Home Blog Page 266

RedMagic 11S Pro.. ఇది మామూలు ఫోన్ కాదు భయ్యా..

RedMagic 11S Pro
RedMagic 11S Pro

RedMagic 11S Pro: ప్రస్తుత కాలంలో మొబైల్ వినియోగదారుల్లో ఎక్కువగా యూత్ ఉన్నారు. వీర గేమింగ్ ను ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఇలాంటి వారి కోసం అత్యుత్తమ మొబైల్ గేమింగ్, ఫ్లాగ్‌షిప్ పనితీరుతో ఉండే మొబైల్ త్వరలో మార్కెట్లోకి రాబోతుంది. అదే RedMagic 11S Pro.ఇది ఓవర్‌లాక్ చేయబడిన Snapdragon 8 Elite (Gen 5) Leading Version చిప్‌సెట్, లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీ వంటి ఫీచర్స్ ను కలిగి ఉంది. ఈ మొబైల్ మార్కెట్లోకి రాకముందే ఎలా ఉందో తెలుస్తోంది. ఈ ఫోన్ గురించి పూర్తి వివరాల్లోకి వెళితె..

RedMagic త్వరలో మార్కెట్లోకి 11S Proను తీసుకురాబోతుంది. ఇది 11 Pro సిరీస్‌కు mid cycle refresh‌గా రానుందని సమాచారం. ఇప్పటివరకు వచ్చిన వివరాల ప్రకారం.. ఈ మోడల్ ప్రధానంగా గేమింగ్ పనితీరును మరింత మెరుగుపరచడానికి రూపొందిస్తున్నారు. 11S Pro డిజైన్‌ చాలా వరకు RedMagic 11 Pro లాగే ఉండే అవకాశం ఉంది. ట్రాన్స్పరెంట్ స్టైల్ లో, ఫ్లష్ కెమెరా, active cooling fan ఉండనుంది. అలాగే ఈ మొబైల్ సిల్వర్ వింగ్, డార్క్ నైట్ వంటి కలర్లలో రానున్నట్లు సమాచారం.

ఈ ఫోన్‌లో 6.85 అంగుళాల AMOLED డిస్ ప్లే ఉండనుంది. ఇది 144Hz refresh రేట్ తో పనిచేస్తుంది. 2K రిజల్యూషన్ తో gaming experience కోసం sharp panel ఉండొచ్చని రిపోర్టులు చెబుతున్నాయి. ముఖ్యంగా లోపల ఉండే డిస్ ప్లే selfie camera ఉండే అవకాశం ఉందని సమాచారం. కాబట్టి front camera cutout లేకుండా full-screen gaming అనుభవం దొరకొచ్చు.

ఈ 11S Proలో Snapdragon 8 Elite Gen 5 చిప్‌సెట్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇది overclocked Leading Version chip‌తో వస్తుంది, అంటే standard version కంటే కొంచెం ఎక్కువ clock speed ఉండొచ్చు. upgraded built-in fan తో పాటు లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ , long gaming sessionsలో heat control కోసం advanced thermal design ఉండొచ్చు.

బ్యాటరీ విభాగంలో 7,500mAh లేదా కొన్నిరిపోర్టుల ప్రకారం 8,000mAh వరకు capacity ఉండొచ్చని సమాచారం ఉంది. Wired charging 80W వరకు, అలాగే కొన్ని లీక్‌లలో wireless charging support కూడా కనిపిస్తోంది. కానీ ఇది అధికారికంగా ఇంకా కన్ఫర్మ్ కాలేదు.

ఈ మొబై్ లో 50MP రియర్ కెమెరా, సెల్పీ కోసం 16MP కెమెరా ఉండనుంది. REDMAGIC OS 11 ఆధారంగా Android 16 రావొచ్చని సమాచారం. ఇప్పటివరకు అధికారికంగా ధర గురించి బయటకు రాలేదు. అయితే గత RedMagic 11 Pro price ఆధారంగా చూస్తే, 11S Pro కూడా premium gaming segmentలోనే ఉండే అవకాశం ఉంది.

ప్రభాస్ తో పెళ్లి కి రెడీ అంటున్న స్టార్ హీరోయిన్...

Prabhas
Prabhas

Prabhas Marriage: సినిమా ఇండస్ట్రీలో సక్సెసులనేవి అంత ఈజీగా రావు…ఎన్నో సంవత్సరాల పాటు కష్టపడి వాళ్ళను వాళ్ళు ప్రూవ్ చేసుకున్న తర్వాతే సక్సెస్ లు వరిస్తాయి. ఇక ఇలాంటి క్రమంలోనే కృష్ణంరాజు నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ సైతం తనదైన రీతిలో సత్తా చాటుతున్నాడు. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. ప్రస్తుతం ఆయన పాన్ ఇండియా సినిమాలను మాత్రమే చేస్తున్నాడు. తనతో సినిమాలు చేయడానికి ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క దర్శకుడు ఆసక్తి చూపిస్తున్నాడు అంటే ఆయన ఏ రేంజ్ సక్సెస్ ని సాధించాడు మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇప్పుడు చేస్తున్న సినిమాలతో మరో మెట్టు పైకి ఎక్కబోతున్నట్టుగా తెలుస్తుంది. ఫౌజీ, స్పిరిట్ లాంటి సినిమాలు ఆయన రేంజ్ ను మార్చబోతున్నాయి.

ప్రభాస్ సినిమాలా పరంగా ముందుకు దూసుకెళ్తున్నప్పటికి పర్సనల్ విషయాల్లో మాత్రం చాలా వరకు వెనుకబడిపోయాడని చాలామంది చెబుతున్నారు. తన తోటి హీరోలందరు పెళ్లి చేసుకొని పిల్లల్ని కట్టుంటే ప్రభాస్ మాత్రం ఇంకా పెళ్లి చేసుకోకపోవడం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా నిలిచిపోవడం అనేది ప్రతి ఒక్కరిని కలవరపెడుతుంది.

తన కుటుంబ సభ్యులతో సహా ప్రతి ఒక్కరు ప్రభాస్ పెళ్లి ఎప్పుడు అంటూ అతన్ని అడుగుతున్నారు. నిజానికి తన దగ్గర కూడా ఆ విషయానికి సమాధానం లేదంటూ ప్రభాస్ తప్పించుకుంటున్నాడు. సమయం వచ్చినప్పుడు అదే జరుగుతుంది అంటూ సిచువేషన్ ను దాటవేస్తున్నాడు. ఇక ఏది ఏమైనా కూడా కొంతమంది హీరోయిన్లు సైతం ప్రభాస్ ఇష్టపడితే పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామంటూ ఓపెన్ గా చెప్పేస్తున్నారు.

జాతి రత్నాలు సినిమాతో హీరోయిన్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న నటి ఫరీయా అబ్దుల్లా…ఆమె గతంలో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ప్రభాస్ ఒప్పుకుంటే నేను పెళ్లి చేసుకుంటాను అంటూ ఫన్నీగా ఒక ఆన్సర్ ఇచ్చింది. మరి నిజంగానే ఆమె ప్రభాస్ ఓకే అంటే పెళ్లి చేసుకుంటుందా? లేదా అనే విషయం పక్కన పెడితే ప్రభాస్ కి అంత మంచి ఫాలోయింగ్ అంత మంచి క్రేజ్ ఉన్నప్పుడు ఎందుకని పెళ్లి చేసుకోవడానికి నెగ్లెక్ట్ చేస్తున్నాడు. అంటూ ఇండస్ట్రీ లో చాలా రకాల చర్చలైతే జరుగుతున్నాయి…

రాజకీయాలను వదిలేసి..ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఆర్థిక పాఠాలు..

RK kothapaluku
RK kothapaluku

RK Kotha Paluku: ప్రతి ఆదివారం ఆంధ్రజ్యోతి పత్రికలో కొత్త పలుకు పేరుతో సంపాదకీయాలు రాస్తుంటారు ఆ పత్రిక ఎండి వేమూరి రాధాకృష్ణ. ఆయన సీనియర్ జర్నలిస్ట్. పైగా రాజకీయ పార్టీలతో ఆయనకు దగ్గర సంబంధాలు ఉంటాయి. రాజకీయాలంటే కూడా ఆయన చాలా ఇష్టం. అందువల్లే తన కొత్త పలుకు సంపాదకీయంలో ఎక్కువగా రాజకీయ వార్తలు ఉండే విధంగా చూసుకుంటారు. లోతైన విషయాలపై విశ్లేషణ చేస్తూ ఉంటారు.

