Home Blog Page 262

ఆ సినిమా విషయంలో వెంకటేష్ - రాజశేఖర్ మధ్య విబేధాలు వచ్చాయా..?

Venkatesh Rajasekhar Differences
Venkatesh Rajasekhar Differences

Venkatesh Rajasekhar Differences: సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోల మధ్య పోటీ వాతావరణం ఉంటుంది. ఎవరి సినిమాలు సక్సెస్ లను సాధిస్తున్నాయి. ఎవరి మూవీస్ డీలా పడిపోతున్నాయనే దానిమీదనే ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే సక్సెస్ ఫుల్ సినిమాలను తీసిన హీరోలు టాప్ రేంజ్ కి వెళ్తుంటే ప్లాప్ లను మూట గట్టుకున్న హీరోలు మాత్రం పాతాళానికి పడిపోతూ ఉంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే విక్టరీ వెంకటేష్ లాంటి హీరో సైతం కెరియర్ స్టార్టింగ్ లో వరుస సినిమాలను చేస్తూ సూపర్ సక్సెస్ లను సాధించాడు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ను టార్గెట్ చేసి ఆయన సినిమాలు చేయడమే కాకుండా సక్సెస్ లను కూడా సాధించాడు.

వాళ్ళని థియేటర్ కి రప్పించడంలో ఆయన కీలకపాత్ర వహించాడనే చెప్పాలి. వెంకటేష్ ఒక సినిమాని రీమేక్ చేయాలనుకున్నాడు. కానీ ఆ సినిమాని రాజశేఖర్ చేసి సూపర్ సక్సెస్ ని సాధించాడు. ఇంతకీ ఆ సినిమా ఏంటి అంటే ‘మా అన్నయ్య’ మూవీ కావడం విశేషం…

తమిళంలో విక్రమన్ దర్శకత్వంలో విజయ్ కాంత్ హీరోగా వచ్చిన ‘వెన్నత్తై పోలా’ అనే సినిమాకి రీమేక్ గా ‘మా అన్నయ్య’ సినిమా తెరకెక్కింది. తెలుగులో ఈ సినిమాకి ‘రవి రాజా పెనిశెట్టి’ దర్శకత్వం వహించాడు. మొదట ఈ మూవీ ని వెంకటేష్ చేయాలని అనుకున్నాడట. కానీ అనుకోని కారణాల వల్ల రాజశేఖర్ ఈ సినిమాకి సంబంధించిన రైట్స్ ని చేజిక్కించుకున్నట్టుగా తెలుస్తుంది.

అందువల్ల వెంకటేష్ తో చేయాల్సిన ఈ ప్రాజెక్టు రాజశేఖర్ దగ్గరికి వెళ్లిందంటూ కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమా రాజశేఖర్ కెరియర్ లోనే సూపర్ డూపర్ సక్సెస్ గా నిలిచిందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక తెలుగు నేటివిటికి తగ్గట్టుగా ఈ సినిమాలో చాలా బాగా చేంజెస్ చేసి మరి రవి రాజా పెనిశెట్టి దర్శకత్వం వహించడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి…

పరిశోధకుడిగా నారా దేవాన్ష్ .. చంద్రబాబు, లోకేష్ ను మించిపోయాడు గా..

Nara devansh

Nara Devaansh : తాత ముఖ్యమంత్రి. దశాబ్దల రాజకీయ అనుభవం ఆయన సొంతం . తండ్రి మంత్రి.. ఆయనకు ఐటి మీద అపారమైన పట్టు.. నానమ్మ డైయిరీ వ్యవస్థాపకురాలు. తల్లి అందులో డైరెక్టర్ గా పని చేస్తూ ఉంటారు.. అటు అమ్మమ్మ.. తాతయ్య కుటుంబం కూడా రాజకీయంగా.. సినిమాలపరంగా ఘన చరిత్ర కలిగిన వారే. ఇటువంటి కుటుంబంలో పుట్టిన ఆ పిల్లాడు అదే వారసత్వాన్ని కొనసాగిస్తున్నాడు. కాకపోతే రాజకీయాల్లో కాకుండా.. వ్యాపారంలో కాకుండా భిన్నమైన దారిని ఎంచుకున్నాడు. తన ఈడు పిల్లలు ఆటపాటలతో సరదాగా గడుపుతూ ఉంటే.. అతడు మాత్రం పరిశోధన అంటూ.. బాల మేధావిగా తన ఆవిష్కరణ బయటపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు.

ఏపీ మంత్రి నారా లోకేష్ తనయుడు నారా దేవాన్ష్ కు సంబంధించి ఒక వీడియో బయటకి వచ్చింది. ఆ వీడియోను నారా లోకేష్ తన ట్విట్టర్ ఖాతాలో పంచుకున్నారు. ఆ వీడియోలో నారా దేవాన్ష్ కనిపించారు. నారా లోకేష్ ఏవో ప్రశ్నలు అడిగారు. దానికి ఆయన స్పష్టమైన సమాధానం చెప్పారు. ఫలితంగా నారా దేవాన్ష్ అల్లరి పిల్లాడు కాదు.. అద్భుతమైన మేధస్సు ఉన్నవాడని అర్థమైంది. Dino deets పేరుతో దేవాన్ష్ ఒక యూట్యూబ్ ఛానల్ ను ప్రారంభించాడు. రాక్షస బల్లులు, శిలాజాలు, పురాతన అవశేషాల గురించి కొంతకాలంగా దేవాన్ష్ పరిశోధన చేస్తున్నాడు. వివిధ పుస్తకాలలో ప్రచురితమైన అంశాలను క్రోడీకరించి.. తాను తెలుసుకున్న విషయాలను.. ఆశ్చర్యానికి గురిచేసే అంశాలను.. ఆకట్టుకునే విధంగా రూపొందించాడు. ఈకాలపు పిల్లలకు అర్థమయ్యే విధంగా వాటిని రూపొందించాడు. వీటిని పాడ్ కాస్ట్ రూపంలో తన యూట్యూబ్ ఛానల్ లో ప్రసారం చేయబోతున్నాడు.

సాధారణ యూట్యూబ్ ఛానల్ మాదిరిగా కాకుండా.. దానికోసం ఒక డైనోసార్ ప్రపంచాన్ని సృష్టించాడు దేవాన్ష్. ప్రాచీన ప్రపంచంలోకి ప్రేక్షకుడి లాగా తన తండ్రిని ఆహ్వానించాడు. దీనిపై అనేక ప్రశ్నలు నారా లోకేష్ అడిగితే.. దేవాన్ష్ ఏ మాత్రం తడుముకోకుండా సమాధానం చెప్పాడు. ఇదే విషయాన్ని నారా లోకేష్ సోషల్ మీడియాలో ప్రస్తావించారు. దీనికి సంబంధించిన స్పెషల్ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

నారా దేవాన్ష్ కొంతకాలంగా శిలాజాలు.. పురాతన సంఘటనలు.. వందల సంవత్సరాల క్రితం జీవించిన జంతువులు.. వంటి వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. తాను తెలుసుకున్న విషయాలను.. పాడ్ కాస్ట్ రూపంలో చెప్పడానికి నారా దేవాన్ష్ ప్రయత్నిస్తున్నారు. నారా లోకేష్ ప్రోమో వీడియో రిలీజ్ చేయడంతో.. నారా దేవాన్ష్ యూట్యూబ్ ఛానల్ మీద అంచనాలు భారీగా పెరిగిపోయాయి.

పెద్ది స్టోరీని అక్కడి నుంచి లేపేశాను అంటూ అసలు నిజం చెప్పేసిన బుచ్చిబాబు...

Sukumar not confident about Peddi movie
Sukumar not confident about Peddi movie

Peddi movie story : రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పెద్ది’ సినిమా వచ్చే నెల 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన ప్రతి విషయం ట్రెండింగ్ లోకి వస్తుంది. ఇక మరికొద్ది గంటల్లో ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ట్రైలర్ కనక ప్రేక్షకులను మెప్పించినట్టయితే మాత్రం సినిమా సూపర్ సక్సెస్ సాధిస్తుందని మేకర్స్ సైతం వాళ్ల అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సక్సెస్ ఫుల్ సినిమాలు చేసిన కూడా రామ్ చరణ్ కి వచ్చిన సక్సెస్ వేరే లెవెల్లో ఉంటాయనే చెప్పాలి. గత సంవత్సరం శంకర్ డైరెక్షన్ లో చేసిన ‘గేమ్ చేంజర్’ సినిమా ఫ్లాప్ అవ్వడంతో రామ్ చరణ్ కొంతవరకు వెనకబడ్డాడు. అయిన కూడా ఈ సినిమా సక్సెస్ అతనికి చాలా మంచి బుస్టాప్ ఇస్తుందని అతను భావిస్తున్నాడు. ఇక డైరెక్టర్ బుచ్చిబాబు ఈ పెద్ది సినిమా కథని ఒక దగ్గర నుంచి లేపేసాను అంటూ చెప్పడం ఇప్పుడు అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది…

తన చిన్న తనంలో తన ఊరులో పెద్దిరాజు అనే ఒక వ్యక్తి ఉండేవాడట. ఆయన కూలీ పనులు చేస్తూ చాలా బలంగా ఉండేవాడట. తను ఎవరివైపు క్రికెట్ మ్యాచ్ ఆడితే వాళ్ళ మ్యాచ్ ఈజీగా గెలిచేదట. అంతటి దృఢమైన బాడీ పెట్టుకుని ఈజీగా సిక్స్ లు కొడుతూ మ్యాచ్ ని గెలిపించేవాడట.

