Home Blog Page 249

ఛార్లెట్‌లో ఘనంగా తానా మదర్స్ డే వేడుకలు

TANA Mothers Day Celebrations
TANA Mothers Day Celebrations

TANA Mothers Day Celebrations: అమెరికాలోని ఛార్లెట్ నగరంలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) ఆధ్వర్యంలో మే 16న నిర్వహించిన మదర్స్ డే వేడుకలు అత్యంత వైభవంగా సాగాయి. ఈ కార్యక్రమానికి దాదాపు 500 మందికిపైగా మహిళలు హాజరుకావడం విశేషం. తల్లులతో పాటు కూతుళ్లు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ వేడుకను ప్రత్యేకంగా నిలిపారు. ఛార్లెట్‌లో ఒకే కార్యక్రమానికి ఇంతమంది మహిళలు రావడం ఇదే తొలిసారని నిర్వాహకులు తెలిపారు.

ఆటలు, పాటలు, డ్యాన్స్‌లు, వినోద కార్యక్రమాలు, విందు భోజనాలతో వేడుకలు సందడిగా జరిగాయి. మహిళల కోసం ప్రత్యేకంగా నిర్వహించిన గేమ్స్, సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.

TANA Mothers Day Celebrations
TANA Mothers Day Celebrations

ఈ కార్యక్రమానికి తానా అధ్యక్షుడు నరేన్ కొడాలి, జాయింట్ ట్రెజరర్ రాజేష్ యార్లగడ్డ, కమ్యూనిటీ సర్వీస్ కోఆర్డినేటర్ సాయి బొల్లినేని తదితరులు హాజరయ్యారు.

TANA Mothers Day Celebrations
TANA Mothers Day Celebrations

తానా హెల్త్ సర్వీసెస్ కోఆర్డినేటర్ మాధురి ఏలూరి ప్రారంభం నుంచి కార్యక్రమ నిర్వహణను సమర్థవంతంగా చేపట్టి, వచ్చిన వారందరూ ఆనందించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

TANA Mothers Day Celebrations
TANA Mothers Day Celebrations

ఈ వేడుక విజయవంతానికి నాగ పంచుమర్తి, ఠాగూర్ మల్లినేని, కిరణ్ కొత్తపల్లి, రవి (నాని) వడ్లముడి తదితరులు కృషి చేశారు.

TANA Mothers Day Celebrations
TANA Mothers Day Celebrations

వర్జీనియా నుంచి విచ్చేసిన ‘అందెలరవమిది’ ఫేమ్ ఇంద్రాణి దావలూరి ముఖ్య అతిథిగా పాల్గొని మహిళల ప్రాముఖ్యతపై ప్రసంగించారు. సిన్సినాటి నుంచి వచ్చిన ప్రముఖ యూట్యూబ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అమ్మమ్మడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచి, గేమ్స్ నిర్వహిస్తూ సందడి చేశారు.

TANA Mothers Day Celebrations
TANA Mothers Day Celebrations

యాంకర్ స్రవంతి ప్రత్తిపాటి తనదైన శైలిలో కార్యక్రమాన్ని చక్కగా నడిపించగా, సింగర్ స్నిగ్ధ ఎల్లేశ్వరపు ఆలపించిన మధుర గీతాలు ప్రేక్షకులను అలరించాయి.

TANA Mothers Day Celebrations
TANA Mothers Day Celebrations

కార్యక్రమ నిర్వహణలో సహకరించిన పద్మజ కొమ్మినేని, జ్యోత్స్న గంట, సౌమ్య శ్రీ తల్లాంకి, ఝాన్సీ అబ్బూరి, జ్యోత్స్న కాండ్లగుంట సేవలను నిర్వాహకులు ప్రత్యేకంగా అభినందించారు.

TANA Mothers Day Celebrations
TANA Mothers Day Celebrations
TANA Mothers Day Celebrations
TANA Mothers Day Celebrations

'కరుప్పు' చిత్రాన్ని మిస్ చేసుకున్న టాలీవుడ్ హీరో అతనేనా..? చేసుంటే 1000 కోట్లు కొట్టేది..

Karuppu Movie
Karuppu Movie

Karuppu Movie: ‘ ఒక హీరో చేయాల్సిన సినిమాని మరో హీరో చేయడం అనేది ఏ ఇండస్ట్రీ లో అయినా సర్వసాధారణం , గతం లోనే కాదు , రీసెంట్ గా కూడా అలాంటి ఉదాహరణలు చాలానే ఉన్నాయి. అందులో మరో లేటెస్ట్ ఉదాహరణ ‘కరుప్పు’. సూర్య హీరో గా నటించిన ఈ చిత్రం రీసెంట్ గానే విడుదలై ఎలాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిల్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. గత కొన్నాళ్లుగా వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ ని ఎదురుకుంటూ , అసలు సూర్య కం బ్యాక్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయా అని ఆయన అభిమానులు బాధ పడుతున్న సమయం లో విడుదలైన ఈ చిత్రం , ట్రేడ్ పండితుల మైండ్ కూడా బ్లాస్ట్ అయ్యే రేంజ్ గ్రాస్ వసూళ్లను రాబడుతూ ముందుకు దూసుకువెళ్తోంది. అయితే ఈ చిత్రాన్ని ముందుగా సూర్య తో చెయ్యాలని అనుకోలేదట.