తాజా కొత్త పలుకులో వేమూరి రాధాకృష్ణ తన ట్రేడ్ మార్క్ రాజకీయాలను వదిలేశారు. ఆర్థిక పాఠాలను చెప్పడం మొదలుపెట్టారు. ఇందులో కొన్ని అంశాలు మాత్రం చెప్పుకోదగ్గవిగా.. ఆచరించే దగ్గవిగా ఉన్నాయి. ముఖ్యంగా భారతీయులు మర్చిపోయిన పొదుపు పాఠాలు.. రాజకీయ పార్టీల సంక్షేమ పథకాలు.. వాటి వల్ల ప్రజలు సోమరిపోతులుగా మారిన తీరు.. అనవసరమైన ఖర్చులు.. ప్రతి అంశాన్ని రాధాకృష్ణ లోతుగానే విశ్లేషించారు. వాస్తవానికి ఈ తరహాలో ఆయన రాస్తారని.. పొలిటికల్ ట్రేడ్ మార్క్ పక్కనపెట్టి ఎకనామికల్ లెక్చర్లు దంచుతారని ఎవరూ ఊహించలేదు.

నరేంద్ర మోడీని పరోక్షంగా ప్రస్తావిస్తూ.. ఇప్పటికైనా దేశం పొదుపు పాఠాలు నేర్వాలని రాధాకృష్ణ పేర్కొన్నారు.. “తోటోడు తొడ కోసుకుంటే.. మనం మెడ కోసుకుంటున్నాం. ఆడంబరాలు పెరిగిపోయాయి. ఖర్చులు ఎక్కువైపోయాయి. పొదుపు అనేది పక్కకు వెళ్లిపోయింది. వ్యక్తిగత అవసరాలకు మించి ఖర్చు విపరీతంగా పెడుతున్నారు. దీనివల్ల పొదుపు లేకుండా పోతోంది. అందువల్ల భారతీయుల వ్యవహార శైలి పూర్తిగా మారిపోతుంది. ఫలితంగానే ఈ ఇబ్బందులు. సాధ్యమైనంతవరకు ఇటువంటి పరిణామాలు భారతీయులను మార్చే అవకాశం ఉందని” రాధాకృష్ణ అభిప్రాయపడ్డారు.

రాధాకృష్ణ చెప్పింది ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ.. పొదుపు గురించి వీర లెవెల్ లో లెక్చర్లు దంచినప్పటికీ.. ఆయన తన పత్రికను అమ్ముకోవడంలో కార్ రేస్ వంటి కార్యక్రమాన్ని ఎందుకు నిర్వహించినట్టు.. సంవత్సర చందా కడితే బహుమతులు ఎందుకు ఇచ్చినట్టు.. రాధాకృష్ణ మాదిరిగానే మిగతా కంపెనీలు కూడా తమ ఉత్పత్తులు అమ్ముకోవడానికి వినియోగదారులను ఆకట్టుకుంటాయి. రకరకాల స్కీములు అమలు చేస్తుంటాయి. ఎవరూ ఒకే విధంగా బతకాలి అనుకోరు. లగ్జరీని ఆస్వాదించాలని భావిస్తుంటారు. ఇందులో తప్ప పట్టాల్సిన అవసరం లేదు. కాకపోతే ఆ లగ్జరీ అనేది వ్యసనంగా మారిపోతేనే ఇబ్బంది. బహుశా భారతీయులు ఇంకా ఆ స్థాయికి రాలేదు. రాధాకృష్ణ చెప్పింది ఒక యాంగిల్ లో బాగానే ఉంది కానీ.. లోతుగా వెళ్తేనే ఇబ్బందిగా ఉంది.. ప్రఖ్యాత కంపెనీలు భారతదేశంలో సంస్థలు ఏర్పాటు చేస్తున్నాయి. ఎందుకంటే బెల్లం ఎక్కడ ఉంటే అక్కడే చీమలు ఉంటాయి. భారతదేశం అతిపెద్ద వినియోగదారులు ఉన్న మార్కెట్ కాబట్టి.. ప్రపంచ స్థాయి కంపెనీలు వస్తుంటాయి.

ఇటీవల ఏపీ రాష్ట్రానికి గూగుల్ వచ్చింది.. రాయల్ ఎన్ఫీల్డ్ వచ్చింది.. అంతకుముందు కియా వచ్చింది. వాటన్నిటిని గొప్పగా చెప్పిన రాధాకృష్ణ.. ఇప్పుడు తప్పు పట్టడమేంటి.. పెద్ద పెద్ద సంస్థలు ఎందుకు ఏర్పాటు అవుతున్నాయి.. ఎందుకు ఈ లగ్జరీ అని అనడం ఏంటి.. ఏదైనా ఒకే కోణంలో ఉండాలి.. అవసరం ఉన్నప్పుడు ఒక విధంగా.. అవసరం లేనప్పుడు మరొక విధంగా మాట్లాడితేనే ఇబ్బందిగా ఉంటుంది. అలాంటప్పుడే వ్యక్తుల మీద గౌరవం పోతుంది. పాపం రాధాకృష్ణ ఎలాంటి రాతలు రాసేవాడు.. చివరికి ఇప్పుడు ఇలా అయిపోయాడు..

15 ఏళ్లల్లో 1.69 కోట్లు... అడ్డంగా దొరికిపోయిన మమతా బెనర్జీ..

Mamata Banerjee
Mamata Banerjee

Mamata Banerjee: వెస్ట్ బెంగాల్లో బిజెపి ప్రభుత్వం దూకుడుగా అడుగులు వేస్తోంది. 15 సంవత్సరాల టిఎంసి పరిపాలన తాలూకు మరకలను మొత్తం తూడ్చి వేయడానికి లక్షల లీటర్ల ఫినాయిల్ వాడుతోంది. ఇప్పటికే ప్రక్షాళన మొదలుపెట్టిన సుబేందు అధికారి.. అక్రమాలను బయట పెడుతోంది. అవినీతి లో పాలు పంచుకున్న అధికారుల మీద.. రాజకీయ నాయకుల మీద కేసులు పెడుతోంది. ఏకంగా కేంద్ర దర్యాప్తు సంస్థల అధికారులు విచారణ సాగిస్తున్నారు. దీంతో ప్రతిరోజు జాతీయ మీడియాలో బెంగాల్ పతాక శీర్షికలో ఉంటోంది.

మమత బెనర్జీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు బెంగాల్ రాష్ట్రంలో అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలు, దారుణాలు, దోపిడీలు మాత్రమే కాదు.. అంతకుమించి జరిగాయి. వ్యవస్థల నాశనం నిరాటకంగా సాగిపోయింది. కొంతమంది అధికారులు.. రాజకీయ నాయకులు ఇష్టానుసారంగా వ్యవహరించారు. బెంగాల్ రాష్ట్రాన్ని తమ సొంత సామంత రాజ్యంగా మార్చుకున్నారు. ఈ క్రమంలో బంగ్లాదేశ్ దేశస్థులకు ఆధార్ కార్డులు.. ఇతర ద్రువీకరణ పత్రాలు అందించారు. వాటి ద్వారా వారు మన దేశంలో ఓటు హక్కు పొందారు. ఈ మాత్రమే కాకుండా కుల దృవీకరణ పత్రాల జారీ విషయంలో కూడా మమత ప్రభుత్వం ఇష్టానుసారంగా వ్యవహరించిందని వార్తలు వస్తున్నాయి. దీనిపై బీజేపీ ప్రభుత్వం విచారణకు ఆదేశాలు జారీ చేసింది.

మమత అధికారంలో ఉన్నప్పుడు మొత్తం 1.69 కోట్ల కుల ధ్రువీకరణ పత్రాలను జారీ చేశారు. వాటిని పరిశీలించాలని ముఖ్యమంత్రి సుబేందు అధికారి. ఆదేశాలు జారీ చేశారు. మమత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రిజర్వేషన్ల అమలు సానుకూలంగా జరగలేదని.. బిజెపి పదేపదే ఆరోపించింది. ఇప్పుడు అధికారంలోకి రాగానే ప్రక్షాళన మొదలుపెట్టింది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో 2011 నుంచి 2026 వరకు దాదాపు 1.69 కోట్ల కుల దృవీకరణ పత్రాలు జారీ అయ్యాయి. వీటిలో కోటి వరకు షెడ్యూల్డ్ కులాల ద్రోపత్రాలు ఉన్నాయి. 48 లక్షల కుల దృవీకరణ పత్రాలు ఓబిసి కేటగిరికి చెందినవి ఉన్నవి. 21 లక్షల కుల దృవీకరణ పత్రాలు షెడ్యూల్డ్ తెగలకు సంబంధించినవి ఉన్నవి. ఇంత భారీ ఎత్తున కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేయడం పట్ల అవకతవకలు జరిగి ఉంటాయని ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం భావిస్తుంది. వీటన్నింటినీ కూడా జాగ్రత్తగా పరిశీలించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఒకవేళ కుల ధ్రువీకరణ పత్రాల జారీ విషయంలో ఏవైనా అక్రమాలు జరిగి ఉంటే వాటిని రద్దు చేస్తారు. అధికారుల పాత్ర ఉంటే చర్యలు తీసుకుంటారు. అర్హత లేకుండా ప్రభుత్వ ప్రయోజనాలు పొందితే కచ్చితంగా చర్యలు తీసుకుంటారు.