ఒకానొక సమయంలో ఊర్లో ఏదైనా మ్యాచ్ ఉంది అంటే ప్రతి ఒక్కరు తనకి కూలీ డబ్బులు ఇచ్చి మరి తన పనిని మాన్పించి మరి క్రికెట్ ఆడటానికి రప్పించేవారట. అలా క్రికెట్ తో పాటు తను బాస్కెట్ బాల్ కూడా బాగా ఆడేవాడని బుచ్చిబాబు చెప్పాడు. అతన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని బుచ్చి బాబు పెద్ది సినిమా కథనైతే రాసుకున్నాడట.

ఎప్పుడో చిన్నప్పుడు తన మైండ్ లో ఉండిపోయిన క్యారెక్టర్ ని ఇప్పుడు రీ క్రియేట్ చేసి రామ్ చరణ్ తో ఆ క్యారెక్టర్ చేయించడమనేది మామూలు విషయం కాదు. ఇక ఈ సినిమా కథ పల్లెటూరు నేపథ్యంలో సాగుతుందనే విషయం మనకు తెలిసిందే… మరి ఈ కథని ప్రేక్షకులు ఎంతవరకు ఓన్ చేసుకుంటారు సినిమా సక్సెస్ ఫుల్ నిలుపుతారా లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులపాటు వెయిట్ చేయాల్సిందే…

70 ఏళ్ళ వయస్సులో ఇవేమి వర్కౌట్స్ సామీ.. కుర్ర హీరోలకు కూడా సాధ్యం అవ్వదు..

Chiranjeevi workout video

Chiranjeevi workout video : ‘ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నెంబర్’ అన ది ప్రతీ ఒక్కరికి వర్తించదు , కేవలం కొంతమందికి మాత్రమే వరిస్తుంది , ఆ కొంతమంది లో ఒకరు మెగాస్టార్ చిరంజీవి. 70 ఏళ్ళ వయస్సు వచ్చింది , ఇప్పటికీ ఆయన డ్యాన్స్ లో వేగం తగ్గలేదు , మాటల్లో పదును తగ్గలేదు, అందం అంతకంటే తగ్గలేదు. ఈ వయస్సులో కూడా నిరంతరం కష్టపడుతూ నేటి తరం యువత కి ఆదర్శంగా నిలుస్తున్నాడు మెగాస్టార్. కాసేపు జాగింగ్ చెయ్యాలన్నా, వాకింగ్ చెయ్యాలన్నా బద్ధకం చూపించే యువత ఉన్న ఈ కాలం లో , 70 ఏళ్ళ వయస్సులో , అన్ని రకాల వర్కౌట్స్ చేస్తూ, తనకు తానే సాటి, ఎవ్వరూ లేరు పోటీ అని అనిపిస్తున్నాడు మెగాస్టార్. ప్రతీ సినిమాకు ప్రారంభానికి ముందు , తన బాడీ ఫిట్నెస్ మీద మెగాస్టార్ పెట్టేంత శ్రద్ద ఇండస్ట్రీ లో ఏ హీరో కూడా పెట్టాడేమో అనిపిస్తుంది.

త్వరలోనే ఆయన డైరెక్టర్ బాబీ తో ఒక యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ప్రారంభం తేదీ ఫిక్స్ అయ్యింది. దీంతో మెగాస్టార్ తనని తానూ సిద్ధం చేసుకోవడం కోసం , జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ కనిపించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. నేటి తరం కుర్ర హీరోలు ఎలా అయితే జిమ్ లో వర్కౌట్స్ చేస్తున్నారో , వాళ్ళతో సమానంగా మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న ఈ వర్కౌట్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో సంచలనం గా మారింది. రకరకాల రోగాలతో హాస్పిటల్స్ చుట్టూ తిరిగే వయస్సు లో కూడా ఇదేమి ఎనర్జీ బాసూ , నీకు మా సెల్యూట్ అంటూ సోషల్ మీడియా లో మెగా ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఇక లేటెస్ట్ మూవీ విషయానికి వస్తే , బాబీ దర్శకత్వం లో తెరకెక్కబోయే ఈ సినిమా మెగాస్టార్ కెరీర్ లోనే మైల్ స్టోన్ లాగా నిలబడబోతుంది. KVN ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని గ్రాండ్ గా నిర్మించబోతోంది. ఈ చిత్రం లో మెగాస్టార్ చిరంజీవి కి కూతురు గా అనశ్వర రాజన్ నటిస్తుండగా , మెగాస్టార్ కి జోడీగా ప్రియమణి నటించబోతుంది. అనురాగ్ కశ్యప్ విలన్ గా నటిస్తుండగా , మాలీవుడ్ సూపర్ స్టార్ మోహన్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసి వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

మహేష్ బాబు సూపర్ హిట్ మూవీ రీమేక్ చేయబోతున్న రమేష్ బాబు కొడుకు...

Ramesh Babu Son Jayakrishna
Ramesh Babu Son Jayakrishna

Ramesh Babu Son Jayakrishna: ఎన్టీఆర్, ఏఎన్నార్ తర్వాత అంత గొప్ప క్రేజ్ ను సంపాదించుకున్న హీరో సూపర్ స్టార్ కృష్ణ…మాస్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. ఇక కృష్ణ తర్వాత తన నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నటుడు మహేష్ బాబు…ఆయన తన సినిమాలతో ప్రేక్షకులందరిని మెప్పిస్తున్నాడు. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. ఇకమీదట తను చేయబోయే సినిమాలతో ప్రేక్షకులను విశేషంగా అలరిస్తాడు అంటూ అతని అభిమానులు చాలా కాన్ఫిడెంట్ ను వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే కృష్ణ పెద్ద కొడుకు అయిన రమేష్ బాబు హీరోగా ఎంట్రీ ఇచ్చిన కూడా ఆయన సక్సెస్ అవ్వలేదు.

ఇక ఇప్పుడు అతని కొడుకు ‘జయకృష్ణ’ అజయ్ భూపతి డైరెక్షన్ లో ‘శ్రీనివాస మంగాపురం’ అనే సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ మూవీ నుంచి రీసెంట్ గా ఒక టీజర్ వచ్చింది. అందులో జయకృష్ణ చాలా చక్కటి పర్ఫామెన్స్ చూపించాడు. సినిమా ఎలా ఉండబోతుంది తను యాక్టర్ గా సెట్ అవుతాడా? లేదా అనే విషయాలు తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…

ఇక ఇలాంటి క్రమంలోనే మహేష్ బాబు సూపర్ హిట్ సినిమా అయిన ‘ఒక్కడు’ మూవీని జయకృష్ణతో రీమేక్ చేయాలని కొంతమంది ప్రొడ్యూసర్స్ అనుకుంటున్నారట. దానికి మహేష్ బాబు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. మరి జయకృష్ణతో ఒక్కడు సినిమా చేస్తే కొన్ని మార్పులు చేర్పులు చేసి సినిమాను చేయాలి. అలా అయితే సినిమా సూపర్ సక్సెస్ ని సాధిస్తుందంటూ మరి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.

ఇక ఈ సినిమాకి దర్శకుడిగా ఎవరు వ్యవహరించబోతున్నారు అనేది ఇప్పుడు పెద్ద టాస్క్ గా మారింది. ఇక ఏది ఏమైనా కూడా మహేష్ బాబు అభిమానులు ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి ఎంతమంది హీరోలు వచ్చిన ఆదరించడానికి సిద్ధంగా ఉన్నామంటూ ఓపెన్ గా చెబుతున్నారు. కాబట్టి జయకృష్ణకి కూడా చాలా మంచి ఫ్యూచర్ ఉందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఒకవేళ ఒక్కడు సినిమాని రీమేక్ చేసినట్లయితే మాత్రం జయకృష్ణ కెరియర్ టాప్ లెవెల్లో ముందుకు దూసుకెళ్తుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…

హర్మూజ్‌ దాటి క్షేమంగ్రా వచ్చిన మరో నౌక.. ఈసారి 20 టన్నుల ఎల్‌పీజీ!