ఆ చిత్ర దర్శకుడు ఆర్జే బాలాజీ మన టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి ముందుగా ఈ కథని వినిపించాడట. ఇది జరిగి రెండేళ్లు అయ్యింది. అంటే ‘పుష్ప’ సినిమా షూటింగ్ సమయం లో కథ వినిపించాడు అన్నమాట. అల్లు అర్జున్ కాన్సెప్ట్ , ఐడియా చాలా నచ్చింది కానీ , సెకండ్ హాఫ్ లో కొన్ని మార్పులు సూచించాడట. ఈలోపు తెలుగు , తమిళ భాషల్లో సమీకరణాలు మారిపోయాయి. అల్లు అర్జున్ అట్లీ , లోకేష్ కనకరాజ్ వంటి డైరెక్టర్స్ తో పని చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపించడం , ఆయన భవిష్యత్తు లైనప్ కూడా మారిపోవడం తో , ఈ ‘కరుప్పు’ చిత్రం ఆయన నుండి చేజారిపోయింది. ఆ తర్వాత స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేర్పులు చేసి తమిళ హీరో సూర్య కి వినిపించడం , ఆయనకు ఈ కథ ఒక రేంజ్ లో నచ్చడం జరిగింది.

వెంటనే షూటింగ్ మొదలై పూర్తి చేసుకొని నేడు మన ముందుకొచ్చింది , ఇక ఆ తర్వాత జరిగింది మొత్తం హిస్టరీ. ఒకవేళ అల్లు అర్జున్ ఈ సినిమాని ఒప్పుకొని చేసుంటే ఎలా ఉండేది?, ఇండస్ట్రీ రికార్డ్స్ అన్ని బద్దలు అయ్యేవా?, ఆయన పాన్ ఇండియా లెవెల్ లో మంచి క్రేజ్ ఉంది కాబట్టి, ఈ సినిమా దైవాన్ని ఆధారంగా తీసుకొని తెరకెక్కించిన సినిమా కాబట్టి, నార్త్ ఇండియా లో కూడా క్లిక్ అయ్యి వెయ్యి కోట్లు రాబట్టి ఉండేదా? అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ చర్చించుకుంటున్నారు. అయితే వీరభద్రుడు గెటప్ లో సూర్య తర్వాత అల్లు అర్జున్ పర్ఫెక్ట్ గా సరిపోతాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు , చేసుంటే పాన్ ఇండియా లెవెల్ లో ఈ చిత్రం అద్భుతాలను నెలకొల్పి ఉండేదని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.

ఎన్టీఆర్ , రామ్ చరణ్ మధ్య రిలేషన్ పూర్తిగా చెడిపోయిందా..? అందుకు ప్రత్యక్ష సాక్ష్యం ఇదే..

NTR Ram Charan Relationship
NTR Ram Charan Relationship

NTR Ram Charan Relationship: ఎన్టీఆర్ , రామ్ చరణ్ మధ్య స్నేహ పూర్వ వాతావరణం #RRR చిత్రం నుండి మాత్రమే కాదు , అంతకు ముందు నుండే ఉంది. వీళ్లిద్దరి కలిసి పార్టీలకు , పబ్బులకు వెళ్లడం వంటివి గతం లో చాలానే చేశారు. అదే విధంగా ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకలకు రామ్ చరణ్, రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకలకు ఎన్టీఆర్ విచ్చేసి సంబరాలు చేసుకునేవారు. ఈ విషయాన్నీ స్వయంగా ఎన్టీఆర్ #RRR మూవీ ఇంటర్వ్యూ సమయం లో చెప్పుకొచ్చాడు. మార్చి 26 న ప్రణతి పుట్టినరోజు అని , మార్చి 27 అర్థ రాత్రి 12 గంటలకు నేను మా ఇంటి గేట్ బయట నిలబడడం , చరణ్ కారు రావడం, అతని పుట్టినరోజు వేడుకలకు వెళ్లడం జరిగేదని ఎన్టీఆర్ చెప్పుకొచ్చాడు. ఇది చూసినప్పుడు అభిమానులం మనం ఈ రేంజ్ కొట్లాడుకుంటున్నాము , కానీ హీరోలు ఎంత స్నేహం గా ఉన్నారో చూడండి అంటూ సోషల్ మీడియా లో మాట్లాడుకున్నారు ఫ్యాన్స్.

#RRR తర్వాత కూడా వీళ్ళ మధ్య సాన్నిహిత్యం కొనసాగుతూనే వచ్చింది. కానీ ఏమైందో ఏమో తెలియదు కానీ , వీళ్లిద్దరి మధ్య ఈసారి సాన్నిహిత్య సంబంధాలు తెగిపోయాయేమో అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఎందుకంటే గడిచిన రెండు సంవత్సరాల నుండి వీళ్లిద్దరు ట్విట్టర్ లో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకోవడం లేదు. గతం లో ఇలా ఉండేది కాదు , ప్రతీ పుట్టిన రోజుకి ఒకరికి ఒకరు శుభాకాంక్షలు తెలుపుకునేవారు. కానీ ఇప్పుడు మాత్రం అసలు ఒకరిని ఒకరు పట్టించుకోవడం లేదు. మహేష్ బాబు , అల్లు అర్జున్ వంటి వారికి ఎన్టీఆర్ ప్రతీ ఏడాది మర్చిపోకుండా శుభాకాంక్షలు తెలుపుతాడు. అల్లు అర్జున్ ని ఆయన ప్రేమగా బావ అని పిలుస్తాడు , అల్లు అర్జున్ కూడా ఎన్టీఆర్ ని బామ్మర్దిగానే ట్రీట్ చేస్తాడు.