ఎన్టీఆర్ కి బ్యాడ్ టైమ్ నడుస్తుందా...

NTR
NTR

NTR Bad Time: తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు సాగుతుంది. జూనియర్ ఎన్టీఆర్ లాంటి నటుడు సైతం తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు సాగుతుండటం విశేషం… రాజమౌళి డైరెక్షన్లో రామ్ చరణ్ తో కలిసి చేసిన ‘త్రిబుల్ ఆర్’ సినిమా భారీ విజయాన్ని సాధించింది. అయితే ఈ సినిమా 1300 కోట్ల వరకు కలెక్షన్స్ ను రాబట్టడంతో అటు జూనియర్ ఎన్టీఆర్ ఇటు రామ్ చరణ్ ఇద్దరు కూడా పాన్ ఇండియాలో ఒక వండర్ ని క్రియేట్ చేశారు. ఈ సినిమాకి 1300 కోట్ల రూపాయల కలెక్షన్స్ వచ్చాయి. ఇక్కడ వరకు బాగానే ఉంది కానీ ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరు కలిసి నటించారు. సోలో హీరో ఎవరో ఒకరు చేసి ఉంటే అంత భారీ కలెక్షన్స్ రాకపోయి ఉండేవని కొంతమంది సినిమా మేధావులు వాళ్ల అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

నిజానికి రాజమౌళి సినిమాల్లో హీరో చాలా బాగా ఎలివేట్ అవుతుంటాడు. అందుకే అతనితో సినిమా చేయడానికి ఇండియాలో ఉన్న స్టార్ హీరోలు అందరు ఎదురు చూస్తుండటం విశేషం…ఇక ఇప్పటివరకు ఆయనతో సినిమాలు చేసిన ప్రతి ఒక్కరికి భారీ సక్సెస్ లను అందించాడు. ప్రస్తుతం మహేష్ బాబుకు సైతం ‘వారణాసి ‘ సినిమాతో భారీ విజయాన్ని కట్ట బెట్టాలని చూస్తున్నాడు.

జూనియర్ ఎన్టీఆర్ మాత్రం సోలో హీరోగా 1000 కోట్ల కలెక్షన్స్ రాబట్టే సినిమాలు చేయలేదు. ఈ మధ్యకాలంలో అతని గ్రాఫ్ కూడా బాగా తగ్గిపోతుంది. తన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా చాలా వరకు తగ్గింది అంటూ కొన్ని వార్తలైతే వస్తున్నాయి. ఇక ఏది ఏమైనా కూడా జూనియర్ ఎన్టీఆర్ ప్రూవ్ చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఇది కనక వర్కౌట్ కాకపోతే మాత్రం ఎన్టీఆర్ సినిమా కెరియర్ ప్రమాదం లో పడుతుంది. కొరటాల శివ దర్శకత్వంలో చేసిన ‘దేవర ‘ సినిమా మంచి విజయాన్ని సాధించిన కూడా ఆ సినిమాకి భారీ కలెక్షన్స్ రాలేదు.

కేవలం 600 కోట్ల వరకు మాత్రమే కలెక్ట్ చేసింది. దీనితో ఎన్టీఆర్ ఇతర హీరోలతో పోలిస్తే చాలా వరకు వెనుకబడిపోయాడని చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. వాళ్ళు అనుకున్నట్టుగానే జూనియర్ ఎన్టీఆర్ వెనుకబడిపోయాడా? లేదంటే డ్రాగన్ సినిమాతో మరోసారి తతన బ్యాడ్ టైం అంతా పోయి గుడ్ టైమ్ వస్తుందా అనేది చూడాలి…

బెర్ముడా ట్రయాంగిల్.. విమానాలు, నౌకలు అదృశ్యం.. ఇన్నాళ్లకు అసలు విషయం తెలిసింది

Bermuda Triangle Mystery
Bermuda Triangle Mystery

Bermuda Triangle Mystery: అక్కడికి వెళ్తే విమానాలు కనిపించకుండా పోతాయి. నౌకలు కూడా అదే స్థాయిలో మాయమైపోతుంటాయి. చాలామంది అక్కడ ఏదో రహస్య శక్తి ఉందని చెబుతుంటారు. అందువల్లే అక్కడికి వెళ్లడానికి కూడా భయపడుతుంటారు. పైగా అక్కడి వాతావరణం కూడా చాలా విచిత్రంగా ఉంటుంది. దీనిపై అనేక రకాల సినిమాలు వచ్చాయి. అయినప్పటికీ కూడా ఇంతవరకు ఆ రహస్యం బయటపడలేదు. అక్కడ ఏం జరుగుతుందో కూడా ప్రపంచానికి తెలియలేదు. ఇన్నాళ్లకు.. అనేక సంవత్సరాల నిరీక్షణ తర్వాత అసలు విషయం ఇప్పుడు బయటకు వచ్చింది.

అట్లాంటిక్ సముద్రంలో బెర్ముడా ట్రయాంగిల్ గురించి అందరికీ తెలుసు. అక్కడ ఒక రహస్యశక్తి ఉందని అందరూ భావిస్తుంటారు. పరిశోధకులు దీనిని కొట్టి పారేసినప్పటికీ.. దీనిపై అనేక సంవత్సరాలుగా వారు పరిశోధన సాగిస్తూనే ఉన్నారు. చివరికి ఇన్నాళ్లకు అసలు నిజం బయటపడింది.

బెర్ముడా ట్రయాంగిల్ ప్రాంతం.. అట్లాంటిక్ మహాసముద్రం కంటే ఎత్తైన ప్రదేశం గా ఉంటుంది. గడిచిన మూడు కోట్ల సంవత్సరాలుగా ఇక్కడ ఎటువంటి అగ్నిపర్వతాలు విస్పోటనానికి గురికాక పోయినప్పటికీ.. పరిసర ప్రాంతంలో సాగర గర్భం కంటే ఇవి ఎత్తైన ప్రదేశంగా కొనసాగుతున్నాయి. ఇక్కడ హవాయి వంటి అనేక అగ్నిపర్వతాల దీవుల సమూహాలు ఉంటాయి. ఇవి భూమిలో ఉన్న మాంటిల్ పొర నుంచి వచ్చిన వేడి.. దానిపై తెలియాడే రాతి భాగం పై ఏర్పడుతూ ఉంటాయి. ఈ పదార్థం అనేది పైకి వస్తున్న కొద్ది అగ్నిపర్వతాలు ఏర్పడుతుంటాయి. అందువల్ల అక్కడ సాగర గర్భం కొంచెం ఉబ్బినట్టు కనిపిస్తూ ఉంటుంది. కొంతకాలం తర్వాత ఎగువ ఉన్న పొరలో ఫలకాలు దూరం జరిగిపోతూ ఉంటాయి. దీనివల్ల అగ్నిపర్వత చర్య చల్లారిపోతూ ఉంటుంది. ఉబ్బెత్తుగా ఉన్న ప్రదేశం మళ్లీ సాధారణ స్థితికి వస్తూ ఉంటుంది. అయితే బెర్ముడాలో ఇటువంటి అద్భుతం జరగలేదు. పైగా ఈ దీవులు పరిసర ప్రాంతాల కంటే 16 అడుగుల ఎత్తైన ప్రదేశం మీద ఉన్నాయి. అయితే ఇక్కడ ఎటువంటి అగ్నిపర్వత చర్యలు లేకపోయినప్పటికీ ఆ ప్రదేశం ఇంకా ఇంకా కిందికి దిగకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

దీనిపై పరిశోధకులు దృష్టి సారించారు. భూకంపాల వల్ల ఉత్పన్నమయ్యే సైస్మిక్ తరంగాలను ఆధారంగా తీసుకున్నారు. అవి భూమి లోపల చర్చుకొని పోతూ ఉంటాయి. ఈ క్రమంలో వాటికి ఎదురయ్యే పదార్థాల సాంద్రత .. మూలకాల ఆధారంగా వాటి వేగం ఉంటుంది. ఇక బెర్ముడాలో ఉన్న భూ ప్రకంపన అధ్యయన కేంద్రంలో నమోదైన సమాచారాన్ని శాస్త్రవేత్తలు పరిశీలించారు. అయితే బెర్ముడా ట్రయాంగిల్ కింద ఉన్న 20 మైళ్ల దూరం వరకు విస్తరించిన భూ అంతర్భాగ చిత్రాన్ని వారు పరిశీలించారు. ఆ పరిశీలనలో అక్కడ భూమిపై పోరా కింద 12 మైళ్ళ మందం కలిగిన ఒక శిల లాంటి పొర కనిపించింది. అది పరిసర ప్రాంతాల్లోని మ్యాంటిల్ కంటే తక్కువ సాంద్రతను కలిగి ఉంది. దీనివల్ల అది అసాధారణ స్థాయిలో తేలియాడుతోంది. అందువల్లే బెర్ముడా ట్రయాంగిల్ తేలియాడుతూ ఉంది. ఈ రాతి పొరను అండర్ ప్లేటింగ్ అని పిలుస్తున్నారు.

ఈ రాశుల ఆదాయం ఈరోజు రెట్టింపు..

Today 24 July 2026 Horoscope
Today 24 July 2026 Horoscope

Today 17 May 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆదివారం ద్వాదశ రాశులపై కృతిక నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి అనుకూలమైన ఫలితాలు ఉండగా.. మరికొన్ని రాశుల వారు స్థిరమైన ఆదాయాన్ని పొందుతారు. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

మేష రాశి (అశ్విని, భరణి,1,2,): ఈ రాశి వారు ఈ రోజు కుటుంబ సభ్యులతో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు. వ్యాపారులకు కొత్త ప్రాజెక్టులు అందుతాయి. ఉద్యోగులు అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. వీరికి అనుకూలమైన వాతావరణం ఉండడంతో అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేయగలుగుతారు. జీవిత భాగస్వామి కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు. మానసికంగా సంతోషంగా ఉండగలుగుతారు.

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారు ఈరోజు ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు. గతంలో ఉన్న సమస్యల నుంచి బయటపడతారు. కొత్తగా పెట్టుబడులు పెట్టేందుకు పెద్దలను సంప్రదిస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. స్నేహితులతో సరదాగా ఉంటారు.

మిథున రాశి( మృగశిర 3,4 ): ఈ రాశి వారు ఈరోజు కొత్తగా వ్యాపారం ప్రారంభించడానికి అన్ని విధాలుగా ఏర్పాట్లు చేసుకుంటారు. ఇప్పటివరకు ఉన్న సమస్యల నుంచి బయటపడతారు. చట్టపరమైన చిక్కుల నుంచి బయటపడతారు. ఎవరికి డబ్బు ఇచ్చే ప్రయత్నం చేయవద్దు. ఉద్యోగులు సీనియర్ల నుంచి మద్దతు పొందడంతో అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేయగలుగుతారు. కొందరికి పదోన్నతి వచ్చే అవకాశం ఉంటుంది.

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారు ఈ రోజు మెరుగైన ఫలితాలు సాధిస్తారు. కార్యాలయంలో లేదా వ్యాపారాల్లో తమకు అనుకూలమైన వాతావరణం ఉండడంతో ప్రయోజనాలు పొందుతారు. కొత్త పరిచయాలు లాభాలు తెచ్చి పెడతాయి. నాణ్యమైన ఆహారాన్ని తీసుకునే ప్రయత్నం చేయాలి. పెద్దల ఆరోగ్యంపై నిర్లక్ష్యంగా ఉండకూడదు. స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. కొత్త వ్యాపారం కోసం సన్నాహాలు చేస్తారు.

సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. గతంలో ఉన్న ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు. ఉద్యోగులు తమ నైపుణ్య ప్రదర్శన ద్వారా అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. సొంత వాహనాలపై వెళ్లకుండా ఉండాలి. వీరికి గ్రహాల అనుకూలత ఉండటం వల్ల ఇంట్లో అన్ని శుభాలే జరిగే అవకాశం ఉంటుంది.

కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారి కుటుంబ జీవితం ఈరోజు సంతోషంగా గడుస్తుంది. స్నేహితుల సంపూర్ణ మద్దతుతో ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడుపుతారు. పూర్వీకుల ఆస్తికి సంబంధించి శుభవార్తలు వింటారు. కోర్టుకు సంబంధించిన విషయాల్లో విజయం సాధించే అవకాశం ఉంటుంది.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారు ఈ రోజు ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. కుటుంబ సభ్యులతో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. గతంలో కంటే ఇప్పుడు ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. పెట్టుబడులు పెట్టే ముందు పెద్దలను సంప్రదించడం మంచిది. సమాజంలో గౌరవం లభిస్తుంది. ఉద్యోగులకు అదనపు ఆదాయం పెరుగుతుంది. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు.

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారు ఈరోజు కుటుంబ సభ్యులతో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. సమాజంలో గౌరవం లభించడంతో అనుకున్న పనులను పూర్తి చేయగలుగుతారు. జీవిత భాగస్వామితో అన్యోన్యంగా గడుపుతారు. వ్యాపారులకు గతంలో కంటే ఇప్పుడు లాభాలు అధికంగా ఉంటాయి. కొత్తగా పెట్టుబడులు పెట్టేముందు పెద్దలను సంప్రదించడం మంచిది.

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారు ఈ రోజు పూర్వీకుల ఆస్తికి సంబంధించి శుభవార్తలు వింటారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. ఎవరికైనా డబ్బు ఇచ్చే ముందు ఆలోచించాలి. చట్టపరమైన చిక్కుల నుంచి బయటపడతారు. అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారికి గ్రహాల అనుకూలత ఉండడంతో అన్ని పనులు పూర్తవుతాయి. జీవిత భాగస్వామితో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. వ్యాపారులకు ఊహించిన దాని కంటే ఎక్కువగా లాభాలు ఉంటాయి. ఇంట్లో శుభకార్యం నిర్వహించే అవకాశం ఉంది. ప్రియమైన వారితో సంతోషంగా గడుపుతారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారు ఈ రోజు ఆహ్లాదంగా గడుపుతారు. ఏదైనా శుభకార్యం నిర్వహించాలని అనుకుంటే కుటుంబ సభ్యుల మద్దతు పొందాల్సి ఉంటుంది. జీవిత భాగస్వామి కోసం కావాల్సిన వస్తువులను కొనుగోలు చేస్తారు. స్నేహితులతో కలిసి విహార యాత్రలకు వెళ్తారు. గతంలో కంటే ఇప్పుడు సమస్యల నుంచి బయటపడతారు.

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : మీనా రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉండనున్నాయి. ఇతరులకు దానధర్మాలు చేస్తారు. పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధించడానికి ఇదే మంచి సమయం. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల మానసికంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు.

మొయినాబాద్ ఫాంహౌస్ సమీపంలో ఇద్దరు మహిళల శవాలు.. అసలేం జరిగిందంటే..

Moinabad farmhouse murders

Moinabad farmhouse murders : వారిద్దరూ మహిళలు. ఇటీవల ఇంట్లో నుంచి (వేరువేరుగా) బయటికి వెళ్లిన వారిద్దరూ మళ్లీ ఇంటికి రాలేదు. ఏం జరిగిందో తెలియదు. కుటుంబ సభ్యులు అన్నిచోట్లా వెతికారు. బంధువులకు ఫోన్ చేసి కనుక్కున్నారు. అయినప్పటికీ ఉపయోగం లేదు. చివరికి వారు వినకూడని వార్త విన్నారు. జరగకూడని దారుణాన్ని చూశారు.

తెలంగాణ రాష్ట్రంలోని తాండూరులో ఇద్దరు మహిళలు కనిపించకుండా పోయారు. వారిద్దరూ వృద్ధులే. చివరికి వారు విగత జీవులుగా మారారు. బషీర్బాద్ పోలీస్ స్టేషన్లో ఒకరు.. యాలాల్ పరిధిలో మరొకరు అదృశ్యమయ్యారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం తోల్కట్ట అటవీ ప్రాంతంలో వారిద్దరి విగత దేహాలు కనిపించాయి. అయితే వారిద్దరిని తాండూర్ నుంచి మొయినాబాద్ తీసుకువచ్చి.. అక్కడ ఎవరూ లేని ప్రదేశంలో దారుణానికి పాల్పడి ఉంటారని.. తర్వాత వారి విగతదేహాలను పూడ్చిపెట్టి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

చనిపోయిన వారిలో బషీరాబాద్ మండలం ఖాసీంపూర్ గ్రామానికి చెందిన అంగన్వాడి ఆయా ఆబేద, తాండూరు ఇందిరమ్మ కాలనీ చెందిన మహబూబ్ బేగం గా పోలీసులు గుర్తించారు. అయితే నిందితులు ఒకేసారి ఈ ఘోరానికి పాల్పడలేదు. సరిగా రెండు నెలల క్రితం ఒక వృద్ధురాలిని అంతం చేశారు. ఆమె విగత దేహాన్ని పూడ్చిపెట్టారు. అనంతరం మరో వృద్ధురాలిని కూడా ఐదు రోజుల క్రితం అంతం చేశారు. ఆమె మిగతాదేహాన్ని కూడా అలానే పూడ్చిపెట్టారు.