Hormuz Strait
Hormuz Strait

Hormuz Strait: పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా చమురు సంక్షోభం నెలకొంది. హర్మూజ్‌ మూసివేతతో గల్ఫ్‌ దేశాల నుంచి రావాల్సిన నౌకలు అక్కడే చిక్కుకుపోయాయి. దీంతో యూరప్‌ దేశాలతోపాటు పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, జపాన్‌ దేశాలు చమురు కొరతతో ఇబ్బంది పడుతున్నాయి. భారత్‌త నౌకలకు ఇరాన్‌ అనుమతి ఇస్తోంది. కానీ అక్కడి ట్రాఫిక్‌ కారణంగా మన నౌకల రాక ఆలస్యం అవుతోంది. నౌకల విజయవంతమైన ప్రయాణాలు వరుసగా దేశీయ ఇంధన సరఫరాను నిల్వలు చేయడంలో కీలక పాత్ర వహిస్తున్నాయి. ఈనెల 13న జలసంధిని దాటిన మార్షల్‌ ఐలాండ్స్‌ జెండాతో ఉన్న సైమీ ట్యాంకర్‌ గుజరాత్‌ తీరానికి చేరుకుంది. 20 వేల టన్నుల ఎల్‌పీజీ తీసుకొచ్చింది. దీంతో హర్ముజ్‌ను సేఫ్‌గా దాటిన ఎల్‌పీజీ నౌకల సంఖ్య 11కు చేరింది.

దేశంలో ఎల్‌పీజీ కొరత..
భారతదేశానికి ఎల్‌పీజీ వంటి ఇంధన ఉత్పత్తుల విదేశీ దిగుమతులు కీలకమే. ప్రతీ ట్యాంకర్‌ దేశీయ మార్కెట్‌పై, గృహ వినియోగం, వాణిజ్య అవసరాలపై తక్షణ ప్రభావాన్ని చూపుతుంది. సైమీతో వచ్చిన సుమారు 20 వేల టన్నుల ఎల్‌పీజీ స్థానిక స్టోరేజ్, రీ–డిస్ట్రిబ్యూషన్‌ ద్వారా వినియోగదారుల అవసరాలు తీర్చడానికి ఉపయోగపడుతుంది.

అవాంతరాలను దాటుకుని..
హార్ముజ్‌ ప్రాంతం నుంచి సురక్షిత రవాణా కొనసాగించడం అంతర్జాతీయ సవాళ్లను ఎదుర్కొంటుంది. వరుసగా 11 ట్యాంకర్ల సేఫ్‌ ఎక్స్‌హిట్‌లు ఉండటం సరఫరా చైన్లను నిలుపుకునేందుకు ఒక ప్రతీకాత్మక సంకేతం. అయినప్పటికీ, ప్రాంతీయ ఉత్కంఠలు కొనసాగితే రవాణా వ్యయం, బీమా సరఫరా ధరలు, మార్గాల ప్రత్యామ్నాయ ఏర్పాటుపై ప్రభావం పడవచ్చును.

ఆర్థిక, వ్యూహాత్మక ప్రభావం..
ప్రస్తుతం దేశంలో రోజుకు సుమారు 5 మిలియన్‌ బ్యారెల్స్‌ చమురు వినియోగం జరుగుతోందని అంచనాలు ఉన్న నేపథ్యంలో, సాధారణంగా ఇంధన మార్కెట్‌లో జరిగే చెల్లింపులు, ధరల స్థిరత్వానికి వర్తించే ప్రతి సరఫరా గొప్ప ప్రాధాన్యత కలిగినది.

సైమీ ట్యాంకర్‌ విజయవంతమైన రవాణా భారతానికి హార్ముజ్‌ వంటి సంకల్పప్రాంతాల నుంచి ఇంధన సరఫరా కొనసాగింపును సూచించే ఒక సానుకూల సంకేతం. అయితే ప్రాంతీయ అస్థిరతలు కొనసాగితే భవిష్యత్తులో మార్గాల భద్రత, రవాణా ఖర్చులు, వినియోగం వంటి అంశాలపై ప్రభుత్వ రంగసంస్థలు మరింత చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.

నేపాల్ ప్రధాని Gen Z నాయకుడు కాదు.. ఇండియా ద్వేషి..

Nepal PM Balen Shah
Nepal PM Balen Shah

Nepal PM Balen Shah: మార్పు కావాలి అన్నారు. మార్పు కోసం ఉద్యమించారు. రోడ్లమీదకి వచ్చారు. కొత్త నాయకత్వాన్ని కోరుకున్నారు. దానికి తగ్గట్టుగానే అక్కడ మార్పులు జరిగాయి. యువత కోరుకున్నట్టుగానే నాయకత్వ మార్పు జరిగింది. చివరికి ఏం జరిగిందంటే..

మన పక్కనే ఉన్న నేపాల్ దేశంలో కొద్ది నెలల క్రితం ఉద్యమం జరిగింది గుర్తుంది కదా.. జనరేషన్ జెడ్ ఆధ్వర్యంలో జరిగిన నిరసనలు తారాస్థాయికి చేరాయి. వారు చేసిన ఆందోళనల వల్ల అక్కడి ప్రభుత్వం తలవంచింది.. అవినీతికి పాల్పడిన పాలకులు దేశం వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఇప్పుడు అక్కడ బాలెన్ షా అనే కొత్త నాయకుడు పరిపాలిస్తున్నాడు. జనరేషన్ జెడ్ తరానికి బాలెన్ షా వారసుడిగా ఉంటున్నాడు. అయితే అతడు భారత్ మీద నిత్యం విద్వేషాన్ని ప్రదర్శిస్తున్నట్టు తెలుస్తోంది. ఫలితంగా భారత్ – నేపాల్ సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.

నేపాల్ ప్రధానమంత్రి బాలెన్ షా తీసుకున్న నిర్ణయం వల్ల ఎన్నో సంవత్సరాలుగా రవాణా రంగం మీద ఆధారపడిన భారతీయ డ్రైవర్ల ఉపాధికి పూర్తిగా గండిపడే అవకాశం కల్పిస్తోంది. ఇతడు మరో జెలెన్ స్కీ మాదిరిగా వ్యవహరిస్తున్నాడు. ఫలితంగా భారతదేశంలో పనిచేస్తున్న నేపాల్ పౌరుల జీవితాలను దుర్భరం చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తోంది. మనదేశంలో నేపాల్ దేశస్థులకు పన్నులు లేని స్వేచ్ఛ సరిహద్దు రాకపోకలు ఉన్నాయి. పైగా ఇక్కడ అక్కడి ప్రజలకు సౌకర్యాలు లభిస్తున్నాయి. చారిత్రాత్మకంగా రెండు దేశాల మధ్య సంబంధాలు కూడా బలంగా ఉన్నాయి. అయితే వాటిని చెడగొట్టేందుకు బాలెన్ షా ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.

మన దేశానికి చెందిన పర్యాటకరిక్షాలు జోగ్ మని, రాణి సరిహద్దు మార్గం మీదుగా నేపాల్ దేశంలోకి ప్రవేశించకుండా అక్కడి పాలకులు నిషేధించినట్టు తెలుస్తోంది. ఎన్ని సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో రాకపోకలు సాగించి.. దానిమీద ఆధారపడి జీవిస్తున్న అనేకమంది భారతీయ డ్రైవర్ల ఉపాధి దెబ్బతింటున్నది. దశాబ్దాలుగా సాగుతున్న పాత విధానానికి నేపాల్ పాలకులు సరికొత్త భాష్యం చెబుతున్న నేపథ్యంలో అక్కడ భారత డ్రైవర్లు ఇబ్బంది పడుతున్నారు. భారత్, నేపాల్ దేశాల మధ్య ప్రతిరోజు పర్యాటకులు రాకపోకలు సాగిస్తూ ఉంటారు. వారిని చేరవేర్చుతూ మన దేశానికి సంబంధించిన చిన్న చిన్న రవాణా కార్మికులు.. ఇతర ఆపరేటర్లు ఉపాధి పొందుతూ ఉంటారు. అయితే నేపాల్ ప్రభుత్వం నిర్ణయం వల్ల వారంతా కూడా ఉపాధికి దూరమయ్యే ప్రమాదం కనిపిస్తుంది. అత్యంత రద్దీగా ఉన్న ఈ మార్గాన్ని మూసివేస్తున్న క్రమంలో తమ ఉపాధి మొత్తం కాలగర్భంలో కలిసిపోతుందని డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరొకవైపు మన దేశానికి సంబంధించిన వాహనాలపై నిరంతరం నిఘా పెట్టడానికి నేపాల్ ప్రభుత్వం ఆన్లైన్ కష్టం సిస్టమ్స్ డిజిటల్ వెహికల్ ట్రాకింగ్ విధానాన్ని అమలులోకి తీసుకొచ్చింది. సరిహద్దుల్లో నిత్యం జరిగే రాకపోకలు.. వాణిజ్య కార్యకలాపాలపై పూర్తిస్థాయిలో నియంత్రణ సాధించాలని నేపాల్ ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే నేపాల్ ప్రభుత్వం మీద అంతర్జాతీయంగా చర్చ జరుగుతుంది. ముఖ్యంగా సరిహద్దుల విధానాలు.. వ్యూహాత్మకంగా, ఆర్థికంగా వేస్తున్న అడుగులపై అంతర్జాతీయంగా రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఇటువంటి సమయంలో భారతదేశానికి వ్యతిరేకంగా నేపాల్ వ్యవహరిస్తున్న తీరు ఆందోళన కలిగిస్తోంది.

'కరుప్పు (వీరభధ్రుడు)' 2 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ఇది మామూలు సునామీ కాదు..

Veerabhadrudu Movie 2 Days Collections
Veerabhadrudu Movie 2 Days Collections

Veerabhadrudu Movie 2 Days Collections: ఎలాంటి అంచనాలు లేకుండా, చాలా సాధారణంగా విడుదలైన తమిళ హీరో సూర్య లేటెస్ట్ చిత్రం ‘కరుప్పు’ బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టిస్తూ ముందుకు దూసుకుపోతోంది. మే 14 న విడుదల అవ్వాల్సిన ఈ సినిమా , కొన్ని అనుకోని కారణాల వల్ల వాయిదా పడింది. ఆలస్యంగా విడుదల అయ్యినప్పటికీ కూడా ఈ చిత్రానికి మంచి ఓపెనింగ్ దక్కింది. మొదటి రోజు దాదాపుగా 28 నుండి 30 కోట్ల రూపాయిల మధ్యలో గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది. ఇక రెండవ రోజు అయితే అన్ని ప్రాంతాల్లోనూ మొదటి రోజు కంటే ఎక్కువ వసూళ్లను రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ముఖ్యంగా తమిళనాడు ప్రాంతం లో ఈ చిత్రానికి నమోదైన రెండవ రోజు గ్రాస్ వసూళ్లు , సూర్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ అని చెప్పొచ్చు , ప్రాంతాల వారీగా ఈ చిత్రానికి వచ్చిన వసూళ్లు ఎంతో ఒకసారి చూద్దాం.

తమిళనాడు ప్రాంతం లో ఈ చిత్రానికి దాదాపుగా రెండు రోజుల్లో 30 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. మొదటి రోజు 12 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు రాగా, రెండవ రోజు ఏకంగా 17 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ చిత్రానికి రెండవ రోజున మంచి గ్రోత్ కనిపించింది, ట్రేడ్ విశ్లేషకులు అందిస్తున్న లెక్కల ప్రకారం చూస్తే మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి 3 కోట్ల 8 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు రాగా, రెండవ రోజు 4 కోట్ల 55 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా రెండు రోజులకు కలిపి 7 కోట్ల 63 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇది సాధారణమైన విషయం కాదు , సరైన బ్లాక్ బస్టర్ లేక ఇబ్బంది పడుతున్న సూర్య కి ఈ సినిమా ఇచ్చిన బూస్ట్ అంతా ఇంతా కాదు.

అదే విధంగా కర్ణాటక ప్రాంతం నుండి 5 కోట్ల 65 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రానికి , కేరళ నుండి 3 కోట్ల 80 లక్షలు, హిందీ + రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 80 లక్షలు, ఓవర్సీస్ నుండి 26 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 74 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు , 36 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి. అలా రెండు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ మార్కుని 50 శాతం కి పైగా అందుకున్న ఈ చిత్రం , రాబోయే రోజుల్లో మరో 34 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను ఈ చిత్రం రాబట్టాల్సి ఉంటుంది.

దురంధర్ ను కాపీ కొట్ట పోయి.. పాకిస్తాన్ నవ్వుల పాలైంది..

Pakistan Copied Durandhar
Pakistan Copied Durandhar

Pakistan Copied Durandhar: తప్పులేదు. కచ్చితంగా తప్పులేదు.. పులిలాగా ఉండాలని వీధి కుక్క అనుకోవడంలో తప్పులేదు. అడవిలో పులి మాదిరిగా గర్జించాలి అనుకోవడంలో తప్పులేదు. ప్రత్యర్థి జంతువును వేటాడాలనుకోడంలో కూడా తప్పులేదు. కానీ ఇవన్నీ ఎవరు చేయాలి.. పులి మాత్రమే చేయాలి. కుక్క అనుకోవడం వరకు బాగానే ఉంటుంది. కానీ పులి మాదిరిగా చేయాలనుకుంటే సాధ్యం కాదు. ఎందుకంటే వీధిలో కుక్క అరిచే అరుపుకు.. దట్టమైన అడవిలో పులి పంజాకు చాలా తేడా ఉంటుంది.

భారత్ లో ఆదిత్య ధర్ అనే దర్శకుడు దురంధర్ అనే సినిమా తీశాడు. పాకిస్తాన్ భారత్ మీద ఎలాంటి పన్నాగం పన్నింది.. భారతదేశంలో అల్లకల్లోలం సృష్టించడానికి ఎలాంటి కుట్రలు చేసింది.. దీనికి ప్రతిగా భారత్ పాకిస్థాన్లో ఎటువంటి గూడ చర్య వ్యవస్థను నిర్వహిస్తోంది.. కరాచీ సరిహద్దు ప్రాంతంలో ఉన్న ల్యాలీ అనే ప్రాంతంలో భారత గూడచారులు ఎలాంటి ఆపరేషన్లు చేశారు.. తద్వారా ఉగ్రవాదం ఎలా అణచివేతకు గురైంది.. ఇలాంటి అంశాల ఆధారంగా దురంధర్ సినిమా రూపొందింది. రెండు భాగాలుగా వచ్చిన ఈ సినిమా ఏకంగా 1800 కోట్ల మార్కెట్ సాధించగలిగింది. బాహుబలి రికార్డులను బద్దలు కొట్టగలిగింది.

పాకిస్తాన్ దేశానికి దురంధర్ సినిమా వ్యతిరేకంగా ఉండడంతో.. మొదటినుంచి కూడా అక్కడి పాలకులు ఈ సినిమా మీద తమ అక్కసు ప్రదర్శించారు. పాకిస్థాన్లో ఈ సినిమాను ప్రదర్శితం కాకుండా అడ్డుకున్నారు. అయితే చాలామంది పాకిస్తాన్ ప్రజలు ఈ సినిమాను ఆన్లైన్లో.. ఇతర మాధ్యమాలలో చూశారు. ఈ సినిమా చూసిన తర్వాత పాకిస్తాన్ పాలకుల మీద అక్కడి ప్రజలు కాండ్రించి ఉమ్మడం మొదలుపెట్టారు.

ఈ నేపథ్యంలో పాకిస్తాన్ దేశంలో కొంత మందికి కొత్త ఆలోచన వచ్చింది. దురంధర్ మించిన సినిమాను చేస్తామని వారు ప్రకటించారు. ప్రకటించడం మాత్రమే కాదు మేవీ ల్యాలీ అనే పేరుతో ఒక సినిమాను కూడా తీశారు విడుదల చేశారు. ఈ సినిమా విడుదలైన రోజే బాక్సులు వెనక్కి వెళ్ళాయి. ఐదు షోలు ప్రదర్శిస్తే కేవలం 22 మంది మాత్రమే వచ్చారు. దీనిని బట్టి పాకిస్తాన్ దురంధర్ ను కాపీ కొట్టి ఏదో చేయాలనుకుంటే.. ఏం జరిగిందో ప్రపంచం మొత్తానికి తెలిసింది. అంతేకాదు భారత్ మీద కుట్రలు చేసేందుకు పాకిస్తాన్ చేసిన ప్రయత్నాలు మొత్తం విఫలమయ్యాయి. మేవీ ల్యాలీ సినిమాలో ల్యాలీ ప్రాంతం గొప్పదనాన్ని దర్శకుడు చూపించే ప్రయత్నం చేశాడు. కానీ ప్రారంభం నుంచి చివరి దాకా బోరింగ్ సినిమా లాగా అది మిగిలిపోయింది. కేవలం ఒక్క రోజులోనే బాక్సులు వెళ్లిపోయాయి అంటే ఆ సినిమా ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఈ కథనం ప్రారంభంలో కుక్క, పులి గురించి ప్రస్తావించాం. కథనం మొత్తం చదివారు కదా.. దీనిని బట్టి పులి ఎవరు.. కుక్క ఎవరు అనేది అర్థమైంది అనుకుంటా.

పురాతన శిలలు తొలగిస్తుండగా.. మూడు శ్వేత నాగులు.. ఎక్కడో తెలుసా..

White Snakes
White Snakes

White Snakes: కొన్ని నిర్మాణ పనులు జరిగేటప్పుడు విచిత్రాలు జరుగుతూ ఉంటాయి. ఇలాంటి సమయంలో ఎన్నో రకాల జీవరాశులు నష్టపోతుంటాయి. అలాగే ములుగు జిల్లాలోని సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ప్రహరీ గోడ నిర్మాణ పనుల సందర్భంగా పురాతన ఆలయ శిలలను తొలగించే క్రమంలో వాటి కింద నుంచి మూడు శ్వేతనాగులు బయటకు వచ్చాయి. అయితే ఈ ప్రాంతంలో జరిగిన ఈ సంఘటనను గ్రామస్తులు ఒక దైవ హెచ్చరికగా భావిస్తున్నారు. అసలు ఏం జరిగిందంటే?

