Home Blog Page 263

'పెద్ది' మూవీ టీంకి ఊహించని షాక్ ఇచ్చిన సెన్సార్.. పాపం బుచ్చి బాబు..

Peddi Movie Censor Cuts
Peddi Movie Censor Cuts

Peddi Movie Censor Cuts: సోషల్ మీడియా లో ఇప్పుడు ఎక్కడ చూసినా డైరెక్టర్ బుచ్చి బాబు నే కనిపిస్తున్నాడు. ఎందుకంటే ఆయన దర్శకత్వం లో , గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరో గా నటించిన ‘పెద్ది’ చిత్రం వచ్చే నెల 4 న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ అన్ని ప్రాంతీయ భాషల్లో విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా ప్రొమోషన్స్ లో భాగంగా బుచ్చి బాబు కనిపించిన ప్రతీ ఛానల్ కి వరుసపెట్టి ఇంటర్వ్యూస్ ఇస్తున్నాడు. ‘పెద్ది’ చిత్రానికి సంబంధించిన అనుభవాలను పంచుకుంటూ , ఆయన మాట్లాడిన మాటలు సినిమాపై మరింత అంచనాలు ఏర్పడేలా చేస్తున్నాయి. ఈ ఇంటర్వ్యూస్ చూసిన తర్వాత అర్థం అయ్యింది ఏమిటంటే , బుచ్చి బాబు మంచి విజన్ ఉన్న డైరెక్టర్ అని , ఆయన విజన్ కి తగ్గ ఔట్పుట్ వచ్చేంత వరకు టెక్నీషియన్స్ నుండి ఎన్ని రీ టేకులు అయినా తీసుకుంటాడని తెలుస్తోంది.

AR రెహమాన్ లాంటి లెజెండ్ తోనే , నాకు ఈ ట్యూన్ నచ్చలేదు అని చెప్పి, ఆయన తన విజన్ కి తగ్గ బెస్ట్ ట్యూన్ ఇచ్చేంత వరకు వదల్లేదు అంటే, బుచ్చి బాబు అవుట్ పుట్ విషయం లో ఎంత కచ్చితమైన మనస్తత్వం తో ఉంటాడో అర్థం చేసుకోవచ్చు. అంతే కాదు , ఫైనల్ ఔట్పుట్ విషయం లో కూడా అసలు తగ్గేదేలే అనే మోడ్ లోనే ఉన్నాడు బుచ్చి బాబు. రీసెంట్ గానే ఈ చిత్రం సెన్సె కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఫైనల్ ఎడిట్ వెర్షన్ పూర్తి అయ్యాక 3 గంటల 10 నిమిషాల నిడివి వచ్చిందట. అయితే సెన్సార్ సభ్యులు కట్స్ బాగానే సూచించారట. అందుకు బుచ్చి బాబు కాస్త అసహనం కి గురైనట్టు తెలుస్తోంది. ఎందుకంటే సినిమాలో , ఆయా సందర్భాల్లో ఇవి అత్యంత కీలకమైనవి అట, అందుకే చాలా వరకు సెన్సార్ సభ్యులను రిక్వెస్ట్ చేసాడట , కానీ వాళ్ళు ఒప్పుకోవడం తో కట్స్ కి అంగీకరించాల్సి వచ్చింది బుచ్చి బాబు.

దాదాపుగా 10 నిమిషాల సన్నివేశాలను సినిమా నుండి తొలగించారట. ఇప్పుడు మూడు గంటల సినిమాగా మిగిలింది , చూడాలి మరి ఈ 10 నిమిషాలు తొలగించడం వల్ల , సినిమా పై ఎలాంటి ప్రభావం పడనుంది అనేది. ఇకపోతే ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని రేపు ముంబై లో ఒక గ్రాండ్ ఈవెంట్ ని ఏర్పాటు చేసి విడుదల చేయబోతున్నారు మేకర్స్. ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ ఆశించిన స్థాయిలో జరగడం లేదు , ఈ థియేట్రికల్ ట్రైలర్ తర్వాత ప్రీ సేల్స్ భారీగా పెరుగుతాయనే ఆశతో ఉన్నారు ఫ్యాన్స్. చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.

వెంకటేష్ , త్రివిక్రమ్ 'ఆదర్శ కుటుంబం' లో రీమిక్స్ సాంగ్.. ప్లానింగ్ మామూలుగా లేదుగా..

Venkatesh Adarsha Kutumbam
Venkatesh Adarsha Kutumbam

Venkatesh Adarsha Kutumbam: ‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత విక్టరీ వెంకటేష్ చేస్తున్న చిత్రం ‘ఆదర్శ కుటుంబం’. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఆడియన్స్ లో అంచనాలు మామూలు రేంజ్ లో లేవు . సాధారణంగానే త్రివిక్రమ్ చిత్రం పై అంచనాలు తారా స్థాయిలో ఉంటాయి , అలాంటిది పీక్ ఫార్మ్ లో వెంకటేష్ లాంటి ఫ్యామిలీ హీరో తో చేతులు కలిపితే ఆ మార్కెట్ లో ఎలాంటి క్రేజ్ ఉంటుంది అనేది ఊహించుకోవచ్చు. ఈ సినిమాకు కూడా మార్కెట్ లో పాన్ ఇండియన్ స్టార్ హీరోకి ఉన్నంత క్రేజ్ ఉంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది , ఈ ఏడాది లోనే షూటింగ్ పూర్తి చేసి విడుదల చెయ్యాలని చూస్తున్నారు కానీ , అది జరిగేలా లేదు , సంక్రాంతికి ఈ సినిమా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

ఈ చిత్రం లో హీరోయిన్ గా కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి నటిస్తున్న సంగతి తెలిసిందే. అదే విధంగా ముందుగా ఈ చిత్రానికి హర్షవర్ధన్ ని సంగీత దర్శకుడిగా ఎంపిక చేసుకున్నారు , కానీ అతను అనుకున్న సమయానికి ఔట్పుట్ డెలివరీ చేయలేకపోతుండడం తో , అతన్ని ఈ చిత్రం నుండి తప్పించి తమన్ ని తీసుకున్నారు. తమన్ మ్యూజిక్ కి యూత్ ఆడియన్స్ లో ఎలాంటి క్రేజ్ ఉంటుంది అనేది ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇకపోతే ఈ సినిమాలో తమన్ వెంకటేష్ పాత సినిమాల్లో సూపర్ హిట్ గా నిల్చిన ఒక పాటని రీమిక్స్ చేయబోతున్నాడట. అది ఏ పాటని రీమిక్స్ చేయబోతున్నాడు అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. నేటి తరం యూత్ ఆడియన్స్ ఉర్రూతలూ ఊగిపోయేలా , పాత సాంగ్స్ ని తన మార్క్ బీట్స్ తో అప్డేట్ చేసి కంపోజ్ చేయడం లో తమన్ ని మించిన వాళ్ళు ఇండస్ట్రీ లో ఎవ్వరూ లేరు.

కాబట్టి ఈ రీమిక్స్ సాంగ్ చార్ట్ బస్టర్ గా నిలుస్తుందని , థియేటర్స్ లో ఈ పాటని చూసి ఆడియన్స్ ఊగిపోతారని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. చూడాలి మరి ఆ రేంజ్ లో ఈ పాట ఉంటుందా లేదా అనేది. ఇకపోతే ఈ చిత్రం లో యంగ్ హీరో నారా రోహిత్ నెగెటివ్ షేడ్స్ ఉన్న పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చేస్తున్నాడు. త్రివిక్రమ్ , వెంకటేష్ కాంబినేషన్ లో సినిమా అంటే , కామెడీ , సెంటిమెంట్, పదునైన డైలాగ్స్ , ఇవన్నీ ఊహిస్తాము, కానీ ఈ చిత్రం లో అవన్నీ ఉంటూనే , మరో సర్ప్రైజింగ్ ఎలిమెంట్ కూడా చేర్చాడట త్రివిక్రమ్ శ్రీనివాస్ , మరి ఆ ఎలిమెంట్ ఏమిటి అనేది తెలియాలంటే టీజర్ వచ్చే వరకు ఆగాల్సిందే.

ఆరోజుల్లో 69 లక్షలతో తీసిన 'అల్లరి' చిత్రం ఎన్ని కోట్లు వసూలు చేసిందో తెలుసా..

Allari Movie Collections
Allari Movie Collections

Allari Movie Collections: మన టాలీవుడ్ లో ఎంతో గొప్ప టెక్నీషియన్స్ ఉన్నారు , కానీ దురదృష్టం కొద్దీ కొంతమంది క్రియేటివ్ డైరెక్టర్స్ ఇప్పుడు ఫార్మ్ లో లేరు. అలాంటి డైరెక్టర్స్ లో ఒకరు రవిబాబు. ప్రముఖ సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్టు చలపతి రావు అబ్బాయి గా ఈయన హీరోగా వెండితెర అరంగేట్రం చేసాడు, కానీ సక్సెస్ అవ్వలేదు , ఆ తర్వాత విలన్ గా , క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించాడు. అలా ఆర్టిస్టుగా బిజీ అవుతున్న రోజుల్లోనే , డైరెక్టర్ గా మారాడు. అలా ఆయన డైరెక్టర్ గా మారి తెరకెక్కించిన మొట్టమొదటి చిత్రం ‘అల్లరి’. ఈ సినిమా అప్పట్లో ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యిందో అందరికీ తెలిసిందే. అప్పటి వరకు ఒకే మూస కామెడీ సినిమాలను చూసిన ఆడియన్స్ కి ఈ చిత్రం చాలా కొత్తగా అనిపించింది.

అయితే తన కొడుకు ప్రతిభ గురించి చలపతి రావు గతం లో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది . ఆయన మాట్లాడుతూ ‘నటుడిగా అప్పుడప్పుడే రవిబాబు ఇండస్ట్రీ లో స్థిరపడుతున్నారు , సడన్ గా ఒక రోజు వచ్చి నా దగ్గర ఒక మంచి కథ కుదిరింది , డైరెక్షన్ చెయ్యాలి అనుకుంటున్నాను అని చెప్పాడు. 70 లక్షల బడ్జెట్ లోనే తీసేద్దాం అన్నాడు. అయితే మనమే తీసేద్దాం , హీరో ఎవరు అని అడిగాను. మన ఈవీవీ సత్య నారాయణ గారి రెండవ కుమారుడు నరేష్ కావాలి అని చెప్పాడు. నేను ఒక్కసారిగా షాక్ కి గురయ్యాను. ఎందుకంటే ఈవీవీ సత్యనారాయణ గారు నాకు అత్యంత సన్నిహితుడు, నాతో నరేష్ గురించి కంగారు పడుతూ ఉండేవాడు , వీడిని అసలు ఏమి చెయ్యాలి అయ్యా , ఆర్టిస్టుగా అసలు పనికిరాడు అనేవాడు’.

‘మీ మొదటి అబ్బాయి ఎలాగో హీరోగా స్థిరపడ్డాడు కదా, నరేష్ ని డైరెక్టర్ ని చేద్దామని చెప్పేవాడిని. అలాంటి వాడిని మా వాడు హీరో గా అడిగేసరికి , అదేంటి రా అని అన్నాను , నా కథకు నరేష్ మాత్రమే సరిపోతాడు అని చెప్పాడు . ఈవీవీ గారికి ఈ విషయం చెప్తే మొదట్లో నమ్మలేదు, లేదండి మావాడు నిజంగానే సినిమా చేద్దామని అంటున్నాడు అని చెప్తే సరే కానివ్వండి మీ ఇష్టం అన్నాడు. ముందుగా మేము మాత్రమే ఈ చిత్రాన్ని నిర్మించాలని అనుకున్నాము , కానీ సురేష్ గారికి కూడా కథ నచ్చడం తో 50 శాతం నేను బడ్జెట్ పెడుతా అన్నాడు, నేను కూడా అందుకు ఓకే చెప్పాను. రవిబాబు ఈ చిత్రాన్ని కేవలం 69 లక్షల్లోనే పూర్తి చేసాడు. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం అప్పట్లో పెద్ద హిట్ అయ్యింది , 5 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది’ అంటూ చెప్పుకొచ్చాడు చలపతి రావు.

'పెద్ది' ప్రొమోషన్స్ సమయంలో ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్.. రామ్ చరణ్ కి అత్యవసర సర్జరీ..

Ram Charan Peddi Collections
Ram Charan Peddi Collections

Ram Charan Surgery: సోషల్ మీడియా లో ప్రస్తుతం ఎక్కడ చూసినా ‘పెద్ది’ మేనియా నే కనిపిస్తోంది. జూన్ 4 న విడుదల అవ్వబోతున్న ఈ సినిమా కి సంబంధించి , మేకర్స్ రోజుకి ఒక అప్డేట్ ఇస్తూ , అభిమానుల్లో ఎక్కడ లేని జోష్ ని నింపుతున్నారు. ఈ సినిమాలో నటించిన నటీనటులకు సంబంధించిన క్యారెక్టర్స్ ని ప్రతీ రోజు ఒక్కొక్కటిగా పరిచయం చేస్తున్నారు మేకర్స్. నిన్న జగపతి బాబు క్యారక్టర్ ని ఆయన గెటప్ ని రివీల్ చేయగా , దానికి ఫ్యాన్స్ నుండి ఎలాంటి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిందో మనమంతా చూశాము. ఇక నేడు హీరోయిన్ జాన్వీ కపూర్ కి క్యారెక్టర్ ని రివీల్ చేయబోతున్నారు. ఇదంతా పక్కన పెడితే , డైరెక్టర్ బుచ్చి బాబు కూడా నాన్ స్టాప్ గా ప్రమోషనల్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు , సినిమాకు సంబంధించిన విశేషాలను చెప్తూ ఆడియన్స్ లో హైప్ పెంచుతున్నాడు.

ఇది ఇలా ఉండగా నిన్న రామ్ చరణ్ ముంబై లోని ఒక సెలూన్ నుండి బయటకు వస్తున్న వీడియో సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. అందులో రామ్ చరణ్ అద్భుతమైన మేకోవర్ ని చూసి ఆనందపడాలో , లేకపోతే ఆయన చేతికి కట్టిన కట్టు చూసి బాధపడాలో తెలియని పరిస్థితి ఏర్పడింది. అయితే రామ్ చరణ్ కి షూటింగ్ సమయంలో జరిగిన గాయాల గురించి నిర్మాత సతీష్ రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు. ఆయన మాట్లాడుతూ ‘కుస్తీ ఫైట్ సీక్వెన్స్ తెరకెక్కినప్పుడు రామ్ చరణ్ గారి కంటికి మాత్రమే కాదు, మణికట్టుకి కూడా దెబ్బలు తగిలాయి. మరో రెండు రోజుల్లో రామ్ చరణ్ మణికట్టుకు సర్జరీ జరగబోతుంది’ అంటూ చెప్పుకొచ్చాడు. ఈ సినిమా కోసం రామ్ చరణ్ ప్రాణం పెట్టి పనిచేశారని , ఆయన విశ్వరూపాన్ని మీరంతా జూన్ 3 న చూడబోతున్నారని అంటున్నాడు.