ఈ వ్యవహారంలో చనిపోయిన ఒక మహిళ భర్త హస్తంతో పాటు.. స్థానికంగా ఒక ఫామ్ హౌస్ సెక్యూరిటీ గార్డ్ గా వ్యవహరించే వ్యక్తి పాత్ర ఉందని పోలీసులు గుర్తించారు. వారిని అంతం చేసిన తర్వాత విగత దేహాలను మోయినాబాదులోని ఓ వ్యవసాయ క్షేత్రం వెనుక వైపు ఉన్న ప్రాంతంలో పూడ్చిపెట్టారు.. అయితే ఎందుకు వారిని అంతం చేశారు?.. డబ్బు కోణంలోనా? ఇంకా మరి ఏదైనా కారణం ఉందా? అనే విషయాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

బండి భగీరథ్.. ఈ పని ఎప్పుడో చేయాల్సింది..

Bandi Bhagirath Case
Bandi Bhagirath Case

Bandi Bhagirath : సాక్ష్యాలు అనుకూలంగా ఉంటాయనుకున్నారు. నిరంజన్ రెడ్డి లాంటి లాయర్ వాదిస్తాడని భావించారు. ఎలాగైనా సరే బెయిల్ లభిస్తుందని గట్టి నమ్మకంతో ఉన్నారు. కానీ అవి ఏవీ జరగలేదు. పైగా న్యాయస్థానాలలో అడుగడుగునా చుక్కెదురైంది. పైగా ఇవన్నీ కూడా రాజకీయంగా ఒత్తిడి కలిగిస్తున్న నేపథ్యంలో తప్పలేదు.. తప్పుకునే అవకాశం లేదు. మొత్తంగా ఇన్ని రోజులపాటు కనిపించకుండా పోయిన బండి భగీరథ్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు.

ఈ చట్టం మీద.. ఈ వ్యవస్థ మీద నమ్మకము కచ్చితంగా ఉన్నప్పుడు.. బెయిల్ కోసం కాకుండా.. ముందుగానే పోలీసుల ఎదుట లొంగిపోయి ఉంటే చాలా బాగుండేది. పైగా అతడి మీద జనాలకు సింపతీ కూడా పెరిగేది. అవన్నీ కాదనుకొని.. ఒక అమ్మాయి తన మీద చేసిన ఆరోపణలకు స్పష్టమైన సమాధానం చెప్పలేకుండా.. పైగా ఆమెకు కౌంటర్గా పోలీస్ కేసులు కూడా పెట్టి.. తన స్థాయి నిరూపించుకున్నాడు భగీరథ్. కానీ ఇక్కడే అతడు తప్పు చేశాడు. ఎందుకంటే ఆమె తాను మైనర్ అని పదేపదే చెప్పింది. ఈ క్రమంలో అత్యంత కఠినమైన కేసు అతని మీద నమోదయింది. రాజకీయంగా కూడా ఈ వ్యవహారం దుమారం రేపడంతో.. రేవంత్ రెడ్డి స్వయంగా కల్పించుకొని ప్రత్యేకంగా దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత బండి భగీరథ్ వ్యవహారం రోజుకో మలుపు తిరిగింది.

నిరంజన్ రెడ్డి లాంటి ఖరీదైన లాయర్ ను నియమించుకున్నప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. దీంతో భగీరథ్ కు అన్ని దారులు మూసుకుపోయాయి. గత్యంతరం లేక.. ఏం చేయాలో తెలియక పోలీసుల ముందు లొంగిపోయాడు. వాస్తవానికి ఈ పని గనుక అతడు ముందే చేసి ఉంటే ఇక్కడిదాకా వచ్చేది కాదు.

తను ఒక కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కొడుకు. పైగా తన తండ్రి ఆ స్థాయికి రావడానికి చాలా కష్టపడ్డాడు. ఆ విషయం తెలిసి కూడా భగీరథ్ ఇలా చేయడం అత్యంత దారుణం. ఇప్పటికే భగీరథ్ చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఆయన తండ్రి ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ కూడా ఇబ్బంది పడుతోంది. ఇలాంటి అప్పుడు తనకు తల వంపులు తెచ్చిన తనయుడిని జైలుకు పంపించడమే మంచిది. లేకపోతే బండి సంజయ్ ఇంకా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. ప్రత్యేకించి గులాబీ పార్టీ సోషల్ మీడియా నుంచి.. ఆ పార్టీ కార్యకర్తల నుంచి..

పావలా శ్యామల కు దిల్ రాజు భారీ ఆర్ధిక సాయం.. ఎంత ఇచ్చాడంటే..

Pavala Shyamala
Pavala Shyamala

Pavala Shyamala: నేడు ఉదయం నిద్రలేవగానే , మన టాలీవుడ్ లో సీనియర్ కమెడియన్ పావలా శ్యామల పరిస్థితి చూసి కంటతడి పెట్టుకొనే ఉండుంటాము. ఎన్నో వందల సినిమాల్లో కమెడియన్ గా నటించి , తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ని సంపాదించుకున్న పావలా శ్యామల, దిక్కు తోచని అనాధ లాగా, కూకట్ పల్లి వై జంక్షన్ వద్ద సైడ్ ప్లాట్ ఫార్మ్ వద్ద కూర్చోవడం, ఆమె దయనీయమైన పరిస్థితి ని చూసిన స్థానికులు , వెంటనే పోలీసులకు సమాచారం అందించడం , పోలీసులు ఆమెని ఫౌండేషన్ కి పంపించడం వంటివి జరిగాయి. సోషల్ మీడియా లో దీనికి సంబంధించిన వీడియోలు బాగా వైరల్ అవ్వడంతో, ఎవరైనా సినీ ప్రముఖులు స్పందించి , ఈమెకు సహాయం చేస్తే బాగుటుందని కోరుకున్నాం. సరిగా అదే జరిగింది , ప్రముఖ నిర్మాత దిల్ రాజు స్పందించి , పావలా శ్యామల కి ఆర్ధిక సాయం అందించాడు.

పావలా శ్యామల ని , ఆమె కూతుర్ని ఒక రూమ్ కి తరలించి , వారికి అన్ని రకాల సౌకర్యాలు సమకూర్చాడు. దీంతో పావలా శ్యామల దిల్ రాజు కి కృతఙ్ఞతలు తెలియజేసింది. అనంతరం ఆమె కూతురు మాట్లాడుతూ దిల్ రాజు గారు చేసిన మేలుని మేము జీవితం లో ఎప్పటికీ మరచిపోలేము , రాజు గారికి మా కష్టం చెప్పుకుంటే కచ్చితంగా సహాయం చేస్తాడని మా అమ్మ ఎన్నో ఇంటర్వ్యూస్ లో చెప్పుకొచ్చింది. మా కష్టాలు ఇప్పటికీ మీ దృష్టికి వచ్చాయి , మీరు మాకు దేవుడితో సమానం అంటూ పావలా శ్యామల కూతురు చెప్పుకొచ్చింది. దిల్ రాజు చేసిన ఈ సహాయం పై సోషల్ మీడియా లో నెటిజెన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. చాలా వరకు దిల్ రాజు పై ఎక్కువగా నెగెటివిటీ ఉంటుంది. కానీ ఈ ఒక్క సంఘటన తో ఆయన నెటిజెన్స్ దృష్టిలో హీరో అయిపోయాడు .

'అగ్నిపరీక్ష 2' ప్రారంభం తేదీ వచ్చేసింది.. ఈసారి టీవీ టెలికాస్ట్ కూడా.. పూర్తి వివరాలు మీకోసం..

Bigg Boss Agnipariksha 2
Bigg Boss Agnipariksha 2

Bigg Boss Agnipariksha 2: ప్రతీ ఏడాది స్టార్ మా ఛానల్ లో ప్రసారమయ్యే బిగ్ బాస్ రియాలిటీ షో కోసం ప్రేక్షకులు ఎంత ఆతృతగా ఎదురు చూస్తారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కానీ గత ఏడాది ప్రసారమైన ‘బిగ్ బాస్ 9’ మాత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకర్షించింది. అందుకు కారణం ‘అగ్నిపరీక్ష’ షో ద్వారా సామాన్యులను బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకొని రావడం , వాళ్ళు అద్భుతమైన కంటెంట్ ఇవ్వడం , ఆ కారణం చేత ఒకరు టైటిల్ విన్నర్ గా నిలవడం , మరో సామాన్యుడు టాప్ 3 గా నిలవడం , ఇలాంటి సంఘటనలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాయి. ఈ కాన్సెప్ట్ పెద్ద హిట్ అవ్వడం తో , రెండవ సీజన్ పై అంచనాలు ఎవ్వరూ ఊహించని రేంజ్ కి చేరుకున్నాయి. ఈ ఏడాది మొదలై 5 నెలలు పూర్తి కావొస్తుంది , కానీ ఇప్పటి వరకు ఈ సీజన్ పై ఎలాంటి అప్డేట్ రాకపోవడం తో అసలు ‘అగ్ని పరీక్ష 2’ ఉందా లేదా అనే సందేహాలు వ్యక్తం అయ్యాయి.