నేడు కూడా ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా అల్లు అర్జున్ శుభాకాంక్షలు తెలిపాడు , మహేష్ బాబు , పవన్ కళ్యాణ్ వంటి వారు కూడా శుభాకాంక్షలు తెలిపారు. కానీ రామ్ చరణ్ నుండి మాత్రం ఎలాంటి శుభాకాంక్షలు రాలేదు , ఇక్కడే అభిమానులకు అనుమానాలు రావడం మొదలయ్యాయి , వీళ్లిద్దరి మధ్య ఏదైనా ఈగో క్లాష్ జరిగిందా?, అసలు ఎందుకు ఇలా ఉంటున్నారు , సోషల్ మీడియా లో ఎలాగో వీళ్ళు శుభాకాంక్షలు చెప్పుకోవడం లేదు , కనీసం వ్యక్తిగతంగా అయినా చెప్పుకుంటున్నారా?, అన్నదమ్ములు లాగా కలిసి ఉండే ఈ ఇద్దరు మాస్ హీరోలు ఇలా ఉండడాన్ని అభిమానులు అసలు తీసుకోలేకపోతున్నారు.

కాలేజీ స్టూడెంట్స్ కి 25 శాతం ఫీజు డిస్కౌంట్ ప్రకటించిన మంచు మనోజ్.. వీడియో వైరల్..

Manchu Manoj Fee Discount
Manchu Manoj Fee Discount

Manchu Manoj Birthday Announcement:  సినిమాలకు చాలా ఏళ్ళు గ్యాప్ ఇచ్చి , ‘భైరవం’ చిత్రం తో రీ ఎంట్రీ ఇచ్చిన మంచు మనోజ్ కెరీర్ మళ్ళీ ఊపందుకుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. గత ఏడాది తన కుటుంబం లో చోటు చేసుకున్న గొడవలు కూడా మంచు మనోజ్ కి బాగా కలిసొచ్చింది. ఆయనపై ఆడియన్స్ లో సానుభూతి పెరిగింది. అదే విధంగా ‘భైరవం’ చిత్రం యావరేజ్ రేంజ్ లో ఆడింది , ఇందులో మనోజ్ కాస్త నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో కనిపించాడు. ఇలాంటి రోల్ ఆయనకు ఇదే తొలిసారి. ఆ తర్వాత తేజ సజ్జ హీరో గా నటించిన ‘మిరాయ్’ చిత్రంలో కూడా మనోజ్ విలన్ గా నటించాడు. ఈ చిత్రం పాన్ ఇండియా లెవెల్ లో ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే.

ఈ సినిమా సక్సెస్ మనోజ్ కి ఇచ్చిన కిక్ మామూలుది కాదు , సంబరాలు చేసుకున్నాడు. నేటి తరం ఆడియన్స్ కి విలన్ గా పరిచయమై అలరించడంతో , ఇప్పుడు మళ్లీ హీరో గా మారాడు. ఇప్పటికే ‘డేవిడ్ రెడ్డి’ అనే చిత్రం లో హీరో గా నటిస్తున్న ఆయన , నేడు తన పుట్టిన రోజు సందర్భంగా మరో క్రేజీ ప్రాజెక్ట్ ని అధికారికంగా ప్రకటించాడు. ఈ చిత్రం పేరు ‘వడ్డీకాసులవాడు’. కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రకటన వీడియో ని మనోజ్ తన మార్క్ స్టైల్ తో నేడు ప్రకటించాడు. అది చూసేందుకు చాలా సరదాగా అనిపించింది. వెంకటేశ్వర స్వామి తో తన కోరికలు వెల్లడిస్తూ , తన మార్క్ కామెడీ టైమింగ్ తో ఆకట్టుకున్నాడు మనోజ్. ఈ చిత్రాన్ని AK ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తుండగా , మంచు మనోజ్ సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.

ఈ గ్లింప్స్ విశేషాల్లోకి వెళ్తే ఉద్యోగం చేసుకునే ఒక సగటు యువకుడు పడే కష్టాలను ఆధారంగా చేసుకొని తెరకెక్కించినట్టు తెలుస్తోంది . వెంకటేశ్వర స్వామి ని మొక్కుకుంటూ తనకు ఉన్న అప్పులన్నీ తీరిపోయి , డబ్బులు బాగా సంపాదిస్తే , వాటితో ఒక కాలేజీ కడుతానని , విద్యార్థులకు ఫీజులో 25 శాతం రాయితీ ఇస్తానని ఆయన మాట్లాడిన మాటలు హైలైట్ గా నిలిచాయి. సోషల్ మీడియా లో బాగా వైరల్ అయినటువంటి ఈ గ్లింప్స్ వీడియో ని మీరు కూడా చూసేయండి. ఈ సినిమాతో పాటు , మనోజ్ మరో సినిమాలో నటించడానికి ఒప్పుకున్నాడు. బాలకృష్ణ , గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కుతున్న కొత్త సినిమాలో మనోజ్ విలన్ గా నటించబోతున్నాడు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా నేడు వెలువడింది.

ఒకే వేదికపై చిరంజీవి - పవన్ కళ్యాణ్ - రామ్ చరణ్.. రేపు మెగా ఫ్యాన్స్ కి పండగే..

Chiranjeevi Pawan Kalyan Ram Charan
Chiranjeevi Pawan Kalyan Ram Charan

Chiranjeevi Pawan Kalyan Ram Charan: మెగా హీరోలందరిని ఒకే వేదిక పై చూసి అభిమానులకు ఎన్ని రోజులైందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అప్పుడెప్పుడో వరుణ్ తేజ్ పెళ్లి అప్పుడు వీళ్లంతా ఒకే చోట కనిపించారు , ఆ తర్వాత పలు పెళ్లి వేదికల్లో కూడా కలిసి కనిపించారు , కానీ వీళ్ళు ఒకే మూవీ ఈవెంట్ లో కనిపించి చాలా రోజులైంది. ‘సైరా నరసింహా రెడ్డి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనే చివరిసారిగా చిరంజీవి , పవన్ కళ్యాణ్ , రామ్ చరణ్ కలిసి కనిపించింది. ఆ తర్వాత మళ్లీ ఆ అవకాశం రాలేదు. అయితే రేపు #Mega158 ప్రాజెక్ట్ లాంచ్ కాబోతుంది. ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ తో పాటు రామ్ చరణ్ కూడా రాబోతున్నాడని , చిరంజీవి తో కలిసి వీళ్ళిద్దరిని రేపు మరోసారి చూడబోతున్నామని , మేకర్స్ అధికారిక ప్రకటన చేశారు.

దీంతో అభిమానులు సంబరాలు చేసుకోవడం మొదలుపెట్టారు. ఈ #Mega158 కి బాబీ కొల్లి దర్శకత్వం వహిస్తుండగా, తమన్ సంగీతం అందించబోతున్నాడు. ‘గాడ్ ఫాదర్’ తర్వాత తమన్ మెగాస్టార్ చిరంజీవి కి పని చేయబోతున్న చిత్రమిది. గతం లో బాబీ మెగాస్టార్ చిరంజీవి తో ‘వాల్తేరు వీరయ్య’ వంటి భారీ కమర్షియల్ హిట్ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ సినిమా తర్వాత మళ్లీ వీళ్లిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న సినిమా కావడంతో అభిమానుల్లో అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ఈ చిత్రం లో మెగాస్టార్ చిరంజీవి ని మాఫియా డాన్ క్యారెక్టర్ లో చూపించబోతున్నారు. ఆయనకు కూతురుగా ‘ఛాంపియన్’ ఫేమ్ అనశ్వర రాజన్ నటించనుంది, అదే విధంగా మెగాస్టార్ కి జోడిగా ప్రియమణి నటించబోతుంది. చిరంజీవి తన కెరీర్ లో ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఇలా గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామా లో నటించలేదు , మొట్టమొదటిసారి అలాంటి పాత్రలో కనిపించబోతుండడం తో అందుకు తగ్గ హోమ్ వర్క్ కూడా చాలా గట్టిగా చేసాడు మెగాస్టార్. ఈ చిత్రం కోసం ఆయన శరీరాన్ని చాలా దృడంగా మార్చుకున్నాడు.

అందుకు సంబంధించిన వర్కౌట్ వీడియో ని రీసెంట్ గానే విడుదల చేయగా, దానికి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. 70 ఏళ్ళ వయస్సులో కుర్ర హీరోలకు కూడా సాధ్యం అవ్వని రేంజ్ లో మెగాస్టార్ చిరంజీవి రెడీ అయ్యాడని , నేటి తరం వాళ్ళు మెగాస్టార్ ని చూసి నేర్చుకోవలసినవి ఇలాంటివి చాలా ఉన్నాయి అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేశారు. ఇకపోతే ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ని ఈ నెలలోనే మొదలు పెట్టబోతున్నారు . ఈ షెడ్యూల్ లో ముందుగా ఇంటర్వెల్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తారట , చిరంజీవి తో పాటు ప్రకాష్ రాజ్ కూడా ఈ యాక్షన్ సీక్వెన్స్ లో భాగం కాబోతున్నట్టు తెలుస్తోంది.

ఎన్టీఆర్ పరిస్థితి చూసి ఆయన భార్య ప్రణతి కన్నీళ్లు పెట్టుకుంది - ప్రశాంత్ నీల్

Lakshmi Pranathi Emotional
Lakshmi Pranathi Emotional

Lakshmi Pranathi Emotional: డైరెక్టర్ విజన్ కి తగ్గట్టు తమని తాము మార్చుకొని పని చేసే హీరోలు మన ఇండియా లో చాలా తక్కువ మంది మాత్రమే ఉన్నారు , ఆ తక్కువ మందిలో ఒకరు జూనియర్ ఎన్టీఆర్. డైరెక్టర్ విజన్ కి తగ్గట్టు తన శరీర ఆకృతి ని మార్చుకోవడం లో ఎన్టీఆర్ ని మించిన హీరో ఇండస్ట్రీ లో మరొకరు ఉండరు అనడంలో ఎలాంటి సందేహం లేదు . ఒకప్పుడు ఎన్టీఆర్ ఎంత లావుగా ఉండేవాడో అందరికీ తెలిసిందే , అప్పటి ఎన్టీఆర్ కి , ఇప్పటి ఎన్టీఆర్ కి తేడా చూస్తే ఆయన ఎంత కష్టపడుతున్నాడో అర్థం అవుతుంది. ఇకపోతే నేడు ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా , మేకర్స్ నిన్న ‘డ్రాగన్’ మూవీ గ్లింప్స్ వీడియో ని విడుదల చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ గ్లింప్స్ వీడియో కి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది కానీ , ఎన్టీఆర్ లుక్స్ పై ట్రోల్స్ చాలా గట్టిగ వచ్చాయి.

