Peddi Movie Censor Cuts: సోషల్ మీడియా లో ఇప్పుడు ఎక్కడ చూసినా డైరెక్టర్ బుచ్చి బాబు నే కనిపిస్తున్నాడు. ఎందుకంటే ఆయన దర్శకత్వం లో , గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరో గా నటించిన ‘పెద్ది’ చిత్రం వచ్చే నెల 4 న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ అన్ని ప్రాంతీయ భాషల్లో విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా ప్రొమోషన్స్ లో భాగంగా బుచ్చి బాబు కనిపించిన ప్రతీ ఛానల్ కి వరుసపెట్టి ఇంటర్వ్యూస్ ఇస్తున్నాడు. ‘పెద్ది’ చిత్రానికి సంబంధించిన అనుభవాలను పంచుకుంటూ , ఆయన మాట్లాడిన మాటలు సినిమాపై మరింత అంచనాలు ఏర్పడేలా చేస్తున్నాయి. ఈ ఇంటర్వ్యూస్ చూసిన తర్వాత అర్థం అయ్యింది ఏమిటంటే , బుచ్చి బాబు మంచి విజన్ ఉన్న డైరెక్టర్ అని , ఆయన విజన్ కి తగ్గ ఔట్పుట్ వచ్చేంత వరకు టెక్నీషియన్స్ నుండి ఎన్ని రీ టేకులు అయినా తీసుకుంటాడని తెలుస్తోంది.
AR రెహమాన్ లాంటి లెజెండ్ తోనే , నాకు ఈ ట్యూన్ నచ్చలేదు అని చెప్పి, ఆయన తన విజన్ కి తగ్గ బెస్ట్ ట్యూన్ ఇచ్చేంత వరకు వదల్లేదు అంటే, బుచ్చి బాబు అవుట్ పుట్ విషయం లో ఎంత కచ్చితమైన మనస్తత్వం తో ఉంటాడో అర్థం చేసుకోవచ్చు. అంతే కాదు , ఫైనల్ ఔట్పుట్ విషయం లో కూడా అసలు తగ్గేదేలే అనే మోడ్ లోనే ఉన్నాడు బుచ్చి బాబు. రీసెంట్ గానే ఈ చిత్రం సెన్సె కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఫైనల్ ఎడిట్ వెర్షన్ పూర్తి అయ్యాక 3 గంటల 10 నిమిషాల నిడివి వచ్చిందట. అయితే సెన్సార్ సభ్యులు కట్స్ బాగానే సూచించారట. అందుకు బుచ్చి బాబు కాస్త అసహనం కి గురైనట్టు తెలుస్తోంది. ఎందుకంటే సినిమాలో , ఆయా సందర్భాల్లో ఇవి అత్యంత కీలకమైనవి అట, అందుకే చాలా వరకు సెన్సార్ సభ్యులను రిక్వెస్ట్ చేసాడట , కానీ వాళ్ళు ఒప్పుకోవడం తో కట్స్ కి అంగీకరించాల్సి వచ్చింది బుచ్చి బాబు.
దాదాపుగా 10 నిమిషాల సన్నివేశాలను సినిమా నుండి తొలగించారట. ఇప్పుడు మూడు గంటల సినిమాగా మిగిలింది , చూడాలి మరి ఈ 10 నిమిషాలు తొలగించడం వల్ల , సినిమా పై ఎలాంటి ప్రభావం పడనుంది అనేది. ఇకపోతే ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని రేపు ముంబై లో ఒక గ్రాండ్ ఈవెంట్ ని ఏర్పాటు చేసి విడుదల చేయబోతున్నారు మేకర్స్. ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ ఆశించిన స్థాయిలో జరగడం లేదు , ఈ థియేట్రికల్ ట్రైలర్ తర్వాత ప్రీ సేల్స్ భారీగా పెరుగుతాయనే ఆశతో ఉన్నారు ఫ్యాన్స్. చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.
