మేకర్స్ ఈ చిత్రానికి ప్రీమియర్ షోస్ సాయంత్రం 6 గంటల నుండి మొదలు పెడితే ఎలా ఉంటుంది అనే ఆలోచన లో ఉన్నారు. కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు , ఇండియా మొత్తం మీద ఈ ప్రీమియర్స్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారు అట మేకర్స్. అంటే జూన్ 3 న 6 గంటలకు ఒక ప్రీమియర్ షో, 9 గంటలకు మరో ప్రీమియర్ షో ఉండబోతుంది అన్నమాట. ఈ రెండు ప్రీమియర్ షోస్ తో కచ్చితంగా పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ ప్రీమియర్స్ రికార్డు ని బద్దలు కోరుతామని అంటున్నారు రామ్ చరణ్ ఫ్యాన్స్. ఆంధ్ర ప్రదేశ్ లో ప్రీమియర్ షో టికెట్ రేట్ 600 రూపాయిలు ఉండనుంది. అదే విధంగా తెలంగాణ లో కూడా అదే రేట్ కి దరఖాస్తు చేసుకున్నారు , మరి ప్రభుత్వం అందుకు అనుమతి ఇస్తుందో లేదో చూడాలి.

మళ్లీ యుద్ధానికి కాలుదువ్వుతున్న ట్రంప్‌.. ఏఐ ఫొటో దేనికి సంకేతం?

Donald Trump
Donald Trump

Donald Trump: కేవలం ఆధిపత్యం, సామ్రాజ్యవాద కాంక్షతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఫశ్చిమాసియాలో యుద్ధం రాజేశాడు. ఇరాన్‌ను తక్కువ అంచనా వేసి చేయి కాల్చుకున్న ట్రంప్‌.. ఇప్పుడు యుద్ధం ముగించేందుకు తంటాలు పడుతోంది. 50 రోజులపాటు సాగిన దాడుల్లో ఇరాన్‌ భారీగా నష్టపోయింది. ఇదే సమయంలో అమెరికాతోపాటు అమెరికా అనుకూల దేశాలు కూడా ఇరాన్‌ దాడుల్లో దెబ్బతిన్నాయి. దీంతో ట్రంప్‌ చర్చల పేరుతో యుద్ధ విరామం ప్రకటించారు. ఇటీవలే అమెరికా కాంగ్రెస్‌కు మళ్లీ యుద్ధం చేసే ఆలోచన లేదని ప్రకటించారు. కానీ తాజాగా ట్రంప్‌ తన సొంత సోషల్‌ మీడియాలో చేసిన పోస్టు మళ్లీ యుద్ధ సంకేతాలు ఇస్తున్నట్లు తెలుస్తోంది, ట్రంప్‌ తన ట్రూత్‌ సోషల్‌ మీడియా అకౌంట్‌లో షేర్‌ చేసిన ‘‘తుఫాను వచ్చే ముందు ప్రశాంతంగా ఉంటుంది’’ అనే క్యాప్షన్‌తో కూడిన చిత్రం ఇరాన్‌పై మళ్లీ దాడులు తప్పవా అన్న సంకేతాలు ఇచ్చింది. చిత్రంలో ట్రంప్‌ ఒక నేవీ అడ్మిరల్‌ ఒక ఊహాజనిత సన్ముఖస్థితిలో ఉన్నట్లు కనిపించగా, ఈ ఫ్రేమ్‌ను పాఠకులు రాజకీయ సంకేతాలుగా విభాషిస్తున్నారు.

సంకేతమా… సమీక్షా…?
ట్రంప్‌ పోస్టు యుద్ధ సంకేతమా లేక ఇప్పటి వరకు జరిగిన యుద్ధంపై సమీక్షా అన్న సందేహాలు కూడా రేకెత్తిస్తోంది. అధికారిక ప్రకటన వెలువడకుండా ఇంతటి ’హింట్‌’ సామాజిక మాధ్యమాల్లో అనేక సందేహాలకు తావిస్తోంది. ఇప్పటికే యుద్ధం కారణంగా ప్రపంచ దేశాలు తీవ్రంగా నష్టపోయాయి. ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలాయి. ఇంధన సంక్షోభం తలెత్తింది. ఇప్పుడిప్పుడే కుదుటపడుతుండగా, ట్రంప్‌ చేసిన పోస్టు మళ్లీ ఒత్తిడికి గురిచేసే ప్రమాదం ఉంది.

ట్రంప్‌ పోస్టు ఒక నేరుగా యుద్ధ ప్రకటనగా చూసుకోవడానికి ఇంకా నిర్ధారణ లేదు, కానీ ఇది పలు రాజకీయ, ఆర్థిక, భద్రతా పరిణామాలకు ఇంపల్స్‌ ఇచ్చేలా ఉంది. అధికారిక నిర్ధారణ లేకుండా దీనిని యుద్ధ హెచ్చరికగా భావించకూడదని నిపుణులు పేర్కొంటున్నారు.

ఎగ్జిబ్యూటర్స్ నుంచి మొదలైన గొడవ ప్రొడ్యూసర్స్ వరకు వచ్చిందా..?

Telugu Cinema Exhibitors Issue
Telugu Cinema Exhibitors Issue

Telugu Cinema Exhibitors Issue: సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమా తీసి దాన్ని రిలీజ్ చేయడానికి ప్రొడ్యూసర్లు ఎంతో కష్టపడుతుంటారు. ఆ సినిమా ఆడితే దానిమీద వచ్చే ప్రాఫిట్స్ తో బతికే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్రతి ఒక్కరు సినిమా మీద ఒక వ్యాపారాన్ని చేస్తున్నారనే చెప్పాలి. ముఖ్యంగా సినిమా బాగుంటే అందరు బాగుంటారు. సినిమా తేడా కొడితే మాత్రం ప్రతి ఒక్కరు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కోకతప్పదు. ముఖ్యంగా థియేటర్ యజమానులు ఆ విషయంలో చాలావరకు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. నిజానికి వీళ్ళు ఇలాంటి కష్టాలు వచ్చినా కూడా సినిమాని రన్ చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నారు. సింగిల్ స్క్రీన్ ఎగ్జిబ్యూటర్లు మాత్రం సినిమాల ద్వారా నష్టాలు వస్తున్నాయంటూ సింగిల్ స్క్రీన్స్ ను ఈ నెల చివరి నుంచి క్లోజ్ చేస్తున్నాం అంటూ ఒక ప్రకటన చేశారు. దాంతో ప్రొడ్యూసర్లందరు రంగంలోకి దిగారు. సింగిల్ స్క్రీన్స్ కి రేంటెడ్ విధానంలో డబ్బులను చెల్లిస్తున్నారు. కానీ వాళ్ళు మాత్రం పర్సంటేజ్ ల రూపంలోనే డబ్బులు చెల్లిస్తే థియేటర్లను నడుపుకోవడానికి బాగుంటుందని భావిస్తున్నారు. ఎగ్జిబ్యూటర్ల సైడ్ దిల్ రాజు లాంటి నిర్మాత ఉండగా, వాళ్లకు వ్యతిరేకంగా మైత్రి రవి, సితార నాగ వంశీ ఉన్నారు. నిజానికి సింగిల్ స్క్రీన్స్ లో సినిమా ని చూసినప్పుడే ఆ సినిమాలు ఎక్కువ ఇంపాక్ట్ ను క్రియేట్ చేస్తాయి.