ములుగు జిల్లాలోని సమ్మక్క–సారక్క గిరిజన విశ్వవిద్యాలయం చుట్టూ భద్రతా దృష్ట్యా రూ.24 కోట్ల వ్యయంతో 8.4 కిలోమీటర్ల పొడవున భారీ ప్రహరీ గోడ నిర్మాణ పనులు చేపట్టారు. నిర్మాణ బాధ్యతలు చేపట్టిన కాంట్రాక్ట్ సంస్థ ఇప్పటికే సగానికి పైగా పనులు పూర్తి చేసింది. అయితే పనులు మొదలైనప్పటి నుంచే భూమి తవ్వకాలలో అనేక చారిత్రక ఆనవాళ్లు బయటపడుతున్నాయని కార్మికులు చెబుతున్నారు. పురాతన శిల్పకళతో కూడిన రాతి స్తంభాలు, దేవతా విగ్రహాల ముక్కలు, ఆలయ నిర్మాణాలకు ఉపయోగించే రాతి బండలు బయటపడటంతో ఈ ప్రాంతం ఒకప్పుడు కాకతీయుల కాలం నాటి ఆధ్యాత్మిక క్షేత్రంగా ఉండి ఉండవచ్చని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

ఇదే క్రమంలో తాజాగా ఎక్స్ కావేటర్ తో కందకం తవ్వుతున్న సమయంలో భారీ రాతి శిలలు అడ్డుగా రావడంతో వాటిని తొలగించే ప్రయత్నం చేశారు. మొదట సాధారణ రాళ్లేనని భావించిన ఆపరేటర్, వాటిని కదిలించగానే అవి పురాతన ఆలయ శిలలని అక్కడి సిబ్బందికి అర్థమైంది. ఇదే సమయంలో ఆ శిలల కిందనుండి ఒక్కసారిగా మూడు తెల్లని నాగుపాములు పడగవిప్పి బయటకు రావడంతో అక్కడి వాతావరణం ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. ఊహించని ఈ ఘటనతో కార్మికులు, అధికారులు భయంతో పరుగులు తీశారు.

అయితే శిలలను తొలగించే సమయంలో ఎక్స్ కావేటర్ బకెట్ ఒక నాగుపాముకు తగలడంతో అది అక్కడికక్కడే చనిపోయిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. మిగిలిన రెండు నాగులు బుసలు కొడుతూ జేసీబీ చుట్టూ తిరిగినట్లు సమాచారం. పాముల ఆగ్రహరూపం చూసిన డ్రైవర్ తీవ్ర భయానికి గురై అక్కడి నుంచి పరుగులు తీశాడని చెబుతున్నారు. కొంతసేపటి వరకు ఆ ప్రాంతంలో ఎవరూ అడుగుపెట్టేందుకు కూడా సాహసించలేదని స్థానికులు వెల్లడించారు.

ఈ ఘటన తర్వాత పరిస్థితి మరింత మిస్టరీగా మారింది. కొంతసేపటి అనంతరం ధైర్యం తెచ్చుకున్న ఎక్స్ కావేటర్ ఆపరేటర్ తిరిగి వచ్చి వాహనాన్ని స్టార్ట్ చేయడానికి ప్రయత్నించగా, అప్పటివరకు సజావుగా పనిచేసిన యంత్రం ఒక్కసారిగా మొరాయించిందట. పలుమార్లు ప్రయత్నించినా స్టార్ట్ కాకపోవడంతో అక్కడి కార్మికులు భయభ్రాంతులకు గురయ్యారు. దీంతో ఇది సాధారణ విషయం కాదు.. అక్కడ దైవిక శక్తి ఉంది అనే ప్రచారం చుట్టుపక్కల గ్రామాల్లో వేగంగా వ్యాపించింది.

స్థానిక గిరిజనులు, పెద్దలు ఈ ప్రాంతాన్ని పవిత్ర స్థలంగా పేర్కొంటున్నారు. పురాతన ఆలయ అవశేషాలను ధ్వంసం చేయడమే ఈ పరిణామాలకు కారణమై ఉండొచ్చని వారు భావిస్తున్నారు. నాగులు ప్రత్యక్షమవడం, యంత్రం పనిచేయకపోవడం వంటి పరిణామాలు దేవతల ఆగ్రహానికి సంకేతమని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. వెంటనే అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించి, పురాతన శిలలను సంరక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

ఇక చరిత్ర పరిశోధకులు మాత్రం ఈ ఘటన మరో కీలక విషయాన్ని వెలుగులోకి తీసుకువచ్చిందని చెబుతున్నారు. ఈ ఘటనతో ప్రస్తుతం ప్రహరీ గోడ నిర్మాణ పనులను తాత్కాలికంగా నిలిపివేశారు. ఘటనాస్థలానికి సమీప గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో చేరుకుని శ్వేతనాగులు కనిపించిన ప్రదేశాన్ని దర్శించుకుంటున్నారు. కొందరు అక్కడ పాలు పోసి నాగదేవతలకు పూజలు కూడా నిర్వహిస్తున్నారు. మరోవైపు సోషల్ మీడియాలో ఈ ఘటనకు సంబంధించిన కథనాలు, వీడియోలు వైరల్ అవుతుండటంతో రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.

గోధుమ పిండిని ఫ్రిజ్ లో పెడుతున్నారా..

Wheat Flour In Fridge
Wheat Flour In Fridge

Wheat Flour In Fridge: నేటి కాలంలో కొన్ని ఆహారపదార్థాలను ఫ్రిజ్ లో నిల్వ ఉంచుకోవడం సాధారణమైపోయింది. ఇందులో కూలింగ్ వ్యవస్థ ఉండడం వల్ల కొన్ని పదార్థాలు పాడవకుండా ఉంటాయి. అయితే ఈ కూలింగ్ అన్నింటికి వర్తించవు. చపాతీలు, పూరీలు, పరాటాల కోసం కొందరు గోధుమ పిండిని ముందుగానే కలుపుతుంటారు. అయితే ఈ పిండిని ఫ్రిజ్‌లో నిల్వచేయడం వల్ల పని త్వరగా పూర్తవుతుందని భావిస్తారు. కానీ ఎక్కువసేపు నిల్వ ఉంచిన పిండి ఆరోగ్యానికి మంచిది కాదని ఆహార నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా వేసవికాలంలో పిండిని ఎక్కువసేపు ఉంచితే అందులో సూక్ష్మజీవులు వేగంగా పెరిగే ప్రమాదం ఉందని చెబుతున్నారు. ఇలా నిల్వ ఉంచిన పిండితో ఏం జరుగుతుందో తెలుసా?

గోధుమ పిండిలో నీరు కలిపిన వెంటనే రసాయన మార్పులు ప్రారంభమవుతాయి. గాలిలో ఉండే బ్యాక్టీరియా, ఈస్ట్, ఇతర సూక్ష్మక్రిములు తడి వాతావరణంలో వేగంగా పెరుగుతాయి. మొదట్లో కనిపించకపోయినా కొన్ని గంటల తర్వాత పిండిలోని పోషకాలు క్రమంగా తగ్గడం ప్రారంభమవుతుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా విటమిన్లు, సహజ గుణాలు తగ్గిపోతాయని అంటున్నారు.

సాధారణంగా పిండిని కలిపిన తర్వాత రెండు గంటలలోపు వాడితే ఉత్తమమని సూచిస్తున్నారు. ఫ్రిజ్‌లో పెట్టినా గరిష్ఠంగా 24 నుంచి 48 గంటల్లోపు వాడేయాలని చెబుతున్నారు. అయితే ఇది కూడా ఫ్రిజ్ ఉష్ణోగ్రత, పరిశుభ్రత, వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. వేసవిలో అయితే పిండి త్వరగా పాడయ్యే అవకాశం ఉండటంతో మరింత జాగ్రత్త అవసరమని హెచ్చరిస్తున్నారు.

పిండి పాడవుతున్న సంకేతాలను గుర్తించడం కూడా చాలా ముఖ్యం. పిండిలో పుల్లటి వాసన రావడం, రంగు మారడం, పైభాగంలో నల్లటి లేదా ఆకుపచ్చ మచ్చలు కనిపించడం, అతిగా జిగటగా మారడం వంటి లక్షణాలు ఉంటే దానిని వాడకుండా ఉండడమే మంచిది. ఇవి ఫంగస్ లేదా హానికరమైన సూక్ష్మజీవులు పెరిగిన సంకేతాలుగా భావిస్తారు.

పాడైన పిండితో చేసిన చపాతీలు లేదా పూరీలు తింటే జీర్ణసంబంధ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. కడుపు ఉబ్బరం, అజీర్ణం, విరేచనాలు, వాంతులు, కడుపు నొప్పి వంటి సమస్యలు తలెత్తవచ్చు. చిన్నపిల్లలు, వృద్ధులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి ఇది మరింత ప్రమాదకరమని వైద్యులు చెబుతున్నారు.