విజయ్ సీఎం అవ్వడం పై నాకు నిజంగా ఎలాంటి అసూయ లేదు - రజినీకాంత్
Rajinikanth: తమిళనాడు మీడియా లో ఎప్పటి నుండో జోరుగా సాగుతున్న చర్చ, రజినీకాంత్ , విజయ్ మధ్య కోల్డ్ వార్ నడుస్తుంది అని. నాలుగు దశాబ్దాల పాటు , పోటీ అనేదే లేకుండా తమిళ సినిమా ఇండస్ట్రీ ని శాసించిన రజినీకాంత్ కి , 2004 లో విజయ్ స్టార్ గా రైజ్ అవ్వడం అసలు నచ్చలేదని , ఇతను ఎప్పటికైనా తనను దాటేస్తాడేమో అనే భయం రజిని లో ఉండేదని, 2017 తర్వాత విజయ్ ఏకంగా తనని దాటేయడం రజినీకాంత్ కి నిద్ర లేకుండా చేసిందని , అప్పటి నుండి విజయ్ పై ఆయన అసూయ తో రగిలిపోతున్నాడని , ఎన్నికల్లో విజయ్ పార్టీ గెలిచినా తర్వాత , రజినీకాంత్ స్టాలిన్ వద్దకు వెళ్లి అన్నా డీఎంకే తో పొత్తు పెట్టుకొని మీరే ప్రభుత్వాన్ని స్థాపించండి అని చెప్పాడని, ఇలా ఎన్నో రకాల వార్తలు ప్రచారం లోకి వచ్చాయి.
వీటిపై రజినీకాంత్ ఇన్ని రోజులు స్పందించలేదు కానీ , నేడు ప్రెస్ మీట్ పెట్టి మరీ ఈ అంశంపై ఆయన స్పందించడం గమనార్హం. ఆయన మాట్లాడుతూ ‘విజయ్ కి నాకు పాతికేళ్ల వయస్సు తేడా ఉంది. అంటే రెండు తరాల తేడా ఉంది మా ఇద్దరి మధ్య. మీడియా లో విజయ్ సీఎం అవ్వడం పై నేను అసూయ తో ఉన్నానని ప్రచారం చేస్తున్నారు. ఇది చూసినప్పుడు నాకు చాలా బాధ కలిగింది. నేనెందుకు విజయ్ పై అసూయ పడుతాను?, కమల్ హాసన్ సీఎం అయితే అసూయ పడుతా , ఎందుకంటే అతను నా తరానికి చెందిన వాడు కాబట్టి. విజయ ఎంజీఆర్, ఎన్టీఆర్ కూడా సాధించలేనిది అతి తక్కువ సమయంలో సాధించి చూపించాడు. కేంద్రం లో బీజేపీ ని, తమిళనాడు లో రెండు పెద్ద తమిళ ద్రవిడ పార్టీలను ఎదురుకొని సీఎం అవ్వడం అనేది ఆశా మాషీ విషయం కాదు’.
‘నేను స్టాలిన్ ని కలిసి , మీ డీఎంకే అన్నా డీఎంకే తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుందని, నేను ఈ రెండు పార్టీలకు ఉమ్మడి సీఎం గా ఉంటానని చెప్పినట్టు గా కూడా మీడియా లో వార్తలు వచ్చాయి. ఇలాంటి వార్తలు సృష్టించడం చాలా పెద్ద తప్పు. స్టాలిన్ నాకు ఒక మంచి మిత్రుడు , అతను కొళత్తూర్ లో ఓడిపోవడం నాకు చాలా బాధని కలిగించింది , కేవలం స్నేహ భావం తోనే అతన్ని కలిసాను కానీ , విజయ్ ని తొక్కేయాలని నేను రాజకీయాల్లోకి రావాలని కాదు, దయచేసి ఇది అర్థం చేసుకోగలరు’ అంటూ సూపర్ స్టార్ రజినీకాంత్ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి.