Dhurandhar 2 OTT: బాక్స్ ఆఫీస్ వద్ద ‘ధురంధర్’ సిరీస్ సృష్టించిన ప్రభంజనం ని అంత తేలికగా ఎవ్వరూ మర్చిపోలేరు. ఎలాంటి అంచనాలు లేకుండా, చాలా సాధారణంగా విడుదలైన ‘ధురంధర్’ చిత్రం, సినిమాటిక్ అనుభూతికి పరాకాష్ట లాంటిది. ఒక సినిమాని ఎంత అద్భుతంగా తియ్యాలి , ఎంత ఎంగేజింగ్ గా తియ్యాలి , స్క్రీన్ ప్లే తో ఎలా ప్రేక్షకులను కట్టిపారేయొచ్చు వంటి విభాగాల్లో , ఫిలిం స్కూల్స్ కోచింగ్ కోసం ఈ చిత్రాన్ని విద్యార్థులకు చూపించవచ్చు. అలాంటి వెండితెర అద్భుతం ఇది. అందుకే ఆడియన్స్ ఈ చిత్రాన్ని నెత్తిన పెట్టుకొని ఆదరించారు కేవలం హిందీ వెర్షన్ తోనే 1380 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను కొల్లగొట్టింది. ఇక భారీ అంచనాల నడుమ విడుదలైన ‘ధురంధర్ 2’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషలకు కలిపి 1870 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.
ఇప్పటికీ కూడా ఈ చిత్రం థియేటర్స్ లో రన్ అవుతూనే ఉంది. అయితే 50 రోజులు పూర్తి అయ్యాక ఓటీటీ లో విడుదల చేయాలి కాబట్టి , రీసెంట్ గానే ఈ చిత్రాన్ని నెట్ ఫ్లిక్స్ లో విడుదల చేశారు. ఈ నెల 15 వ తారీఖు నుండి ఈ చిత్రం తెలుగు , తమిళం , హిందీ , మలయాళం , కన్నడ భాషల్లో అందుబాటులోకి వచ్చింది. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే, ఇది కేవలం ఓవర్సీస్ ఆడియన్స్ కి మాత్రమే అందుబాటులో ఉంటుంది, ఇండియన్ ఆడియన్స్ కి అందుబాటులోకి రావడం కష్టం. ఎందుకంటే ఇండియా లో ఈ చిత్రం కేవలం జియో హాట్ స్టార్ లోనే అందుబాటులోకి రానుంది. ముందుగా ఈ నెల 15 నే ఈ చిత్రాన్ని హాట్ స్టార్ లో విడుదల చేద్దామని అనుకున్నారు. కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల , ఈ సినిమా జూన్ 4 కి వాయిదా పడింది.
దీంతో ఈ చిత్రాన్ని మన పైరసీ రాయుళ్లు ఓవర్సీస్ నుండి HD ప్రింట్ డౌన్ లోడ్ చేసి ఇంటర్నెట్ లో పెట్టేశారు. అత్యధిక శాతం ఇండియన్ ఆడియన్స్ ఇంటర్నెట్ లో ఈ చిత్రాన్ని ఇప్పుడు చూసేస్తున్నారు. ఇలా జరగడం వల్ల, జియో హాట్ స్టార్ సంస్థకు నష్టం వందల కోట్లలోనే ఉంటుందని , ఒకేసారి విడుదల చేయకుండా చాలా పెద్ద తప్పు చేశారని సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే నెట్ ఫ్లిక్స్ లో ఓవర్సీస్ ఆడియన్స్ ఈ చిత్రాన్ని ఎగబడి చూస్తున్నారట. ముఖ్యంగా పాకిస్థాన్ దేశం లో ఒక్కసారిగా అందరూ ఈ చిత్రం ఓపెన్ చేయడం తో నెట్ ఫ్లిక్స్ ఆ దేశం లో కొంతసేపు క్రాష్ అయ్యిందని అంటున్నారు.
















మెగాస్టార్ తో రేణు దేశాయ్.. సంచలనం రేపుతున్న లేటెస్ట్ పోస్ట్..
Renu Desai: సోషల్ మీడియా నిత్యం యాక్టీవ్ గా ఉండే సినీ సెలబ్రిటీస్ లో ఒకరు రేణు దేశాయ్. హీరోయిన్ గా, మోడల్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా మాత్రమే కాకుండా, ఈమెకు ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి గా నెటిజెన్స్ లో బాగా గుర్తింపు ఉంది. అయితే సోషల్ మీడియా లో తన అభిప్రాయాలను వ్యక్తపరిచినప్పుడు ఒక సెక్షన్ ఆడియన్స్ ఈమెపై తీవ్రమైన నెగెటివిటీ చూపించడం వంటివి గతంలో మనం చాలానే చూశాము . అందుకు రేణు దేశాయ్ చాలా అసహనానికి గురి అవుతూ ఉండేది. అందుకే ఇన్ స్టాగ్రామ్ లో తన పోస్టులకు కామెంట్ సెక్షన్ బ్లాక్ చేసింది. ఇకపోతే నేడు మెగాస్టార్ తో కలిసి దిగిన ఒక ఫోటోని ఆమె ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేయగా, అది బాగా వైరల్ అయ్యింది. మెగాస్టార్ అంటే మన టాలీవుడ్ మెగాస్టార్ కాదు , మలయాళం మెగాస్టార్ మమ్ముటి.
ఆయన్ని షూటింగ్ సెట్స్ లో కలిసిన సందర్భంగా తన ఆనందాన్ని పంచుకుంటూ ‘ఇది నాకు ఒక క్రేజీ ఫ్యాన్ మూమెంట్ అని చెప్పొచ్చు. మమ్ముటి లాంటి లెజెండ్ తో కాస్త సమయం గడిపినా నా జన్మ ధన్యం అవుతుంది , ఒక్కసారైనా ఈ మూమెంట్ వస్తే బాగుండును అని నా జీవితం లో ఒక కోరిక ఉండేది , అది నేటితో నిజమైంది. ఆయన లాంటి గొప్ప మనసు ఉన్న వ్యక్తిని నా జీవితం లో ఇప్పటి వరకు కలవలేదు’ అంటూ ఆమె మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఆమె వ్యాఖ్యలకు సోషల్ మీడియా లో నెటిజెన్స్ సపోర్ట్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. మాకు కూడా మీలాటి అదృష్టం దొరికి ఉండుంటే బాగుండేది అంటూ మమ్మూటీ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియా లో బాగా వైరల్ అయినటువంటి ఆ వీడియో ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి.