Home Blog Page 248

ప్రొఫెసర్ నాగేశ్వరరావుకు ఏమైంది.. ఎందుకిలా చేస్తున్నాడు?

Professor Nageswara Rao
Professor Nageswara Rao

Professor Nageswara Rao: ప్రొఫెసర్ నాగేశ్వరరావు.. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఈ పేరు మార్మోగిపోతుంది. ఎందుకంటే ఆయన ఏపీలో కూటమి విచ్ఛిన్నం కోసం చిన్న పాటి ఒక ప్రయత్నం చేశారన్న విమర్శ ఉంది. జగన్మోహన్ రెడ్డి తమకు శాశ్వత మిత్రుడు అని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అన్నట్టు ప్రకటించేసారు. మధ్యలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తావన తీసుకొచ్చారు. అయితే ఈ విశ్లేషణలో ఎంత మాత్రం నిజం లేదు అనేది ఇతర విశ్లేషకుల నుంచి వస్తున్న మాట. పైగా ఎలాంటి నాగేశ్వరరావు.. ఇలా మారిపోయారు ఏంటి అనే ప్రశ్న వినిపిస్తోంది. యూనివర్సిటీ ప్రొఫెసర్ గా ఆయన పాఠాలు చెబుతుంటే విద్యార్థులు మంత్రముగ్ధులై తరగతి గదిలో కనిపించేవారు. టీవీ డిబేట్లో ఆసక్తికర విశ్లేషణలు చేస్తే ఎక్కువమంది చూసేవారు. కేవలం తన విశ్లేషణలతో ప్రజల్లో క్రేజ్ తెచ్చుకున్నారు ప్రొఫెసర్ నాగేశ్వరరావు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్సీ కూడా అయ్యారు. అయితే నాటి స్వతంత్ర విశ్లేషణ పోయింది. రాజకీయ ప్రేరేపిత విశ్లేషణ వచ్చింది.

* ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను అడ్డగోలు సమర్ధింపు..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఆ పార్టీకి అనుకూల విశ్లేషణ మొదలుపెట్టారు ప్రొఫెసర్ నాగేశ్వరరావు. సమాజం మొత్తం తనను మేధావిగా కీర్తించడంతో అదే ధోరణితో ఆలోచనలు చేశారు. సమాజం మొత్తం వ్యతిరేకించే వాటిని సమర్థించడం ప్రారంభించారు. జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను సమాజం మొత్తం వ్యతిరేకించింది. పట్టాదారు పాసుపుస్తకాలపై జగన్మోహన్ రెడ్డి ఫోటో ముద్రించడానికి అడ్డగోలుగా సమర్థించుకున్నారు ప్రొఫెసర్ నాగేశ్వరరావు. చివరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా ఆశ్చర్యంతో మునిగిపోయాయి అంటే ఆయన విశ్లేషణ ఎంత అనుకూలంగా సాగిందో అర్థం చేసుకోవచ్చు. అయితే అదే ల్యాండ్ టైటిల్ యాక్ట్ తో ఎన్నికల్లో తీవ్రంగా నష్టపోయింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. నాడే ప్రొఫెసర్ నాగేశ్వరరావు లాంటి వారు తప్పు అని చెప్పి ఉంటే జగన్మోహన్ రెడ్డి సరిదిద్దుకునే వారేమో.

* రాష్ట్రంలో కొత్త రచ్చ..
ఇప్పుడు బిజెపి శాశ్వత మిత్రుడు జగన్మోహన్ రెడ్డి అని.. ఆ మాట అన్నది కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అని.. పవన్ కళ్యాణ్ ను క్లాస్ పీకారని.. ఇలా రాజకీయ ప్రేరేపిత విశ్లేషణ చేశారు. ఏపీ రాజకీయాల్లో కల్లోలం నింపే ప్రయత్నం చేశారు. స్వతంత్ర విశ్లేషణ నుంచి రాజకీయ ప్రేరేపిత విశ్లేషణ వైపు నడిచారు. తనకున్న క్రెడిబిలిటీని దెబ్బ తీసుకున్నారు. ఒకప్పుడు టీవీ డిబేట్లకు ఆయనను పిలిచేవారు. ఇప్పుడు మాత్రం యూట్యూబ్ ఛానల్ కు పరిమితం అవుతున్నారు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు వ్యవహార శైలి చూస్తుంటే.. ఆయన చేస్తున్న విశ్లేషణలు చూస్తుంటే మాత్రం… ఇప్పటివరకు ఆయనను అభిమానించేవారు సైతం వ్యతిరేకిస్తున్నారు. అయితే ఆయన మేధావి కాబట్టి.. విశ్లేషకుడు కాబట్టి.. దీనిని పట్టించుకుంటారనుకోవడం మూర్ఖత్వమే అవుతుంది. అయితే మారిన విశ్లేషణ వైఖరి చూస్తుంటే మాత్రం అభిమానులకు ఇబ్బంది తెచ్చి పెడుతోంది.

‘ఆటా-సటా’పై హైకోర్టు ఆగ్రహం.. ఈ పద్ధతిలో పెళ్లిళ్లు ఎలా ఉంటాయి..

Rajasthan Marriage Tradition
Rajasthan Marriage Tradition

Rajasthan Marriage Tradition: భారతదేశంలోని కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ పాత సామాజిక ఆచారాలు కొనసాగుతూనే ఉన్నాయి. అలాంటి సంప్రదాయాల్లో రాజస్థాన్‌లో కనిపించే ఆటా-సటా వివాహ పద్ధతి ఒకటి. ఈ ఆచారం ప్రకారం రెండు కుటుంబాలు పరస్పర అంగీకారంతో తమ ఇంటి ఆడబిడ్డలను ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటాయి. అంటే ఒక కుటుంబంలోని అబ్బాయి, మరో కుటుంబంలోని అమ్మాయిని పెళ్లి చేసుకుంటే… అదే సమయంలో ఆ కుటుంబంలోని అబ్బాయికి ఈ కుటుంబంలోని అమ్మాయిని వివాహం చేస్తారు. ఒకప్పుడ వరకట్న సమస్యలు, ఆడపిల్లలపై వేధింపులు ఉండడంతో కొందరు పెద్దలు ఇలాంటి పెళ్లిళ్లను చేశారు. దీనినే తెలుగు రాష్ట్రాల్లో ‘కుండ మార్పిడి’ పెళ్లిళ్లు అని అంటారు. అయితే ఈ వివాహ పద్ధతి వివాదంగా మారింది. ఈ వింత ఆచారంపై ఇటీవల హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ వివరాల్లోకి వెళితె..

ఆటా-సటా అనే పదానికి స్థానిక భాషలో మార్పిడి లేదా ఇచ్చిపుచ్చుకోవడం అనే అర్థం ఉంది. పూర్వ కాలంలో కట్న భారం తగ్గించడానికి, పెళ్లి ఖర్చులు తగ్గించడానికి ఈ పద్ధతి ప్రారంభమైందని సామాజిక పరిశోధకులు చెబుతున్నారు. ముఖ్యంగా పేద కుటుంబాలు పెద్ద మొత్తంలో కట్నం ఇవ్వలేని పరిస్థితుల్లో ఈ విధానాన్ని అనుసరించేవి. దీంతో రెండు కుటుంబాల మధ్య ఆర్థిక భారం తగ్గుతుందని భావించేవారు. ఈ ఆచారం ముఖ్యంగా రాజస్థాన్‌లోని గ్రామీణ ప్రాంతాలు, తెగల సమాజాలు, కొన్ని వెనుకబడిన వర్గాల్లో ఎక్కువగా కనిపిస్తుందని తెలుస్తోంది.

అయితే కాలక్రమేణా ఈ సంప్రదాయం అనేక సమస్యలకు దారితీసింది. ముఖ్యంగా బాల్య వివాహాలు పెరగడానికి ఇది ఒక కారణంగా మారిందని మహిళా హక్కుల సంస్థలు చెబుతున్నాయి. ఒక కుటుంబంలో పెళ్లి వయసు వచ్చిన అబ్బాయికి జోడీ కావాలంటే, మరో కుటుంబం తమ చిన్న వయసు ఉన్న అమ్మాయిని కూడా వివాహం చేయాల్సి వస్తోంది. దీంతో చట్ట విరుద్ధంగా చిన్నారుల పెళ్లిళ్లు జరిగే ఘటనలు పెరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి.

అంతేకాకుండా ఈ పద్ధతిలో మహిళల స్వేచ్ఛ, వ్యక్తిగత అభిప్రాయాలకు పెద్దగా ప్రాధాన్యం ఉండదని విమర్శలు ఉన్నాయి. ఒక వివాహంలో సమస్యలు వస్తే, మరో కుటుంబంలోని జంట జీవితంపైనా దాని ప్రభావం పడుతుందని సామాజిక కార్యకర్తలు చెబుతున్నారు. కొన్ని సందర్భాల్లో ఒక కోడలిపై వేధింపులు జరిగితే, ప్రతీకారంగా మరో కుటుంబంలోని కోడలిని కూడా ఇబ్బంది పెట్టే ఘటనలు బయటపడ్డాయి.

ఇటీవల ఈ అంశంపై రాజస్థాన్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బాల్య వివాహాలు, మహిళల హక్కుల ఉల్లంఘనలు కొనసాగడానికి ఇలాంటి సంప్రదాయాలే కారణమవుతున్నాయని కోర్టు వ్యాఖ్యానించింది. పిల్లల హక్కులను రక్షించడం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేస్తూ, చట్ట విరుద్ధ వివాహాలను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది.

కోర్టు వ్యాఖ్యల తర్వాత మహిళా సంఘాలు, బాలల హక్కుల సంస్థలు ఈ ఆచారాన్ని పూర్తిగా నిషేధించాలని డిమాండ్ చేస్తున్నాయి. సమాజంలో అవగాహన పెంచడం, బాల్య వివాహాలపై కఠిన చట్టాలు అమలు చేయడం, గ్రామీణ ప్రాంతాల్లో విద్యను ప్రోత్సహించడం ద్వారా మాత్రమే ఇలాంటి సంప్రదాయాలను తగ్గించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

మిత్రులమని బిజెపి, వైసిపి ప్రకటించగలవా?

YCP BJP Relations
YCP BJP Relations

BJP And YSRCP: ఏపీలో రాజకీయ రచ్చ సాగుతోంది. జగన్ మనకు శాశ్వత మిత్రుడు అని పవన్ కళ్యాణ్ తో అమిత్ షా అన్నట్టు ప్రముఖ విశ్లేషకుడు ప్రొఫెసర్ నాగేశ్వరరావు చెప్పుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డిని జైలులో పెట్టాలన్న పవన్ కళ్యాణ్ కోరినట్లు.. దానిపై అమిత్ షా క్లాస్ పీకినట్లు విశ్లేషించారు నాగేశ్వర్. చంద్రబాబు కోరికతోనే పవన్ అక్కడికి వెళ్లినట్టు అర్థం వచ్చేలా మాట్లాడారు. అయితే ఈ విషయాలను పక్కన పెట్టేద్దాం. జగన్ శాశ్వత మిత్రుడు అయితే బిజెపి ఆయనతో కలవగలదా? పోనీ జగన్మోహన్ రెడ్డి తాను బిజెపితో కలుస్తానని బాహటంగా చెప్పగలరా? ఆ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తాయి అని బాహటంగా వారు ప్రకటించగలరా? ఇప్పుడు పొలిటికల్ వర్గాల్లో దీనిపైనే చర్చ నడుస్తోంది. పూర్తి వ్యతిరేక భావజాలం కలిగిన రెండు పార్టీలు శాశ్వత మిత్రులుగా కొనసాగ గలవా?

* కాంగ్రెస్ బద్ధ విరోధిగా..
భారతీయ జనతా పార్టీ కి జగన్ మోహన్ రెడ్డి ఒక విషయంలో మాత్రం అనుకూలం. కాంగ్రెస్ పార్టీకి బిజెపి బద్ద విరోధి. అదే కాంగ్రెస్ పార్టీని బద్ధ విరోధిగా చూస్తారు జగన్మోహన్ రెడ్డి. ఈ విషయంలో మాత్రం ఆ రెండు పార్టీలు విధానం ఒకటే. కానీ భావజాలం మాత్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీది, కాంగ్రెస్ పార్టీది ఒక్కటే. కాంగ్రెస్ నాయకులే 90 శాతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ సంప్రదాయ ఓటు బ్యాంకుగా ఉండే ముస్లిం, మైనారిటీలు, ఎస్సీ ఎస్టీలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి టర్నయ్యారు. ఈ వర్గాలంతా భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకం. ఇలాంటి విరుద్ధ భావజాలం కలిగిన ఆ రెండు పార్టీలు కలవగలవా? కలిసి నడవగలవా? ఈ విషయం ప్రొఫెసర్ నాగేశ్వర్ కు తెలియదా? ఆయనకు ఈ చిన్నపాటి అవగాహన లేదా? అనేది ఇప్పుడు చర్చ. కచ్చితంగా ఇది రాజకీయ ప్రేరేపిత విశ్లేషణ అంటూ ఒక ప్రచారం నడుస్తోంది.

* వ్యతిరేక భావజాలం..
బలమైన హిందుత్వవాదంతో ముందుకు వెళుతోంది భారతీయ జనతా పార్టీ. ఆ పార్టీతో సుదీర్ఘ ప్రయాణం కొనసాగిస్తూ వస్తోంది తెలుగుదేశం పార్టీ. రాజకీయ కారణాలతో బీజేపీ నుంచి బయటకు వచ్చిందే కానీ.. ఆ రెండు పార్టీల కలయిక ప్రతిసారి మంచి విజయాన్ని నమోదు చేస్తూ వచ్చింది. అటువంటి పార్టీని వదులుకొని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో బిజెపి ఎందుకు కలుస్తుంది. పోనీ కలిస్తే ఏమైనా ప్రయోజనం ఉందా అంటే అది లేదు. మూడోసారి నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చేందుకు కారణం తెలుగుదేశం. అటువంటి పార్టీని తాత్కాలిక మిత్రుడిగా అమిత్ షా ఎందుకు పోలుస్తారు. పైగా జగన్ పట్ల విపరీతమైన ద్వేషంతో నడిచే పవన్ కళ్యాణ్ వద్ద ఎందుకు ప్రస్తావిస్తారు. చంద్రబాబు నాయకత్వాన్ని బలంగా నమ్ముతున్నారు పవన్ కళ్యాణ్. కేంద్ర ప్రభుత్వ మద్దతుతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలని భావిస్తున్నారు. ఆయన రాజకీయాలు ఒక పద్ధతి ప్రకారం ఉంటాయి. ఆయనెందుకు జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టమని కోరుతారు? ప్రొఫెసర్ నాగేశ్వర్ ది ముమ్మాటికి రాజకీయ ప్రేరేపిత విశ్లేషణ అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. కూటమిలో ఒక రకమైన విచ్చిన్నం కోసం చేసే ప్రయత్నం గా ఎక్కువమంది భావిస్తున్నారు.

రామ్ చరణ్ - సుకుమార్ కాంబోలో రాబోతున్న సినిమా కథ అక్కడి నుంచి లేపేశారా..?

Ram Charan Sukumar Movie
Ram Charan Sukumar Movie

Ram Charan Sukumar Movie: రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ఇంతకుముందు రంగస్థలం సినిమా వచ్చింది. ఇప్పుడు వీళ్ళిద్దరి కాంబినేషన్లో మరో సినిమా రాబోతుంది. ఇప్పటికే రామ్ చరణ్ వైవిధ్యభరితమైన పాత్రను పోషిస్తూ ముందుకు సాగుతున్నాడు. బుచ్చిబాబు డైరెక్షన్లో చేసిన ‘పెద్ది’ సినిమా వచ్చే నెల నాలుగోవ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఈ సినిమాతో ఎలాగైనా సరే సూపర్ సక్సెస్ ని సాధించాలనే ప్రయత్నంలో రామ్ చరణ్ ఉన్నాడు. గత సంవత్సరం ఆయన చేసిన గేమ్ చేంజర్ మూవీ ఆశించిన మేరకు సాధించకపోవడంతో ఈ సినిమా మొత్తానికైతే ప్రేక్షకుల్లో ఒక విశేషమైన స్పందన రాబడుతుందనే అనే ఆలోచనలో రామ్ చరణ్ ఉన్నాడు. ఇక ప్రస్తుతం ఆయన సుకుమార్ తో చేయబోయే సినిమాకు సంబంధించిన మెకోవర్ పనుల్లో బిజీగా ఉన్నట్టుగా తెలుస్తుంది. సుకుమార్ సైతం ఈ కథని చాలా డిఫరెంట్ గా చూపించే ప్రయత్నం చేయబోతున్నాడట…

ఇక హాలీవుడ్ లో వచ్చిన ‘ఇన్సెప్షన్’ సినిమా ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని డిఫరెంట్ స్క్రీన్ ప్లే తో కథనైతే డిజైన్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది. కథ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుందట. ఇంతకు ముందు వీళ్ళిద్దరి కాంబినేషన్లో పల్లెటూరు నేపథ్యంలో రంగస్థలం సినిమా వచ్చింది.

అయితే ఇప్పుడు దానికి పూర్తి విరుద్ధంగా హై టెక్నాలజీ తో ఒక కథనైతే రెడీ చేశారట. ఇక మొత్తానికైతే రామ్ చరణ్ ను సుకుమార్ ఏ రేంజ్ లో చూపిస్తాడు. తద్వారా రామ్ చరణ్ ఇమేజ్ ను రెట్టింపు చేస్తాడా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది… సుకుమార్ లాంటి దర్శకుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉండటం నిజంగా ఇండస్ట్రీ చేసుకున్న అదృష్టమనే చెప్పాలి. రాజమౌళి తర్వాత పాన్ ఇండియాలో ఆ రేంజ్ గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు కూడా తనే కావడం విశేషం…

ఆయనకి చాలామంది అభిమానులు ఉన్నారు. పాన్ ఇండియాలో అతనితో సినిమాలు చేయడానికి చాలా మంది హీరోలు సైతం ఆసక్తి చూపిస్తుంటే అతను మాత్రం తెలుగు హీరోలతోనే సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు…

జగన్ ప్రెస్ మీట్.. సోషల్ మీడియాకు పండగే!

Jagan Press Meet
Jagan Press Meet

Jagan Press Meet: ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడంతో అసెంబ్లీకి హాజరు కావడం లేదు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. కేవలం 11 స్థానాలు మాత్రమే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి రావడంతో నిబంధనల మేరకు ప్రతిపక్ష హోదా రాదు. అదే విషయాన్ని ప్రభుత్వం తో పాటు స్పీకర్ తేల్చి చెప్పారు. అయితే తనకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే సభలో అడుగుపెట్టి ప్రజా సమస్యలు ప్రస్తావిస్తానని జగన్మోహన్ రెడ్డి చెబుతున్నారు. ఆ అవకాశం లేకపోవడంతో వారాంతపు కామెంట్స్ అంటూ.. తాడేపల్లి లో ప్రెస్ మీట్ పెట్టి సమకాలీన రాజకీయ అంశాలపై మాట్లాడుతున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రస్తావిస్తున్నారు. అయితే ఇప్పుడు జగన్ అలా ప్రెస్ మీట్ పెడితే చాలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు బెదిరిపోతున్నాయి. ఆయన ప్రెస్ మీట్ పెట్టిన ప్రతిసారి సోషల్ మీడియాలో ట్రోల్స్ కు గురవుతున్నారు. ఆయన మాటల్లో తప్పిదాలు చోటు చేసుకోవడంతో.. రీల్స్, మీమ్స్ తో హోరెత్తిపోతోంది సోషల్ మీడియా..