మల్టీప్లెక్స్ లో సినిమాలు చూసిన కూడా అంతటి కిక్ రాకపోవచ్చు. దానివల్ల సింగల్ స్క్రీన్స్ ను బతికించుకోవాల్సిన అవసరమైతే ఉంది. ఆ సినిమాకు సంబంధించిన వేడుకలన్ని సింగిల్ స్క్రీన్స్ లోనే జరుగుతుంటాయి. కాబట్టి అలాంటి సందర్భంలో సింగిల్ స్క్రీన్ ను మూసేస్తే సినిమా మీద భారీ ఎఫెక్ట్ పడే అవకాశాలైతే ఉంటాయి.

ఇప్పటికీ సింగిల్ స్క్రీన్ లలో సినిమాను చూసి ఎంజాయ్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ కోసం అయినా వాటిని బతికించాల్సిన అవసరమైతే ఉందని చాలామంది భావిస్తున్నారు. ఇక ఎగ్జిబ్యూటర్ల నుంచి మొదలైన ఈ గొడవ ప్రొడ్యూసర్ల వరకు చేరుకుంది. వాళ్ళు ఒకరి మీద ఒకరు కామెంట్ చేసుకునే స్థాయికి వెళ్లిపోయింది.

ఇక ఈ సిచువేషన్ వల్ల ప్రొడ్యూసర్ల మధ్య గ్యాప్ పెరుగుతుంది. ఇప్పటికే దిల్ రాజుకి మైత్రి వాళ్ళకి మధ్య కొంచెం డిస్టెన్స్ ఏర్పడింది. ఇక ఇప్పుడు దిల్ రాజు కి నాగ వంశీ మధ్య కూడా విభేదాలు వచ్చే అవకాశాలైతే ఉన్నాయి. ఈ విషయం మీద ఎలాంటి డిసీజన్స్ తీసుకుంటారు అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…

ఒకరు కాదు.. ఇద్దరు.. ఎన్టీఆర్ 'డ్రాగన్' గ్లింప్స్ లో ఊహకందని ట్విస్టులు..

Dragon Glimpse Update
Dragon Glimpse Update

Dragon Glimpse Update: ఈ నెల 20 న ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా , ప్రస్తుతం ఆయన ప్రశాంత్ నీల్ తో చేస్తున్న ‘డ్రాగన్’ మూవీ కి సంబంధించిన గ్లింప్స్ వీడియో ని విడుదల చేయబోతున్నారు మేకర్స్. పుట్టినరోజు మొదలైన వెంటనే అర్థ రాత్రి 12 గంటలకు ఎన్టీఆర్ మాస్ విశ్వరూపాన్ని ఇండియా మొత్తం షేక్ అవ్వబోతుంది. నిన్న ట్విట్టర్ లో మేకర్స్ ‘APOCALYPSE’ అని వేసిన ఒక ట్వీట్ సంచలనం గా మారింది. ఈ ట్వీట్ అర్థం మే 20 న ప్రపంచం అంతం అయిపోబోతుంది అని. అంటే ఎన్టీఆర్ ని అంత పవర్ ఫుల్ గా మీరంతా చూడబోతున్నారు అంటూ చెప్పకనే చెప్పేసారు మేకర్స్. ఈ గ్లింప్స్ నిడివి దాదాపుగా 4 నిమిషాల 35 సెకండ్లు ఉంటుందట. ఒక గ్లింప్స్ వీడియో ఇంత లెంగ్త్ తో ఉండడం హిస్టరీ లో ఎప్పుడూ జరగలేదు.

ఎడారి లో చేసింగ్ సన్నివేశాలతో పాటు , కొన్ని యాక్షన్ బ్లాక్స్, పవర్ ఫుల్ డైలాగ్స్ ఇవన్నీ ఈ గ్లింప్స్ వీడియో లో ఉంటాయట. మరో ఆసక్తికరమైన ట్విస్ట్ ఏంటంటే , ఈ చిత్రం లో హీరో ఎన్టీఆర్ యే , విలన్ కూడా ఎన్టీఆర్ యే , డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నాడట. ఈ రెండు క్యారెక్టర్స్ కి సంబంధించిన డీటెయిల్స్ కూడా గ్లింప్స్ వీడియో లో చూపించబోతున్నట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్ కి డ్యూయల్ రోల్స్ వేయడం కాదు , ‘జై లవ కుశ’ లో ఏకంగా ట్రిపుల్ రోల్ చేశాడు , అందులో ఒక క్యారెక్టర్ నెగెటివ్ అయ్యినప్పటికీ, చివర్లో ఆ క్యారెక్టర్ ని పాజిటివ్ ని చేసి జనాల్లో సానుభూతి వచ్చేలా చేశాడు డైరెక్టర్. కానీ ‘డ్రాగన్’ లో అలాంటివి ఏమి లేవట , జాలి, దయ , కరుణ లేని మానవమృగం లాగా కనిపించబోతున్నాడట ఎన్టీఆర్.

ఈ రెండు క్యారెక్టర్స్ లో ఎన్టీఆర్ నట విశ్వరూపం ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోవచ్చు. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కరెక్ట్ గా మ్యానేజ్ చేస్తే , ఈ చిత్రం ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతాలను నెలకొల్పుతుంది అనడం లో ఎలాంటి సందేహం లేదు. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో రుక్మిణి వాసంత్ హీరోయిన్ గా నటిస్తుంది.

పవన్ కళ్యాణ్ కి కథ చెప్పిన తమిళ స్టార్ డైరెక్టర్... సింగిల్ సిట్టింగ్ లో ఒకే అయిందిగా...

Pawan Kalyan
Pawan Kalyan

Pawan Kalyan: తెలుగు హీరోలతో సినిమాలు చేయడానికి ఇండియాలో ఉన్న దర్శకులంతా ఆసక్తి చూపిస్తున్నారు.ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంటి నటుడు సైతం తన సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకుకెళ్తుండటం విశేషం… ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాల అతన్ని టాప్ లెవల్లో నిల్చోనిబెట్టాయి. ఇకమీదట చేయబోతున్న సినిమాల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఈ సంవత్సరం వచ్చిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించకపోయిన కూడా తర్వాత రాబోయే సినిమాలతో పెను ప్రభంజనాలను సృష్టించాలనే ప్రయత్నంలో పవన్ కళ్యాణ్ ఉన్నాడు. ఇక దానికి తగ్గట్టుగానే ఇప్పుడు సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇక ఈ సినిమాతో పాటుగా మరొక ఇద్దరు దర్శకులతో కూడా అతను పని చేయబోతున్నాడనే వార్తలైతే వస్తున్నాయి. ఇక రీసెంట్ గా ఒక తమిళ దర్శకుడు ఆయనకి కథ వినిపించాడట.

ఇంతకీ ఆ దర్శకుడు ఎవరంటే జైలర్ సినిమాతో సక్సెస్ ను సాధించిన నెల్సన్ కావడం విశేషం…ఆయన సైతం రీసెంట్ గా పవన్ కళ్యాణ్ కి ఒక కథనైతే వినిపించారట. ఆయన ప్రస్తుతం రజినీకాంత్ తో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తి అయిన తర్వాత రజనీకాంత్ కమల్ హాసన్ లను పెట్టి ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు.

ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ కి కూడా ఒక కథ చెప్పాడట. సోషల్ మెసేజ్ ఉన్న కథ కావడంతో పవన్ కళ్యాణ్ ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. ఇక త్రివిక్రమ్ సైతం ఇందులో ఇన్వాల్వ్ అయి కథలో మార్పులు చేర్పులు చేస్తాడా లేదంటే కథని అలాగే ఉంచుతాడా అనేది తెలియాల్సి ఉంది.

ఇక పవన్ కళ్యాణ్ కాబట్టి త్రివిక్రమ్ ఆ కథలోని లోటు పాట్లను చూసి పవన్ కళ్యాణ్ కి మరోక నరేషన్ కూడా ఇప్పిస్తాడు. అది కూడా కన్ఫర్మ్ అయితే నెల్సన్ డైరెక్షన్లో పవన్ కళ్యాణ్ సినిమా అనౌన్స్ మెంట్ వస్తుంది. లేకపోతే మాత్రం ఈ ప్రాజెక్ట్ మధ్యలోనే ఆగిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి…

ప్లేఆఫ్ రేసు: ఐపీఎల్ విచిత్రపరిస్థితి : RCB గెలవాలని CSK అభిమానుల పూజలు

IPL 2026 Playoffs
IPL 2026 Playoffs

IPL 2026 Playoffs: ఐపీఎల్ అభిమానుల అచనాలకు అందని విధంగా సాగిపోతోంది. ముఖ్యంగా ప్లే ఆఫ్ బెర్త్ ఖరారు చేసుకున్న జట్లు ఓటమిపాలవుతున్నాయి. దీంతో గణాంకాలు మారిపోతున్నాయి. సమీకరణాలు తారు మారవుతున్నాయి. దీంతో ఏ జట్టు ప్లే ఆఫ్ వెళ్తుంది.. ఏ జట్టు ఇంటికి వెళుతుంది.. అనే ప్రశ్నలు అభిమానులను తీవ్ర ఉత్కంఠకు గురిచేస్తున్నాయి.

ఐపీఎల్ లో పంజాబ్ జట్టు వరుసగా ఆరు విజయాలు నమోదు చేసింది. ఆ తర్వాత వరుసగా 5 ఓటములను నమోదు చేసింది.. దీంతో ఆ జట్టు ప్లే ఆఫ్ ఆశలు తలకిందులు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో పంజాబ్ జట్టు ఆదివారం బెంగళూరుతో జరిగే మ్యాచ్లో కచ్చితంగా గెలవాలి. అప్పుడే ఆ జట్టు ప్లే ఆఫ్ వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. అయితే ఈ మ్యాచ్లో పంజాబ్ గెలిస్తే చెన్నై జట్టుకు ప్లే ఆఫ్ వెళ్లే అవకాశాలు ఉండవు.

అందువల్లే చెన్నై అభిమానులు పంజాబ్ గెలవకూడదని.. బెంగళూరు గెలవాలని పూజలు చేస్తున్నారు. ఐపీఎల్ పాయింట్ల పట్టికలో బెంగళూరు ప్రస్తుతం 16 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. ఈ జట్టు 8 విజయాలు, నాలుగు ఓటములతో ఐపీఎల్ లో మిగతా చెట్లకు అందనంత ఎత్తులో ఉంది. బెంగళూరు జట్టుకు నెట్ రన్ రేటు అద్భుతంగా ఉంది . ఈ జట్టు 1.053 నెట్ రన్ రేట్ కొనసాగిస్తోంది.

పంజాబ్ జట్టు ఇప్పటివరకు 12 మ్యాచ్లు ఆడింది. ఆరు విజయాలు.. ఐదు ఓటములను నమోదు చేసింది. నెట్ రన్ రేట్ +0.355 తో కొనసాగుతోంది. ముంబై తో ఓడిపోవడం ఈ జట్టు భవితవ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. బెంగళూరు తో ఒకవేళ ఈ జట్టుకు ఓడిపోతే.. ప్లే ఆఫ్ వెళ్ళే అవకాశాలు ఉండవు. లక్నో జట్టుతో గెలిచినా కూడా ఉపయోగం ఉండదు. పంజాబ్ ఓడిపోతే చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు మార్గం సుగమం అవుతుంది. ఈ చెట్టు ఖాతాలో 12 పాయింట్లు ఉన్నాయి..+0.027 నెట్ రన్ రేట్ ఉంది. జట్టు ఇంకా సన్ రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ క్యాపిటల్స్ తో ఆడాల్సి ఉంది. పంజాబ్ ఓడిపోయి.. చెన్నై వరుసగా రెండు మ్యాచ్లో గెలిస్తే.. అప్పుడు దర్జాగా ప్లే ఆఫ్ వెళ్తుంది. ఇటీవల లక్నో జట్టుతో జరిగిన మ్యాచ్లో ఓడిపోకుండా ఉంటే ఈ జట్టుకు బాగుండేది. అందువల్లే నేటి మ్యాచ్లో బెంగళూరు గెలవాలని.. పంజాబ్ ఓడిపోవాలని చెన్నై అభిమానులు భావిస్తున్నారు.

యంగ్ క్రికెటర్ తో హీరోయిన్ శ్రీలీల డేటింగ్.. ఇలా దొరికిపోయిందేంటి..

Sreeleela Tilak Varma Relationship
Sreeleela Tilak Varma Relationship

Sreeleela Tilak Varma Relationship: ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిన నటి శ్రీలీల. ఈమె ఇండస్ట్రీ లోకి వచ్చిన తర్వాత అప్పటి వరకు టాప్ హీరోయిన్స్ గా చలామణి అయిన వాళ్ళందరూ కనుమరుగు అయిపోయారు. ఇప్పుడు ఆమెకు కెరీర్ నిండా డిజాస్టర్ ఫ్లాప్స్ ఉన్నాయి , అయినప్పటికీ కూడా నిర్మాతలు ఈమెతో సినిమాలు చేయడానికి క్యూలు కడుతున్నారంటే , యూత్ లో ఆమెకు ఉన్నటువంటి క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఇదంతా పక్కన పెడితే ఈ సినీ గ్లామర్ ప్రపంచం లో హీరోయిన్స్ పై రూమర్స్ ఉండడం సర్వ సాధారణం. కానీ శ్రీలీల అందుకు అతీతం , ఈమెపై ఎలాంటి రూమర్స్ లేవని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు ఈమె మీద కూడా రూమర్స్ మొదలయ్యాయి. బాలీవుడ్ లో శ్రీలీల కి సంబంధించిన ఒక రూమర్ ఇప్పుడు ఇండస్ట్రీ ని షేక్ చేస్తోంది.

ప్రముఖ క్రికెటర్ తిలక్ వర్మ తో శ్రీలీల ప్రేమలో ఉందని, వీళ్లిద్దరు ప్రస్తుతం డేటింగ్ చేస్తున్నారని అంటున్నారు. ఎందుకంటే రీసెంట్ గా ఈమె ధర్మశాల లో జరిగిన పంజాబ్ కింగ్స్ వెర్సస్ ముంబై ఇండియన్స్ ఐపీఎల్ మ్యాచ్ లో ఆడియన్స్ గ్యాలరీ లో కూర్చొని ఎంజాయ్ చేసింది. ఈమెతో పాటు, తల్లి స్వర్ణలత కూడా ఉండడం విశేషం. వీళ్లిద్దరు తిలక్ వర్మ తో అత్యంత సన్నిహితంగా ఉండడం, అంతే కాకుండా రెండు మూడు సార్లు ముంబై లో తిలక్ వర్మ తో కలిసి శ్రీలీల కనిపించడం వంటివి వీళ్లిద్దరు ప్రేమలో ఉన్నారు అనే రూమర్ కి బలాన్ని చేకూరుస్తోంది. గతం లో సూర్య కుమార్ యాదవ్ కూడా తిలక్ వర్మ ప్రేమలో ఉన్నాడు అంటూ తీజ్ చేసిన వీడియో కి లింక్ చేసి చూస్తూ , వీళ్లిద్దరు కచ్చితంగా ప్రేమలోనే ఉన్నారు అని తేల్చి చెప్పేస్తున్నారు నెటిజెన్స్.