కొంతమంది పిండిని మృదువుగా ఉండేందుకు ఎక్కువసేపు బయటే ఉంచుతుంటారు. కానీ గది ఉష్ణోగ్రతలో పిండిని ఎక్కువసేపు ఉంచడం వల్ల కూడా బ్యాక్టీరియా పెరుగుదల మరింత వేగంగా జరుగుతుంది. అందుకే వెంటనే వాడకపోతే గాలి చొరబడని డబ్బాలో పెట్టి ఫ్రిజ్‌లో నిల్వ చేయాలని సూచిస్తున్నారు.

ఫ్రిజ్‌లో ఉంచిన పిండిని వాడేముందు ఒకసారి బాగా పరిశీలించడం మంచిది. వాసన, రంగు, టెక్స్చర్‌లో ఏమైనా మార్పులు ఉంటే వాడకూడదు. అలాగే ఫ్రిజ్‌లో కూడా పిండిని తెరిచి ఉంచకూడదు. అలా ఉంచితే ఇతర ఆహారాల వాసనలు, సూక్ష్మక్రిములు దానిలోకి చేరే అవకాశం ఉంటుంది.

అధిక జ్యేష్ఠ మాసం ఎప్పటి నుంచి? ఈ కాలంలో ఏం చేయాలి?

Adhika Jyeshta Masam 2026
Adhika Jyeshta Masam 2026

Adhika Jyeshta Masam 2026: చంద్ర సంవత్సరాలు, సౌర సంవత్సరాల మధ్యలో ప్రతీ 32 నెలలకు ఒకసారి అధిక మాసం వస్తుంది. హిందూ క్యాలెండర్ ప్రకారం.. శ్రీ పరాభవ నామ సంవత్సరంలో చాంద్రమాన జ్యేష్ఠ మాసం ఈసారి అధిక మాసంగా వచ్చింది. ఈ అధిక జ్యేష్ఠ మాసం 2026 మే 17 నుంచి జూన్ 15 వరకు కొనసాగనుంది. సూర్యసిద్ధాంతం, సిద్ధాంత శిరోమణి వంటి గ్రంథాల ప్రకారం.. ఏ చాంద్రమాసంలో సూర్య సంక్రాంతి లేకపోతే దానిని అధిక మాసం గా పరిగణిస్తారు. సౌర సంవత్సరం, చాంద్ర సంవత్సరం మధ్య ఉండే కాలవ్యత్యాసాన్ని సమన్వయం చేసేందుకు భారతీయ ఋషులు ఈ విధానాన్ని ఏర్పాటుచేశారు. సాధారణంగా వచ్చే జ్యేష్ఠమాసంలో కొన్నిశుభకార్యాలు నిర్వహిస్తారు. కాన ఇప్పుడు వచ్చిన అధిక జ్యేష్ఠమాసంలో ఎలాంటి పూజలు చేస్తారు? ఏం చేయకుండా ఉంటారు?

సాధారణంగా ఒక సౌరసంవత్సరంలో 365 రోజులు ఉంటాయి. చంద్ర సంవత్సరంలో 354 రోజులు ఉంటాయి. ఈ మాసాలను సరిచేసేందుకు ప్రతీ 32 నెలలకు ఒకసారి అధికమాసంను చేర్చుతున్నారు. కొన్నిసార్లు అధిక ఆషాఢం,అధిక శ్రావణ మాసం వస్తుంది. ఈసారి అధిక జ్యేష్ఠమాసం వచ్చింది. అధిక జ్యేష్ఠమాసాన్ని పురుషోత్తమ మాసంగా కూడా పిలుస్తారు. ఈ కాలంలో భక్తితో స్నానం, దానం, జపం, ఉపవాసం, విష్ణుపూజ చేస్తే పాపక్షయం, దారిద్ర్య నివారణ కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. పురుషోత్తమ మహాత్మ్య పఠనం, శ్రీకృష్ణారాధన, నక్తవ్రతం, ఒక భుక్తం వంటి ఆచారాలు ఎంతో పుణ్యప్రదమని భావిస్తారు. అధికమాసాంతంలో నెయ్యి, బెల్లం, ధాన్యం దానం చేయడం విశేష ఫలితాన్ని ఇస్తుందని శాస్త్రోక్తంగా పేర్కొన్నారు.

అయితే ఈ మాసంలో కొన్ని శుభకార్యాలు వర్జ్యంగా చెప్పబడ్డాయి. ముఖ్యంగా వివాహాలు, ఉపనయనాలు, గృహప్రవేశాలు, దేవతా ప్రతిష్ఠలు, కొత్త వాహనాలు లేదా భూమి కొనుగోలు వంటి కార్యక్రమాలు చేయరాదని ఆచారం చెబుతోంది. అలాగే కొత్త ఆభరణాలు, కొత్త వస్త్రధారణ, వ్రతోద్యాపనలు, యజ్ఞాలు కూడా నివారించాలని సూచించారు.

ఈ మాసంలో అవసరమైన నిత్యకర్మలు మాత్రం చేయవచ్చు. వార్షిక శ్రాద్ధాలు, పితృకార్యాలు, తీర్థశ్రాద్ధాలు, జన్మదిన పూజలు, రుద్రాభిషేకాలు, జపాలు, దానాలు, గ్రహణ సంబంధిత కర్మలు నిర్వహించేందుకు అధికమాసంలో నిషేధం లేదు. శాస్త్రాల ప్రకారం “ఆవశ్యక కర్మలకు అధికమాస దోషం లేదు” అనే సూత్రం ఇక్కడ ప్రధానంగా చెప్పబడింది.

మిడ్ రేంజ్ పీపుల్స్ కోసం Vivo కొత్త ఫోన్లు.. ఎలా ఉంటాయంటే..

Vivo V80
Vivo V80

Vivo V80: Vivo కంపెనీ ఇప్పటికే ఎన్నో రకాల మొబైల్స్ ను మార్కెట్లోకి తీసుకువచ్చి వినియోగదారులను ఆకట్టకుంది. అయితే ఇటీవల తన కొత్త స్మార్ట్‌ఫోన్‌లు Vivo V‑80, Vivo S‑2 అనే రెండు మొబైల్స్ ను గ్లోబల్ మొబైల్ సిస్టమ్స్ అలోన్‌స్ (GSMA) డేటాబేస్‌లో రిజిస్టర్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఈ రెండు మోడళ్లు త్వరలో లాంచ్ కాబోతున్నాయని తెలుస్తోంది.

వివో వి‑80 మోడల్ నెంబర్ V2630 గాను, వివో ఎస్‑2 V2576 గా GSMAగా డేటాబేస్‌లో కనిపించినట్లు రిపోర్టులు తెలుపుతున్నాయి. ఇది తుది టెస్టింగ్ దశకు చేరుకున్నాయని తెలుస్తోంది. అయితే ఈ డేటాబేస్ ఎంట్రీలో ఎలాంటి స్పెసిఫికేషన్‌లు (చిప్‌సెట్, డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా) ఇంకా డిటైల్‌గా ప్రకటించలేదు. కానీ ఈ ఫోన్లు ఎలా ఉండబోతున్నాయో కొన్ని లీకులు భట్టి తెలుస్తోంది. కొన్ని అంచనాల ప్రకారం ఈ మొబైల్స్ ఇలా ఉండనున్నాయి.

Vivo V‑80:
మొబైల్ నిపుణుల అంచనాల ప్రకారం.. ఈ కొత్త మొబైల్ వివో ఎస్‑60 బేస్‌డ్ డివైస్‌గా ఉండొచ్చని చెబుతున్నారు. గ్లోబల్ మార్కెట్‌లో వివో వి‑80 పేరుతో, చైనాలో ఎస్‑60 పేరుతో లాంచ్ అవుతుందని అంటున్నారు. ఈ మొబైల్ లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 3 లేదా 8 జెన్ 3 చిప్‌సెట్‌ ఉండే అవకాశం ఉంది. అలాగే ఇందులో 6.59 అంగుళాల OLED డిస్ ప్లేను చేర్చి ఉంటారని అంటున్నారు. ఈ డిస్ ప్లే 1.5K రిజల్యూషన్ తో పనిచేస్తుంది. అలాగే ఈ మొబైల్ బ్యాటరీ 7000mAh ఉండగా.. దీనికి 90W ఫాస్ట్ చార్జింగ్‌ సపోర్టు చేస్తుందని అంటున్నారు.

Vivo S‑2:
వివో ఎస్‑2 లైన్‌అప్ ద్వారా వచ్చే ఈ మొబైల్ ప్రధానంగా మిడ్‌రేంజ్ సిరీస్‌లో రాబోతుంది. ఇప్పటికే ఎస్‑సిరీస్ మిడ్ రేంజ్ డివైస్‌లతో పోటీ పడుతోంది. ఈ పరిస్థితిలో వివో ఎస్‑2 మరింత ఆకర్షణీయమైన ప్రాసెసర్, డిస్‌ప్లే కాన్ఫిగరేషన్‌తో రావచ్చని అంచనా. అయితే దీని గురించ ఎటువంటి సమాచారం లీక్ కాలేదు.