* అప్పట్లో మీడియాకు దూరంగా..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి మీడియా ముందుకు వచ్చిన దాఖలాలు లేవు. ఒక్కసారి కూడా ప్రెస్ మీట్ పెట్టలేదు. మీడియాతో మాట్లాడేందుకు కూడా ఇష్టపడేవారు కాదు. దీంతో ఆయనతో మాట్లాడేందుకు మీడియా చేయని ప్రయత్నం అంటూ ఉండేది కాదు. చివరకు ఢిల్లీ పర్యటన సమయంలో సైతం జగన్మోహన్ రెడ్డి మీడియాను దగ్గరకు రానిచ్చేవారు కాదు. ఏదైనా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా చెప్పాలి అనుకుంటే.. రికార్డెడ్ తో కూడిన వీడియోను విడుదల చేసేవారు. వాటినే సాక్షితోపాటు మిగతా మీడియాకు విడుదల చేసేవారు. దీంతో అంతా జగన్మోహన్ రెడ్డి వాగ్దాటి గల మనిషి అని భావించేవారు. ఎటువంటి తత్తర పాటు లేకుండా మాట్లాడేవారు. అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. ఏ మీడియాతో మాట్లాడే వారు కాదో.. అదే మీడియాతో వారాంతపు సమావేశాలు నిర్వహించి రాజకీయాల కోసం మాట్లాడుతున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రస్తావిస్తున్నారు. అయితే ఆ వైఫల్యాలు ప్రజల్లోకి వెళ్తున్నాయో లేదో చెప్పలేం కానీ.. ఆయన మాత్రం సోషల్ మీడియాలో టార్గెట్ అవుతున్నారు.

* గతంలో లోకేష్ కు..
గతంలో మంత్రి నారా లోకేష్ ను అలానే వెంటాడే వారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్టులు. అయితే ఇప్పుడు వెంటాడకుండానే జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మరి సోషల్ మీడియాకు అవసరమైన వనరులను అందిస్తున్నారు. విదేశీ పర్యటన ముగించుకుని బెంగళూరు వచ్చారు జగన్మోహన్ రెడ్డి. ఈవారం తాడేపల్లి కి వచ్చి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి తిరిగి బెంగళూరు వెళ్ళిపోనున్నారు. దీంతో రెడీగా ఉన్నారు సోషల్ మీడియా యాక్టివిస్టులు. ఆయన రెండు గంటలపాటు ఏకధాటిగా మీడియా సమావేశంలో పాల్గొంటూ వస్తున్నారు. కానీ ఏదో ఒకటి తప్పుడుగా మాట్లాడి బుక్ అవుతున్నారు. మరి ఈరోజు ఎలాంటి తప్పుడు మాటలు వెలుగు చూస్తాయో చూడాలి.

ప్రభాస్ ఇమేజ్ డ్యామేజ్ చేసిన ముగ్గురు దర్శకులు వీళ్లే...

Prabhas
Prabhas

Prabhas: తెలుగు సినిమా ఇండస్ట్రీలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కి ఉన్న గుర్తింపు నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి ఇకమీదట ఆయన చేయబోతున్న సినిమాల విషయంలో సైతం తను చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు… అయితే ప్రభాస్ బాహుబలి సినిమాతో పాన్ ఇండియాలో పెను సంచలనాన్ని క్రియేట్ చేసిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాతో ఆయన ఓవర్ నైట్ లో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. అప్పటినుంచి డిఫరెంట్ సినిమాలను చేస్తూ పాన్ ఇండియా ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఇక ప్రభాస్ ఎంటైర్ కెరియర్లో చేసిన ఒక మూడు సినిమాలు అతని ఇమేజ్ ను భారీగా డామేజ్ చేశాయి. నిజానికి ఆ దర్శకులు సైతం ప్రభాస్ ని అంత పెద్దగా వాడుకోలేదనే చెప్పాలి. ఇంతకీ ఆ దర్శకులు ఎవరు అంటే ‘ఆదిపురుష్’ సినిమాతో తనకు భారీ డిజాస్టర్ ని కట్టబెట్టి ప్రభాస్ ఇమేజ్ ని మొత్తానికే డామేజ్ చేసిన దర్శకుడు ఓం రావత్ కావడం విశేషం…

ఆయన ఆ మూవీ చేయకపోయిన బాగుండేది అనేంతలా ప్రభాస్ అభిమానులు సైతం ఇబ్బంది పడ్డారు అంటే ఆ సినిమా ఏ రేంజ్ లో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ సినిమాతో ప్రభాస్ కి ఒక భారీ సక్సెస్ ని కట్టబెట్టాలనే ఉద్దేశ్యంతో రాధాకృష్ణ సినిమాని తెరకెక్కించాడు. ఈ సినిమా ప్రభాస్ కి ఎలాంటి ఇమేజ్ ని తీసుకురాలేదు.

పైగా ఆ మూవీ చేసినందుకు అతని మీద భారీ విమర్శలైతే వచ్చాయి. కాబట్టి డైరెక్టర్ రాధాకృష్ణ కూడా ప్రభాస్ ని ఇమేజ్ ను పూర్తిగా డ్యామేజ్ చేశారనే చెప్పాలి. ఇక ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా వచ్చిన ‘రాజా సాబ్’ సినిమా సైతం ప్రభాస్ ఇమేజ్ ను పూర్తిగా డామేజ్ చేసేసింది. ఇక ప్రభాస్ తో తెరకెక్కించాల్సిన సినిమా అయితే ఇది కాదని చాలామంది కామెంట్స్ చేశారు. ఇక ఈ మూవీని మీడియం రేంజ్ హీరోతో తెరకెక్కించి ఉంటే బాగుండేది. ప్రభాస్ ఇమేజ్ కి తగ్గ కథ కాదని చెప్పారు.

అలాగే ప్రభాస్ ని డిఫరెంట్ షేడ్స్ లో చూపిస్తానని చెప్పిన మారుతి ఈ సినిమాలో కొన్నిసార్లు భయపడే క్యారెక్టర్ లో కూడా చూపించాడు. దాన్ని ప్రేక్షకులతో పాటు అభిమానులు కూడా జీర్ణించుకోలేకపోయారు… ఇక ఈ ముగ్గురు దర్శకులు ప్రభాస్ ఇమేజ్ ని ఈ మధ్యకాలంలో చాలావరకు డ్యామేజ్ చేశారు…

సినిమాల విషయంలో చిరంజీవికి సలహాలిచ్చిన రజినీకాంత్...ఇంతకీ ఏం చెప్పాడు...

Rajinikanth And Chiranjeevi
Rajinikanth And Chiranjeevi

Chiranjeevi And Rajinikanth: గత 50 సంవత్సరాలుగా తెలుగు సినిమా ఇండస్ట్రీ ఎనలేని సేవలను అందిస్తున్న నటుడు మెగాస్టార్ చిరంజీవి…70 సంవత్సరాల వయసులో కూడా ఆయన కుర్ర హీరోలకు పోటీని ఇస్తున్నారంటే మామూలు విషయం కాదు. ఇక ప్రస్తుతం బాబీ డైరెక్షన్లో చేయబోయే సినిమా కోసం ఆయన జిమ్ కి వెళ్లి మరి తీవ్రమైన కసరత్తులైతే చేస్తున్నాడు. ఆ సినిమాలో 50 సంవత్సరాలు పైబడిన వయసు గల క్యారెక్టర్ లో చిరంజీవి కనిపించబోతున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు. తద్వారా ఈ సినిమా అతనికి ఎలాంటి ఐడెంటిటి క్రియేట్ చేసి పెడుతుందనేది కూడా తెలియాల్సి ఉంది. నిజానికి ఆయన అనుకుంటే ఈ ఏజ్ లో సినిమాలు చేయాల్సిన పనిలేదు. ఫ్యామిలీతో పాటు ఎంజాయ్ చేస్తూ కాలాన్ని గడపొచ్చు. కానీ మనం ఎవరి కంటే తక్కువ కాదు మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాలి ఇంకా మనం చేయాల్సిన సినిమాలు చాలానే ఉన్నాయి అనే ఒక దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నాడు.

ఇక ఇదిలా ఉంటే తమిళ్ సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా వెలుగొందుతున్న రజనీకాంత్ సైతం ప్రస్తుతం సోలో హీరోగా అలరిస్తున్నాడు. ‘జైలర్ 2’ సినిమాతో మరోసారి ప్రేక్షకుడి ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. ఈ క్రమంలోనే రీసెంట్ గా చిరంజీవి రజనీకాంత్ ను కలిసినప్పుడు సినిమాల విషయంలో రజనీకాంత్ చిరంజీవికి కొన్ని సలహాలైతే ఇచ్చారట.

అవి ఏంటి అంటే ఈ ఏజ్ లో డిఫరెంట్ సినిమాలని చేయాలని రొటీన్ రెగ్యులర్ సినిమాలు చేయడం కంటే మనం ఇంతకుముందు చేయని పాత్రలు ఏంటో తెలుసుకొని ఆ క్యారెక్టర్ ను చేయగలిగితే బాగుంటుంది అంటూ చెప్పారట. చిరంజీవి కూడా దానికి ఎస్ చెప్పినట్టుగా తెలుస్తుంది.

ఇక రాబోయే రోజుల్లో వీళ్లిద్దరి నుంచి వైవిధ్య భరితమైన సినిమాలు వచ్చే అవకాశాలైతే ఉన్నాయంటూ కొంతమంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు…చూడాలి మరి రాబోయే రోజుల్లో వాళ్ల నుంచి ఎలాంటి సినిమాలు రాబోతున్నాయి అనేది…

స్పిరిట్ vs డ్రాగన్ ఎవరి దమ్ము ఎంత..?

Spirit Vs Dragon
Spirit Vs Dragon

Spirit Vs Dragon: తెలుగు సినిమా ఇండస్ట్రీలో రెబల్ స్టార్ గా తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న నటుడు ప్రభాస్… ఆయన నుంచి వచ్చిన సినిమాలు ప్రేక్షకులను విశేషంగా అలరిస్తున్నాయి. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలన్ని పాన్ ఇండియాలో పెను సంచలనాలను క్రియేట్ చేస్తుండడం విశేషం… ఇక జూనియర్ ఎన్టీఆర్ సైతం పాన్ ఇండియాలో తన సత్తా చాటుతున్నాడు. దేవర సినిమాతో 500 కోట్లకు పైన కలెక్షన్స్ ను కొల్లగొట్టిన ఆయన ఇప్పుడు డ్రాగన్ సినిమాతో మరోసారి పెను సంచలనాలను క్రియేట్ చేయాలనే ప్రయత్నంలో ఉన్నాడు… ప్రస్తుతం ప్రభాస్ ఎన్టీఆర్ ల మధ్య విపరీతమైన పోటీ అయితే ఉందనే విషయం మనకు తెలిసిందే.

సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో చేస్తున్న స్పిరిట్ సినిమా వచ్చే సంవత్సరం మార్చి నెలలో రిలీజ్ అవ్వనుంది. అలాగే ఎన్టీఆర్ హీరోగా చేసిన ‘డ్రాగన్’ సినిమా సైతం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ రెండు సినిమాల మధ్య తీవ్రమైన పోటీ ఉందనే విషయం మనందరికి తెలిసిందే. రెండింటిలో ఏ సినిమా భారీ విజయాన్ని సాధిస్తుంది ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా ఇద్దరు మ్యాజిక్ చేసి సినిమాని మరోసారి టాప్ లెవల్లో నిలబెడతారా లేదా అనేది తెలియాల్సి ఉంది.

ఇక ప్రశాంత్ నీల్ ఇంతకుముందు చేసిన కేజిఎఫ్ సిరీస్ అలాగే సలార్ తో భారీ విజయాన్ని అందుకున్నాడు. ఇక జూనియర్ ఎన్టీఆర్ కి సైతం అలాంటి విజయాన్నే కట్టబెట్టాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ఏది ఏమైనా కూడా జూనియర్ ఎన్టీఆర్ ఈ మధ్యకాలంలో చేసిన సినిమాలు అతనికి పెద్దగా గుర్తింపైతే తీసుకురావడం లేదు.

కాబట్టి ఈ సినిమాతోనే ఆయన పెను సంచలనాలను క్రియేట్ చేయాల్సిన అవసరమైతే ఉంది. లేకపోతే ఆయన భారీగా డీలా పడిపోయే ప్రమాదం ఉంది… మొత్తానికైతే వీళ్ళిద్దరి మధ్య తీవ్రమైన పోటీ ఉంది. ఇక వీళ్లలో ఎవరు పై చేయి సాధిస్తారు…ఎవరు వెనకబడిపోతారు అనేది తెలియాలంటే మాత్రం మరొక సంవత్సరం పాటు వెయిట్ చేయాల్సిన అవసరమైతే ఉంది…

పవన్, అమిత్ షా భేటీ.. ప్రొఫెసర్ నాగేశ్వర్ విశ్లేషణ కరెక్టేనా?

Pawan Kalyan Friends
Pawan Kalyan Friends

Pawan Kalyan Amit Shah Meeting: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరి ఇంతలా దిగజారుతారా? ఆయన వెళ్లి అమిత్ షాను జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టమని కోరుతారా? రాజకీయంగా ఎదుర్కొంటారు తప్ప ఇటువంటి పరిస్థితికి వస్తారా? అసలు ప్రొఫెసర్ నాగేశ్వర్ విశ్లేషణ ఎందుకు అలా వచ్చింది? ఆయనకు ఎవరు సమాచారం ఇచ్చారు? పొలిటికల్ వర్గాల్లో దీనిపైన చర్చ నడుస్తోంది. కొద్దిరోజుల కిందట హోం మంత్రి అమిత్ షాను పవన్ కళ్యాణ్ కలిసినట్లు.. జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టమని కోరినట్టు.. అందుకు అమిత్ షా తిరస్కరించినట్టు.. జగన్ శాశ్వత మిత్రుడు అన్నట్టు.. చంద్రబాబు తాత్కాలిక స్నేహితుడు అన్నట్టు.. అనవసరంగా జగన్మోహన్ రెడ్డి జోలికి వెళ్లొద్దు అంటూ సలహా ఇచ్చినట్టు.. చంద్రబాబు కోసం మనమెందుకు పని చేయాలి అన్నట్టు.. ప్రొఫెసర్ నాగేశ్వరరావు విశ్లేషించారు. ఈ సమావేశంలో నాదేండ్ల మనోహర్ ఉన్నట్లు కూడా చెప్పుకొచ్చారు. తనకు విశ్వసనీయ సమాచారం అన్నట్టు మాట్లాడారు. అది మొదలు ఏపీలో రచ్చ రచ్చ సాగుతోంది. అయితే దీనిపై క్లారిటీ ఇచ్చారు నాదెండ్ల మనోహర్. అటువంటిదేమీ లేదని తేల్చేశారు.

* ఎప్పుడు చంద్రబాబుకు వ్యతిరేకంగానే…
ప్రొఫెసర్ నాగేశ్వరరావు మంచి విశ్లేషకుడు. కానీ ఆయన ఎప్పుడూ చంద్రబాబుకు వ్యతిరేకి. ఆ విశ్లేషణలో చంద్రబాబు వ్యతిరేక ముద్ర కనిపిస్తుంది. ఇప్పుడు కూడా చంద్రబాబు పవన్ కళ్యాణ్ ను పంపినట్టు.. జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టమని పవన్ మధ్యవర్తిత్వం వహించారన్నది ప్రొఫెసర్ నాగేశ్వర్ విశ్లేషణ. అంతవరకు ఓకే. చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి కోసం రాజకీయం చేస్తారే అనుకుందాం. అయితే జైల్లో పెట్టమని తానే స్వయంగా అడుగుతారు కదా. పోనీ చంద్రబాబు చెప్పారు సరే.. పవన్ అలా వెళ్లి అమిత్ షాను కోరుతారా? 2014లో కేంద్రంలో బిజెపికి మద్దతు తెలిపారు పవన్ కళ్యాణ్. జగన్ వస్తే విధ్వంసం పుట్టుకొస్తుందని చెప్పి అప్పట్లో రాష్ట్రంలో టిడిపికి.. కేంద్రంలో బిజెపికి మద్దతు తెలిపారు. 67 సీట్లతో జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నారు. అధికార పక్షానికి ధీటుగా వ్యవహరిస్తున్నారు. ఆ సమయంలోనే పవన్ కళ్యాణ్ ఒక్కసారి కూడా కేంద్ర పెద్దలను కలవలేదు. కేవలం రాజకీయంగానే జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొన్నారు తప్ప.. వ్యక్తిగతంగా ఆయనపై ఫిర్యాదులు చేసిన దాఖలాలు లేవు. అప్పుడే చేయని పవన్ ఇప్పుడు ఎలా చేస్తారు అనేది ఒక ప్రశ్న.

* కోర్టులను ప్రభావితం చేయగలరా?
అయినా జగన్మోహన్ రెడ్డి పై ఉన్నవి పాత కేసులు. ఏవైనా కొత్త కేసులు పెట్టి జైల్లో పెట్టాలని కోరుతారే తప్ప.. పాత కేసులు కోర్టుల పరిధిలో ఉన్నాయి. ఆ కేసుల్లో ప్రధాని నరేంద్ర మోడీ ప్రమేయం ఏమి ఉంటుంది. కోర్టులను మోదీ, అమిత్ షా ఆదేశాలు జారీ చేయగలరా? ప్రభుత్వాలు కోర్టులను ప్రభావితం చేయగలవు అనుకుంటే.. ఒక్కోసారి ప్రతికూల తీర్పులు ఎలా వస్తున్నాయి. అయితే ఒకటి మాత్రం నిజం అయి ఉంటుంది. ఇందులో నాదేండ్ల మనోహర్ ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి.. ఆయనంటే గిట్టని వారు సమాచారం ఇవ్వొచ్చు. లేకుంటే ప్రొఫెసర్ నాగేశ్వరరావుకు ఎవరైనా పక్కదారి పట్టించవచ్చు. లేకుంటే ప్రొఫెసర్ నాగేశ్వర్ టిడిపి పై వ్యతిరేకతతో.. కూటమిలో చిన్నపాటి కుదుపు తెచ్చేందుకు ఈ విశ్లేషణ చేసి ఉండవచ్చు. అంతకుమించి ఏమీ కనిపించడం లేదు కూడా. అయితే ఇప్పుడు నాదెండ్ల మనోహర్ ఫుల్ క్లారిటీ ఇవ్వడంతో అందరి అనుమానం ప్రొఫెసర్ నాగేశ్వరరావు పైనే ఉంది.

పవన్ కళ్యాణ్ తో స్నేహం చేసి లాభపడిన వాళ్ళు ఎవరు...నష్టపోయిన వాళ్లెవరంటే..?