అయితే శ్రీలీల సన్నిహిత వర్గాలు మాత్రం , తిలక్ వర్మ కుటుంబం తో శ్రీలీల కుటుంబానికి ఎప్పటి నుండో మంచి సాన్నిహిత్యం ఉందని , ఆ కారణం చేతనే తిలక్ వర్మ మ్యాచ్ లకు శ్రీలీల వస్తుందని అంటున్నారు. ఇందులో ఎంత మాత్రం నిజముందో చూడాలి . ఇక శ్రీలీల కెరీర్ విషయానికి వస్తే, తెలుగు లో ప్రస్తుతం ఈమె ఎలాంటి సినిమాకు కమిట్ అవ్వలేదు. ఈమె హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కమర్షియల్ గా ఎంత పెద్ద ఫ్లాప్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. అదే విధంగా ఈమె కోలీవుడ్ లో రెండు కొత్త సినిమాల్లో నటించడానికి రీసెంట్ గానే సంతకాలు చేసింది , అదే విధంగా బాలీవుడ్ లో ఈమె హీరోయిన్ గా నటించిన రెండు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.

కరీంనగర్‌ మంత్రుల ’పవర్‌ కట్‌’.. సీఎం రేవంత్‌ సంచలన నిర్ణయం!

Karimnagar Ministers Power Cut
Karimnagar Ministers Power Cut

Karimnagar Ministers Power Cut: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. తన కేబినెట్‌ను పూర్తిస్థాయిలో విస్తరించకుండా ఇప్పటికీ ఎమ్మెల్యేలను ఊరిస్తున్నారు. అసంతృప్తి వ్యక్తమైన ప్రతీసారి విస్తరణ అంశాన్ని తెరపైకి తెస్తున్నారు. అయితే రెండున్నరేళ్లుగా కోఆర్డినేషన్‌తో పాలన సాగిస్తున్నారు. కరీంనగర్‌ మంత్రులకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ముఖ్యంగా శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌ సీఎం పాల్గొనే ప్రతీ కార్యక్రమంలో పాల్గొనడమే ఇందుకు నిదర్శనం. అయితే తాజాగా సీఎం సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఉమ్మడి జిల్లాకు చెందిన శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌తోపాటు తొలిసారి ఎమ్మెల్యే అయి మంత్రివర్గంలో స్థానం దక్కించుకున్న ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ పవర్‌ కట్‌ చేశారు.

వారి సిఫారసులు ఉమ్మడి జిల్లాకే..
సీఎంఆర్‌ఎఫ్‌ విషయంలో నిన్నటి వరకు మంత్రులు తమ ఉమ్మడి నియోజకవర్గ పరిధిలోని లబ్ధిదారులతోపాటు రాష్ట్రవ్యాప్తంగా సిఫార్సు చేయడానికి సౌలభ్యం ఉండేది. కానీ ఇప్పుడు ఆ వెసులుబాటును కట్‌ చేశారు. ఇకపై ముగ్గురు మంత్రులు ఉమ్మడి జిల్లా వరకు మాత్రమే సిఫారసు చేయాల్సి ఉంటుంది. రాష్ట్రస్థాయిలో చేస్తే పరిగణనలోకి తీసుకోరు.

పారదర్శకత పెంపు..
సీఎంఆర్‌ఎఫ్‌కు సంబంధించి దరఖాస్తులు, చెక్కుల సవరణ ప్రక్రియలను పూర్తిగా డిజిటల్‌ పరిష్కారంగా మార్చారు. ఇది అభ్యర్థుల సమాచార నమోదు నుంచి చెక్కుల పంపిణీ, భౌన్స్‌ వరకు ట్రాక్‌ చేయడానికి, మినహాయింపులు తగ్గించడానికి, మేనేజిమెంట్‌లో జోక్యాలను తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఆన్‌లైన్‌ వ్యవస్థ ద్వారా ఇటీవలికాల పాలనలో పత్రాలు, నిర్ణయాలపై పారదర్శకతతో పాటు వేగవంతమైన తనిఖీలు కూడా సులభమవుతాయి.

పాలనా ప్రభావాలు
సిఫార్సుల పరిమితి స్థానిక స్థాయిలో నిధుల సమకూర్పు ఫోకస్‌ను పెంచే అవకాశం కలిగిస్తుంది. ఈ కారణంగా నియోజకవర్గ ధోరణుల పరంగా మంత్రుల బాధ్యతలు స్పష్టమవుతాయి. మరిన్ని పారదర్శక చర్యలు వల్ల సిఫార్సుల వ్యక్తిగత నియంత్రణ పెరుగుతుంది. అయితే రాజకీయసంబంధాలలో వ్యతిరేక భావనలను పెంచే అవకాశం ఉంది. డిజిటలైజేషన్‌ దశ అధికారిక ప్రక్రియలను వేగవంతం చేసినప్పటికీ, సాంకేతిక ప్రాప్తి లేని ప్రాంతాల ప్రజల కోసం సాయంగా ఏర్పాటు చేయకపోతే కొందరు లబ్ధిదారులు నష్టపోయే అవకాశముంది.

ఈ నిర్ణయం మంత్రుల రాజకీయ వ్యూహాలకు, స్థానిక అభివృద్ధి ప్రాధాన్యాలకు ప్రభావం చూపుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. నియోజకవర్గ పరిధిలోనే ఫోకస్‌ పెరగడంతో మెరుగైన సామాజిక బహుమతి కార్యక్రమాలు సాధ్యమవుతాయని సమర్థకులు అంటున్నారు. మరోవైపు, రాష్ట్రీయ స్థాయిలో సమానమైన ప్రాజెక్టుల కోసం పోటీ తగ్గడంతో కీలక ప్రాజెక్టులకు సమయస్ఫూర్తి తగ్గే ప్రమాదం ఉండొచ్చు.

విజయ్ సీఎం అవ్వడం పై నాకు నిజంగా ఎలాంటి అసూయ లేదు - రజినీకాంత్

Rajinikanth
Rajinikanth

Rajinikanth: తమిళనాడు మీడియా లో ఎప్పటి నుండో జోరుగా సాగుతున్న చర్చ, రజినీకాంత్ , విజయ్ మధ్య కోల్డ్ వార్ నడుస్తుంది అని. నాలుగు దశాబ్దాల పాటు , పోటీ అనేదే లేకుండా తమిళ సినిమా ఇండస్ట్రీ ని శాసించిన రజినీకాంత్ కి , 2004 లో విజయ్ స్టార్ గా రైజ్ అవ్వడం అసలు నచ్చలేదని , ఇతను ఎప్పటికైనా తనను దాటేస్తాడేమో అనే భయం రజిని లో ఉండేదని, 2017 తర్వాత విజయ్ ఏకంగా తనని దాటేయడం రజినీకాంత్ కి నిద్ర లేకుండా చేసిందని , అప్పటి నుండి విజయ్ పై ఆయన అసూయ తో రగిలిపోతున్నాడని , ఎన్నికల్లో విజయ్ పార్టీ గెలిచినా తర్వాత , రజినీకాంత్ స్టాలిన్ వద్దకు వెళ్లి అన్నా డీఎంకే తో పొత్తు పెట్టుకొని మీరే ప్రభుత్వాన్ని స్థాపించండి అని చెప్పాడని, ఇలా ఎన్నో రకాల వార్తలు ప్రచారం లోకి వచ్చాయి.