కానీ మీరు అందరూ ఎదురు చూస్తున్న అప్డేట్ త్వరలోనే రాబోతుంది. ఈ సీజన్ జూన్ నెలాఖరు నుండి మొదలు కాబోతుంది అట. ఈ నెలలో ‘అగ్ని పరీక్ష 2’ కి సంబంధించిన ప్రోమో షూటింగ్ కూడా చేయబోతున్నారట. ఈసారి పోటీ భారీ రేంజ్ లో ఉంటుంది కాబట్టి, టాస్కులు కూడా చాలా కఠినంగా డిజైన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఏ రియాలిటీ షో లో కూడా చూడని రేంజ్ టాస్కులను ఈ షో లో డిజైన్ చేస్తున్నారట. ఇక జడ్జీలుగా ఈసారి వేరే వాళ్ళని తీసుకునే అవకాశం ఉంది. గత సీజన్ లో వచ్చిన నవదీప్ కొనసాగే అవకాశం ఉందట, అదే విధంగా బిగ్ బాస్ సీజన్ 9 టైటిల్ విన్నర్ కళ్యాణ్ పడాల కూడా ఈ షో లో పాల్గొనబోతున్నట్టు తెలుస్తుంది.

అయితే ఆయన జడ్జీ గా కాదు , టీం లీడ్ గా ఉంటారట. ఆడిషన్స్ ద్వారా ఎంపికైన కంటెస్టెంట్స్ ని నాలుగు టీమ్స్ గా చేసి , వాటికి టీం లీడ్స్ ని కూడా పెట్టబోతున్నారట. అందులో ఒక టీం కి కళ్యాణ్ పడాల, మరో టీం కి తనూజ , మిగిలిన రెండు టీమ్స్ కి కూడా గత సీజన్ కి సంబంధించిన వాళ్ళే ఉంటారని తెలుస్తుంది. ఇకపోతే శివాజీ ఈ సీజన్ లో ఒక జడ్జీగా వ్యవహరించబోతున్నట్టు టాక్. కనీవినీ ఎరుగని రీతిలో చాలా గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారట మాకెర్స్. ఈ సీజన్ కేవలం హాట్ స్టార్ లో మాత్రమే కాకుండా, టీవీ లో కూడా టెలికాస్ట్ చేయబోతున్నట్టు సమాచారం.

యూఏఈ తో భారత్ చారిత్రాత్మక ఇంధన ఒప్పందం.. కడుపు మంటతో చస్తున్న పాకిస్తాన్..

India UAE Energy Deal
India UAE Energy Deal

India UAE Energy Deal: పాకిస్తాన్ దేశస్థులను తన్ని తన్ని తరిమేస్తోంది కదా యూఏఈ.. చివరికి ఇచ్చిన అప్పు కూడా ముక్కు పిండి వసూలు చేసింది కదా.. దీంతో యూఏఈ మీద కడుపు మంటతో రగిలిపోతుంది పాకిస్తాన్. అంతర్జాతీయంగా ఒత్తిడి తీసుకురాలేదు. అమెరికాతో చెప్పి ఇబ్బంది పెట్టలేదు. చైనాతో చెప్పుకొని అణిచి వేయలేదు. కడుపు ఉబ్బరంతో రగిలిపోవడం తప్ప.. ఏమి చేయలేదు.

శత్రువుకు శత్రువు మనకు మిత్రుడు అన్నట్టుగా.. పాకిస్తాన్ దేశాన్ని తన్ని తరిమేస్తున్న యూఏఈ తో భారత్ స్నేహ హస్తాన్ని చాచింది. అంతేకాదు దోస్త్ మేరా దోస్త్ అంటూ పాటలు పాడుతుంది. తాజాగా యూఏఈ తో అత్యంత కీలకమై ఇంధన ఒప్పందాన్ని భారత్ కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం అబుదాబిలోని పెట్రోలియం రిజర్వ్ లో దాదాపు మూడు కోట్ల బ్యారెళ్ల వరకు చమురు నిల్వచేసే అవకాశం భారతదేశపు ఏర్పడింది. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ ఆల్ నహియాన్ మధ్య చర్చలు జరిగాయి. ఈ చర్చలు అబుదాబి వేదికగా సాగాయి. ఆ తర్వాత రెండు దేశాల అధిపతులు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. పశ్చిమ ఆసియా ప్రాంతంలో పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు.. ఇతర పరిస్థితులను అంచనా వేసి భారత్ ఈ నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో.. అవి భారత దేశ ఆర్థిక వ్యవస్థకు తీవ్ర ఇబ్బందికరంగా మారిన క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

పశ్చిమ ఆసియా లో యుద్ధం తర్వాత అన్ని దేశాలు పొదుపు చర్యలు పాటిస్తున్నాయి. అయితే ఏ దేశం కూడా ఈ స్థాయిలో గల్ఫ్ దేశాలతో ఆర్థిక ఒప్పందాలు కుదుర్చుకోలేదు. ఈ విషయంలో భారత్ ప్రపంచ దేశాల కంటే ముందుగానే తొలి అడుగు వేసింది. తద్వారా భవిష్యత్తు కాలంలో వచ్చే ఇబ్బందులను ముందుగానే అంచనా వేసింది. మూడు కోట్ల బ్యారెళ్ళ చమురు ను నిల్వ చేయడం భారతదేశానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. కేవలం ముడి చమురు మాత్రమే కాకుండా గ్యాస్ నిల్వలు.. ఎల్పిజి సరఫరా.. రక్షణ సహకారం.. ఇంకా అనేక విషయాలు మీద ఒప్పందాలు జరిగాయి. ఈ ఒప్పందాలు మనకు లాభం చేకూర్చితే.. పొరుగున ఉన్న పాకిస్తాన్ దేశానికి కడుపుమంట రగిలిస్తున్నాయి.

గల్ఫ్ లో యుద్ధం తర్వాత.. ఇరాన్ దాడులు చేసిన తర్వాత యూఏఈ మనస్తత్వం పూర్తిగా మారిపోయింది. గతంలో మన దేశంతో వాణిజ్యం విషయంలో ఊహించిన స్థాయిలో దూకుడును ఆ దేశం కొనసాగించలేకపోయింది. ఎప్పుడైతే ఇరాన్ తమ మీద దాడులు చేసిందో.. అప్పుడే యూఏఈ పూర్తిగా మనసు మార్చుకుంది. ట్రేడ్.. ఇతర ఒప్పందాలను కుదుర్చుకునే పనిలో పడింది. అందువల్లే భారతదేశంతో స్నేహ హస్తాన్ని చాచింది. దీనివల్ల భారత్ భవిష్యత్తు కాలంలో వచ్చే ఇబ్బందులను.. సమస్యలను సులభంగానే ఎదుర్కునే అవకాశం ఉంది.

మెగాస్టార్ తో రేణు దేశాయ్.. సంచలనం రేపుతున్న లేటెస్ట్ పోస్ట్..

Renu Desai
Renu Desai

Renu Desai: సోషల్ మీడియా నిత్యం యాక్టీవ్ గా ఉండే సినీ సెలబ్రిటీస్ లో ఒకరు రేణు దేశాయ్. హీరోయిన్ గా, మోడల్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా మాత్రమే కాకుండా, ఈమెకు ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి గా నెటిజెన్స్ లో బాగా గుర్తింపు ఉంది. అయితే సోషల్ మీడియా లో తన అభిప్రాయాలను వ్యక్తపరిచినప్పుడు ఒక సెక్షన్ ఆడియన్స్ ఈమెపై తీవ్రమైన నెగెటివిటీ చూపించడం వంటివి గతంలో మనం చాలానే చూశాము . అందుకు రేణు దేశాయ్ చాలా అసహనానికి గురి అవుతూ ఉండేది. అందుకే ఇన్ స్టాగ్రామ్ లో తన పోస్టులకు కామెంట్ సెక్షన్ బ్లాక్ చేసింది. ఇకపోతే నేడు మెగాస్టార్ తో కలిసి దిగిన ఒక ఫోటోని ఆమె ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేయగా, అది బాగా వైరల్ అయ్యింది. మెగాస్టార్ అంటే మన టాలీవుడ్ మెగాస్టార్ కాదు , మలయాళం మెగాస్టార్ మమ్ముటి.

ఆయన్ని షూటింగ్ సెట్స్ లో కలిసిన సందర్భంగా తన ఆనందాన్ని పంచుకుంటూ ‘ఇది నాకు ఒక క్రేజీ ఫ్యాన్ మూమెంట్ అని చెప్పొచ్చు. మమ్ముటి లాంటి లెజెండ్ తో కాస్త సమయం గడిపినా నా జన్మ ధన్యం అవుతుంది , ఒక్కసారైనా ఈ మూమెంట్ వస్తే బాగుండును అని నా జీవితం లో ఒక కోరిక ఉండేది , అది నేటితో నిజమైంది. ఆయన లాంటి గొప్ప మనసు ఉన్న వ్యక్తిని నా జీవితం లో ఇప్పటి వరకు కలవలేదు’ అంటూ ఆమె మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఆమె వ్యాఖ్యలకు సోషల్ మీడియా లో నెటిజెన్స్ సపోర్ట్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. మాకు కూడా మీలాటి అదృష్టం దొరికి ఉండుంటే బాగుండేది అంటూ మమ్మూటీ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియా లో బాగా వైరల్ అయినటువంటి ఆ వీడియో ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి.

 

View this post on Instagram

 

A post shared by renu desai (@renuudesai)

ఓటీటీ లో 'ధురంధర్ 2' కి వందల కోట్ల నష్టాలు.. మేకర్స్ పెద్ద పొరపాటు చేశారు..

Dhurandhar 2 OTT
Dhurandhar 2 OTT

Dhurandhar 2 OTT: బాక్స్ ఆఫీస్ వద్ద ‘ధురంధర్’ సిరీస్ సృష్టించిన ప్రభంజనం ని అంత తేలికగా ఎవ్వరూ మర్చిపోలేరు. ఎలాంటి అంచనాలు లేకుండా, చాలా సాధారణంగా విడుదలైన ‘ధురంధర్’ చిత్రం, సినిమాటిక్ అనుభూతికి పరాకాష్ట లాంటిది. ఒక సినిమాని ఎంత అద్భుతంగా తియ్యాలి , ఎంత ఎంగేజింగ్ గా తియ్యాలి , స్క్రీన్ ప్లే తో ఎలా ప్రేక్షకులను కట్టిపారేయొచ్చు వంటి విభాగాల్లో , ఫిలిం స్కూల్స్ కోచింగ్ కోసం ఈ చిత్రాన్ని విద్యార్థులకు చూపించవచ్చు. అలాంటి వెండితెర అద్భుతం ఇది. అందుకే ఆడియన్స్ ఈ చిత్రాన్ని నెత్తిన పెట్టుకొని ఆదరించారు కేవలం హిందీ వెర్షన్ తోనే 1380 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను కొల్లగొట్టింది. ఇక భారీ అంచనాల నడుమ విడుదలైన ‘ధురంధర్ 2’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషలకు కలిపి 1870 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

ఇప్పటికీ కూడా ఈ చిత్రం థియేటర్స్ లో రన్ అవుతూనే ఉంది. అయితే 50 రోజులు పూర్తి అయ్యాక ఓటీటీ లో విడుదల చేయాలి కాబట్టి , రీసెంట్ గానే ఈ చిత్రాన్ని నెట్ ఫ్లిక్స్ లో విడుదల చేశారు. ఈ నెల 15 వ తారీఖు నుండి ఈ చిత్రం తెలుగు , తమిళం , హిందీ , మలయాళం , కన్నడ భాషల్లో అందుబాటులోకి వచ్చింది. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే, ఇది కేవలం ఓవర్సీస్ ఆడియన్స్ కి మాత్రమే అందుబాటులో ఉంటుంది, ఇండియన్ ఆడియన్స్ కి అందుబాటులోకి రావడం కష్టం. ఎందుకంటే ఇండియా లో ఈ చిత్రం కేవలం జియో హాట్ స్టార్ లోనే అందుబాటులోకి రానుంది. ముందుగా ఈ నెల 15 నే ఈ చిత్రాన్ని హాట్ స్టార్ లో విడుదల చేద్దామని అనుకున్నారు. కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల , ఈ సినిమా జూన్ 4 కి వాయిదా పడింది.

దీంతో ఈ చిత్రాన్ని మన పైరసీ రాయుళ్లు ఓవర్సీస్ నుండి HD ప్రింట్ డౌన్ లోడ్ చేసి ఇంటర్నెట్ లో పెట్టేశారు. అత్యధిక శాతం ఇండియన్ ఆడియన్స్ ఇంటర్నెట్ లో ఈ చిత్రాన్ని ఇప్పుడు చూసేస్తున్నారు. ఇలా జరగడం వల్ల, జియో హాట్ స్టార్ సంస్థకు నష్టం వందల కోట్లలోనే ఉంటుందని , ఒకేసారి విడుదల చేయకుండా చాలా పెద్ద తప్పు చేశారని సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే నెట్ ఫ్లిక్స్ లో ఓవర్సీస్ ఆడియన్స్ ఈ చిత్రాన్ని ఎగబడి చూస్తున్నారట. ముఖ్యంగా పాకిస్థాన్ దేశం లో ఒక్కసారిగా అందరూ ఈ చిత్రం ఓపెన్ చేయడం తో నెట్ ఫ్లిక్స్ ఆ దేశం లో కొంతసేపు క్రాష్ అయ్యిందని అంటున్నారు.

'పెద్ది' ట్రైలర్ లో విచిత్రమైన లుక్ లో జగపతి బాబు.. వీడియో వైరల్..

Jagapathi Babu Look In Peddi
Jagapathi Babu Look In Peddi

Jagapathi Babu Look In Peddi: సుకుమార్ స్కూల్ నుండి వచ్చే ప్రతీ డైరెక్టర్, కథ కంటే ఎక్కువగా క్యారెక్టర్స్ కి ప్రాధాన్యం ఇస్తుంటారు. సుకుమార్ తన శిష్యులకు అదే నేర్పించాడు. ముఖ్యంగా ఆయన ప్రియా శిష్యుడు బుచ్చి బాబు గురువు ని తూచా తప్పకుండ అనుసరించే మనిషి. సుకుమార్ ఏ విధంగా అయితే క్యారెక్టర్స్ కి ప్రాధాన్యత ఇస్తాడో , బుచ్చి బాబు కూడా అదే విధంగా ప్రాధాన్యత ఇస్తాడు. మొదటి సినిమా ‘ఉప్పెన’ తోనే తన మార్క్ ఏంటో అందరికీ చూపించాడు. ఇప్పుడు ‘పెద్ది’ కి కూడా ఆయన అదే ఫార్ములా ని అనుసరించాడు. ఈ చిత్రంలో కేవలం రామ్ చరణ్ క్యారెక్టర్ ఒక్కటే కాదు , ప్రతీ క్యారెక్టర్ కూడా హైలైట్ అవ్వబోతుంది అని హింట్స్ ఇస్తున్నాడు. ఎల్లుండి ట్రైలర్ లో చూపించబోయే క్యారెక్టర్స్ అన్నిటిని ఆయన రోజు కి ఒకటి రివీల్ చేస్తూ వస్తున్నాడు.

ముందుగా ఈ చిత్రం లో రామ్ చరణ్ కుస్తీ గురువు గా నటించిన శివరాజ్ కుమార్ క్యారెక్టర్ ని పరిచయం చేశారు, ఆ తర్వాత మీర్జాపూర్ ఫేమ్ దివ్యేన్డు క్యారెక్టర్ ని పరిచయం చేశారు , ఇక నేడు ఈ చిత్రం లో కీలక పాత్ర పోషిస్తున్న జగపతి బాబు క్యారెక్టర్ ని పరిచయం చేశాడు . చాలా రోజుల క్రితమే జగపతి బాబు కి సంబంధించిన ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. ఇందులో ఆయన ‘అప్పలసూరి’ అనే క్యారెక్టర్ చేస్తున్నాడు. జగపతి బాబు మేక్ ఓవర్ ని చూసి అందరూ ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. అసలు చిన్నప్పటి నుండి మనం చూస్తూ పెరిగిన జగపతి బాబు ఈయనేనా?, ఇలా ఉన్నదేంటి?, బయటకు ఆయన ఆ గెటప్ లో వస్తే ఎవ్వరూ గుర్తు పట్టలేరు అంటూ కామెంట్స్ చేశారు అప్పట్లో.

అయితే నేడు ఆయన క్యారెక్టర్ కి సంబంధించిన వీడియో ని విడుదల చేయగా , ఈ క్యారెక్టర్ కోసం ఆయన ఎంత కష్టపడ్డాడో అర్థం అవుతోంది. ముందుగా ఆ గెటప్ ని చూసి అందరూ విలన్ క్యారెక్టర్ అనుకున్నారు , కానీ ఆయన తన ఊరి సమస్యల కోసం పోరాడే వ్యక్తిగా కనిపించబోతున్నాడని ఈరోజు విడుదల చేసిన గ్లింప్స్ ని చూస్తే తెలుస్తోంది. కచ్చితంగా ఆయన కెరీర్ లో ఈ క్యారెక్టర్ ఒక ల్యాండ్ మార్క్ లాగా మిగిలిపోతుంది అనడం లో ఎలాంటి సందేహం లేదు. జూన్ 4 న విడుదల అవ్వబోతున్న ఈ సినిమాని చూసి జనాలు రామ్ చరణ్ క్యారెక్టర్ గురించి ఏ రేంజ్ లో మాట్లాడుకుంటారో , జగపతి బాబు క్యారెక్టర్ గురించి కూడా అదే రేంజ్ లో మాట్లాడుకుంటారని అంటున్నాడు డైరెక్టర్ బుచ్చి బాబు. ఇక సోషల్ మీడియా లో బాగా వైరల్ అయినటువంటి ఈ వీడియో ని మీరు కూడా చూసేయండి.

