Home Blog Page 264

పవన్ కళ్యాణ్ కి కథ చెప్పిన తమిళ స్టార్ డైరెక్టర్... సింగిల్ సిట్టింగ్ లో ఒకే అయిందిగా...

Pawan Kalyan
Pawan Kalyan

Pawan Kalyan: తెలుగు హీరోలతో సినిమాలు చేయడానికి ఇండియాలో ఉన్న దర్శకులంతా ఆసక్తి చూపిస్తున్నారు.ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంటి నటుడు సైతం తన సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకుకెళ్తుండటం విశేషం… ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాల అతన్ని టాప్ లెవల్లో నిల్చోనిబెట్టాయి. ఇకమీదట చేయబోతున్న సినిమాల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఈ సంవత్సరం వచ్చిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించకపోయిన కూడా తర్వాత రాబోయే సినిమాలతో పెను ప్రభంజనాలను సృష్టించాలనే ప్రయత్నంలో పవన్ కళ్యాణ్ ఉన్నాడు. ఇక దానికి తగ్గట్టుగానే ఇప్పుడు సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇక ఈ సినిమాతో పాటుగా మరొక ఇద్దరు దర్శకులతో కూడా అతను పని చేయబోతున్నాడనే వార్తలైతే వస్తున్నాయి. ఇక రీసెంట్ గా ఒక తమిళ దర్శకుడు ఆయనకి కథ వినిపించాడట.

ఇంతకీ ఆ దర్శకుడు ఎవరంటే జైలర్ సినిమాతో సక్సెస్ ను సాధించిన నెల్సన్ కావడం విశేషం…ఆయన సైతం రీసెంట్ గా పవన్ కళ్యాణ్ కి ఒక కథనైతే వినిపించారట. ఆయన ప్రస్తుతం రజినీకాంత్ తో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తి అయిన తర్వాత రజనీకాంత్ కమల్ హాసన్ లను పెట్టి ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు.

ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ కి కూడా ఒక కథ చెప్పాడట. సోషల్ మెసేజ్ ఉన్న కథ కావడంతో పవన్ కళ్యాణ్ ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. ఇక త్రివిక్రమ్ సైతం ఇందులో ఇన్వాల్వ్ అయి కథలో మార్పులు చేర్పులు చేస్తాడా లేదంటే కథని అలాగే ఉంచుతాడా అనేది తెలియాల్సి ఉంది.

ఇక పవన్ కళ్యాణ్ కాబట్టి త్రివిక్రమ్ ఆ కథలోని లోటు పాట్లను చూసి పవన్ కళ్యాణ్ కి మరోక నరేషన్ కూడా ఇప్పిస్తాడు. అది కూడా కన్ఫర్మ్ అయితే నెల్సన్ డైరెక్షన్లో పవన్ కళ్యాణ్ సినిమా అనౌన్స్ మెంట్ వస్తుంది. లేకపోతే మాత్రం ఈ ప్రాజెక్ట్ మధ్యలోనే ఆగిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి…

ప్లేఆఫ్ రేసు: ఐపీఎల్ విచిత్రపరిస్థితి : RCB గెలవాలని CSK అభిమానుల పూజలు

IPL 2026 Playoffs
IPL 2026 Playoffs

IPL 2026 Playoffs: ఐపీఎల్ అభిమానుల అచనాలకు అందని విధంగా సాగిపోతోంది. ముఖ్యంగా ప్లే ఆఫ్ బెర్త్ ఖరారు చేసుకున్న జట్లు ఓటమిపాలవుతున్నాయి. దీంతో గణాంకాలు మారిపోతున్నాయి. సమీకరణాలు తారు మారవుతున్నాయి. దీంతో ఏ జట్టు ప్లే ఆఫ్ వెళ్తుంది.. ఏ జట్టు ఇంటికి వెళుతుంది.. అనే ప్రశ్నలు అభిమానులను తీవ్ర ఉత్కంఠకు గురిచేస్తున్నాయి.

ఐపీఎల్ లో పంజాబ్ జట్టు వరుసగా ఆరు విజయాలు నమోదు చేసింది. ఆ తర్వాత వరుసగా 5 ఓటములను నమోదు చేసింది.. దీంతో ఆ జట్టు ప్లే ఆఫ్ ఆశలు తలకిందులు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో పంజాబ్ జట్టు ఆదివారం బెంగళూరుతో జరిగే మ్యాచ్లో కచ్చితంగా గెలవాలి. అప్పుడే ఆ జట్టు ప్లే ఆఫ్ వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. అయితే ఈ మ్యాచ్లో పంజాబ్ గెలిస్తే చెన్నై జట్టుకు ప్లే ఆఫ్ వెళ్లే అవకాశాలు ఉండవు.

అందువల్లే చెన్నై అభిమానులు పంజాబ్ గెలవకూడదని.. బెంగళూరు గెలవాలని పూజలు చేస్తున్నారు. ఐపీఎల్ పాయింట్ల పట్టికలో బెంగళూరు ప్రస్తుతం 16 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. ఈ జట్టు 8 విజయాలు, నాలుగు ఓటములతో ఐపీఎల్ లో మిగతా చెట్లకు అందనంత ఎత్తులో ఉంది. బెంగళూరు జట్టుకు నెట్ రన్ రేటు అద్భుతంగా ఉంది . ఈ జట్టు 1.053 నెట్ రన్ రేట్ కొనసాగిస్తోంది.

పంజాబ్ జట్టు ఇప్పటివరకు 12 మ్యాచ్లు ఆడింది. ఆరు విజయాలు.. ఐదు ఓటములను నమోదు చేసింది. నెట్ రన్ రేట్ +0.355 తో కొనసాగుతోంది. ముంబై తో ఓడిపోవడం ఈ జట్టు భవితవ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. బెంగళూరు తో ఒకవేళ ఈ జట్టుకు ఓడిపోతే.. ప్లే ఆఫ్ వెళ్ళే అవకాశాలు ఉండవు. లక్నో జట్టుతో గెలిచినా కూడా ఉపయోగం ఉండదు. పంజాబ్ ఓడిపోతే చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు మార్గం సుగమం అవుతుంది. ఈ చెట్టు ఖాతాలో 12 పాయింట్లు ఉన్నాయి..+0.027 నెట్ రన్ రేట్ ఉంది. జట్టు ఇంకా సన్ రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ క్యాపిటల్స్ తో ఆడాల్సి ఉంది. పంజాబ్ ఓడిపోయి.. చెన్నై వరుసగా రెండు మ్యాచ్లో గెలిస్తే.. అప్పుడు దర్జాగా ప్లే ఆఫ్ వెళ్తుంది. ఇటీవల లక్నో జట్టుతో జరిగిన మ్యాచ్లో ఓడిపోకుండా ఉంటే ఈ జట్టుకు బాగుండేది. అందువల్లే నేటి మ్యాచ్లో బెంగళూరు గెలవాలని.. పంజాబ్ ఓడిపోవాలని చెన్నై అభిమానులు భావిస్తున్నారు.

యంగ్ క్రికెటర్ తో హీరోయిన్ శ్రీలీల డేటింగ్.. ఇలా దొరికిపోయిందేంటి..

Sreeleela Tilak Varma Relationship
Sreeleela Tilak Varma Relationship

Sreeleela Tilak Varma Relationship: ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిన నటి శ్రీలీల. ఈమె ఇండస్ట్రీ లోకి వచ్చిన తర్వాత అప్పటి వరకు టాప్ హీరోయిన్స్ గా చలామణి అయిన వాళ్ళందరూ కనుమరుగు అయిపోయారు. ఇప్పుడు ఆమెకు కెరీర్ నిండా డిజాస్టర్ ఫ్లాప్స్ ఉన్నాయి , అయినప్పటికీ కూడా నిర్మాతలు ఈమెతో సినిమాలు చేయడానికి క్యూలు కడుతున్నారంటే , యూత్ లో ఆమెకు ఉన్నటువంటి క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఇదంతా పక్కన పెడితే ఈ సినీ గ్లామర్ ప్రపంచం లో హీరోయిన్స్ పై రూమర్స్ ఉండడం సర్వ సాధారణం. కానీ శ్రీలీల అందుకు అతీతం , ఈమెపై ఎలాంటి రూమర్స్ లేవని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు ఈమె మీద కూడా రూమర్స్ మొదలయ్యాయి. బాలీవుడ్ లో శ్రీలీల కి సంబంధించిన ఒక రూమర్ ఇప్పుడు ఇండస్ట్రీ ని షేక్ చేస్తోంది.

ప్రముఖ క్రికెటర్ తిలక్ వర్మ తో శ్రీలీల ప్రేమలో ఉందని, వీళ్లిద్దరు ప్రస్తుతం డేటింగ్ చేస్తున్నారని అంటున్నారు. ఎందుకంటే రీసెంట్ గా ఈమె ధర్మశాల లో జరిగిన పంజాబ్ కింగ్స్ వెర్సస్ ముంబై ఇండియన్స్ ఐపీఎల్ మ్యాచ్ లో ఆడియన్స్ గ్యాలరీ లో కూర్చొని ఎంజాయ్ చేసింది. ఈమెతో పాటు, తల్లి స్వర్ణలత కూడా ఉండడం విశేషం. వీళ్లిద్దరు తిలక్ వర్మ తో అత్యంత సన్నిహితంగా ఉండడం, అంతే కాకుండా రెండు మూడు సార్లు ముంబై లో తిలక్ వర్మ తో కలిసి శ్రీలీల కనిపించడం వంటివి వీళ్లిద్దరు ప్రేమలో ఉన్నారు అనే రూమర్ కి బలాన్ని చేకూరుస్తోంది. గతం లో సూర్య కుమార్ యాదవ్ కూడా తిలక్ వర్మ ప్రేమలో ఉన్నాడు అంటూ తీజ్ చేసిన వీడియో కి లింక్ చేసి చూస్తూ , వీళ్లిద్దరు కచ్చితంగా ప్రేమలోనే ఉన్నారు అని తేల్చి చెప్పేస్తున్నారు నెటిజెన్స్.

అయితే శ్రీలీల సన్నిహిత వర్గాలు మాత్రం , తిలక్ వర్మ కుటుంబం తో శ్రీలీల కుటుంబానికి ఎప్పటి నుండో మంచి సాన్నిహిత్యం ఉందని , ఆ కారణం చేతనే తిలక్ వర్మ మ్యాచ్ లకు శ్రీలీల వస్తుందని అంటున్నారు. ఇందులో ఎంత మాత్రం నిజముందో చూడాలి . ఇక శ్రీలీల కెరీర్ విషయానికి వస్తే, తెలుగు లో ప్రస్తుతం ఈమె ఎలాంటి సినిమాకు కమిట్ అవ్వలేదు. ఈమె హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కమర్షియల్ గా ఎంత పెద్ద ఫ్లాప్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. అదే విధంగా ఈమె కోలీవుడ్ లో రెండు కొత్త సినిమాల్లో నటించడానికి రీసెంట్ గానే సంతకాలు చేసింది , అదే విధంగా బాలీవుడ్ లో ఈమె హీరోయిన్ గా నటించిన రెండు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.

కరీంనగర్‌ మంత్రుల ’పవర్‌ కట్‌’.. సీఎం రేవంత్‌ సంచలన నిర్ణయం!

Karimnagar Ministers Power Cut
Karimnagar Ministers Power Cut

Karimnagar Ministers Power Cut: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. తన కేబినెట్‌ను పూర్తిస్థాయిలో విస్తరించకుండా ఇప్పటికీ ఎమ్మెల్యేలను ఊరిస్తున్నారు. అసంతృప్తి వ్యక్తమైన ప్రతీసారి విస్తరణ అంశాన్ని తెరపైకి తెస్తున్నారు. అయితే రెండున్నరేళ్లుగా కోఆర్డినేషన్‌తో పాలన సాగిస్తున్నారు. కరీంనగర్‌ మంత్రులకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ముఖ్యంగా శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌ సీఎం పాల్గొనే ప్రతీ కార్యక్రమంలో పాల్గొనడమే ఇందుకు నిదర్శనం. అయితే తాజాగా సీఎం సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఉమ్మడి జిల్లాకు చెందిన శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌తోపాటు తొలిసారి ఎమ్మెల్యే అయి మంత్రివర్గంలో స్థానం దక్కించుకున్న ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ పవర్‌ కట్‌ చేశారు.

వారి సిఫారసులు ఉమ్మడి జిల్లాకే..
సీఎంఆర్‌ఎఫ్‌ విషయంలో నిన్నటి వరకు మంత్రులు తమ ఉమ్మడి నియోజకవర్గ పరిధిలోని లబ్ధిదారులతోపాటు రాష్ట్రవ్యాప్తంగా సిఫార్సు చేయడానికి సౌలభ్యం ఉండేది. కానీ ఇప్పుడు ఆ వెసులుబాటును కట్‌ చేశారు. ఇకపై ముగ్గురు మంత్రులు ఉమ్మడి జిల్లా వరకు మాత్రమే సిఫారసు చేయాల్సి ఉంటుంది. రాష్ట్రస్థాయిలో చేస్తే పరిగణనలోకి తీసుకోరు.

పారదర్శకత పెంపు..
సీఎంఆర్‌ఎఫ్‌కు సంబంధించి దరఖాస్తులు, చెక్కుల సవరణ ప్రక్రియలను పూర్తిగా డిజిటల్‌ పరిష్కారంగా మార్చారు. ఇది అభ్యర్థుల సమాచార నమోదు నుంచి చెక్కుల పంపిణీ, భౌన్స్‌ వరకు ట్రాక్‌ చేయడానికి, మినహాయింపులు తగ్గించడానికి, మేనేజిమెంట్‌లో జోక్యాలను తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఆన్‌లైన్‌ వ్యవస్థ ద్వారా ఇటీవలికాల పాలనలో పత్రాలు, నిర్ణయాలపై పారదర్శకతతో పాటు వేగవంతమైన తనిఖీలు కూడా సులభమవుతాయి.

పాలనా ప్రభావాలు
సిఫార్సుల పరిమితి స్థానిక స్థాయిలో నిధుల సమకూర్పు ఫోకస్‌ను పెంచే అవకాశం కలిగిస్తుంది. ఈ కారణంగా నియోజకవర్గ ధోరణుల పరంగా మంత్రుల బాధ్యతలు స్పష్టమవుతాయి. మరిన్ని పారదర్శక చర్యలు వల్ల సిఫార్సుల వ్యక్తిగత నియంత్రణ పెరుగుతుంది. అయితే రాజకీయసంబంధాలలో వ్యతిరేక భావనలను పెంచే అవకాశం ఉంది. డిజిటలైజేషన్‌ దశ అధికారిక ప్రక్రియలను వేగవంతం చేసినప్పటికీ, సాంకేతిక ప్రాప్తి లేని ప్రాంతాల ప్రజల కోసం సాయంగా ఏర్పాటు చేయకపోతే కొందరు లబ్ధిదారులు నష్టపోయే అవకాశముంది.

ఈ నిర్ణయం మంత్రుల రాజకీయ వ్యూహాలకు, స్థానిక అభివృద్ధి ప్రాధాన్యాలకు ప్రభావం చూపుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. నియోజకవర్గ పరిధిలోనే ఫోకస్‌ పెరగడంతో మెరుగైన సామాజిక బహుమతి కార్యక్రమాలు సాధ్యమవుతాయని సమర్థకులు అంటున్నారు. మరోవైపు, రాష్ట్రీయ స్థాయిలో సమానమైన ప్రాజెక్టుల కోసం పోటీ తగ్గడంతో కీలక ప్రాజెక్టులకు సమయస్ఫూర్తి తగ్గే ప్రమాదం ఉండొచ్చు.

విజయ్ సీఎం అవ్వడం పై నాకు నిజంగా ఎలాంటి అసూయ లేదు - రజినీకాంత్

Rajinikanth
Rajinikanth

Rajinikanth: తమిళనాడు మీడియా లో ఎప్పటి నుండో జోరుగా సాగుతున్న చర్చ, రజినీకాంత్ , విజయ్ మధ్య కోల్డ్ వార్ నడుస్తుంది అని. నాలుగు దశాబ్దాల పాటు , పోటీ అనేదే లేకుండా తమిళ సినిమా ఇండస్ట్రీ ని శాసించిన రజినీకాంత్ కి , 2004 లో విజయ్ స్టార్ గా రైజ్ అవ్వడం అసలు నచ్చలేదని , ఇతను ఎప్పటికైనా తనను దాటేస్తాడేమో అనే భయం రజిని లో ఉండేదని, 2017 తర్వాత విజయ్ ఏకంగా తనని దాటేయడం రజినీకాంత్ కి నిద్ర లేకుండా చేసిందని , అప్పటి నుండి విజయ్ పై ఆయన అసూయ తో రగిలిపోతున్నాడని , ఎన్నికల్లో విజయ్ పార్టీ గెలిచినా తర్వాత , రజినీకాంత్ స్టాలిన్ వద్దకు వెళ్లి అన్నా డీఎంకే తో పొత్తు పెట్టుకొని మీరే ప్రభుత్వాన్ని స్థాపించండి అని చెప్పాడని, ఇలా ఎన్నో రకాల వార్తలు ప్రచారం లోకి వచ్చాయి.

వీటిపై రజినీకాంత్ ఇన్ని రోజులు స్పందించలేదు కానీ , నేడు ప్రెస్ మీట్ పెట్టి మరీ ఈ అంశంపై ఆయన స్పందించడం గమనార్హం. ఆయన మాట్లాడుతూ ‘విజయ్ కి నాకు పాతికేళ్ల వయస్సు తేడా ఉంది. అంటే రెండు తరాల తేడా ఉంది మా ఇద్దరి మధ్య. మీడియా లో విజయ్ సీఎం అవ్వడం పై నేను అసూయ తో ఉన్నానని ప్రచారం చేస్తున్నారు. ఇది చూసినప్పుడు నాకు చాలా బాధ కలిగింది. నేనెందుకు విజయ్ పై అసూయ పడుతాను?, కమల్ హాసన్ సీఎం అయితే అసూయ పడుతా , ఎందుకంటే అతను నా తరానికి చెందిన వాడు కాబట్టి. విజయ ఎంజీఆర్, ఎన్టీఆర్ కూడా సాధించలేనిది అతి తక్కువ సమయంలో సాధించి చూపించాడు. కేంద్రం లో బీజేపీ ని, తమిళనాడు లో రెండు పెద్ద తమిళ ద్రవిడ పార్టీలను ఎదురుకొని సీఎం అవ్వడం అనేది ఆశా మాషీ విషయం కాదు’.

‘నేను స్టాలిన్ ని కలిసి , మీ డీఎంకే అన్నా డీఎంకే తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుందని, నేను ఈ రెండు పార్టీలకు ఉమ్మడి సీఎం గా ఉంటానని చెప్పినట్టు గా కూడా మీడియా లో వార్తలు వచ్చాయి. ఇలాంటి వార్తలు సృష్టించడం చాలా పెద్ద తప్పు. స్టాలిన్ నాకు ఒక మంచి మిత్రుడు , అతను కొళత్తూర్ లో ఓడిపోవడం నాకు చాలా బాధని కలిగించింది , కేవలం స్నేహ భావం తోనే అతన్ని కలిసాను కానీ , విజయ్ ని తొక్కేయాలని నేను రాజకీయాల్లోకి రావాలని కాదు, దయచేసి ఇది అర్థం చేసుకోగలరు’ అంటూ సూపర్ స్టార్ రజినీకాంత్ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి.

దిల్ రాజు బ్యానర్ లో వచ్చిన ఈ మూడు సినిమాలు ఇప్పటికి ఎవర్గ్రీన్ గానే నిలిచిపోయయా..?

Dil Raju
Dil Raju

Dil Raju: ఒక సినిమా తెరమీదికి రావాలంటే దాని వెనకాల చాలామంది కష్టపడాల్సి ఉంటుంది. ఒక దర్శకుడు ప్రొడ్యూసర్ ఇద్దరు కలిసి ఆ సినిమాను సెట్స్ మీదకి తీసుకువస్తారు. కాబట్టి సినిమాకి వీళ్లిద్దరు చాలా కీలకమనే చెప్పాలి. ఇక ఇలాంటి క్రమంలోనే ప్రొడ్యూసర్ దిల్ రాజు సైతం వరుస సినిమాలను చేస్తూ సూపర్ సక్సెస్ లను సాధిస్తున్నాడు. నిజానికి ఇండస్ట్రీలో సక్సెస్ లు చాలా తక్కువగా వస్తాయి. కానీ దిల్ రాజు బ్యానర్ నుంచి వచ్చిన సినిమాలు మాత్రం 95% సక్సెస్ రేట్ ని కలిగి ఉన్నాయి అంటే ఆయన స్క్రిప్ట్ విషయంలో గాని, సినిమాలను సెట్స్ మీదకు తీసుకెళ్లడంలో గాని ఎంత జాగ్రత్తగా ఉంటాడో మనం అర్థం చేసుకోవచ్చు. అలాంటి సుకుమార్ ప్రస్తుతం చేస్తున్న సినిమాల విషయంలో ఆచితూచి మరి ముందుకు అడుగులు వేస్తున్నాడు. ఈ మధ్యకాలంలో ఆయన నుంచి వచ్చిన సినిమాలు ప్రేక్షకులను ఏ మాత్రం మెప్పించలేకపోతున్నాయి.

గత సంవత్సరం వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా సూపర్ హిట్ అయింది. అయితే రామ్ చరణ్ హీరోగా వచ్చిన గేమ్ చేంజర్ సినిమా భారీగా డీలా పడిపోయిందనే చెప్పాలి. ఇక ఇప్పటికే వాళ్ళ బ్యానర్ నుంచి 50 సినిమాలకు పైన మూవీస్ ని రిలీజ్ చేశాడు.

అయినప్పటికి తన కెరియర్ లో చేసిన సినిమాలన్నింటిలో ఒక మూడు సినిమాలు ఎవరు గ్రీన్ గా నిలిచిపోతాయి అంటూ దిల్ రాజు ఎప్పటికి చెబుతుంటాడు. అందులో ఒకటి ‘బొమ్మరిల్లు’ సినిమా కాగా, మరొకటి ‘కొత్త బంగారు లోకం’ ఇంకొకటి ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమా కావడం విశేషం… ఈ మూడు సినిమాలకి చాలా మంచి ప్రత్యేకత ఉంది.

ఇప్పటికి జనాలు ఆ సినిమాలను టీవీల్లో చూస్తూ ఉంటారని దిల్ రాజు పాలు సందర్భాల్లో చెప్పాడు. ఇక ఏది ఏమైనా కూడా దిల్ రాజు బ్యానర్ ని నిలబెట్టిన సినిమాల్లో ఈ మూడు సినిమాలు మొదటి వరుసలో ఉంటాయి… ఇక ఫ్యామిలీ ఎమోషన్స్ కి వాల్యూస్ ఇస్తూ ఆయన చిత్రీకరించే సినిమాలు ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణను సంపాదించుకుంటున్నాయి…

అల్లు అర్జున్ - లోకేష్ కనకరాజ్ మూవీ టైటిల్ ఇదేనా...

Allu Arjun And Lokesh Kanagaraj
Allu Arjun And Lokesh Kanagaraj

Allu Arjun And Lokesh Kanagaraj: ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఐకాన్ స్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటుడు అల్లు అర్జున్…తన ఎంటైర్ కెరియర్ లో చేసిన సినిమాలు తనకి ఎనలేని గుర్తింపును తీసుకొచ్చాయి. ముఖ్యంగా ‘పుష్ప’, ‘పుష్ప 2’ సినిమాలతో ఆయన ఇండియాలో భారీ పాపులారిటి ని సంపాదించుకున్నాడు. ఇక ‘పుష్ప 2’ సినిమా ఇచ్చిన సక్సెస్ తో వెనుదిరిగి చూడకుండా ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇప్పటికే అట్లీ డైరెక్షన్లో ‘రాకా’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో ఎలాగైనా సరే సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించాలని తను అనుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ సినిమా ఏ రేంజ్ సక్సెస్ ను సాధిస్తుంది. అల్లు అర్జున్ కి ఎలాంటి విజయాన్ని కట్టబెడుతుంది. అల్లు అర్జున్ కెరీయర్ని మార్చేస్తుందా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమా తర్వాత ఆయన లోకేష్ కనకరాజు దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చారు. వచ్చే ఏడాది నుంచి ఈ సినిమా సెట్స్ మీద కి వెళ్లే అవకాశాలైతే ఉన్నాయి. అయితే ఈ సినిమాకి ‘యోధ’ అనే టైటిల్ ని పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ టైటిల్ని బట్టి చూస్తుంటే ఇది కూడా ఒక భారీ కమర్షియల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కబోతుందనే వార్తలైతే వస్తున్నాయి.

ఇక లోకేష్ కనకరాజ్ కమర్షియల్ సినిమాలను చాలా అద్భుతంగా తరికెక్కించడంలో సిద్ధహస్తుడు… ఏ ఎపిసోడ్స్ ఎక్కడెక్కడ ఉండాలి. సినిమాలోని సన్నివేశాలతో ప్రేక్షకులను ఎలా బుక్ చేయాలి అనేది లోకేష్ కి తెలిసినంత బాగా ఇంకెవరికి తెలియదు.

గత సంవత్సరం రజనీకాంత్ చేసిన కూలీ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించకపోయిన కూడా లోకేష్ కనకరాజు ఎక్కడ డీలా పడకుండా అల్లు అర్జున్ తో సినిమా సెట్ చేసుకున్నాడు అంటే మామూలు విషయం కాదు… కాబట్టి ఈ ప్రాజెక్టు మీద కూడా ప్రేక్షకుల్లో విశేషమైన అంచనాలైతే ఉన్నాయి. ఇక ఈ ప్రాజెక్టు ఏ రేంజ్ సక్సెస్ ని సాధిస్తుంది. ప్రేక్షకుడిని మెప్పించగలుగుతుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…

చీరలో అందాల ‘రోజ్’

Rose Sardana
Rose Sardana

ట్రంప్‌ స్టాక్‌ ట్రేడ్స్‌.. అక్రమ ఆదాయం కోసం అధికార దుర్వినియోగం!

Trump Stock Trades
Trump Stock Trades

Trump Stock Trades: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్‌ ట్రంప్‌పై అనేక ఆరోపణలు ఉన్నాయి. ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌లోనూ ట్రంప్‌ ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఇక అధ్యక్షుడి కన్నా ముందు వ్యాపార వేత్తగా ఉన్న ట్రంప్‌ అనేక అక్రమాలకు పాల్పడినట్లు ఫిర్యాదులు ఉన్నాయి. తాజాగా ట్రంప్‌ అధ్యక్ష హోదాలో అక్రమ ఆదాయం కోసం యత్నించినట్లు ఆరోపణలు వస్తున్నాయి.2026 జనవరి–మార్చి మధ్య ట్రంప్‌ తరపున సుమారు 3,700 లావాదేవీలు జరిగాయని యూఎస్‌ ఆఫీస్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌ ఎథిక్స్‌ బహిర్గతం చేసింది. ఈ ట్రాన్సాక్షన్ల మొత్తం 220 మిలియన్‌ డాలర్ల నుంచి 750 మిలియన్‌ డాలర్ల వరకు ఉండవచ్చని అంచనా. టెక్‌ షేర్లు, కాంట్రాక్టర్‌ కంపెనీలు, బోయింగ్‌ వంటి సంస్థల్లో పెద్ద ఎత్తున కొనుగోళ్లు–అమ్మకాలు జరిగాయి.

ట్రంప్‌పై విమర్శల వెల్లువ..
ఈ అక్రమాల వెల్లడి తర్వాత ప్రతిపక్ష డెమోక్రాట్లు, సెనేటర్‌ ఎలిజబెత్‌ వారెన్‌ వంటి నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ట్రంప్‌ అధికారపు నిర్ణయాలు తన స్టాక్‌ లాభాలకు అనుకూలంగా ఉపయోగించుకున్నారని ఆరోపణలు చేశారు. జనవరి 6న ఒక మిలియన వరకు ఎన్‌విడా షేర్లు కొన్నారని ఫైలింగ్స్‌ చూపిస్తున్నాయి. దాదాపు ఒక వారం తర్వాత అమెరికా కామర్స్‌ డిపార్ట్‌మెంట్‌ ఎన్‌విడా ఏ200 ఏఐ చిప్స్‌ చైనాకు అమ్మకాలను అనుమతించింది. ఫిబ్రవరి 10న మరో పెద్ద కొనుగోలు జరిగి, తర్వాత మెటాతో ఎన్‌విడా పెద్ద డీల్‌ ప్రకటన వచ్చింది.

చైనా పర్యటన అందుకోసమేనా?
ట్రంప్‌ చైనా సందర్శనలో ఎన్‌విడా సీవో జెన్సెన్‌ హువాంగ్‌ను తీసుకెళ్లడం, స్టాక్‌ హోల్డింగ్‌తో కలిసి రాజకీయ లాభం కోసం చేసిన చర్యగా విమర్శలు వచ్చాయి. పాలంటిర్‌ వంటి కాంట్రాక్ట్‌ సంస్థల షేర్లు ప్రభుత్వ డీల్స్‌ సమయంలో కొనడం కూడా సందేహాలు రేకెత్తించింది. అయితే ట్రంప్‌ ఆర్గనైజేషన్‌ ప్రకారం, ఈ ఇన్వెస్ట్‌మెంట్లు మూడవ వ్యక్తులు నిర్వహిస్తున్నారు. బ్లైండ్‌ ట్రస్ట్‌ లాంటి వ్యవస్థలో అధ్యక్షుడు నేరుగా నిర్ణయాలు తీసుకోరు. ఎరిక్‌ ట్రంప్‌ వంటి కుటుంబ సభ్యులు ఈ ఆరోపణలను రాజకీయ ప్రచారంగా కొట్టిపారేశారు. అధికారిక నిర్ణయాలు జాతీయ భద్రత, ఆర్థిక వృద్ధి ఆధారంగా తీసుకుంటారని వాదన.

ఎంతవరకు అవినీతి?
అధ్యక్షుడి స్థాయిలో ఇంత పెద్ద స్టాక్‌ ట్రేడింగ్‌ వాల్యూమ్‌ (రోజుకు 40+ ట్రేడ్లు) సంఘర్షణల అవకాశాలను పెంచుతుంది. టైమింగ్‌ సందేహాలు రేకెత్తించడం సహజం.
ప్రభుత్వ నియంత్రణలో ఉన్న సెక్టర్ల (టెక్‌ ఎక్స్‌పోర్ట్స్, డిఫెన్స్‌ కాంట్రాక్ట్స్‌)లో ఇన్వెస్ట్‌ చేయడం ఎలైట్‌లకు ప్రయోజనం కల్పించే అవకాశం ఉంది. అమెరికా అధ్యక్షులు ఇంతకుముందు కూడా ఇన్వెస్ట్‌మెంట్లు చేసుకున్నారు. ట్రంప్‌ ముందు బాండ్లలో ఎక్కువగా ఉండేవారు. ఇప్పుడు స్టాక్స్‌కు మారడం మార్కెట్‌ ట్రెండ్‌తో సమానంగా ఉండవచ్చు.

ఈ ఘటన యాజమాన్య పారదర్శకత, ఎథిక్స్‌ నియమాల గురించి మళ్లీ చర్చనీయాంశం చేసింది. ఆరోపణలు రాజకీయంగా ఉన్నప్పటికీ, అధికారుల ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రవర్తనపై కఠినమైన నియమాల అవసరాన్ని హైలైట్‌ చేస్తున్నాయి. ఇది నిజమైన అవినీతి కాదా లేదా సాధారణ మార్కెట్‌ యాక్టివిటీ కాదా అనేది ఇంకా స్వతంత్ర దర్యాప్తు అవసరమైన విషయం. ఈ సంఘటన అమెరికా రాజకీయాల్లో ఉద్రిక్తతను మరింత పెంచుతుంది.

అమెరికా అక్కసు.. మన వీసా దేవుడికి అంతర్జాతీయ గుర్తింపు..!

Chilkur Balaji Temple
Chilkur Balaji Temple

Chilkur Balaji Temple: చిలుకూరు బాలాజీ.. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. జాతీయ స్థాయిలోనూ మంచి గుర్తింపు ఉన్న ఆలయం. విదేశాలకు వెళ్లాలనుకునేవారు. ఉద్యోగాలు రావాలని మొక్కుకునేవారు ఇక్కడ 108 ప్రదక్షిణలు చేస్తారు. ఇలా మొక్కుకున్నవారిలో 80 శాతం మంది కోరికలు నెరవేరినట్లు ఆలయం అధికారులు, భక్తులు తెలిపారు. దీంతో ఇక్కడికి వచ్చే భక్తుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. అందుకే చిలుకూరు బాలాజీ వీసా దేవుడిగా గుర్తింపు పొందాడు. అయితే ఇప్పుడు మన దేవుడికి అంతర్జాతీయ గుర్తింపు దక్కింది. అమెరికా సెనేటర్‌ ‘వీసా కార్టెల్‌’ ఇందుకు కారణం. హెదరాబాద్‌ సమీపంలోని చిలుకూరు బాలాజీ ఆలయం భారతీయులకు కేవలం ఆధ్యాత్మిక కేంద్రం మాత్రమే కాదు. ఎంతోమంది యువకులు, విద్యార్థులు, ఉద్యోగార్థులు తమ అమెరికా వీసా కలలను సాకారం చేసుకోవడానికి ఇక్కడ ప్రార్థనలు చేస్తారు. ఈ ఆలయం గురించి ఫ్రాన్స్‌ 24 అధికారిక చానల్‌ విశేష రిపోర్ట్‌ చేసింది. దీనిని ‘Visa Temple’గా పిలిచి, విశ్వాసం ఆధారంగా లక్షలాది మంది భక్తులు ఇక్కడ 11 ప్రదక్షిణలు చేసి వీసా కోసం, 108 ప్రదక్షిణలు చేసి కృతజ్ఞతలు తెలిపే సంప్రదాయాన్ని వివరించింది.

అమెరికా సెనేటర్‌ అక్కసు..
అయితే, ఇదే ఆలయాన్ని అమెరికా సెనేటర్‌ ఎరిక్‌ ష్మిట్‌ తీవ్రంగా విమర్శించారు. హెచ్‌–1బీ వీసాలు, భారతీయ ఐటీ వృత్తులపై తన వ్యతిరేకత వ్యక్తం చేస్తూ ఈ ఆలయాన్ని ‘Visa Cartel’గా అభివర్ణించాడు. భక్తుల ప్రార్థనలను ఎగతాళి చేశారు. ఇది కేవలం ఒక ఆలయం గురించి మాత్రమే కాకుండా, భారతీయ సంస్కృతి, విశ్వాసాలు, వలస విధానాలపై జరుగుతున్న వివాదాన్ని ప్రతిబింబిస్తోంది.

చిలుకూరు బాలాజీ వెనుక చిన్న కథ.
చిలుకూరు బాలాజీ ఆలయం సుమారు 500 సంవత్సరాల చరిత్ర కలిగిన ప్రాచీన ఆలయం. ఇక్కడ హుండీ లేదు, డబ్బు స్వీకరణ లేదు, వీఐపీలకు ప్రత్యేకత లేదు. అందరూ ఒకే సామాన్య భక్తులుగా ప్రదక్షిణలు చేస్తారు. 1980–90లలో ఇంజినీరింగ్‌ విద్యార్థులు వీసా వైఫల్యాల తర్వాత ఇక్కడ ప్రార్థన చేసి విజయం సాధించడంతో ’వీసా బాలాజీ’ అనే పేరు వచ్చింది. ఇప్పుడు రోజుకు వేలాది మంది భక్తులు వస్తున్నారు. ఫ్రాన్స్‌ 24 రిపోర్ట్‌లో ఈ విశ్వాసాన్ని గౌరవంగా చిత్రీకరించారు. ఇది భారతీయుల ’అమెరికన్‌ డ్రీమ్‌’ను సూచిస్తుందని, కష్టాలు, నమ్మకం మధ్య జరిగే ప్రయాణాన్ని హైలైట్‌ చేశారు.సెనేటర్‌ వ్యాఖ్యల వెనుక రాజకీయాలుఎరిక్‌ ష్మిట్‌ వ్యాఖ్యలు హెచ్‌–1బీ వీసా వ్యవస్థపై జరుగుతున్న అమెరికా రాజకీయ చర్చలో భాగం.

అమెరికా ఉద్యోగాల్లో ఆధిపత్యం..
అమెరికాలో ఉద్యోగాలు, టెక్‌ సెక్టర్‌లో భారతీయుల ఆధిపత్యం, వీసా దుర్వినియోగం అనే అంశాలపై రిపబ్లికన్‌ సెనేటర్లు విమర్శలు చేస్తున్నారు. ఈ సందర్భంలో చిలుకూరు ఆలయ ఫోటోను పోస్ట్‌ చేసి ‘వీసా కార్టెల్‌కు సొంత వీసా ఆలయం ఉంది‘ అని వ్యాఖ్యానించడం భారతీయులను కలచివేసింది. ఇది భారతీయ విశ్వాసాలను ఎగతాళి చేయడమే. సాంస్కృతిక అసహనాన్ని ప్రదర్శించడం.
వీసా సమస్యలను మతపరమైన దృక్పథంతో చూడడం అని చెప్పవచ్చు.

భారతీయ సమాజంలో ఆలయాలు, దేవుళ్లు కేవలం మతపరమైనవి కాకుండా, సామాజిక, మానసిక మద్దతు అందించే కేంద్రాలు. వీసా, ఉద్యోగం, వివాహం వంటి జీవిత సమస్యల్లో విశ్వాసం బలాన్నిస్తుంది. ఫ్రాన్స్‌ రిపోర్ట్‌ ఈ మానవీయ కోణాన్ని అర్థం చేసుకుంది. కానీ సెనేటర్‌ వ్యాఖ్యలు దీన్ని రాజకీయ ఆయుధంగా మార్చాయి. ఈ సంఘటన రెండు వైపులా ఆలోచింపజేస్తుంది.

సుకుమార్ ను అవమానించిన ప్రొడ్యూసర్... ఆయనతో మళ్ళీ సినిమా చేయలేదుగా...

Sukumar
Sukumar

Sukumar: ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఇంటెలిజెంట్ డైరెక్టర్ గా గుర్తింపును సంపాదించుకున్న వాళ్ళలో సుకుమార్ మొదటి స్థానంలో ఉంటాడు. ఇప్పటి వరకు ఆయన చేసిన సినిమాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. వైవిధ్యభరితమైన కథాంశాలతో సినిమాలను చేసిన సుకుమార్ ప్రస్తుతం మరోసారి రామ్ చరణ్ తో జతకట్టబోతున్నాడు. అయితే వీళ్ళిద్దరి కాంబినేషన్లో రాబోయే సినిమా డిఫరెంట్ గా ఉంటుందని కథ ను సైతం ఫైనల్ చేసి పక్కన పెట్టినట్టుగా తెలుస్తుంది. ఇక ఏది ఏమైనా కూడా సుకుమార్ ని ఒక ప్రొడ్యూసర్ దారుణంగా అవమానించాడు అంటూ అతని అభిమానులైతే చాలా వరకు కామెంట్స్ చేస్తున్నారు.

నిజానికి అది అవమానం కంటే కూడా సినిమా సక్సెస్ అవ్వడానికి తనకి తానే అవమానించుకున్నాడు అంటూ మరి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ ఎవరా ప్రొడ్యూసర్ అంటే దిల్ రాజుగా తెలుస్తుంది. సుకుమార్ అల్లు అర్జున్ తో చేసిన ఆర్య సినిమా భారీ విజయాన్ని సాధించింది. ఈ మూవీకి దిల్ రాజు ప్రొడ్యూసర్ కావడం విశేషం…

ఆర్య సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత చివర్లో ఒక మాంటేజ్ సన్నివేశం కోసం దిల్ రాజు ను బతిమిలాడాడట. కానీ అప్పటికే ఆ సినిమా మీద అనుకున్న డబ్బులు పెట్టేసాము అని ఇక పెట్టడం చాలా కష్టమని చెప్పడంతో ఏం చేయాలో తెలియని సుకుమార్ దిల్ రాజు కాళ్లు పట్టుకొని మరి ఆ మాంటేజ్ కి డబ్బులు పెట్టించుకొని సినిమాని చేసి సక్సెస్ ఫుల్ గా నిలిపాడు.

అయితే ఇప్పటికి ఆ విషయాన్ని గుర్తు పెట్టుకున్న సుకుమార్ ఆర్య సినిమా తర్వాత దిల్ రాజు తో మరో సినిమా చేయలేదు. వీళ్ల కాంబోలో సినిమా వస్తుందంటూ గతంలో చాలా వరకు ప్రచారం జరిగినా కూడా అది కార్యరూపం దాల్చలేదు. ఏది ఏమైనా కూడా సుకుమార్ లాంటి దర్శకుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ ని ముందుకు నడిపించడంలో కీలకపాత్ర వహిస్తున్నాడు. కాబట్టే అతనితో సినిమాలు చేయడానికి చాలామంది స్టార్ హీరోలు సైతం ఆసక్తి చూపిస్తుండటం విశేషం…

పెద్ది మూవీ ట్రైలర్ లో హైలెట్ అయ్యేది ఆ నటుడేనా..?

Peddi Ticket Price Hike
Peddi Ticket Price Hike

Peddi Movie Trailer: తెలుగు సినిమా ఇండస్ట్రీలో వచ్చే సినిమాల కంటెంట్ మారిపోయింది. ప్రేక్షకులు డిఫరెంట్ సినిమాలు చూడడానికే ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. కాబట్టి వైవిద్య భరితమైన కథాంశాలతో సినిమాలను చేసి సూపర్ సక్సెస్ లను సాధించాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలో రామ్ చరణ్ హీరోగా చేసిన ఈ సినిమా వచ్చే నెల 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ రేపు రిలీజ్ చేస్తున్నారు. ఈ ట్రైలర్ లో రామ్ చరణ్ తో పాటు మరొక నటుడు కూడా హైలెట్ అవ్వబోతున్నారు అంటూ సినిమా యూనిట్ నుంచి కొన్ని వార్తలైతే వస్తున్నాయి.

ఇప్పటివరకు ఈ సినిమాకి సంబంధించిన ప్రతి ఎపిసోడ్ ని హైలెట్ చేస్తూ వచ్చారు. అంటే రామ్ చరణ్ ఎలాంటి పాత్రను పోషిస్తున్నాడు. అసలు సినిమా థీమ్ ఏంటి ఈ మూవీ ఎక్కడ జరుగుతుంది. ఏ సంవత్సరం కాలంలో ఈ సినిమా నడుస్తుంది అనే ఒక సెటప్ అంతా ప్రేక్షకులకు ఇంట్రడ్యూస్ చేశారు.

కానీ ఇప్పుడు మాత్రం రామ్ చరణ్ క్యారెక్టర్ లోని కెపాబిలిటిని చూపిస్తూనే మీర్జాపూర్ లో మున్నాభాయ్ గా నటించి మెప్పించిన దివ్యాంద శర్మ ఈ సినిమాలో రామ్ బుజ్జి అనే ఒక కీలకపాత్రలో నటిస్తున్నాడు. అయితే ఆ పాత్ర సినిమాకి చాలా హైలైట్ గా నిలువబోతుందట. సినిమా మొత్తానికి ఈ పాత్ర చాలా డిఫరెంట్ గా ఉండబోతుందని చెబుతున్నారు.దానికి తగ్గట్టుగానే ట్రైలర్ లో సైతం దివ్యాంద శర్మ ను హైలెట్ చేస్తూ ట్రైలర్ కట్ అయితే చేశారట.

ఇక ఏది ఏమైనా కూడా అతని పాత్ర ఏంటి అతనికి రామ్ చరణ్ కి మధ్య ఉన్న సంబంధం ఏంటి? అసలు ఈ సినిమా స్టోరీకి తను ఎలాంటి కనెక్ట్ అవుతాడు అనే విషయాలన్నిటిని ట్రైలర్లో ప్రస్ఫుటంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారట… మొత్తానికైతే ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ సక్సెస్ ని సాధిస్తుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…

సమ్మర్ లో EVలు వేడెక్కితే ఏం జరుగుతుందో తెలుసా..

Electric Vehicles Summer Heat
Electric Vehicles Summer Heat

Electric Vehicles Summer Heat: వేసవి కాలంలో ఎండలు మండిపోతున్నప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల (EVలు) భద్రతపై చాలా మందిలో రకరకాల సందేహాలు తలెత్తుతుంటాయి. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్‌ల లాగే ఈవీల్లో కూడా లిథియం అయాన్ బ్యాటరీలను ఉపయోగించడం వల్ల అధిక వేడికి ఇవి ప్రమాదాలకు గురవుతాయా అనే భయం ఉంటుంది. అయితే సరైన అవగాహన, జాగ్రత్తలు ఉంటే వేసవిలో కూడా ఈవీలను పూర్తి సురక్షితంగా ఉపయోగించవచ్చు. ఎండల తీవ్రత పెరిగినప్పుడు ఈవీల పనితీరు ఎలా ఉంటుంది, ఏయే వాహనాలు సురక్షితంగా ఉంటాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇక్కడ చూద్దాం.

సాధారణంగా పెట్రోల్, డీజిల్ కార్లతో పోలిస్తే ఎలక్ట్రిక్ వాహనాలు ప్రమాదాలకు గురయ్యే అవకాశాలు చాలా తక్కువని అంతర్జాతీయ పరిశోధనలు చెబుతున్నాయి. అయితే వేసవిలో 40 డిగ్రీల సెల్సియస్ దాటి ఎండలు ఉన్నప్పుడు, బ్యాటరీలపై అదనపు ఒత్తిడి పడుతుంది. నాణ్యత లేని లోకల్ బ్యాటరీలు, మోడిఫైడ్ వైరింగ్ లేదా బ్యాటరీ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (BMS) లోపాలు ఉన్నప్పుడు మాత్రమే వేడి వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. బ్రాండెడ్ , గుర్తింపు పొందిన కంపెనీల వాహనాల్లో ఇవి చాలా అరుదుగా జరుగుతాయి.

ఎండ తీవ్రతకు తోడు కారును లాంగ్ డ్రైవ్ చేసినప్పుడు బ్యాటరీ లోపల ఉష్ణోగ్రత విపరీతంగా పెరుగుతుంది. ఈ సమయంలో బ్యాటరీ వేడిని నియంత్రించలేకపోతే ‘థర్మల్ రన్‌అవే’ (Thermal Runaway) అనే ప్రక్రియ జరుగుతుంది. అంటే ఒక బ్యాటరీ సెల్ వేడెక్కి పక్కన ఉన్న సెల్స్‌కు ఆ వేడిని వేగంగా బదిలీ చేస్తుంది. దీనివల్ల బ్యాటరీ ఉబ్బిపోవడం, దట్టమైన పొగ రావడం లేదా షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు వచ్చే ప్రమాదం ఉంటుంది. అయితే, ఆధునిక కార్లలోని సిస్టమ్ బ్యాటరీ వేడెక్కగానే కారు పవర్‌ను తగ్గించడం లేదా ఛార్జింగ్‌ను ఆటోమేటిక్‌గా నిలిపివేయడం చేస్తుంది.

భారతదేశంలో విక్రయించే ఎలక్ట్రిక్ కార్లకు ప్రభుత్వం ‘AIS-156’ అనే కఠినమైన భద్రతా ప్రమాణాలను తప్పనిసరి చేసింది. దీని ప్రకారం కంపెనీలు అడ్వాన్స్‌డ్ కూలింగ్ టెక్నాలజీని వాడుతున్నాయి.

లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ : టాటా నెక్సాన్ ఈవీ (Tata Nexon ev), పంచ్ ఈవీ, మహీంద్రా XUV400, మరియు BYD అటో 3 వంటి ప్రముఖ కార్లలో లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీ ఉంటుంది. ఇందులో బ్యాటరీ చుట్టూ ప్రత్యేకమైన కూలెంట్ ద్రవం ప్రవహిస్తూ బ్యాటరీని ఎల్లప్పుడూ చల్లగా ఉంచుతుంది.

LFP బ్యాటరీ సాంకేతికత: టాటా, ఇతరులు వాడుతున్న LFP (Lithium Iron Phosphate) బ్యాటరీలు భారతీయ వేసవి వాతావరణానికి బాగా తట్టుకుంటాయి. ఇవి ఇతర NMC బ్యాటరీల కంటే ఎక్కువ వేడిని (సురక్షితంగా) భరించగలవు.

వేసవిలో ఈవీలు ఉన్నవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
లాంగ్ డ్రైవ్ లేదా ఎండలో ప్రయాణించి వచ్చిన వెంటనే కారును ఛార్జింగ్‌కు కనెక్ట్ చేయవద్దు. కారును కనీసం 45 నుండి 60 నిమిషాల పాటు నీడలో పార్క్ చేసి, బ్యాటరీ చల్లబడిన తర్వాతే ఛార్జ్ చేయాలి. కారును వీలైనంత వరకు నేరుగా ఎండ తగలకుండా చెట్ల కిందనో లేదా ఇండోర్ పార్కింగ్‌లోనే ఉంచాలి. ఛార్జింగ్ పాయింట్ కూడా మంచి గాలి వెలుతురు ఉండే ప్రదేశంలో ఉండాలి. మధ్యాహ్నం 12 నుండి సాయంత్రం 4 గంటల మధ్య తీవ్రమైన ఎండలు ఉంటాయి. ఈ సమయంలో ‘డీసీ ఫాస్ట్ ఛార్జింగ్’ (DC Fast Charging) వాడటం తగ్గించాలి. రాత్రి వేళల్లో లేదా ఉదయాన్నే హోమ్ ఛార్జర్ ద్వారా ఛార్జ్ చేసుకోవడం బ్యాటరీ ఆరోగ్యానికి ఎంతో మంచిది. వేసవి కాలంలో రోజువారీ వాడకం కోసం బ్యాటరీని 80% వరకు ఛార్జ్ చేయడం ఉత్తమం. నిరంతరం 100% ఛార్జ్ చేసి ఎండలో ఉంచితే బ్యాటరీపై ఒత్తిడి పెరుగుతుంది.

ఈ ఏడాది చివరి నాటికి Tata నుంచి కొత్త తరహా కారు..

Tata Motors
Tata Motors

Tata Motors: భారత ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణ, ముడి చమురు దిగుమతుల భారాన్ని తగ్గించుకోవడమే లక్ష్యంగా ఇథనాల్ బ్లెండింగ్ కార్యక్రమాన్ని ముమ్మరంగా ముందుకు తీసుకెళ్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా E20 (పెట్రోల్ 80శాతం, ఇథనాల్ 20 శాతం)ని అందుబాటులోకి తీసుకువచ్చింది. భవిష్యత్తులో దీనిని E85 లేదా పూర్తి స్థాయిలో E100కు చేర్చాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనికి అనుగుణంగా కొన్ని కంపెనీలు ఇలాంటి కార్లనే తయారు చేస్తున్నాయి. అలాంటి వాటిలో TATA ఒకటి. దేశీయ వాహన తయారీ దిగ్గజం ‘టాటా మోటార్స్’ నుంచి E20 కార్లు రాబోతున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే…

టాటా మోటార్స్ 2023 నుంచే తమ అన్ని వాహనాలను E20 ప్రమాణాలకు అనుగుణంగా మార్చేసింది. కేవలం ఇథనాల్‌తోనే ఆగకుండా ఎలక్ట్రిక్ (EV), సీఎన్‌జీ (CNG), హైడ్రోజన్ వంటి బహుళ పర్యావరణహిత ఇంధన వనరులపై సంస్థ భారీగా పెట్టుబడులు పెడుతోంది. ఇందులో భాగంగానే ‘భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో’లో టాటా ప్రదర్శించిన ‘పంచ్ ఫ్లెక్స్-ఫ్యూయల్ కాన్సెప్ట్’ (Tata Punch Flex-Fuel) వాహన ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంది.

సాధారణ టాటా పంచ్ కారులో ఉండే 1.2 లీటర్, త్రీ-సిలిండర్ పెట్రోల్ ఇంజన్ నే ఈ ఫ్లెక్స్-ఫ్యూయల్ మోడల్‌లోనూ ఉపయోగించారు. అయితే, ఇథనాల్‌ స్వభావం పెట్రోల్‌తో పోలిస్తే భిన్నంగా ఉంటుంది. కాబట్టి ఇంజిన్ దెబ్బతినకుండా టాటా ఇంజనీర్లు కీలక మార్పులు చేశారు. ఇంధనంలో ఇథనాల్ శాతం ఎంత ఉందో ఆటోమేటిక్‌గా గుర్తించి, దానికి తగినట్లుగా ఇంజిన్ పనితీరును ఇది మారుస్తుంది. ఇథనాల్ వల్ల తుప్పు పట్టకుండా ఉండేందుకు ఫ్యూయల్ లైన్లు, పంపులు, ఇంజెక్టర్లను ప్రత్యేక మెటీరియల్‌తో తయారు చేశారు. ఇథనాల్ దహన ప్రక్రియ తర్వాత వచ్చే ఉద్గారాలను సమర్థంగా నియంత్రించేలా ఎగ్జాస్ట్ (సైలెన్సర్) వ్యవస్థను రీ-డిజైన్ చేశారు.

ఫ్లెక్స్ ఫ్యూయల్ (Flex-Fuel)వాహనాల వల్ల ఒకే వాహనం 100 శాతం స్వచ్ఛమైన పెట్రోల్‌ లేదా పెట్రోల్-ఇథనాల్‌ కలిసిన ఏ ఏ నిష్పత్తి మిశ్రమంతోనైనా (ఉదాహరణకు E85 లేదా E100) ఎలాంటి ఇబ్బంది లేకుండా సాఫీగా వెళ్తుంది. ఇథనాల్ అనేది చెరకు రసం, మొలాసిస్, పాడైపోయిన ధాన్యాలు (మొక్కజొన్న, విరిగిన బియ్యం) వంటి వ్యవసాయ ఉత్పత్తుల నుండి తయారయ్యే ఒక రకమైన బయో-ఫ్యూయల్ (జీవ ఇంధనం). పెట్రోల్‌తో పోలిస్తే ఇథనాల్ మండటం వల్ల కార్బన్ మోనాక్సైడ్, హైడ్రోకార్బన్ల ఉద్గారాలు గణనీయంగా తగ్గుతాయి. ఇది గాలి నాణ్యతను మెరుగుపరుస్తుంది.మరోవైపు ఇథనాల్ తయారీకి వ్యవసాయ వ్యర్థాలు, పంటలు అవసరం కాబట్టి దేశీయ రైతులకు అదనపు ఆదాయ వనరు లభిస్తుంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. టాటా మోటార్స్ ప్రదర్శించిన పంచ్ ఫ్లెక్స్-ఫ్యూయల్ కాన్సెప్ట్.. భారతదేశం స్వయంసమృద్ధి, హరిత భవిష్యత్తు వైపు వేగంగా అడుగులు వేస్తోందనడానికి ఒక బలమైన నిదర్శనం.

విజయ్ కి త్రిష.. మాళవికకు ఎవరు? ఓరేయ్ మీరు జర్నలిస్టులా? ఏంట్రా ఇదీ

Malavika Mohanan And Vijay
Malavika Mohanan And Vijay

Malavika Mohanan And Vijay: బోడి గుండుకు మోకాలికి ముడి పెట్టే వాళ్లను ఏమంటారు.. అసలు లేని సంబంధాన్ని అంటగట్టే వాళ్లను ఏమంటారు.. ఇప్పటి కాలంలో అయితే జర్నలిస్టులు సారీ సారీ సో కాల్డ్ సన్నాసులు అనాలేమో.. పైగా తాము పాత్రికేయాన్ని ఉద్దరిస్తున్నట్టు.. తాము ఉద్దండులం అన్నట్టు వీళ్ళ బిల్డప్ లు కొనసాగుతుంటాయి.. అసలు ఒక్కడికైనా సక్కగా చదువు వస్తుందా.. కనీసం డిగ్రీ వరకైనా చదువుకున్నారా.. జర్నలిజం పాఠాలు తెలుసా.. ఎలాంటి ప్రశ్నలు వేయాలి.. ఎలా సమాధానాలు తెలుసుకోవాలి.. ఎలాంటి ప్రమాణాలు పాటించాలి.. ఇవేవీ తెలియదు. గొట్టం పట్టుకోగానే ప్రతి ఒక్కడు సర్వంతర్యామి లాగా.. సర్వశక్తి సంపన్నుడిలాగా బిల్డ్అప్ ఇస్తుంటారు.

ఈ తరహా పాత్రికేయంలో తమిళనాడుకు చెందిన పాత్రికేయులు పీహెచ్డీ చేశారేమో అనిపిస్తుంది. ఎందుకంటే వారు మాట్లాడుతున్న మాటలు.. అడుగుతున్న ప్రశ్నలు బి గ్రేడ్ స్థాయి కంటే దారుణంగా ఉన్నాయి. అసలు ఎవరితో మాట్లాడుతున్నాం.. ఎలా మాట్లాడుతున్నామనే సోయి లేకుండా పోతోంది. ఆడవాళ్లను అడగకూడని ప్రశ్నలు అడుగుతున్నారు. వారు ఇబ్బంది పడుతున్నా సరే రాక్షస ఆనందం పొందుతున్నారు. అటువంటిదే ఈ సంఘటన కూడా.