వీటిపై రజినీకాంత్ ఇన్ని రోజులు స్పందించలేదు కానీ , నేడు ప్రెస్ మీట్ పెట్టి మరీ ఈ అంశంపై ఆయన స్పందించడం గమనార్హం. ఆయన మాట్లాడుతూ ‘విజయ్ కి నాకు పాతికేళ్ల వయస్సు తేడా ఉంది. అంటే రెండు తరాల తేడా ఉంది మా ఇద్దరి మధ్య. మీడియా లో విజయ్ సీఎం అవ్వడం పై నేను అసూయ తో ఉన్నానని ప్రచారం చేస్తున్నారు. ఇది చూసినప్పుడు నాకు చాలా బాధ కలిగింది. నేనెందుకు విజయ్ పై అసూయ పడుతాను?, కమల్ హాసన్ సీఎం అయితే అసూయ పడుతా , ఎందుకంటే అతను నా తరానికి చెందిన వాడు కాబట్టి. విజయ ఎంజీఆర్, ఎన్టీఆర్ కూడా సాధించలేనిది అతి తక్కువ సమయంలో సాధించి చూపించాడు. కేంద్రం లో బీజేపీ ని, తమిళనాడు లో రెండు పెద్ద తమిళ ద్రవిడ పార్టీలను ఎదురుకొని సీఎం అవ్వడం అనేది ఆశా మాషీ విషయం కాదు’.

‘నేను స్టాలిన్ ని కలిసి , మీ డీఎంకే అన్నా డీఎంకే తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుందని, నేను ఈ రెండు పార్టీలకు ఉమ్మడి సీఎం గా ఉంటానని చెప్పినట్టు గా కూడా మీడియా లో వార్తలు వచ్చాయి. ఇలాంటి వార్తలు సృష్టించడం చాలా పెద్ద తప్పు. స్టాలిన్ నాకు ఒక మంచి మిత్రుడు , అతను కొళత్తూర్ లో ఓడిపోవడం నాకు చాలా బాధని కలిగించింది , కేవలం స్నేహ భావం తోనే అతన్ని కలిసాను కానీ , విజయ్ ని తొక్కేయాలని నేను రాజకీయాల్లోకి రావాలని కాదు, దయచేసి ఇది అర్థం చేసుకోగలరు’ అంటూ సూపర్ స్టార్ రజినీకాంత్ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి.

దిల్ రాజు బ్యానర్ లో వచ్చిన ఈ మూడు సినిమాలు ఇప్పటికి ఎవర్గ్రీన్ గానే నిలిచిపోయయా..?

Dil Raju
Dil Raju

Dil Raju: ఒక సినిమా తెరమీదికి రావాలంటే దాని వెనకాల చాలామంది కష్టపడాల్సి ఉంటుంది. ఒక దర్శకుడు ప్రొడ్యూసర్ ఇద్దరు కలిసి ఆ సినిమాను సెట్స్ మీదకి తీసుకువస్తారు. కాబట్టి సినిమాకి వీళ్లిద్దరు చాలా కీలకమనే చెప్పాలి. ఇక ఇలాంటి క్రమంలోనే ప్రొడ్యూసర్ దిల్ రాజు సైతం వరుస సినిమాలను చేస్తూ సూపర్ సక్సెస్ లను సాధిస్తున్నాడు. నిజానికి ఇండస్ట్రీలో సక్సెస్ లు చాలా తక్కువగా వస్తాయి. కానీ దిల్ రాజు బ్యానర్ నుంచి వచ్చిన సినిమాలు మాత్రం 95% సక్సెస్ రేట్ ని కలిగి ఉన్నాయి అంటే ఆయన స్క్రిప్ట్ విషయంలో గాని, సినిమాలను సెట్స్ మీదకు తీసుకెళ్లడంలో గాని ఎంత జాగ్రత్తగా ఉంటాడో మనం అర్థం చేసుకోవచ్చు. అలాంటి సుకుమార్ ప్రస్తుతం చేస్తున్న సినిమాల విషయంలో ఆచితూచి మరి ముందుకు అడుగులు వేస్తున్నాడు. ఈ మధ్యకాలంలో ఆయన నుంచి వచ్చిన సినిమాలు ప్రేక్షకులను ఏ మాత్రం మెప్పించలేకపోతున్నాయి.

గత సంవత్సరం వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా సూపర్ హిట్ అయింది. అయితే రామ్ చరణ్ హీరోగా వచ్చిన గేమ్ చేంజర్ సినిమా భారీగా డీలా పడిపోయిందనే చెప్పాలి. ఇక ఇప్పటికే వాళ్ళ బ్యానర్ నుంచి 50 సినిమాలకు పైన మూవీస్ ని రిలీజ్ చేశాడు.

అయినప్పటికి తన కెరియర్ లో చేసిన సినిమాలన్నింటిలో ఒక మూడు సినిమాలు ఎవరు గ్రీన్ గా నిలిచిపోతాయి అంటూ దిల్ రాజు ఎప్పటికి చెబుతుంటాడు. అందులో ఒకటి ‘బొమ్మరిల్లు’ సినిమా కాగా, మరొకటి ‘కొత్త బంగారు లోకం’ ఇంకొకటి ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమా కావడం విశేషం… ఈ మూడు సినిమాలకి చాలా మంచి ప్రత్యేకత ఉంది.

ఇప్పటికి జనాలు ఆ సినిమాలను టీవీల్లో చూస్తూ ఉంటారని దిల్ రాజు పాలు సందర్భాల్లో చెప్పాడు. ఇక ఏది ఏమైనా కూడా దిల్ రాజు బ్యానర్ ని నిలబెట్టిన సినిమాల్లో ఈ మూడు సినిమాలు మొదటి వరుసలో ఉంటాయి… ఇక ఫ్యామిలీ ఎమోషన్స్ కి వాల్యూస్ ఇస్తూ ఆయన చిత్రీకరించే సినిమాలు ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణను సంపాదించుకుంటున్నాయి…

అల్లు అర్జున్ - లోకేష్ కనకరాజ్ మూవీ టైటిల్ ఇదేనా...

Allu Arjun And Lokesh Kanagaraj
Allu Arjun And Lokesh Kanagaraj

Allu Arjun And Lokesh Kanagaraj: ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఐకాన్ స్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటుడు అల్లు అర్జున్…తన ఎంటైర్ కెరియర్ లో చేసిన సినిమాలు తనకి ఎనలేని గుర్తింపును తీసుకొచ్చాయి. ముఖ్యంగా ‘పుష్ప’, ‘పుష్ప 2’ సినిమాలతో ఆయన ఇండియాలో భారీ పాపులారిటి ని సంపాదించుకున్నాడు. ఇక ‘పుష్ప 2’ సినిమా ఇచ్చిన సక్సెస్ తో వెనుదిరిగి చూడకుండా ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇప్పటికే అట్లీ డైరెక్షన్లో ‘రాకా’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో ఎలాగైనా సరే సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించాలని తను అనుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ సినిమా ఏ రేంజ్ సక్సెస్ ను సాధిస్తుంది. అల్లు అర్జున్ కి ఎలాంటి విజయాన్ని కట్టబెడుతుంది. అల్లు అర్జున్ కెరీయర్ని మార్చేస్తుందా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమా తర్వాత ఆయన లోకేష్ కనకరాజు దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చారు. వచ్చే ఏడాది నుంచి ఈ సినిమా సెట్స్ మీద కి వెళ్లే అవకాశాలైతే ఉన్నాయి. అయితే ఈ సినిమాకి ‘యోధ’ అనే టైటిల్ ని పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ టైటిల్ని బట్టి చూస్తుంటే ఇది కూడా ఒక భారీ కమర్షియల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కబోతుందనే వార్తలైతే వస్తున్నాయి.