GSMA డేటాబేస్‌లో ఈ ఫోన్ల గురించి కనిపించడం వల్ల వివో వి‑80, ఎస్‑2 రెండూ త్వరలో అధికారికంగా ప్రకటించబడే అవకాశం ఉందని తెలుస్తోంది. ముఖ్యంగా చైనాలో ఎస్‑60/ఎస్‑2 లాంచ్ తర్వాతే గ్లోబల్‌గా వి‑80 రిలీజ్ అవుతుందని ఊహిస్తున్నారు. మరిన్ని స్పెసిఫికేషన్‌లు, ధర, లాంచ్ స్లాట్ వివరాలు మరికొద్ది రోజుల్లో వెల్లడికావచ్చని ఎక్స్‌పర్ట్‌లు చెబుతున్నారు

మహేష్ బాబు కొడుకు గౌతమ్ కామెడీ టైమింగ్ అదుర్స్.. వైరల్ గా మారిన వీడియో..

Gautam Krishna
Gautam Krishna

Mahesh Babu Son Gautam: మన టాలీవుడ్ స్టార్ హీరోల్లో కామెడీ టైమింగ్ అంటే మనకు గుర్తుకు వచ్చే ఇద్దరు ముగ్గురు హీరోల్లో ఒకరు సూపర్ స్టార్ మహేష్ బాబు. ‘ఖలేజా’ వచ్చేంత వరకు మహేష్ లో ఈ రేంజ్ కామెడీ టైమింగ్ ఉంటుందని అభిమానులు కూడా ఊహించలేదు. ఆ సినిమా తర్వాత ఆయన చేసిన ప్రతీ సినిమాలోనూ కామెడీ టైమింగ్ ని ఉండేలా చూసుకుంటూ వచ్చాడు , అది ఆయన్ని ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా దగ్గరయ్యేలా చేసింది. అయితే మహేష్ బాబు లో కామెడీ టైమింగ్ ఉంది కదా అని , ఆయన పిల్లల్లో కూడా కచ్చితంగా కామెడీ టైమింగ్ ఉండాలి అనే రూలేమీ లేదు. కానీ మహేష్ బాబు కుమారుడు గౌతమ్ లో కూడా అద్భుతమైన కామెడీ టైమింగ్ ఉందని రీసెంట్ గా సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్న ఒక వీడియో ని చూసిన తర్వాతే అర్థమైంది.

విదేశాల నుండి ఇండియా కి తిరిగి వస్తున్న సమయం లో గౌతమ్ ని విమానాశ్రయం లో మీడియా రిపోర్టర్స్ వచ్చి ఫోటోలు , వీడియోలు తీయడం మొదలు పెట్టారు. హాయ్ సార్ అని చెప్తే, తిరిగి నవ్వుతూ హాయ్ అని రిప్లై ఇచ్చాడు గౌతమ్. అదే సమయం లో ఫోటోలు తియ్యడానికి ఒక రిపోర్టర్ అత్యుత్సాహం చూపిస్తుండడాన్ని చూసి , పడిపోకు అలా అంటూ నవ్వుతూ కౌంటర్ వేసి కారు ఎక్కేసాడు. ఆయన తో పాటు సితార , నమ్రత శిరోడ్కర్ కూడా ఉన్నారు. అయితే అంత చిన్న డైలాగ్ లో కామెడీ టైమింగ్ ఏముందని మీకు అనిపించొచ్చు , కానీ ఆ చెప్పే విధానం ని చూస్తుంటే వింటేజ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కామెడీ టైమింగ్ కనిపించింది. అభిమానులకు కూడా అదే ఫీలింగ్ కలిగింది. సోషల్ మీడియా లో బాగా వైరల్ అయినటువంటి ఈ వీడియో ని మీ కోసం క్రింద అందిస్తున్నాము చూడండి.

లండన్ లో చదువుకుంటున్న మహేష్ బాబు , ఇది వరకే తన స్నేహితులతో కలిసి ఎన్నో షార్ట్ ఫిలిమ్స్ లో నటించాడు. అవి యూట్యూబ్ లో కూడా బాగా వైరల్ అయ్యాయి, తండ్రితో ఉన్నటువంటి యాక్టింగ్ టాలెంట్ , గౌతమ్ లో కూడా ఉంది , ఇండస్ట్రీ లోకి అడుగుపెడితే కచ్చితంగా సక్సెస్ అవుతాడు అని మహేష్ అభిమానులే కాదు , ఇతర హీరోల అభిమానులు కూడా చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఈ కామెడీ టైమింగ్ ని చూసిన తర్వాత , ఇతను ఇండస్ట్రీ లోకి అడుగుపెడితే తిరుగులేదని అనిపిస్తోంది అంటూ సోషల్ మీడియా లో విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు.

మరోసారి CNG ధరలపెంపు.. వీరిపై తీవ్ర ప్రభావం..

CNG Price Hike
CNG Price Hike

CNG Price Hike: దేశంలో వాహనదారులపై ఇంధన భారం మరింత పెరిగింది. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి సమయంలోనే ఇప్పుడు కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (CNG) ధరలు కూడా భగ్గుమంటున్నాయి. ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ (IGL) కిలో సీఎన్‌జీపై మరో రూపాయి పెంచుతూ తాజాగా నిర్ణయం తీసుకుంది. రెండు రోజుల క్రితమే కిలో CNGపై రూ.2 పెంచిన కేంద్రం.. ఇప్పుడు మరో రూపాయి పెంచడంతో… కేవలం 48 గంటల వ్యవధిలోనే సీఎన్‌జీ ధర ఏకంగా రూ.3 మేర పెరిగినట్లయింది. ఈ ధరల ప్రభావం ఎలా ఉండబోతుందో చూద్దాం..

CNG ధరల పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో కిలో సీఎన్‌జీ ధర రూ.80 దాటి రూ.80.09కి చేరింది. అలాగే నోయిడా, ఘజియాబాద్‌లలో రూ.88.70, గురుగ్రామ్‌లో రూ.85.12, ముంబైలో రూ.84 చొప్పున ధరలు పలికాయి. హైదరాబాద్ లో రూ.90 పలుకుతోంది. ఈ రెండు రోజుల వ్యవధిలోనే అటు పెట్రోల్, డీజిల్ ధరలు కూడా లీటరుకు రూ.3 చొప్పున పెరగడం గమనార్హం.

సీఎన్‌జీ ధరల పెరుగుదల వల్ల మధ్యతరగతి ప్రజలతో పాటు రవాణా రంగంపై తీవ్ర ప్రభావం పడుతుంది.ఆటో, క్యాబ్ డ్రైవర్లు: పెట్రోల్, డీజిల్ రేట్లు భరించలేక ఎక్కువ మైలేజ్ వస్తుందని ఆటోలు, ఓలా/ఉబెర్ ట్యాక్సీలను సీఎన్‌జీ మోడల్స్‌గా మార్చుకున్న డ్రైవర్లకు ఇది కోలుకోలేని దెబ్బ. వారి రోజువారీ సంపాదనలో ఇంధన ఖర్చులే సగానికి పైగా చేరనున్నాయి. ఇప్పటికే కొన్ని నగరాల్లో ఆటో యూనియన్లు కనీస ఛార్జీలను పెంచాలని డిమాండ్ చేస్తున్నాయి.
సరుకు రవాణా చేసే చిన్న కమర్షియల్ వాహనాలు (టాటా ఏస్ వంటివి) చాలా వరకు సీఎన్‌జీపైనే నడుస్తాయి. ఇంధన ధర పెరగడంతో రవాణా ఖర్చులు పెరిగి, పండ్లు, కూరగాయలు, నిత్యవసర వస్తువుల ధరలు కూడా పెరిగే ప్రమాదం ఉంది.

భారతదేశంలో సీఎన్‌జీ కార్ల విభాగంలో మారుతి సుజుకి, టాటా మోటార్స్, హ్యుందాయ్ కంపెనీలదే హవా. మారుతి సుజుకి (Maruti Suzuki)కంపెనీకి చెందిన అల్టో K10 (Alto K10), వ్యాగన్ ఆర్ (WagonR), సెలెరియో (Celerio), స్విఫ్ట్ (Swift), డిజైర్ (Dzire), బ్రెజ్జా (Brezza), ఎర్టిగా (Ertiga) ఉన్నాయి. అలాగే టాటా మోటార్స్ (Tata Motors)కు చెందిన తియాగో (Tiago), టిగోర్ (Tigor), పంచ్ (Punch), ఆల్ట్రోజ్ (Altroz) వంటి కార్లు సీఎన్‌జీ వేరియంట్లలో అందుబాటులో ఉన్నాయి. హ్యుందాయ్ (Hyundai గ్రాండ్ i10 నియోస్ (Grand i10 Nios), ఆరా (Aura) మరియు సరికొత్తగా మైక్రో ఎస్‌యూవీ ‘ఎక్స్టర్’ (Exter) కార్లలో సీఎన్‌జీ ఆప్షన్‌ను అందిస్తోంది.

పెట్రోల్, డీజిల్ కంటే సీఎన్‌జీ కార్లు ఇప్పటికీ 40 నుంచి 45 శాతం వరకు రన్నింగ్ కాస్ట్‌ను ఆదా చేస్తున్నప్పటికీ… ఇలా వరుసగా ధరలు పెంచుకుంటూ పోతే సీఎన్‌జీ వాహనాల కొనుగోలుపై కస్టమర్లు పునరాలోచనలో పడే అవకాశం ఉంది.

పిల్లలకు చిప్స్ ఇచ్చే తల్లిదండ్రులకు పరిశోధకుల హెచ్చరిక..

Chips And Biscuits
Chips And Biscuits

Chips And Biscuits: నేటితరం పిల్లల నిత్య ఆహారంలో చిప్స్, బిస్కెట్లు, చాక్లెట్లు, కేకులు భాగమైపోయాయి. ఏడుపు ఆపడానికైనా, మారాం తగ్గించడానికైనా తల్లిదండ్రులు చాలా సులువుగా ప్యాకెట్ ఫుడ్స్‌ను పిల్లల చేతుల్లో పెడుతున్నారు. అయితే ఈ అలవాటు పై మరోసారి ఆలోచించుకోవాల్సిన సమయం వచ్చిందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి అల్ట్రా ప్రాసెస్డ్‌ ఫుడ్స్‌ అతిగా తినే పిల్లల్లో ఆస్తమా బారిన పడే ముప్పు గణనీయంగా పెరుగుతున్నట్టు తాజాగా జరిగిన ఒక అధ్యయనంలో వెల్లడైంది. ఆ అధ్యయనం వివరాల్లోకి వెళితే..

స్పెయిన్‌కు చెందిన పరిశోధకులు 4 నుంచి 5 ఏళ్ల వయసు గల చిన్న పిల్లలను సుదీర్ఘంగా పరిశీలించారు. అధ్యయనం ప్రారంభంలోనే ఆస్తమా, శ్వాసకోశ ఇబ్బందులు లేదా ఎలాంటి అలర్జీ సమస్యలు లేని ఆరోగ్యవంతమైన పిల్లలను మాత్రమే ఈ పరిశోధన కోసం ఎంపిక చేసుకున్నారు. వారి రోజువారీ ఆహార అలవాట్లను, వారు తీసుకునే ప్రాసెస్డ్ ఫుడ్ పరిమాణాన్ని శాస్త్రవేత్తలు నిశితంగా గమనించారు.

పిల్లల బరువు, శారీరక శ్రమ, కుటుంబ నేపథ్యం వంటి ఇతరత్రా అన్ని రకాల జీవనశైలి అంశాలను క్రోడీకరించి, సర్దుబాటు చేసిన తర్వాత పరిశోధకులు ఒక దిగ్భ్రాంతికరమైన విషయాన్ని కనుగొన్నారు. అల్ట్రా ప్రాసెస్డ్‌ ఫుడ్స్‌ను చాలా తక్కువగా లేదా అస్సలు తీసుకోని పిల్లలతో పోలిస్తే… వీటిని ఎక్కువగా, నిరంతరం తినే పిల్లల్లో ఆస్తమా తలెత్తే అవకాశం ఏకంగా నాలుగు రెట్లు (400%) అధికంగా ఉంటున్నట్టు పరిశోధనలో తేలింది.

సాధారణంగా ఆస్తమా రావడానికి జన్యుపరమైన కారణాలు (జీన్స్), వంశపారంపర్యత ముఖ్య కారకాలుగా భావిస్తారు. కానీ, కేవలం జన్యువులే కాకుండా మనం తీసుకునే ఆహారం, పర్యావరణం, మారిన జీవన శైలి వంటి బాహ్య అంశాలు కూడా ఈ వ్యాధి తీవ్రతను పెంచడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని ఈ అధ్యయనం స్పష్టం చేస్తోంది. కృత్రిమ రంగులు, ప్రిజర్వేటివ్‌లు, అధిక మోతాదులో ఉండే ఉప్పు, చక్కెరలు పిల్లల శ్వాసవ్యవస్థపై నెమ్మదిగా ప్రభావం చూపిస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ప్యాకెట్లలో దొరికే జంక్ ఫుడ్స్ పిల్లల రోగనిరోధక శక్తిని బలహీన పరచడమే కాకుండా, శరీరంలో అంతర్గత వాపులు (inflammation) పెరగడానికి కారణమవుతాయి. ఇది క్రమంగా ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని దెబ్బతీసి అస్తమా కు దారితీస్తుంది. అందువల్ల ఇప్పటికైనా తల్లిదండ్రులు అప్రమత్తమై పిల్లలకు ప్యాకెట్ ఫుడ్స్ అలవాటును తగ్గించి… తాజా పండ్లు, కూరగాయలు, ఇంట్లో వండిన పోషకాహారాన్ని అందించడం ఎంతైనా అవసరం ఉందని వైద్య పరిశోధకులు తెలుపుతున్నారు.

ప్రభాస్ ను తిట్టిన కొరియోగ్రాఫర్... కోపానికి వచ్చిన ప్రభాస్ ఏం చేశాడంటే..?

Prabhas Dance Master
Prabhas Dance Master

Prabhas Dance Master: ఈశ్వర్ సినిమాతో హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నటుడు ప్రభాస్…ఈ సినిమా ఆశించిన వరకు విజయాన్ని సాధించలేదు. ఇక రాఘవేంద్ర తో ఆయన పూర్తిగా డిజాస్టర్ బాట పట్టాడు. ఇక మూడో సినిమా అయిన వర్షంతో తనను తాను స్టార్ హీరోగా ఎలివేట్ చేసుకున్నాడు. ఆ తర్వాత చేసిన చత్రపతి, మున్నా, బిల్లా డార్లింగ్, బుజ్జిగాడు, మిర్చి లాంటి సినిమాలతో స్టార్ హీరోగా ఎదిగాడు. ఇక బాహుబలి సినిమాతో పాన్ ఇండియాలో పెను ప్రభంజనాన్ని సృష్టించాడు. ఇక ప్రభాస్ తన ఎంటైర్ కెరీర్ లో చేసిన సినిమాలు అతన్ని టాప్ హీరోగా మార్చేశాయి. అయితే ప్రభాస్ కెరియర్ స్టార్టింగ్ లో ఇండస్ట్రీకి రాకముందు రాకేష్ మాస్టర్ దగ్గర డాన్స్ నేర్చుకున్నాడు. రాజేష్ మాస్టర్ దగ్గరుండి మరీ స్టెప్పులు ఎలా వెయ్యాలి నేర్పేవాడట… దాంతో ప్రభాస్ డాన్సర్ గా కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీలో రాణించాడు. ప్రభాస్ ‘చక్రం’ సినిమా చేస్తున్న సమయంలో ఒక సాంగ్ కి రాకేష్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశాడు. ఆ సమయంలో రాకేష్ మాస్టర్ వేసిన స్టెప్ ప్రభాస్ అనుకున్నట్టుగా వేయలేదు. రాకేష్. మాస్టర్ ప్రభాస్ మీద కోపగించుకున్నారట.

ప్రభాస్ కి సైతం రాజేష్ మాస్టర్ మీద కోపం వచ్చిన కూడా ఎంతైనా తనకు ముందు నుంచి డాన్స్ నేర్పిన గురువు కాబట్టి ఏమి అనకుండా ఓపిక గా ఉన్నాడట. మొత్తానికైతే రాకేష్ మాస్టర్ ప్రభాస్ ని తిట్టాడు అంటూ గతంలో కొన్ని వార్తలైతే వచ్చాయి.

ఇక ఏది ఏమైనా కూడా రాకేష్ మాస్టర్ తనకు అవకాశాలు సరిగ్గా రాకపోవడంతో ఆ తర్వాత కాలంలో తను డిప్రెషన్లకు వెళ్లిపోయి ఎవరిని పడితే వాళ్ళని మీడియం ముందుకు వచ్చి తిడుతూ తన ఇమేజ్ ను చాలా వరకు డ్యామేజ్ చేసుకున్నాడు. ఇక ఆ తర్వాత ఎక్కువగా మందు తాగి అనారోగ్య కారణంతో ఆయన మృతి చెందాడు.

ఇక ఏది ఏమైనా కూడా ప్రభాస్ కి మొదట డ్యాన్స్ నేర్పిన గురువు కావడంతో అతనంటే ఇప్పటికి ప్రభాస్ కి చాలా రెస్పెక్ట్ ఉందని పలు సందర్భాల్లో చెబుతుండటం విశేషం…ప్రస్తుతం ప్రభాస్ ఫౌజీ, స్పిరిట్ లాంటి రెండు సినిమాలను చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు కూడా పాన్ వరల్డ్ లో రిలీజ్ అవుతుండడం విశేషం…