అయితే ఈ లుక్స్ కోసం ఎన్టీఆర్ ఏ రేంజ్ లో కష్టపడ్డాడో , ప్రశాంత్ నీల్ రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు. ఆయన మాట్లాడుతూ ‘ఎన్టీఆర్ ని ఈ సినిమా కోసం కాస్త మేకోవర్ అవ్వాలని చెప్పాను , కానీ అతని తగ్గినా బరువు ని చూసి షాక్ కి గురయ్యాను. బాగా నీరసించిపోయారు, పేలవంగా మారడమే కాకుండా , అనారోగ్యానికి గురైన వాడిలాగా కనిపించాడు. కేవలం డ్రాగన్ చిత్రం కోసం ఎన్టీఆర్ నాలుగు నెలల్లో 15 కిలోల బరువు తగ్గాడు. ఇక చాలు బరువు తగ్గడం ఆపేయ్ అని ఎన్టీఆర్ కి చాలా గట్టిగా చెప్పాను , అయినప్పటికీ ఆయన వెనకడుగు వెయ్యలేదు. ఎన్టీఆర్ పడుతున్న కష్టాన్ని చూసి ఆయన సతీమణి లక్ష్మి ప్రణతి కంటతడి పెట్టుకుంది. ఏ భార్య కి అయినా తమ భర్త అలా కష్టపడుతూ పని చేయడం చూస్తే చాలా బాధ కలుగుతుంది కదా, ప్రణతి కి కూడా అంతే’.

‘నా టీం కూడా ఎన్టీఆర్ పడే కష్టాన్ని చూసి బాగా బాధపడ్డారు. మీ విజన్ కి తగ్గ ఔట్పుట్ వచ్చేంత వరకు నేను దేనికైనా సిద్ధమని చెప్పి, ఈ చిత్రం కోసం ప్రాణం పెట్టి పనిచేశాడు. సినిమా పట్ల ఎన్టీఆర్ చూపించే డెడికేషన్ కి సెల్యూట్ చేయొచ్చు’ అంటూ ప్రశాంత్ నీల్ ఈ సందర్భంగా చెప్పుకోచ్చాడు. ఇకపోతే డ్రాగన్ చిత్రం దేశభక్తి కి సంబంధించిన సినిమా అని , ఎవ్వరూ ఊహించని ట్విస్టులు ఈ చిత్రం లో ఉంటాయని ప్రశాంత్ నీల్ రీసెంట్ గా జరిగిన ఈ ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు.

LUGER ప్రశాంత్ నీల్ ఏదో సరదాగా పెట్టిన పేరు కాదు.. దాని వెనక ఇంతటి చరిత్ర ఉంది..

NTR Dragon Movie
NTR Dragon Movie

Luger Meaning In Dragon Movie: పిరియాడిక్ డ్రామాలు తీయడంలో ప్రశాంత్ నీల్ తర్వాతే ఎవరైనా. తొలి సినిమా ఉగ్రం తర్వాత.. ప్రశాంత్ తన స్టైల్ పూర్తిగా మార్చుకున్నాడు. కర్ణాటకలో అత్యంత ఫేమస్ అయిన కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ లో జరిగిన వ్యవహారాల మీద అతడు సీరియస్ గా స్టడీ చేశాడు. ఆ తర్వాత దానికి డ్రామా యాడ్ చేసి కేజిఎఫ్ అనే సినిమా తీశాడు. రెండు భాగాలుగా వచ్చిన ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టేసింది. వేల కోట్ల రూపాయలను వసూలు చేసి, కన్నడ ఇండస్ట్రీకి దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చింది. ఈ సినిమాతోనే ప్రశాంత్ ఆగిపోలేదు.

సలార్ అనే సినిమా కూడా పీరియాడిక్ డ్రామా నేపథ్యంలోనే రూపొందించాడు. ఇందులో తెగలు.. వారి మధ్య పోరాటాలు.. మధ్యలో దేవా అనే వ్యక్తి ప్రవేశించడం.. ఆ తర్వాత ఆ సామ్రాజ్యాలు ఎలా మారిపోయాయి.. ఆ తర్వాత ఎటువంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి వంటి అంశాలను మొదటి భాగాల్లో చూపించాడు ప్రశాంత్. ఆ తర్వాత రెండవ భాగం పై ఆసక్తిని మరింత పెంచాడు. కేజీఎఫ్ లో మూడో భాగం కూడా ఉంటుందని హింట్ ఇచ్చేశాడు. ఈ కాలపు దర్శకులు తమకంటూ సినిమాటిక్ యూనివర్స్ ఏర్పాటు చేసుకున్నారు. అందులో విజయవంతమైన వారు కొందరు మాత్రమే. ఆ జాబితాలో ప్రశాంత్ నీల్ ముందు వరుసలో ఉంటాడు.

ప్రశాంత్ ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ తో డ్రాగన్ అనే సినిమా తీస్తున్నాడు. ఆ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ ను జూనియర్ ఎన్టీఆర్ జన్మదినం సందర్భంగా విడుదల చేశారు. అందులో మాదక ద్రవ్యాలు.. రెండు ట్రేడింగ్ కంపెనీల మధ్య సాగే వ్యవహారాలు ప్రధానంగా చూపించారు. ఇందులో జూనియర్ ఎన్టీఆర్ పాత్రకు LUGER అని పేరు పెట్టాడు ప్రశాంత్. అయితే ఇదేదో ఆషామాషీగా పెట్టిన పేరు కాదు. దీని అర్థం వెతికితే చాలా పెద్ద చరిత్ర వచ్చింది. గూగుల్లో లభిస్తున్న సమాచారం ప్రకారం లూగర్ అనేది జర్మన్ నైన్ ఎం ఎం సెంటీమీటర్ ఆటోమేటిక్ పిస్టల్. ఇది రెండు ప్రపంచ యుద్ధాలు జరిగినప్పుడు జర్మన్ సైన్యానికి ప్రామాణికమైన సర్వీస్ తుపాకీగా ఉండేది. పైగా ఇందులో జూనియర్ ఎన్టీఆర్ కూడా క్రూరమైన వ్యక్తి లాగా కనిపిస్తున్నాడు. వందల మందిని చంపేసి.. ఇంకా తన కలలోకి శత్రువులు రాకూడదని.. వస్తే మాత్రం వేరే విధమైన పనిష్మెంట్ ఉంటుందని హెచ్చరిస్తున్నాడు.

ఇప్పుడు మాత్రమే కాదు. ప్రశాంత్ నీల్ చరిత్ర లో జరిగిన సంఘటనలను తన సినిమాలలో ప్రస్తావించాడు. కేజిఎఫ్ సినిమాలో కళాష్ నికావో, ఎల్డో రాడో, సలార్ సినిమాలో యుద్ధ విమానం.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో విషయాలను ప్రశాంత్ తన సినిమాలలో చూపించాడు. అయితే ఇప్పుడు డ్రాగన్ లో LUGER తోనే ఆగిపోయేలా కనిపించడం లేదు.. ఇంకా అనేక రకాల పాత్రలను.. వారి నేపథ్యాలను.. దాగి ఉన్న టెక్నికల్ పేర్లను బయటపెట్టే అవకాశం ఉంది. ఎంతైనా ప్రశాంత్ టెక్నికల్ జీనియస్. పైగా అతడికి పీరియాడికల్ డ్రామాలు అంటే చాలా ఇష్టం. అందువల్లే తన సినిమాల్లో కథలు అలా ఉండేలా చూసుకుంటాడు ప్రశాంత్.

 

ముకేశ్ అంబానీ అంటేనే వ్యాపారం.. మామిడి పండ్లను ఎందుకు వదిలిపెడతాడు..

Mukesh Ambani Mango Business
Mukesh Ambani Mango Business

Mukesh Ambani Mango Business: నీళ్లలో ఉండే చేప బయటికి రావడానికి అంతగా ఇష్టపడదు. ఒకవేళ వచ్చినా సరే వెంటనే మళ్ళీ నీళ్లలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. అలాగే డబ్బున్న వాళ్ళు, ముఖ్యంగా వ్యాపారం చేసే వాళ్ళు.. ప్రతి దాంట్లో కూడా బిజినెస్ మాత్రమే చూస్తారు. ఎంత పెట్టుబడి పెడితే.. ఎంత లాభం వస్తుంది.. ఇన్కమ్ ఎలా జనరేట్ అవుతుంది.. అనే అంశాలు మాత్రమే పరిశీలిస్తారు. అందువల్లే వ్యాపారవేత్తలు మానవ సంబంధాలను పెద్దగా పట్టించుకోరు. కేవలం వారికి కావాల్సింది ఆర్థిక బంధాలు మాత్రమే.

మనదేశంలో ఎంతో మంది వ్యాపారవేత్తలు ఉన్నారు. వారంతా కూడా భిన్నమైన రంగాలలో వ్యాపారాలు చేస్తున్నారు. కొందరు ప్రజల అవసరాలకు అనుగుణంగా వ్యాపారాలు చేస్తుంటే.. మరికొందరేమో అవసరాలు సృష్టించి వ్యాపారాలు చేస్తున్నారు. అయితే మరి కొంతమంది ప్రజల అవసరాలలోనే వ్యాపార సామ్రాజ్యాలను సృష్టిస్తున్నారు. అటువంటి వారిలో ముకేశ్ అంబానీ ముందు వరుసలో ఉంటారు. పెట్రోల్ నుంచి మొదలు పెడితే టీవీ వరకు.. ఆయన చేయని వ్యాపార అంటూ లేదు. వేల కోట్లు కాదు.. లక్షల కోట్లు దాటినా.. ఆయనకు వ్యాపారంలో మాత్రమే ఆనందం లభిస్తుంది. డబ్బు సంపాదించడంలోనే మజా వస్తూ ఉంటుంది. అందువల్లే వచ్చిన ఏ అవకాశాన్ని కూడా ముఖేష్ అంబానీ వదులుకోరు. చివరికి మామిడి పండ్లను సైతం తన వ్యాపారానికి అనుకూలంగా మార్చుకున్నారు. ఆసియాలోనే అతిపెద్ద మామిడిపండ్ల ఎగుమతి దారుగా అవతరించారు.

మామిడిపండ్లను కార్పొరేట్ వ్యవస్థగా మార్చిన ఘనత ముమ్మాటికి ముకేశ్ అంబానికి దక్కుతుంది. ముకేశ్ అంబానీ ఆధ్వర్యంలో గుజరాత్ లోని జాంనగర్ ప్రాంతంలో ఆసియాలోని అతిపెద్ద మామిడి తోట ఉంది. దీనిని ధీరుబాయ్ అంబానీ లకీ భాగ్ ఆమ్రాయిని అని పిలుస్తుంటారు. ఇది మొత్తం 600 ఎకరాలలో విస్తరించి ఉంది. ఇక్కడ గతంలో బీడు భూమి ఉండేది. అందులో విపరీతమైన చౌడు ఉండేది. అనేక రకాలుగా భూసార పరీక్షలు చేసిన తర్వాత ఈ భూమిని మామిడిపండ్ల తోట సాగుకు అనుకూలంగా మార్చారు. ఇందులో ఆల్ఫాన్సో, కేసర్ వంటి భారతీయ ప్రసిద్ధ రకాల తో పాటు టామీ, అట్ కిన్స్ , కిట్, మాయ వంటి అంతర్జాతీయ రకాలు కూడా ఉన్నాయి. మొత్తంగా ఇక్కడ 200 పైగా ప్రీమియం రకాలను సాగు చేస్తున్నారు. ప్రతి ఏడాది ఇక్కడ 600 టన్నుల అధిక నాణ్యత గల మామిడి పండ్లను ఉత్పత్తి చేసి, విదేశాలకు ఎగుమతి చేస్తూ ఉంటారు.

ఆయిల్ రిఫైనరీ నుంచి కాలుష్యాన్ని ఎదుర్కొనేందుకు.. ఆ ప్రాంతంలో ఉష్ణోగ్రతను పూర్తిగా తగ్గించేందుకు పర్యావరణహిత కార్యక్రమంగా ఇక్కడ మామిడి చెట్లను పెంచడం మొదలుపెట్టారు. 1997లో ఈ తోటలో మొక్కలు పెంచడం ప్రారంభించారు. ఇక్కడ పండిన మామిడి పండ్లు పూర్తిగా సేంద్రియ విధానంలో సాగవుతూ ఉంటాయి. వీటిని యూరప్.. ఇంగ్లాండ్.. అమెరికా వంటి దేశాలకు ఎమర్జ చేస్తూ ఉంటారు. ఈ మామిడి పండ్లను కేబీ ఎక్స్పోర్ట్స్.. ఆల్ సీజన్ ఎక్స్పోర్ట్స్ వంటి సంస్థలు ఎగమతి చేస్తూ ఉంటాయి. కేవలం మామిడిపండ్ల ఉత్పత్తి మాత్రమే కాదు.. చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల రైతులకు మామిడి మొక్కలను ప్రతి ఏడాది ఉచితంగా అందిస్తూ ఉంటారు. ముకేశ్ అంబానీ నిర్ణయం వల్ల అక్కడి రైతులు అత్యంత నాణ్యమైన మామిడి పండ్లను ఉత్పత్తి చేసి లాభాలను ఆర్జిస్తూ ఉన్నారు.

దేశ భద్రతకు ముప్పు తెచ్చిన 'ధురంధర్ 2'.. హై కోర్టు సంచలన తీర్పు..

Dhurandhar 2 Controversy
Dhurandhar 2 Controversy

Dhurandhar 2 Controversy: ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిల్చిన ‘ధురంధర్ 2’ చిత్రం రీసెంట్ గానే ఓటీటీ లోకి ఎంట్రీ ఇచ్చింది. నెట్ ఫ్లిక్స్ ఓవర్సీస్ లో విడుదలైన ఈ సినిమాకు థియేటర్స్ లో ఏ రేంజ్ లో రెస్పాన్స్ వచ్చిందో , అంతకు మించిన రేంజ్ ఓటీటీ లో కూడా వచ్చింది. థియేటర్స్ లో ఇప్పటి వరకు ఈ చిత్రానికి 1850 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి, ఇప్పటికీ విజయవంతంగా థియేటర్స్ లో ఈ చిత్రం రన్ అవుతూనే ఉంది. బుక్ మై షో లో గడిచిన 24 గంటల్లో 12 వేల టిక్కెట్లు కూడా అమ్ముడుపోయాయి. ఓటీటీ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత కూడా నాలుగు గంటల నిడివి ఉన్నటువంటి సినిమాని థియేటర్స్ కి వెళ్లి చూసేందుకు ఆడియన్స్ ఇష్టపడుతున్నారంటే సాధారణమైన విషయం కాదు.

ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు ‘ధురంధర్ 2’ చిత్రానికి సరికొత్త చిక్కు ఒకటి ఎదురైంది. ఢిల్లీ హై కోర్టు లో ఈ చిత్రం పై ఒక పిటీషన్ దాఖలు అయ్యింది . ఈ సినిమాలో , సాయుధ దళాల కార్యకలాపాల వివరాలను బహిర్గతం చేసారని, ఇది దేశ భద్రతకు పెద్ద ముప్పు తీసుకొచ్చే అవకాశం ఉందని , సశత్ర సీమా బల్ (SSB) లో హెడ్ కానిస్టేబుల్ గా పని చేస్తున్న దీపక్ కుమార్ పిటీషన్ దాఖలు చేశాడు. ఈ సినిమా కచ్చితంగా కల్పిత కథ నే అయ్యుండొచ్చు, కానీ భద్రతాదళ సిబ్బంది లేవనెత్తిన ఈ అంశాన్ని అంత తేలికగా తీసుకునేది లేదని హై కోర్టు చెప్పుకొచ్చింది. ఈ ఆరోపణలపై నిజానిజాలేంటో విచారణ చేపట్టాలని సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేట్ (CBFC) బోర్డుని హై కోర్టు ఆదేశించింది . మరి సెంట్రల్ బోర్డు ఏమని వివరణ ఇస్తుందో చూడాలి.