Pawan Kalyan
Pawan Kalyan

Pawan Kalyan Friends: తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు దూసుకెళ్తుంది. ప్రస్తుతం పాన్ ఇండియాలో మన స్టార్ హీరోలు చేస్తున్న సినిమాలన్నీ పెను సంచనాలను క్రియేట్ చేస్తుండటం విశేషం… ఇక ఇప్పటివరకు ఎవరు ఇలాంటి సినిమాలు చేసిన రాని గుర్తింపు స్టార్ హీరోలు ఈ మధ్యకాలంలో చేస్తున్న సినిమాలతో తెచ్చుకుంటున్నారు. పాన్ ఇండియాలో పెను సంచలనాలను క్రియేట్ చేయడంతో ఇప్పటివరకు ఇండియాలో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో నెంబర్ వన్ స్థాయిలో కొనసాగుతుంది. ఇక ఇదిలా ఉంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సైతం తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. ఇక పవన్ కళ్యాణ్ తో ఫ్రెండ్షిప్ చేసి ఇండస్ట్రీలో చాలా మంది నటులుగా స్థిరపడ్డారు. ముఖ్యంగా బండ్ల గణేష్, ఉత్తేజ్ లాంటి నటులు మొదట్లో పవన్ కళ్యాణ్ తో చాలా మంచి ఫ్రెండ్స్ గా కొనసాగారు. వీళ్ళ మధ్య చాలా మంచి బాండింగ్ ఉండేది. ఆ తర్వాత ప్రొడ్యూసర్ గా మారి పవన్ కళ్యాణ్ తోనే పలు సినిమాలు చేసి సూపర్ సక్సెస్ సాధించాడు. ముఖ్యంగా గబ్బర్ సింగ్ సినిమాతో బండ్ల గణేష్ ఓవర్ నైట్ లో స్టార్ ప్రొడ్యూసర్ గా మారిపోయాడు. ఆ సినిమా ఇచ్చిన సక్సెస్ తో బండ్ల గణేష్ కి తిరుగులేకుండా పోయింది.

ఇక పవన్ కళ్యాణ్ మీద ఎప్పటికప్పుడు కృతజ్ఞతలు చూపిస్తూ వస్తున్న గణేష్ ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ కి చాలా దూరం అయిపోయాడు. కారణం ఏదైనా కూడా వీళ్ళిద్దరు మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉందని వాళ్ళ సన్నిహిత వర్గాల నుంచి కొన్ని వార్తలైతే వస్తున్నాయి…

పవన్ కళ్యాణ్ ద్వారా నష్టపోయిన వారు ఎవరు అంటే ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి అనే చెప్పాలి. పవన్ కళ్యాణ్ ఫ్రెండ్ అవ్వడం వల్ల కేవలం అతని సినిమాలకు ఆర్ట్ డైరెక్టర్ గా పని చేస్తాడేమో మన సినిమాలకు చేయడేమో అనే ఉద్దేశ్యంతో కొంతమంది స్టార్ హీరోలు, డైరెక్టర్లు ఆనంద్ సాయిని ఆర్ట్ డైరెక్టర్ గా తీసుకోవడం లేదంటూ గతంలో కొన్ని వార్తలైతే వచ్చాయి.

నిజానికి ఆనంద్ సాయి చాలా మంచి ఆర్ట్ డైరెక్టర్ ఆయన చేసిన సినిమాలన్నీ ప్రేక్షకులను విశేషంగా అలరించాయి. పవన్ కళ్యాణ్ లాంటి స్నేహితుడు ఉండటం నిజంగా తన అదృష్టం అంటూ ఆనంద్ సాయి పలు ఇంటర్వ్యూల్లో చెప్పాడు. అలాగే పవన్ కళ్యాణ్ వల్లే తను ఆర్ట్ డైరెక్టర్ గా మారానని కూడా గుర్తు చేసుకుంటాడు…

ఆరు బయట 48 డిగ్రీలు.. చెట్టు నీడలో 29 డిగ్రీలు.. అందుకే మొక్కలు నాటాలనేది

Tree Plantation Benefits
Tree Plantation Benefits

Tree Plantation Benefits: ఎండలు మండిపోతున్నాయి. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. బయటికి వెళ్లాలంటే భయమేస్తోంది. ఉదయం 10 గంటలు దాటితే చాలు రోడ్లమీద అనధికారిక కర్ఫ్యూ వాతావరణం ఏర్పడుతోంది. ఇంట్లో ఉంటే కూడా విపరీతమైన ఉక్క పోత వేధిస్తోంది. ఫ్యాన్ కింద ఉంటే చెమటలు తగ్గడం లేదు. కూలర్ వేడి నుంచి ఉపశమనం అందించడం లేదు. చివరికి ఏసీ కూడా చల్లని గాలిని అందివ్వడం లేదు.

ఇలాంటి తరుణంలో వేసవి నుంచి రక్షణ పొందే ఏకైక మార్గం ఒకటి ఉంది.. అదే మొక్కలను పెంచడం. అభివృద్ధి మాయలో పడి ప్రభుత్వాలు చెట్లను విపరీతంగా నరికేస్తున్నాయి. ప్రజలు కూడా పర్యావరణ స్పృహను పక్కనపెట్టి.. బిల్డింగ్ల మీద బిల్డింగ్ లు కడుతున్నారు. నగరాలు గ్రామాలు అని తేడా లేకుండా కాంక్రీట్ జంగిల్స్ లాగా మార్చేస్తున్నారు. కనీసం వర్షపు నీరు భూమిలోకి ఇంకే అవకాశం లేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. చివరికి గ్రీన్ బెల్ట్ ఏరియాని కూడా కమర్షియల్ గా మార్చేసి.. మొక్కలను పెంచడం లేదు. చెట్లుగా ఎదిగేలా చేయడం లేదు.

ఎండాకాలంలో చల్లదనం కోసం.. చాలామంది ఏసీలను ఆశ్రయిస్తుంటారు. కానీ చల్లదనం చెట్ల నుంచి విపరీతంగా వస్తుందని.. నిరూపితమైంది. ఉత్తర ప్రదేశ్ లోని నోయిడా ప్రాంతంలో ఒకే చోట.. ఓకే సమయంలో నిర్వహించిన పరిశీలనలో చెట్లకు ఉన్న విలువ అందరికీ అర్థమైంది. అక్కడ రోడ్డుమీద ఉష్ణోగ్రతను పరిశీలిస్తే రికార్డు స్థాయిలో 48 డిగ్రీలు చూయించింది. అదే సమయంలో చెట్టు నీడలో కేవలం 29 డిగ్రీలు మాత్రమే చూపించింది. అంటే చెట్లు ఉన్న ప్రాంతంలో ఏకంగా 19 డిగ్రీల ఉష్ణోగ్రత తగ్గింది. ఎండల నుంచి మనల్ని కాపాడడానికి.. భూమిని చల్లబరిచేందుకు మొక్కలు నాటాల్సిందే. వాటిని వృక్షాలుగా ఎదిగేందుకు తోడ్పాటు అందివ్వాల్సిందే.

చెట్లు పరోపకారులు. మొక్కలు నాటడం వల్ల.. మనుషుల మనుగడకు ఎంతో ప్రయోజనకరం. ఎందుకంటే భూమ్మీద ఉష్ణోగ్రతను చెట్లు తగ్గిస్తాయి. నేల క్షీణతను తగ్గిస్తాయి. భూగర్భ జల మట్టాన్ని క్రమబద్ధీకరిస్తాయి. చివరికి వరదల నుంచి కాపాడతాయి. కరువు కాటకాలు సోకకుండా అడ్డుపడతాయి.

ఈ ఐదు రాశుల వారికి ఈరోజు లక్ష్మీ కటాక్షం..

Today 18 July 2026 Horoscope
Today 18 July 2026 Horoscope

Today 20 May 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురువారం ద్వాదశ రాశులపై పునర్వసు నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి అనుకోకుండా ధన లాభం ఉండనుంది. మరికొన్ని రాశుల వారు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

మేష రాశి (అశ్విని, భరణి,1,2,): వ్యక్తిగతంగా అధిక ప్రయోజనాలు పొందుతారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. స్నేహితుల సహకారంతో అప్పులను తీరుస్తారు. వ్యాపారులు కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి సమాయత్తమవుతారు. ఉద్యోగులకు అధికారుల మద్దతు ఉండడంతో అన్ని ప్రయోజనాలు కలుగుతాయి. కొందరికి పదోన్నతి వచ్చే అవకాశం ఉంటుంది.

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారికి ఈ రోజు ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. వ్యాపారులకు కుటుంబ సభ్యుల మద్దతు ఉండడంతో ఊహించిన దానికంటే ఎక్కువగా ప్రయోజనాలు పొందుతారు. ఉద్యోగులు కొత్తగా ప్రాజెక్టులు చేపడితే వెంటనే పూర్తిచేస్తారు. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశం ఉంది. దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

మిథున రాశి( మృగశిర 3,4 ): ఈ రాశి వారు కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. కష్టానికి తగిన ఫలితం ఉంటుంది. ముఖ్యమైన ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేస్తారు. గతంలో కంటే ఇప్పుడు ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు. ఉద్యోగులకు అధికారుల నుంచి ప్రశంసలు అందుతాయి. కొందరికి పదోన్నతి వచ్చే అవకాశం ఉంటుంది. ఎవరికైనా డబ్బు ఇచ్చే ముందు ఆలోచించాలి.

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారు ఈ రోజు సమయానికి అనుకూలంగా పనులు పూర్తి చేసుకుంటారు. ఇతరుల వద్ద ఆగిపోయిన డబ్బు వసూలు అవుతుంది. కుటుంబ వాతావరణం సంతోషంగా ఉంటుంది. కొత్తగా పెట్టుబడులు పెట్టేవారు పెద్దలను సంప్రదిస్తారు. మానసికంగా సంతృప్తిగా ఉంటారు. కొన్ని ముఖ్యమైన పనులు చేసేటప్పుడు ఒత్తిడి కలుగుతుంది.

సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారికి ఈ రోజు సమాజంలో గౌరవం లభిస్తుంది. గతంలో కంటే ఇప్పుడు ఆదాయం పెరుగుతుంది. అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. కుటుంబ సభ్యుల మధ్య బంధుత్వాలు పెరిగిపోతాయి. స్నేహితుల సహకారంతో అప్పులను తీరుస్తారు. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. జీవిత భాగస్వామితో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు.

కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వ్యాపారులకు పెద్దలనుంచి సపోర్టు ఉంటుంది. దీంతో కొత్తగా పెట్టుబడులు పెడతారు. ఉద్యోగులకు అధికారుల మద్దతు ఉండడంతో ముఖ్యమైన పనులను ప్రారంభిస్తారు. స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. పిల్లల కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సివస్తే జాగ్రత్తగా ఉండాలి.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారు ఈరోజు అన్ని రంగాల్లో రాణిస్తారు. గతంలో కంటే ఇప్పుడు ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారు. ఉద్యోగులకు అదనపు ఆదాయం అందుతుంది. గతంలో కంటే ఇప్పుడు పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేయడంతో మానసికంగా సంతృప్తిగా ఉంటారు.

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారు ఈ రోజు అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఇలాంటి సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కష్టానికి తగిన ఫలితం ఉంటుంది. చేసే ప్రతి పనిలో విజయం సాధిస్తారు. ఉద్యోగులు కోరుకున్న జీవితాన్ని పొందుతారు. గతంలో చేపట్టిన ప్రాజెక్టులను ఇప్పుడు విజయవంతంగా పూర్తి చేస్తారు.

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారికి కుటుంబ సభ్యుల మద్దతు ఉండడంతో ఘన నియంగా లాభాలు పొందుతారు. ఎవరికైనా డబ్బు ఇచ్చే ముందు ఆలోచించాలి. ఉద్యోగులు తోటి వారితో సక్రమంగా ఉండాలి. స్నేహితుల సహకారంతో అప్పులను తీరుస్తారు. కొత్తగా పెట్టుబడులు పెట్టేవారు పెద్దలను సంప్రదించడం మంచిది. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారు ఈరోజు దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉండగలుగుతారు. బకాయిల నుంచి విముక్తి కలుగుతుంది. ఉద్యోగులకు తోటి వారి సహకారం ఉంటుంది. కొన్ని ప్రయాణాల వల్ల అధిక ప్రయోజనాలు పొందుతారు. పిల్లల కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు. జీవిత భాగస్వామి కోసం అవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారికి ఈరోజు ఆర్థికంగా కొన్ని కష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంది. వ్యాపారులు కొత్తగా ఒప్పందాలు చేసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. విలువైన వస్తువుల విషయంలో ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి. జీవిత భాగస్వామి కోసం అవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులతో విహారయాత్రలకు వెళ్తారు.

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారికి ఈ రోజు ఆర్థికంగా మెరుగైన ఫలితాలు ఉంటాయి. అయితే ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యమైన పనులను వాయిదా వేసుకోవడమే మంచిది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొంటే కష్టపడాల్సి వస్తుంది. దూర ప్రయాణాలు చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

సమ్ థింగ్.. సమ్ థింగ్: అమిత్ షాతో ఢిల్లీలో పవన్ , నాదెండ్ల భేటి.. ఏదో జరుగుతోందట.. నిజమా!?

Amith shah pawan nadendla

Pawan Kalyan – Amit Shah : కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోడీ తర్వాత.. స్థానంలో ఉన్నారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. ఏపీలో కూడా చంద్రబాబు తర్వాత ఆ స్థాయిలో ఉన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఏపీలో పవన్ కళ్యాణ్.. కేంద్రంలో అమిత్ షా ఇద్దరు కూడా అత్యంత శక్తివంతమైన నాయకులు. వీరిద్దరికి బలమైన నేపథ్యం ఉంది. అన్నింటికి మించి జాతీయ భావాలు పుష్కలంగా ఉన్నాయి. వీరిద్దరిది ఒకే మనస్తత్వం. శైలికూడా ఒకే విధంగా ఉంటుంది. దేశం ముఖ్యమా.. ప్రాణాలు ముఖ్యమా అంటే వీరిద్దరూ మొదటి దానికి ఓటు వేస్తారు.

అంతటి జాతీయత భావాలు ఉన్న వీరిద్దరూ కలవడం ఏపీ రాజకీయాలలోనే కాదు, దేశ రాజకీయాలలో సంచలనంగా మారింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అమిత్ షా పెద్దగా ఎవరితో మాట్లాడటం లేదు. పైగా పశ్చిమ బెంగాల్లో సిలిగురి కారిడార్ లో చేపడుతున్న పనులపై నిత్యం సమీక్షలు చేస్తున్నారు.. ఈశాన్య రాష్ట్రాలపై ప్రధానంగా ఫోకస్ పెట్టారు. అలాంటి అమిత్ షా ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు. పవన్ కళ్యాణ్ వెంట ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా ఉన్నారు. ఏకంగా 25 నిమిషాల పాటు చర్చ జరిగింది. అనేక అంశాలపై ఈ సమావేశంలో మాట్లాడారని తెలుస్తోంది. అమిత్ షా తో సమావేశం ముగిసిన తర్వాత పవన్ కళ్యాణ్ బయటకు వచ్చి నవ్వుతూ కనిపించారు. అధ్యంతం మీటింగ్ అద్భుతంగా సాగిందని పేర్కొన్నారు.

ఇప్పటికిప్పుడు అమిత్ షా, పవన్ కళ్యాణ్ భేటీ వెనుక అసలు ఉద్దేశం 2029 ఎన్నికల్లో ఏపీ రాష్ట్రంలో బిజెపి, జనసేన, టిడిపి కలిసి పోటీ చేయడమేనని బయటకు లీకులు ఇచ్చారు. ఎందుకంటే ఈ మూడు పార్టీలు కూటమిగా ఏర్పడి 2024 లో బంపర్ మెజారిటీతో విజయం సాధించాయి. వైసిపిని 11 స్థానాలకు పరిమితం చేశాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏపీలో అభివృద్ధి.. సంక్షేమం.. ప్రజల భద్రత.. రాజకీయంగా స్థిరత్వం వంటివి కొనసాగాలంటే ఈ మూడు పార్టీలు 2029 ఎన్నికల్లో కూడా కలిసి పోటీ చేయాలని పవన్ కళ్యాణ్ అమిత్ షా కు సూచనలు చేసినట్టు బయట చెప్పారు.. దీనికి అమిత్ షా కూడా ఒప్పుకున్నట్టు సమాచారం.

2024 లో కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడేందుకు.. దానికంటే ముందు జనసేన, టిడిపి, బిజెపి పార్టీలు కలిసి పోటీ చేసేందుకు పవన్ కళ్యాణ్ చొరవ చూపించారు. బిజెపి పెద్దలతో మాట్లాడారు. పొత్తు కుదిరేలా చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేశారు. అందువల్ల ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగలిగింది. అయితే ఇప్పుడు కూడా ఏపీలో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి.. వైసిపిని అధికారానికి దూరంగా ఉంచాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. అందువల్లే ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ బిజెపి పెద్దలతో అసలు విషయం చెప్పేస్తున్నారు. పవన్ కళ్యాణ్ మాటను బిజెపి పెద్దలు కూడా కాదనలేకపోతున్నారు. ఆయన చెప్పిన దానికి ఓకే అంటున్నారు. అయితే పవన్ కళ్యాణ్ గురువారం కూడా ఢిల్లీలోనే ఉంటారు. ఎన్డీఏ ప్రభుత్వంలోని కీలక మంత్రులను.. ఇంకా కొంతమంది పెద్ద వ్యక్తులను కలిసే అవకాశం ఉంది.

– కుహాన మేధావుల వాదన ఇదీ..

అయితే అమిత్ షాతో పవన్ భేటి వెనుక బీజేపీ, జనసేన లీకులు అన్నీ టీడీపీకి అనుకూలంగానే ఉన్నాయి. మూడు పార్టీలు కలిసినడిచేటట్టుగానే ఉన్నాయి. అయితే మన తెలుగులో ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటి వారు దీనిపై కోడిగుడ్డుపై ఈకలు పీకిన చందంగా కొత్త లాజిక్ వెతుకుతున్నారు.. జగన్ ను కేంద్రంలోని బీజేపీ అరెస్ట్ చేస్తే ఖాళీ అయ్యే ఆ స్థానంలో జనసేనను ప్రతిపక్షంగా పెట్టొచ్చని.. లేదంటే బీజేపీతో కలిసి జనసేన సపరేట్ గా పోటీచేసినా గెలవచ్చొని.. ఈ రెండూ కాదంటే పవనే బీజేపీలో చేరి లీడ్ చేయవచ్చని నాగేశ్వర్ లాంటి మేధావులు ఇప్పటికే సోషల్ మీడియాలో పుంఖాను పుంఖాలుగా వార్తలు , వీడియోలు పరిచేస్తున్నారు.

అయితే లోగొట్టు పెరుమాళ్లకెరుక అన్నట్టు.. కేంద్ర హోంమంత్రి బీజేపీలో నంబర్ 2 అయిన అమిత్ షా ఆ గుట్టు విప్పరు.. జనసేనాని పవన్ బయటకు చెప్పరు… ఏం జరిగింది? భవిష్యత్తులో ఏం జరుగబోతోందన్నది వారిద్దరికే తెలుసు. కానీ బయట మాత్రం కొందరు కూటమిలో ఈ భేటి ద్వారా బాగానే పుల్లలు పెట్టే ప్లాన్లు చేస్తున్నారు. ఏపీ రాజకీయాల్లో ఈ భేటి ప్రభావం ఎంతనేది భవిష్యత్తులోనే తేలనుంది..

జగన్ అరెస్ట్‌పై పవన్, అమిత్ షా సీక్రెట్ డీల్.. లైవ్‌లోనే దొరికేసిన ప్రొఫెసర్ నాగేశ్వర్.. మైండ్ బ్లాక్ పొలిటికల్ ట్విస్ట్..

professer nageshwar

Andhra Pradesh politics : ఏపీ రాజకీయాలు ఎప్పుడు కూడా గుంటూరు మిరపకాయ లాగా ఘాటుగానే ఉంటాయి. రాజకీయ నాయకులు ఏదో ఒక విషయం మీద సమావేశం అవుతూ ఉంటారు.. అందులో కాస్త రకరకాల చర్చలు జరుగుతుంటాయి. ఆ తర్వాత వేరే విధంగా బయటికి వస్తుంటాయి. అవి బయటకు వచ్చిన తర్వాత విశ్లేషకులు తమ నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంటారు. అక్కడ జరిగింది మొత్తం తాము చూసినట్టు.. తమ సమక్షంలోనే చెబుతుంటారు. ఫలితంగా అసలు వాస్తవం పక్కకు వెళ్తుంది. చివరికి ఊహాగానం ప్రచారంలో ఉంటుంది.

ఏపీలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు పవన్ కళ్యాణ్. నాదెండ్ల మనోహర్ మంత్రిగా కొనసాగుతున్నారు. వీరిద్దరూ రాజకీయ అంశాలపై చర్చించేందుకు ఢిల్లీ వెళ్లారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తో భేటీ అయ్యారు. అక్కడ ఏం జరిగింది అనేది వీరి ముగ్గురికి తెలిసి ఉంటుంది. కొన్ని అంతర్గత విషయాలు కూడా చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. అంత పెద్ద విషయాలను ఏ నాయకుడు కూడా బయటకు చెప్పడానికి ఇష్టపడడు. కొన్ని విషయాలు మాత్రమే విలేకరులతో చెబుతారు.. ఆ తర్వాత వెళ్ళిపోతారు. ఒకవేళ విలేకరులకు బలమైన పబ్లిక్ రిలేషన్ ఉంటే లోపల ఏం జరిగిందో తెలుసుకుంటారు. ఆ తర్వాత దానిని వార్తగా ప్రచురిస్తారు. జనంలోకి తీసుకెళ్తారు. కానీ కొంతమంది విశ్లేషకులు తమకు నచ్చింది చెబుతుంటారు. తమకు తోచింది వాగుతుంటారు. ఇప్పుడు ఏపీలో అమిత్ షా, నాదెండ్ల మనోహర్, పవన్ కళ్యాణ్ భేటీపై కూడా ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఇలానే మాట్లాడారు.

పవన్ కళ్యాణ్, మనోహర్, అమిత్ షా భేటీలో జగన్ అరెస్ట్ గురించి చర్చ వచ్చిందని.. జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలని పవన్ కళ్యాణ్ కోరినట్టు.. దానికి అమిత్ షా నో చెప్పినట్టు.. జగన్మోహన్ రెడ్డిని లాంగ్ టర్మ్ పొలిటికల్ ఫ్రెండ్ అని అమిత్ షా చెప్పినట్టు.. దానికి పవన్ కళ్యాణ్ కూడా తల ఊపినట్టు.. ఇలా చెప్పుకుంటూ పోయారు ప్రొఫెసర్ నాగేశ్వర్. వాస్తవానికి ఇలాంటి విషయాలు రాజకీయ యవనిక మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తాయి. ఎందుకంటే ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటి వ్యక్తులు ఇలాంటి మాటలు మాట్లాడితే వాటి ఎఫెక్ట్ అధికంగా ఉంటుంది. వీటిని అంచనా వేయలేక నాగేశ్వర్ ఏదో ఒకటి మాట్లాడేసారు. ఇప్పుడు అది ఏపీ రాజకీయాలలో సంచలనంగా మారింది. నాగేశ్వర్ మాట్లాడిన మాటలను వైసీపీ తనకు అనుకూలంగా మార్చుకుంది. రకరకాల ప్రచారాలు చేయడం మొదలుపెట్టింది.

నాగేశ్వర్ వ్యాఖ్యల తర్వాత ఏపీ మంత్రి మనోహర్ స్పందించారు. ఆయన అలా మాట్లాడటం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. అసలు అక్కడ జరిగింది ఒకటని.. నాగేశ్వర్ చెప్పింది ఒకటని.. జగన్ అరెస్ట్ గురించి అక్కడ ప్రస్తావన రాలేదని మనోహర్ క్లారిటీ ఇచ్చారు. అయినప్పటికీ వైసీపీ సోషల్ మీడియా.. మీడియా రకరకాల ప్రచారాలు చేస్తున్నాయి. అందువల్లే విశ్లేషకులు ఒక పార్టీకి వత్తాసు పలకకూడదు. తమకు తోచినట్టు మాట్లాడకూడదు. నిజం తెలిస్తే బయటపెట్టాలి. లేకుంటే నిశ్శబ్దంగా ఉండాలి. అటు ఇటు కాని విధంగా మాట్లాడితే చివరికి ఆ ప్రభావం రాష్ట్ర ప్రయోజనాల మీద.. ప్రజల మీద ఉంటుంది. ఈ విషయం ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటి వ్యక్తులకు తెలియకపోవడం నిజంగా బాధాకరం.

ఈ మధ్య వయసు పెరిగే కొద్దీ ప్రొఫెసర్ నాగేశ్వర్ లో అప్పట్లో ఆయన భావజాలం అంతా మళ్లీ బయటకొస్తోంది. కమ్యూనిజం భావజాలం.. కాంగ్రెస్ సెక్యూలరిజం కలగలిపి బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడడమే పనిగా పెట్టుకొన్నారని ఈ మధ్యన కొందరు కౌంటర్లు కూడా ఇస్తున్నారు. అయినా కూడా ఈ మేధావి నాగేశ్వర్ తన పంథా అసలు మార్చుకోవడం లేదు. బీజేపీపై నరనరాన వ్యతిరేకతతో అటు మోడీపై ఇష్టమొచ్చినట్టుగా మాట్లాడేస్తున్నారు. ఇటు బీజేపీతో పొత్తులో ఉన్న పార్టీలను ఆడిపోసుకుంటున్నాడు. నిజానికి అమిత్ షాతో భేటిలో పవన్, నాదెండ్ల తప్ప ఎవరూ లేరు. అక్కడ ప్రొఫెసర్ నాగేశ్వర్ ఏ కెమెరా కానీ.. వాయిస్ మైక్ కాని పెట్టలేదు. కానీ అక్కడ ఉన్నట్టు.. తనకు చెవిలో చెప్పినట్టుగా అన్నీ కల్పిత కథనాలతో నాగేశ్వర్ తెలుగు ప్రజల మెదళ్లలోకి విషం చిమ్ముతున్నారు. పెద్దాయన.. పెద్దమనిషి.. పైగా మేధావి ముసుగు అని నాదేండ్ల మనోహర్ గట్టిగా మాట్లాడలేదు కానీ.. ఇలానే ఆడిపోసుకుంటే నాగేశ్వర్ పెద్దరికానికి ఎప్పుడో ఒకప్పుడు ఎసరు రావడం ఖాయం.. అయినా నోరుమంచిదైతే ఊరు మంచిది అవుతుందని అంటారు. ఆ విషయం గ్రహించి తెచ్చుకున్న పెద్దరికం తగ్గట్టు ప్రొఫెసర్ గారు మారితే బెటర్ అని పలువురు సూచిస్తున్నారు. వింటే ఆయనపై విమర్శల వాడి తగ్గుతుంది.. వినకుంటే బయట ఈగల మోత పెరుగుతుంది..

సుబేందు అధికారి ని ఓడించేందుకు మమత కుట్ర.. ఏకంగా 100 కోట్ల ఖర్చు.. ఇలా బయటపడింది

Suvendu Adhikari
Suvendu Adhikari

Suvendu Adhikari: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో అధికారాన్ని దక్కించుకోవడానికి మమతా బెనర్జీ వచ్చిన ఏ అవకాశాన్ని కూడా వదులుకోలేదు. చివరికి ఓటర్లకు డబ్బులు పంచేందుకు కూడా వెనకాడ లేదు. బెంగాల్ రాష్ట్రంలో ఓటర్లకు డబ్బులు పంచే సంస్కృతి అంతగా ఉండదు. కానీ ఈసారి మమతా బెనర్జీ ఆ సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా నందిగ్రామ్ ప్రాంతంలో పోటీ చేస్తున్న సుబేందు అధికారిని ఓడించేందుకు ఆమె అనేక రకాలుగా ప్రయత్నాలు చేశారు. ఏకంగా 100 కోట్ల వరకు ఖర్చు పెట్టారు. అయినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది.

మమతా బెనర్జీ ఈ స్థాయిలో ఖర్చుపెట్టిన విషయాన్ని ఆమ్ జనతా ఉనయన్ పార్టీ అధినేత ఉమాయిబ్ బయటపెట్టారు.. ఈయన గతంలో తృణమూల్ కాంగ్రెస్ లో పనిచేసేవారు. ఎన్నికలకు ముందు మమతా బెనర్జీతో పొసగక బయటికి వచ్చేసారు. నందిగ్రామ్ లో షాహిద్ ఉల్ హక్ అనే అభ్యర్థిని తన పార్టీ తరఫున పోటీలో ఉంచారు. అయితే ఇక్కడ అధికారి విజయం సాధించారు. నందిగ్రామ్ లో సుభేందు అధికారిని ఓడించేందుకు మమత ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేయాలో.. అన్ని రకాలుగా చేసింది. కానీ అవి అంతగా పని చేయలేదు. అందువల్లే ఇక్కడ సుబేందు అధికారి విజయం సాధించారు.

ఈ 100 కోట్లు కూడా పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి వచ్చాయని ఉమాయిబ్ చెబుతున్నారు. ప్రజాస్వామ్యాన్ని కించపరిచే విధంగా మమతా బెనర్జీ వ్యవహరించారని.. సుబేందు అధికారిని ఓడించేందుకు ఏకంగా 100 కోట్ల వరకు ఖర్చు పెట్టారంటే.. మిగతా నియోజకవర్గాలలో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. ఓటర్లకు 1000 నుంచి 5000 వరకు కవర్లో పెట్టి ఇచ్చారని.. అయితే మమత బెనర్జీ అరాచకాలు తెలిసి ఓటర్లు తెలివిగా నిర్ణయం తీసుకున్నారని ఉమాయిబ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే దీనిపై ఇంతవరకు తృణమూల్ కాంగ్రెస్ అవును అని గాని.. కాదు అని గాని.. చెప్పలేదు. ఒకవేళ ఇది గనుక నిజమని తేలితే.. అప్పుడు పరిణామాలు వేరే విధంగా మారే అవకాశం ఉంది. ఇప్పటికే బెంగాల్ రాష్ట్రంలో టిఎంసి తీవ్రమైన ప్రతిఘటన ప్రజల నుంచి ఎదుర్కొంటున్నది. ఆ పార్టీ నాయకులు బెంగాల్ నుంచి పారిపోతున్నారు. పార్టీ కార్యాలయాలు తాళం వేసి ఉంటున్నాయి. మమత బెనర్జీ కూడా కార్యకర్తలకు అంతగా అందుబాటులో ఉండడం లేదు.

ఛార్లెట్‌లో ఘనంగా తానా మదర్స్ డే వేడుకలు

TANA Mothers Day Celebrations
TANA Mothers Day Celebrations

TANA Mothers Day Celebrations: అమెరికాలోని ఛార్లెట్ నగరంలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) ఆధ్వర్యంలో మే 16న నిర్వహించిన మదర్స్ డే వేడుకలు అత్యంత వైభవంగా సాగాయి. ఈ కార్యక్రమానికి దాదాపు 500 మందికిపైగా మహిళలు హాజరుకావడం విశేషం. తల్లులతో పాటు కూతుళ్లు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ వేడుకను ప్రత్యేకంగా నిలిపారు. ఛార్లెట్‌లో ఒకే కార్యక్రమానికి ఇంతమంది మహిళలు రావడం ఇదే తొలిసారని నిర్వాహకులు తెలిపారు.

ఆటలు, పాటలు, డ్యాన్స్‌లు, వినోద కార్యక్రమాలు, విందు భోజనాలతో వేడుకలు సందడిగా జరిగాయి. మహిళల కోసం ప్రత్యేకంగా నిర్వహించిన గేమ్స్, సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.

TANA Mothers Day Celebrations
TANA Mothers Day Celebrations

ఈ కార్యక్రమానికి తానా అధ్యక్షుడు నరేన్ కొడాలి, జాయింట్ ట్రెజరర్ రాజేష్ యార్లగడ్డ, కమ్యూనిటీ సర్వీస్ కోఆర్డినేటర్ సాయి బొల్లినేని తదితరులు హాజరయ్యారు.

TANA Mothers Day Celebrations
TANA Mothers Day Celebrations

తానా హెల్త్ సర్వీసెస్ కోఆర్డినేటర్ మాధురి ఏలూరి ప్రారంభం నుంచి కార్యక్రమ నిర్వహణను సమర్థవంతంగా చేపట్టి, వచ్చిన వారందరూ ఆనందించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

TANA Mothers Day Celebrations
TANA Mothers Day Celebrations

ఈ వేడుక విజయవంతానికి నాగ పంచుమర్తి, ఠాగూర్ మల్లినేని, కిరణ్ కొత్తపల్లి, రవి (నాని) వడ్లముడి తదితరులు కృషి చేశారు.

TANA Mothers Day Celebrations
TANA Mothers Day Celebrations

వర్జీనియా నుంచి విచ్చేసిన ‘అందెలరవమిది’ ఫేమ్ ఇంద్రాణి దావలూరి ముఖ్య అతిథిగా పాల్గొని మహిళల ప్రాముఖ్యతపై ప్రసంగించారు. సిన్సినాటి నుంచి వచ్చిన ప్రముఖ యూట్యూబ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అమ్మమ్మడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచి, గేమ్స్ నిర్వహిస్తూ సందడి చేశారు.

TANA Mothers Day Celebrations
TANA Mothers Day Celebrations

యాంకర్ స్రవంతి ప్రత్తిపాటి తనదైన శైలిలో కార్యక్రమాన్ని చక్కగా నడిపించగా, సింగర్ స్నిగ్ధ ఎల్లేశ్వరపు ఆలపించిన మధుర గీతాలు ప్రేక్షకులను అలరించాయి.

TANA Mothers Day Celebrations
TANA Mothers Day Celebrations

కార్యక్రమ నిర్వహణలో సహకరించిన పద్మజ కొమ్మినేని, జ్యోత్స్న గంట, సౌమ్య శ్రీ తల్లాంకి, ఝాన్సీ అబ్బూరి, జ్యోత్స్న కాండ్లగుంట సేవలను నిర్వాహకులు ప్రత్యేకంగా అభినందించారు.

TANA Mothers Day Celebrations
TANA Mothers Day Celebrations
TANA Mothers Day Celebrations
TANA Mothers Day Celebrations

'కరుప్పు' చిత్రాన్ని మిస్ చేసుకున్న టాలీవుడ్ హీరో అతనేనా..? చేసుంటే 1000 కోట్లు కొట్టేది..

Karuppu Movie
Karuppu Movie

Karuppu Movie: ‘ ఒక హీరో చేయాల్సిన సినిమాని మరో హీరో చేయడం అనేది ఏ ఇండస్ట్రీ లో అయినా సర్వసాధారణం , గతం లోనే కాదు , రీసెంట్ గా కూడా అలాంటి ఉదాహరణలు చాలానే ఉన్నాయి. అందులో మరో లేటెస్ట్ ఉదాహరణ ‘కరుప్పు’. సూర్య హీరో గా నటించిన ఈ చిత్రం రీసెంట్ గానే విడుదలై ఎలాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిల్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. గత కొన్నాళ్లుగా వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ ని ఎదురుకుంటూ , అసలు సూర్య కం బ్యాక్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయా అని ఆయన అభిమానులు బాధ పడుతున్న సమయం లో విడుదలైన ఈ చిత్రం , ట్రేడ్ పండితుల మైండ్ కూడా బ్లాస్ట్ అయ్యే రేంజ్ గ్రాస్ వసూళ్లను రాబడుతూ ముందుకు దూసుకువెళ్తోంది. అయితే ఈ చిత్రాన్ని ముందుగా సూర్య తో చెయ్యాలని అనుకోలేదట.

ఆ చిత్ర దర్శకుడు ఆర్జే బాలాజీ మన టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి ముందుగా ఈ కథని వినిపించాడట. ఇది జరిగి రెండేళ్లు అయ్యింది. అంటే ‘పుష్ప’ సినిమా షూటింగ్ సమయం లో కథ వినిపించాడు అన్నమాట. అల్లు అర్జున్ కాన్సెప్ట్ , ఐడియా చాలా నచ్చింది కానీ , సెకండ్ హాఫ్ లో కొన్ని మార్పులు సూచించాడట. ఈలోపు తెలుగు , తమిళ భాషల్లో సమీకరణాలు మారిపోయాయి. అల్లు అర్జున్ అట్లీ , లోకేష్ కనకరాజ్ వంటి డైరెక్టర్స్ తో పని చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపించడం , ఆయన భవిష్యత్తు లైనప్ కూడా మారిపోవడం తో , ఈ ‘కరుప్పు’ చిత్రం ఆయన నుండి చేజారిపోయింది. ఆ తర్వాత స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేర్పులు చేసి తమిళ హీరో సూర్య కి వినిపించడం , ఆయనకు ఈ కథ ఒక రేంజ్ లో నచ్చడం జరిగింది.

వెంటనే షూటింగ్ మొదలై పూర్తి చేసుకొని నేడు మన ముందుకొచ్చింది , ఇక ఆ తర్వాత జరిగింది మొత్తం హిస్టరీ. ఒకవేళ అల్లు అర్జున్ ఈ సినిమాని ఒప్పుకొని చేసుంటే ఎలా ఉండేది?, ఇండస్ట్రీ రికార్డ్స్ అన్ని బద్దలు అయ్యేవా?, ఆయన పాన్ ఇండియా లెవెల్ లో మంచి క్రేజ్ ఉంది కాబట్టి, ఈ సినిమా దైవాన్ని ఆధారంగా తీసుకొని తెరకెక్కించిన సినిమా కాబట్టి, నార్త్ ఇండియా లో కూడా క్లిక్ అయ్యి వెయ్యి కోట్లు రాబట్టి ఉండేదా? అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ చర్చించుకుంటున్నారు. అయితే వీరభద్రుడు గెటప్ లో సూర్య తర్వాత అల్లు అర్జున్ పర్ఫెక్ట్ గా సరిపోతాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు , చేసుంటే పాన్ ఇండియా లెవెల్ లో ఈ చిత్రం అద్భుతాలను నెలకొల్పి ఉండేదని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.