'పెద్ది' కి రెహమాన్ అందించిన సంగీతం నాకు నచ్చలేదు అంటూ డైరెక్టర్ బుచ్చి బాబు హాట్ కామెంట్స్..

Buchi Babu
Buchi Babu

Buchi Babu: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘పెద్ది’ వచ్చే నెల 4 న ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్లో గ్రాండ్ గా విడుదల అవ్వబోతున్న సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషనల్ కార్యక్రమాలను వేగవంతం చేసింది మూవీ టీం. అందులో భాగంగా డైరెక్టర్ బుచ్చి బాబు రీసెంట్ గా వరుసపెట్టి ఇంటర్వ్యూస్ ఇవ్వడం మొదలు పెట్టాడు. ఈ ఇంటర్వ్యూస్ లో ఆయన సినిమా గురించి మాట్లాడిన కొన్ని ఆసక్తికరమైన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ముఖ్యంగా సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ గురించి బుచ్చి బాబు చెప్పిన మాటలు వింటే , ఇంత స్థాయికి ఎదిగిన వాళ్ళు , ఇంత డౌన్ టు ఎర్త్ ఉంటారా అని అనిపించక తప్పదు. కొద్దిగా ఫేమ్ రాగానే అతి చేసే సెలబ్రిటీలు , బుచ్చి బాబు రెహమాన్ గురించి చెప్పిన ఈ మాటలు వింటే మారుతారు అనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఆయన మాట్లాడుతూ ‘పెద్ది మ్యూజిక్ సిట్టింగ్స్ కోసం రెహమాన్ గారి ఇంటికి వెళ్ళాము. ఆయన మా కోసం అప్పటికే మూడు ట్యూన్స్ రెడీ చేసి ఉంచాడు. వాటిల్లో మొదటి ట్యూన్ వినగానే నచ్చలేదు సార్ అని చెప్పాను, అవునా , అయితే రెండవ ట్యూన్ విను అన్నాడు , అది కూడా బాగాలేదు అని చెప్పాను , పోనీ మూడవ ట్యూన్ విను అని అన్నాడు , అది కూడా నచ్చలేదు అని మొహమాటం లేకుండా చెప్పాను. అవునా, సరే ఇలా కూర్చో , కొత్తది చేద్దాం అనేవారు. నాకు అలా నచ్చలేదు అని ముఖం మీదనే చెప్పడం కరెక్ట్ కాదు అనే విషయం నాకు తెలియదు , నా పక్కన ఉన్న నలుగురు అలా మాట్లాడకూడదు అని చెప్తే, అబ్బా చాలా పెద్ద తప్పు చేశానే అని అనుకున్నాను. ఆ తర్వాత రెహమాన్ గారికి క్షమాపణలు చెప్పడానికి వెళ్తే, నువ్వు వెయ్యి సార్లు రిజెక్ట్ చేసిన నేను ఏమి అనుకోను, మీరు సంతృప్తి చెందడమే నాకు కావాలి అన్నాడు’ అంటూ బుచ్చి బాబు చెప్పుకొచ్చాడు.

కేవలం ఒక్కటంటే ఒక్క సినిమా అనుభవం ఉన్న డైరెక్టర్ బుచ్చి బాబు. అలాంటి డైరెక్టర్ , ఆస్కార్ విజేత అందించిన మ్యూజిక్ ని రిజెక్ట్ చేసినప్పటికీ, చిరాకు పడకుండా , అతన్ని పూర్తిగా సంతృప్తి పరిచేంత వరకు ట్యూన్స్ ఇస్తూనే ఉన్నాడంటే , రెహమాన్ గొప్పతనం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటి మ్యూజిక్ డైరెక్టర్స్ లో కొంతమందికి టాలెంట్ ఉన్నప్పటికీ కూడా యాటిట్యూడ్ ఎక్కువగా ఉంటుంది , అందుకే వాళ్ళ కెరీర్ కేవలం కొంత కాలం వరకే పరిమితం అవుతుంది , రెహమాన్ లాంటోళ్ళు దశాబ్దాల తరబడి ఇప్పటికీ టాప్ సినిమాలకు సంగీతం అందిస్తున్నారంటే కారణం , వాళ్ళ ప్రవర్తన, ఓపిక , సహనం అని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం ఏమి ఉంటుంది.

4 నిమిషాల 35 సెకండ్ల విధ్వంసం.. ఎన్టీఆర్ 'డ్రాగన్' మూవీ గ్లింప్స్ హైలైట్స్ ఇవే..

NTR Dragon Movie
NTR Dragon Movie

NTR Dragon Movie: జూనియర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా , ఈ నెల 20 న ఆయన హీరో గా నటిస్తున్న ‘డ్రాగన్’ మూవీ కి సంబంధించిన గ్లింప్స్ వీడియో ని విడుదల చేయబోతున్న సంగతి తెలిసిందే . కాసేపటి క్రితమే మూవీ టీం ‘APOCALYPSE’ అంటూ ఒక ట్వీట్ వేసింది. అంటే ‘ప్రపంచం మొత్తం నాశనం అవ్వబోతుంది’ అని దాని అర్థం. ఎన్టీఆర్ క్యారక్టర్ తాలూకు పవర్ ఫుల్ నేచర్ ని వివరించేందుకే ఈ పదాన్ని ఉపయోగించారు. అయితే ఇప్పటి వరకు టీజర్ , గ్లింప్స్ వీడియోస్ వంటివి కేవలం నిమిషం నిడివి తో , లేదా 2 నిమిషాల నిడివి తో విడుదల చేసేవారు. కానీ ‘డ్రాగన్’ గ్లింప్స్ వీడియో నిడివి ఏకంగా 4 నిమిషాల 35 సెకండ్లు ఉండబోతుంది అట. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీ లోనే ఇంత లెంగ్త్ తో ఇప్పటి వరకు ఒక్క గ్లింప్స్ కూడా రాలేదు.

ఈ నాలుగు నిమిషాల వీడియో లో ఎన్టీఆర్ మాస్ విద్వంసాన్ని ప్రశాంత్ నీల్ తన స్టైల్ లో చూపించాడట. ఎన్టీఆర్ లుక్ కూడా చాలా పవర్ ఫుల్ గా ఉండబోతుందని , ఇప్పటి వరకు ఏ డైరెక్టర్ కూడా ఆయన్ని ఈ విధంగా చూపించలేకపోయారని అంటున్నారు. ప్రశాంత్ నీల్ టీజర్ , గ్లింప్స్ వీడియోస్ తోనే విస్ఫోటనం సృష్టించడం లో దిట్ట. ఆయన మొదటి చిత్రం ‘కేజీఎఫ్’ టీజర్ విడుదల అయ్యినప్పుడు కూడా ఇంతే. అప్పటి వరకు కన్నడ ప్రజలకు తప్ప, ఈ ప్రశాంత్ నీల్ , యాష్ వంటి వారు ఎవరికీ తెలియదు. కానీ ఈ సినిమా టీజర్ విడుదల తర్వాత ప్రపంచం మొత్తం దాని గురించే మాట్లాడుకోవడం జరిగింది. అది ప్రశాంత్ నీల్ విజన్ రేంజ్, ఇక కేజీఎఫ్ సీక్వెల్ టీజర్ తో కూడా ఆయన సృష్టించిన సునామీ మామూలుది కాదు.

ఆ తర్వాత విడుదలైన ‘సలార్’ టీజర్ కూడా మూవీ లవర్స్ ని విపరీతంగా ఆకట్టుకొని , అంచనాలను భారీగా పెంచేలా చేసింది. ఇక జూన్ 20 న విడుదల చేయబోయే ‘డ్రాగన్’ గ్లింప్స్ , ప్రశాంత్ నీల్ కెరీర్ లోనే ది బెస్ట్ గా ఉండబోతుందని అంటున్నారు. అంటే ఏ రేంజ్ లో ఉండబోతుందో ఊహించుకోవచ్చు. ఇప్పటికే ఈ చిత్రం పై అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి, ఇక ఈ గ్లింప్స్ వీడియో విడుదల అయ్యాక ఆ అంచనాలు ఏ రేంజ్ కి చేరుకుంటాయో చూడాలి. ఇకపోతే ఈ చిత్రం లో హీరోయిన్ గా రుక్మిణి వసంత్ నటిస్తోంది. ప్రస్తుతానికి షూటింగ్ కి తాత్కాలిక విరామం ఇచ్చారు. త్వరలోనే భారీ షెడ్యూల్ ని ప్లాన్ చేయబోతున్నారు మేకర్స్.