ఇక లోకేష్ కనకరాజ్ కమర్షియల్ సినిమాలను చాలా అద్భుతంగా తరికెక్కించడంలో సిద్ధహస్తుడు… ఏ ఎపిసోడ్స్ ఎక్కడెక్కడ ఉండాలి. సినిమాలోని సన్నివేశాలతో ప్రేక్షకులను ఎలా బుక్ చేయాలి అనేది లోకేష్ కి తెలిసినంత బాగా ఇంకెవరికి తెలియదు.

గత సంవత్సరం రజనీకాంత్ చేసిన కూలీ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించకపోయిన కూడా లోకేష్ కనకరాజు ఎక్కడ డీలా పడకుండా అల్లు అర్జున్ తో సినిమా సెట్ చేసుకున్నాడు అంటే మామూలు విషయం కాదు… కాబట్టి ఈ ప్రాజెక్టు మీద కూడా ప్రేక్షకుల్లో విశేషమైన అంచనాలైతే ఉన్నాయి. ఇక ఈ ప్రాజెక్టు ఏ రేంజ్ సక్సెస్ ని సాధిస్తుంది. ప్రేక్షకుడిని మెప్పించగలుగుతుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…

చీరలో అందాల ‘రోజ్’

Rose Sardana
Rose Sardana

ట్రంప్‌ స్టాక్‌ ట్రేడ్స్‌.. అక్రమ ఆదాయం కోసం అధికార దుర్వినియోగం!

Trump Stock Trades
Trump Stock Trades

Trump Stock Trades: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్‌ ట్రంప్‌పై అనేక ఆరోపణలు ఉన్నాయి. ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌లోనూ ట్రంప్‌ ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఇక అధ్యక్షుడి కన్నా ముందు వ్యాపార వేత్తగా ఉన్న ట్రంప్‌ అనేక అక్రమాలకు పాల్పడినట్లు ఫిర్యాదులు ఉన్నాయి. తాజాగా ట్రంప్‌ అధ్యక్ష హోదాలో అక్రమ ఆదాయం కోసం యత్నించినట్లు ఆరోపణలు వస్తున్నాయి.2026 జనవరి–మార్చి మధ్య ట్రంప్‌ తరపున సుమారు 3,700 లావాదేవీలు జరిగాయని యూఎస్‌ ఆఫీస్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌ ఎథిక్స్‌ బహిర్గతం చేసింది. ఈ ట్రాన్సాక్షన్ల మొత్తం 220 మిలియన్‌ డాలర్ల నుంచి 750 మిలియన్‌ డాలర్ల వరకు ఉండవచ్చని అంచనా. టెక్‌ షేర్లు, కాంట్రాక్టర్‌ కంపెనీలు, బోయింగ్‌ వంటి సంస్థల్లో పెద్ద ఎత్తున కొనుగోళ్లు–అమ్మకాలు జరిగాయి.

ట్రంప్‌పై విమర్శల వెల్లువ..
ఈ అక్రమాల వెల్లడి తర్వాత ప్రతిపక్ష డెమోక్రాట్లు, సెనేటర్‌ ఎలిజబెత్‌ వారెన్‌ వంటి నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ట్రంప్‌ అధికారపు నిర్ణయాలు తన స్టాక్‌ లాభాలకు అనుకూలంగా ఉపయోగించుకున్నారని ఆరోపణలు చేశారు. జనవరి 6న ఒక మిలియన వరకు ఎన్‌విడా షేర్లు కొన్నారని ఫైలింగ్స్‌ చూపిస్తున్నాయి. దాదాపు ఒక వారం తర్వాత అమెరికా కామర్స్‌ డిపార్ట్‌మెంట్‌ ఎన్‌విడా ఏ200 ఏఐ చిప్స్‌ చైనాకు అమ్మకాలను అనుమతించింది. ఫిబ్రవరి 10న మరో పెద్ద కొనుగోలు జరిగి, తర్వాత మెటాతో ఎన్‌విడా పెద్ద డీల్‌ ప్రకటన వచ్చింది.

చైనా పర్యటన అందుకోసమేనా?
ట్రంప్‌ చైనా సందర్శనలో ఎన్‌విడా సీవో జెన్సెన్‌ హువాంగ్‌ను తీసుకెళ్లడం, స్టాక్‌ హోల్డింగ్‌తో కలిసి రాజకీయ లాభం కోసం చేసిన చర్యగా విమర్శలు వచ్చాయి. పాలంటిర్‌ వంటి కాంట్రాక్ట్‌ సంస్థల షేర్లు ప్రభుత్వ డీల్స్‌ సమయంలో కొనడం కూడా సందేహాలు రేకెత్తించింది. అయితే ట్రంప్‌ ఆర్గనైజేషన్‌ ప్రకారం, ఈ ఇన్వెస్ట్‌మెంట్లు మూడవ వ్యక్తులు నిర్వహిస్తున్నారు. బ్లైండ్‌ ట్రస్ట్‌ లాంటి వ్యవస్థలో అధ్యక్షుడు నేరుగా నిర్ణయాలు తీసుకోరు. ఎరిక్‌ ట్రంప్‌ వంటి కుటుంబ సభ్యులు ఈ ఆరోపణలను రాజకీయ ప్రచారంగా కొట్టిపారేశారు. అధికారిక నిర్ణయాలు జాతీయ భద్రత, ఆర్థిక వృద్ధి ఆధారంగా తీసుకుంటారని వాదన.

ఎంతవరకు అవినీతి?
అధ్యక్షుడి స్థాయిలో ఇంత పెద్ద స్టాక్‌ ట్రేడింగ్‌ వాల్యూమ్‌ (రోజుకు 40+ ట్రేడ్లు) సంఘర్షణల అవకాశాలను పెంచుతుంది. టైమింగ్‌ సందేహాలు రేకెత్తించడం సహజం.
ప్రభుత్వ నియంత్రణలో ఉన్న సెక్టర్ల (టెక్‌ ఎక్స్‌పోర్ట్స్, డిఫెన్స్‌ కాంట్రాక్ట్స్‌)లో ఇన్వెస్ట్‌ చేయడం ఎలైట్‌లకు ప్రయోజనం కల్పించే అవకాశం ఉంది. అమెరికా అధ్యక్షులు ఇంతకుముందు కూడా ఇన్వెస్ట్‌మెంట్లు చేసుకున్నారు. ట్రంప్‌ ముందు బాండ్లలో ఎక్కువగా ఉండేవారు. ఇప్పుడు స్టాక్స్‌కు మారడం మార్కెట్‌ ట్రెండ్‌తో సమానంగా ఉండవచ్చు.

ఈ ఘటన యాజమాన్య పారదర్శకత, ఎథిక్స్‌ నియమాల గురించి మళ్లీ చర్చనీయాంశం చేసింది. ఆరోపణలు రాజకీయంగా ఉన్నప్పటికీ, అధికారుల ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రవర్తనపై కఠినమైన నియమాల అవసరాన్ని హైలైట్‌ చేస్తున్నాయి. ఇది నిజమైన అవినీతి కాదా లేదా సాధారణ మార్కెట్‌ యాక్టివిటీ కాదా అనేది ఇంకా స్వతంత్ర దర్యాప్తు అవసరమైన విషయం. ఈ సంఘటన అమెరికా రాజకీయాల్లో ఉద్రిక్తతను మరింత పెంచుతుంది.