తమిళనాడులో విజయ్ ప్రభుత్వం ఏర్పడింది. ముఖ్యమంత్రిగా విజయ్ కొనసాగుతున్నారు. ఆయనకు మరొక నటికి సంబంధం ఉందని వార్తలు వస్తున్నాయి. ఆ సంబంధాన్ని బలపరిచే విధంగా వారిద్దరు వివరిస్తున్నారు. అది వారిద్దరి వ్యక్తిగత ఇష్టం. అలా ఉండదు అని చెప్పడానికి ఎవరికీ ఎటువంటి అధికారం లేదు. కానీ కొంతమంది తమిళ పాత్రికేయులకు విజయ్, ఆ నటి వ్యవహారంలో ఇంకా ఏదో తెలుసుకోవాలని ఆసక్తి పెరిగింది. కాకపోతే ఇటువంటి ఆలోచన పాత్రికేయులకు రావడం దుర్మార్గం. ఎందుకంటే వ్యక్తిగతంగా ఎవరి ప్రైవసీ వారికి ఉంటుంది. దానిని గౌరవించాలి. అలా కాకుండా పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తే ఇదిగో ఇలానే ఉంటుంది.

మాళవిక మోహనన్ అనే నటి విజయ్ తో కలిసి మాస్టర్ అనే సినిమాలో నటించింది. ఆ సినిమా బాగానే ఆడింది. ఆ సినిమా తర్వాత మాళవికకు అవకాశాలు వచ్చాయి. మాస్టర్ సినిమాలో విజయ్ తో స్క్రీన్ పంచుకునే అవకాశం కూడా మాళవికకు ఎక్కువ లభించింది. మాళవిక ఇప్పుడు సినిమాలతో చాలా బిజీగా ఉంది. ఇటీవల ఓ సినిమా ప్రమోషన్ కు సంబంధించి తమిళనాడు వచ్చింది. అక్కడ ఆమెకు విలేకరుల నుంచి రకరకాల ప్రశ్నలు ఎదురయ్యాయి..”విజయ్ త్రిషతో వెళ్ళినట్టుగానే.. మీతో కూడా వెళ్తుంటారా.. లేదా మీరు కూడా ఆయనతో వెళ్తుంటారా.. మీరు ఆయనతో వెళ్లినట్టు వార్తలు వచ్చాయి కదా.. దీనిపై మీ స్పందన ఏంటి” ఈ ప్రశ్నను ఓ విలేఖరి మాళవికను అడగగానే ఆమె ముఖం మాడిపోయింది. ఆ ప్రశ్నకు ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు. ఆ తర్వాత ఆ విలేకరి ముఖం ఒకసారి చూసింది.

అక్కడ జనం ఉన్నారు కాబట్టి సరిపోయింది. లేకుంటే చెప్పుతో కొట్టేదేమో. తప్పులేదు.. అటువంటి ప్రశ్నలు అడిగే సన్నాసులకు జర్నలిస్టులం అని చెప్పుకునే కనీస అర్హత లేదు. ఇటువంటి వారి వల్లే కదా పాత్రికేయాన్ని ఎవడూ నమ్మనిది.. అసలు ఆ ప్రశ్న ఎలా ఉందంటే.. మీరు కూడా విజయ్ తో సంబంధం కలిగి ఉన్నారు కదా.. అన్నట్టుగా ఉంది. మాళవికకు ఎంతో భవిష్యత్తు ఉంది. రేపట్నాడు ఆమెన్ వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతుంది. అప్పుడు ఆమె పరిస్థితి ఎలా ఉంటుంది.. అందువల్లే ఇటువంటి లేకి సన్నాసులు పాత్రికేయంలోకి రాకూడదు. పాత్రికేయులమని చెప్పుకోకూడదు.

ఇంట్లో చికెన్ ను కడుగుతున్నారా..

Chicken Washing Safety
Chicken Washing Safety

Chicken Washing Safety: చికెన్ వండే ముందు దానిని నీటితో బాగా కడగడం చాలా మంది ఇళ్లలో సాధారణ అలవాటు. ముఖ్యంగా ట్యాప్ కింద పెట్టి శుభ్రం చేస్తే మలినాలు పోతాయని భావిస్తుంటారు. అయితే ఆహార భద్రత నిపుణులు మాత్రం ఇది సురక్షితమైన పద్ధతి కాదని హెచ్చరిస్తున్నారు. చికెన్‌ను కడిగే సమయంలో నీటి చిమ్ముర్లు సింక్, కిచెన్ ప్లాట్‌ఫామ్, పాత్రలు, కూరగాయలు వంటి వాటిపై పడుతూ ప్రమాదకరమైన బాక్టీరియాను వ్యాపింపజేస్తాయని చెబుతున్నారు. దీంతో ఏం జరుగుతుందో తెలుసా?

పచ్చి చికెన్‌పై సాధారణంగా సాల్మొనెల్లా, క్యాంపిలోబాక్టర్ వంటి హానికరమైన బాక్టీరియా ఉండే అవకాశం ఉంటుంది. ఇవి మన కంటికి కనిపించవు. ట్యాప్ నీటితో కడిగితే అవి పూర్తిగా పోవు. పైగా నీటి చుక్కల ద్వారా ఇతర ఆహార పదార్థాలకు చేరి ఫుడ్ పాయిజనింగ్‌కు కారణమవుతాయి. కడిగిన చికెన్‌ను తాకిన చేతులతో ఇతర వస్తువులను ముట్టుకుంటే కూడా బాక్టీరియా వ్యాప్తి చెందుతుంది.

కొన్ని పరిశోధనల ప్రకారం.. చికెన్‌ను కడగడం కంటే సరైన ఉష్ణోగ్రతలో బాగా వండడం ఎంతో ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. అధిక వేడి వల్లే బాక్టీరియా పూర్తిగా నశిస్తుంది. చికెన్ లోపల భాగం కూడా బాగా ఉడికేలా చూసుకోవాలి. పూర్తిగా ఉడకని చికెన్ తింటే కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలు, జ్వరం వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది.

చికెన్‌ను కూరగాయలు, పండ్లు, రెడీ టు ఈట్ ఫుడ్‌కు దూరంగా ఉంచడం చాలా అవసరం. పచ్చి మాంసం నుంచి వచ్చే ద్రవాలు ఇతర ఆహారాలపై పడితే క్రాస్ కంటామినేషన్ జరుగుతుంది. అందుకే ఫ్రిజ్‌లో కూడా చికెన్‌ను మూత ఉన్న డబ్బాలో లేదా కింద షెల్ఫ్‌లో ప్రత్యేకంగా నిల్వ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

కిచెన్‌లో వాడే కట్టింగ్ బోర్డులు కూడా ప్రత్యేకంగా ఉండాలి. చికెన్ కట్ చేసే బోర్డు, కూరగాయలు కట్ చేసే బోర్డు వేర్వేరుగా వాడితే బాక్టీరియా వ్యాప్తి తగ్గుతుంది. అలాగే చికెన్ కట్ చేసిన కత్తులను వెంటనే వేడి నీటితో శుభ్రం చేయడం మంచిది. ఒకే బోర్డు, ఒకే కత్తిని శుభ్రం చేయకుండా మళ్లీ వాడటం ప్రమాదకరం.

చికెన్ హ్యాండిల్ చేసిన తర్వాత చేతులను కనీసం 20 సెకన్ల పాటు సబ్బుతో బాగా కడుక్కోవాలి. అలాగే సింక్, కిచెన్ టాప్, ట్యాప్ హ్యాండిల్స్ వంటి ప్రాంతాలను కూడా శుభ్రపరచాలి. చాలామంది చేతులు కడిగినా కిచెన్ ఉపరితలాలను మర్చిపోతారు. దీంతో అక్కడ ఉన్న బాక్టీరియా మళ్లీ ఇతర ఆహారాలకు చేరే అవకాశం ఉంటుంది.

కొంతమంది చికెన్‌పై నిమ్మరసం, వెనిగర్ లేదా పసుపు వేసి కడిగితే బాక్టీరియా పోతుందని అనుకుంటారు. అయితే ఇవి వాసన తగ్గించడంలో సహాయపడినా ప్రమాదకర సూక్ష్మక్రిములను పూర్తిగా తొలగించలేవని నిపుణులు చెబుతున్నారు. సరైన హైజీన్ పాటించడం, బాగా ఉడికించడం మాత్రమే భద్రమైన మార్గమని స్పష్టం చేస్తున్నారు.