగా మరోసారి తన ఉన్నతమైన మనసుని చాటుకున్నాడు మెగాస్టార్. రీసెంట్ గానే తమిళ హీరో సీఎం సార్వత్రిక ఎన్నికల్లో ఘనవిజయం సాధించి తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాడు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి నేడు స్వయంగా విజయ్ కి ఫోన్ చేసి, సుమారుగా 15 నిమిషాల పాటు సంభాషించాడట.

తమిళనాడు రాష్ట్రానికి సీఎం గా బాధ్యతలు చెప్పినట్టినందుకు ముందుగా విజయ్ కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసాడట. అనంతరం ఎన్నికలు ముగిసిన తర్వాత నాలుగు రోజుల వరకు తమిళనాడు లో జరిగిన హై డ్రామా గురించి కూడా చిరంజీవి ప్రస్తావించాడట. ఇక విజయ్ రీసెంట్ గానే ‘మీ మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రాన్ని చూశానని, మీ కామెడీ టైమింగ్ ని చాలా కాలం తర్వాత ఆరంభం నుండి ఎండింగ్ వరకు ఎంజాయ్ చేశానని , అదే విధంగా నా ‘జన నాయగన్’ చిత్రం లీక్ అయ్యినప్పుడు సపోర్టుగా నిలిచినందుకు ధన్యవాదాలు అని కూడా మెగాస్టార్ కి చెప్పినట్టు సమాచారం. ఇలా వీళ్లిద్దరి మధ్య సుదీర్ఘంగా ఫోన్ కాల్ సంభాషణ జరిగినట్టు తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి తో విజయ్ కి ఎప్పటి నుండో మంచి సాన్నిహిత్యం ఉంది. ఆయన తండ్రి చంద్రశేఖర్ చిరంజీవి తో ఏకంగా మూడు సూపర్ హిట్ సినిమాలు చేసాడు.

ఈ మూడు సినిమాల షూటింగ్స్ సమయంలో విజయ్ రెగ్యులర్ గా సెట్స్ కి వస్తుండేవాడని, చిరంజీవి అతన్ని చాలా బాగా చూసుకునేవాడని తెలుస్తోంది. అంతే కాదు , రాజకీయాల కారణంగా సినిమాలకు సుదీర్ఘ విరామం ప్రకటించిన చిరంజీవి , రీ ఎంట్రీ ఇచ్చింది ‘ఖైదీ నెంబర్ 150’ చిత్రం తో , ఈ సినిమా కమర్షియల్ గా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే, బాహుబలి తర్వాత వంద కోట్ల షేర్ మార్కుని అందుకున్న రెండవ తెలుగు చిత్రమిది. ఈ సినిమా విజయ్ ‘కత్తి’ చిత్రానికి రీమేక్. ఈ రీమేక్ రైట్స్ స్వయంగా విజయ్ తన నిర్మాతతో మాట్లాడి చిరంజీవి కి ఉచితంగా ఇప్పించాడని అప్పట్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిరంజీవి స్వయంగా చెప్పుకొచ్చాడు. అలా ఎప్పటి నుండి వీళ్లిద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది.

మామిడికాయ, పుచ్చకాయ కలిపి తింటున్నారా...

Mango Watermelon side effects
Mango Watermelon side effects

Mango Watermelon side effects: వేసవి కాలం వచ్చిందంటే మార్కెట్‌లో మామిడి, పుచ్చకాయ, సపోటా, ద్రాక్ష వంటి పండ్లు విరివిగా కనిపిస్తాయి. శరీరానికి చల్లదనం, తక్షణ శక్తిని ఇస్తాయని చాలామంది ఈ పండ్లను ఎక్కువగా తీసుకుంటుంటారు. అయితే కొన్ని పండ్లను కలిపి తినడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా మామిడి, పుచ్చకాయ, సపోటా వంటి పండ్లను ఒకేసారి తినడం జీర్ణక్రియపై ప్రభావం చూపుతుందని చెబుతున్నారు.ఈ పండ్లు ఒకేసారి తింటే ఎలాంటి సమస్యలు వస్తాయో చూద్దాం..

మామిడి పండులో సహజ చక్కెర శాతం ఎక్కువగా ఉంటుంది. అదే సమయంలో పుచ్చకాయలో అధిక నీటి శాతం ఉండగా, సపోటాలో ఫైబర్‌తో పాటు షుగర్ కూడా అధికంగా ఉంటుంది. ఈ మూడు పండ్లను కలిపి తీసుకున్నప్పుడు జీర్ణవ్యవస్థ ఒక్కసారిగా ఎక్కువ శ్రమ పడాల్సి వస్తుంది. ఫలితంగా గ్యాస్, బ్లోటింగ్, కడుపు ఉబ్బరం, అజీర్ణం వంటి సమస్యలు రావచ్చని వైద్యులు సూచిస్తున్నారు.

కొంతమందిలో ఈ కాంబినేషన్ వల్ల విరోచనాలు, కడుపునొప్పి, వాంతుల భావన కూడా కనిపించవచ్చని చెబుతున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, డయాబెటిస్ లేదా జీర్ణ సమస్యలతో బాధపడేవారు ఇలాంటి ఫ్రూట్ కాంబినేషన్ల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. శరీరంలో షుగర్ స్థాయిలు ఒక్కసారిగా పెరగడం వల్ల అలసట, అసౌకర్యం కూడా కలగవచ్చు.

అలాగే ద్రాక్షతో పాటు పాలు తీసుకోవడం కూడా మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ద్రాక్షలో ఉండే ఆమ్ల గుణాలు పాలలోని ప్రోటీన్లతో కలిసి జీర్ణక్రియను మందగింపజేస్తాయని అంటున్నారు. దీని వల్ల కడుపు బరువుగా అనిపించడం, గ్యాస్, మలబద్ధకం లేదా అజీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.

ఆయుర్వేదం ప్రకారం.. కూడా కొన్ని ఆహార పదార్థాలను కలిపి తీసుకోవడం విరుద్ధం అని అంటారు. అంటే వాటి గుణాలు పరస్పరం విరుద్ధంగా పనిచేసి శరీరానికి ఇబ్బందులు కలిగిస్తాయని వివరిస్తుంది. ముఖ్యంగా పాలు, పుల్లటి పండ్లు లేదా అధిక నీటి శాతం ఉన్న పండ్లను కలిపి తీసుకోవడం మంచిది కాదని సూచిస్తుంది. వైద్యుల సూచనల ప్రకారం.. పండ్లను ఒక్కోటి విడిగా తీసుకోవడం ఉత్తమం. ముఖ్యంగా భోజనం చేసిన వెంటనే కాకుండా మధ్యలో స్నాక్‌లా తీసుకుంటే జీర్ణక్రియ సజావుగా జరుగుతుంది. అలాగే ఒకేసారి ఎక్కువ రకాల పండ్లు తినకుండా పరిమిత మోతాదులో తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు.

రాజమౌళి వల్ల పర్సనల్ గా బాగా ఇబ్బంది పడ్డ నటులు వీళ్లే... ఓపెన్ గా చెప్పిన స్టార్ హీరో...

S S Rajamouli
S S Rajamouli

Rajamouli working style: ‘స్టూడెంట్ నెంబర్ వన్’ సినిమాతో ఇండస్ట్రీకి దర్శకుడిగా పరిచయమైన రాజమౌళి ఆ సినిమా ఇచ్చిన సక్సెస్ తో వరుస సినిమాలను చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. ఇప్పటివరకు ఆయన నుంచి వచ్చిన సినిమాలన్నీ ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణను సంపాదించుకున్నాయి. ఇక ఇలాంటి క్రమంలోనే తనే నుంచి రాబోతున్న సినిమాల విషయంలో ఆయన ఇంకాస్త జాగ్రత్తగా ఉండాల్సిన సమయమైతే ఆసన్నమైంది. ప్రస్తుతం ఆయన మహేష్ బాబును హీరోగా పెట్టి చేస్తున్న వారణాసి సినిమాతో యావత్ ఇండియన్ సినిమా పరిధిని దాటి ప్రపంచ స్థాయి ప్రేక్షకులను మెప్పించే విధంగా సన్నాహాలు చేస్తున్నాడు. దానికి తగ్గట్టుగానే ఈ సినిమాని చాలా ఎమోషన్స్ తో తెరకెక్కిస్తున్నారు.

ఇక అవసరమైన చోట ఎలివేషన్స్ ను కూడా యాడ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దీంతో ఈ సినిమా సూపర్ సక్సెస్ ను సాధిస్తుంది అంటూ మేకర్స్ చాలా కాన్ఫిడెంట్ ను వ్యక్తం చేస్తున్నారు. 1500 కోట్ల బడ్జెట్ tho తెరకెక్కుతున్న ఈ సినిమా 3000 కోట్లకు పైన కలెక్షన్స్ ను రాబట్టాల్సిన అవసరమైతే ఉంది… నిజానికి రాజమౌళి ఒక సినిమా కోసం చాలామంది ఆర్టిస్టులను లాక్ చేస్తుంటాడు.

వాళ్ళ డేట్స్ ని బల్క్ గా తీసుకొని తనకి కావలసిన మెకోవర్ లో వాళ్ళను రెడీ చేస్తుంటాడు. ఈ క్రమంలోనే బాహుబలి సినిమా కోసం ప్రభాస్, రానా డేట్స్ ని బల్క్ గా తీసుకొని తన దగ్గరే ఒక మూడు సంవత్సరాల పాటు వాళ్ళని ఉంచుకున్నాడు. ఇక ఈ క్రమంలోనే వాళ్ళ బాడీలు సైతం భారీగా ఉండాలని వాళ్లకి విపరీతంగా తినిపించి వాళ్ళ బాడీని బలంగా తయారయ్యేలా చేశాడు. రాజమౌళి పెట్టిన టార్చర్ కి తమ బాడీని చాలా బాగాబిల్డ్ చేసుకున్న హీరోలు ఈ సినిమా షూటింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళు దానిని మెయింటైన్ చేయకపోవడంతో ప్రభాస్ బాడీ మొత్తం షిప్ అవుట్ అయిపోయింది.

రానాకి సైతం ఒక కిడ్నీ ఫెయిల్ అయిపోయింది… దాంతో రానా కిడ్నీ మార్చుకున్న విషయం మనకు తెలిసిందే. మొత్తానికైతే రాజమౌళి వల్ల వీళ్ళిద్దరి కెరియర్లు చాలా వరకు నష్టపోయాయనే చెప్పాలి. దాంతో ప్రభాస్ ఇప్పటికి కోల్పోవడం లేదు. తనకు ఏదో ఒక హెల్తీ ఇష్యూ వస్తుంది. ఇక ఎందుకని ప్రభాస్ హెల్త్ బాగుపడటం లేదనే విషయంలో చాలా రకాల చర్చలైతే జరుగుతున్నాయి.

 

ఇంటర్లో 97% మార్కులు.. పరీక్ష కంటే ముందు 82 కీమో థెరపీలు..

Student Success Story
Student Success Story

Student Success Story: పరీక్ష మందు చిన్నపాటి జ్వరం వస్తేనే చాలామంది ఇబ్బంది పడతారు. ఆ ప్రభావం పరీక్ష మీద ఖచ్చితంగా ఉంటుంది. మార్కులు కూడా తక్కువగా వస్తూ ఉంటాయి. చిన్నపాటి జ్వరం వస్తేనే పరీక్ష మీద ఈ స్థాయిలో ప్రభావం ఉంటే.. ఈమె ఏకంగా 82 కీమో థెరపీలు చేసుకుంది. క్యాన్సర్ వ్యాధిని జయించింది. భరించలేని బాధ ఉన్నప్పటికీ.. చదువుల తల్లి సరస్వతి మాదిరిగా తన ప్రతిభను నిరూపించుకుంది. ఏకంగా ఇంటర్లో 97% మార్కులు సాధించింది.

పశ్చిమ బెంగాల్లో ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలలో అద్రిజా గాన్ అనే యువతి ఏకంగా 97% మార్కులు సాధించింది. తద్వారా రాష్ట్రస్థాయి ర్యాంకు అందుకుంది. అయితే ఈ స్థాయిలో మార్కులు సాధించడం వెనక కన్నీటి గాధ ఉంది. అద్రిజా మూడు సంవత్సరాల క్రితం క్యాన్సర్ వ్యాధి బారిన పడింది. ఆ వ్యాధి నివారణ కోసం ఆమె ఏకంగా 82 సార్లు కీమో థెరపీ చేయించుకుంది. ఆస్పత్రిలో నరకం చూస్తుంది. అయినప్పటికీ ఆమె చదువుకు కీమో థెరపీలు ఆటంకం కలిగించలేదు. ఒకవైపు తీవ్రమైన అనారోగ్య సమస్య.. మరోవైపు ఇబ్బంది పెడుతున్న శస్త్ర చికిత్స.. అయినప్పటికీ ఆమె చదువుకొని కొనసాగించింది. ఒక దశలో తల్లిదండ్రులు విశ్రాంతి తీసుకోవాలని సూచించినప్పటికీ ఆమె ఏ మాత్రం వెనకడుగు వేయలేదు.

అద్రిజా పదవ తరగతిలో కూడా 94% మార్కులు సాధించింది. అద్రిజా బిగ్ బజార్ ప్రాంతంలోని రామకృష్ణ శారదా మిషన్ సిస్టర్ నివేదిత బాలికల పాఠశాలలో చదువుతోంది. ఈమె 2018లో అత్యంత అరుదైన బ్లడ్ క్యాన్సర్ వ్యాధి బారిన పడింది. ఆరవ తరగతి వార్షిక పరీక్షలు జరుగుతున్నప్పుడు ఆమెకు అనారోగ్యం సోకింది. తల్లిదండ్రులు వైద్య పరీక్షలు చేస్తే ఆమెకు అరుదైన టి సెల్ లింఫోమా సోకినట్టు తేలింది. 2021 వరకు ఆమె చికిత్స తీసుకుంటూనే ఉంది. ఆ సమయంలో ఆమెకు ఏకంగా 82 సార్లు కీమో థెరపీలు చేశారు. వ్యాధి ఇబ్బంది పెడుతున్నప్పటికీ .. మందులు వేసుకుంటే శరీరం సహకరించకపోయినప్పటికీ .. అద్రిజా కష్టపడి చదివింది. అత్యంత ఉత్తమమైన మార్కులు సాధించింది. తద్వారా చదువుకు అనారోగ్యం ఆటంకం కాదని నిరూపించింది. అద్రిజా సాధించిన మార్కుల పట్ల ఆమె తండ్రి మంగల్ హర్షం వ్యక్తం చేస్తున్నాడు. తన కుమార్తె గొప్ప ప్రయత్నం చేసిందని కొనియాడుతున్నాడు.