నిజానికి ‘ధురంధర్ 2’ చిత్రం కల్పిత కథనే. కానీ పూర్తి స్థాయి కల్పిత కథ మాత్రం కాదు. నిజ జీవితం లో జరిగిన కొన్ని సంఘటనలను ఆధారంగా తీసుకొని , దానికి ఫిక్షన్ ని జోడించి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. భద్రతా దళాలు రెండు దేశాల్లోనూ ఎలా పని చేస్తున్నాయి?, పొలిటికల్ సిస్టం ఎలా రన్ అవుతుంది , ఇండియన్ ఆర్మీ లో ఎలాంటి ట్రైనింగ్ ఇస్తారు వంటి అంశాలను ఈ చిత్రం లో చూపించారు. అందుకే ఇప్పుడు నేరుగా CBFC రంగం లోకి దిగాల్సి వచ్చింది. ఒక సినిమా ని ఉన్నది ఉన్నట్టుగా చూపించాలంటే ఈ మాత్రం అడ్డంకులు రావడం సహజమే.

భార్య చెప్పుల్లో జిపిఎస్ ట్రాకర్.. ఈ భర్త ఎందుకు ఆ పని చేశాడంటే..

Wife GPS Tracker In Slippers
Wife GPS Tracker In Slippers

Wife GPS Tracker In Slippers: ఇది దిగ్భ్రాంతి కలిగించే సంఘటన. సభ్య సమాజం తలదించుకునే దారుణం. పైగా అతడు అనేక సందర్భాల్లో చూశాడు. పద్ధతి మార్చుకోవాలని చెప్పి చూశాడు. అయినప్పటికీ ఆమె మారలేదు. పైగా మరింత బరితెగించింది. కట్టుకున్న భర్త కదా తట్టుకోలేకపోయాడు. తన భార్య బాగోతాన్ని బయటపెట్టాలనుకున్నాడు. చివరికి ఆ పని చేశాడు. బీహార్ రాష్ట్రంలో గత నెల ఆరవ తేదీన పాట్నాలోని పులివారి షరీఫ్ ఏక్తా నగర్లో జరిగిన ఈ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

అతడి పేరు రాజేష్ (పేరు మార్చాం) ఇతడికి దివ్య (పేరు మార్చాం) అనే భార్య ఉంది. రాజేష్, దివ్య మొదట్లో అన్యోన్యంగానే ఉండేవారు. ఆ తర్వాత దివ్య ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. భర్త మీద ఏమాత్రం ఆసక్తిని చూపించేది కాదు. పైగా నిత్యం ఫోన్లోనే తల దూర్చేది. వాట్సప్ లో ఎప్పటికప్పుడు సందేశాలను క్లియర్ చేస్తూ ఉండేది. పైగా భర్త బయటకు వెళ్ళిపోగానే ఫోన్లలో గంటల తరబడి సంభాషణలు కొనసాగిస్తూ ఉండేది. ఈ వ్యవహారం రాజేష్ కు ఏమాత్రం నచ్చేది కాదు. అనేక సందర్భాల్లో దివ్యకు చెప్పి చూశాడు. అయినప్పటికీ ఆమె తన ప్రవర్తన మార్చుకోలేదు. పైగా అనుమానిస్తున్నామని భర్తను తిట్టేది. దీంతో ఎలాగైనా సరే భార్యను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలని రాజేష్ అనుకున్నాడు. అయితే భార్యకు అనుమానం రాకుండా ఆ పని చేశాడు. ఎప్పటి మాదిరిగానే ఆమెతో ఉండడం మొదలుపెట్టాడు.

రాజేష్ పని మీద బయటకు వెళ్తే చాలు దివ్య ఫోన్లో ఉండేది. కొన్ని సందర్భాలలో ప్రియుడి వద్దకు వెళ్ళేది.. అయితే దివ్య ను ఎలాగైనా పట్టుకోవాలని అనుకున్న అతడు తన ప్లాన్ వర్కౌట్ చేశాడు. అతడు పని మీద బయటకు వెళ్లినట్టు నటించాడు. దాని కంటే ముందుగానే తన భార్య చెప్పులలో, ఇంట్లో జిపిఎస్ పరికరాలు అమర్చాడు. రాజేష్ బయటికి వెళ్లగానే.. దివ్య వెంటనే తన ప్రియుడు వద్దకు వెళ్ళిపోయింది.. తన ఫోన్ ద్వారా ఆమె జిపిఎస్ పొజిషన్ ను ట్రాక్ చేశాడు. ఆమె తన ప్రియుడు ఇంట్లో ఉన్నప్పుడు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు. భార్యను నిలదీశాడు. దీంతో ఆమె కూడా అతనితో వాగ్వాదానికి దిగింది. ఆ తర్వాత అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు..

నేటి కాలంలో వివాహేతర సంబంధాలు సర్వసాధారణంగా మారిపోయాయి. భార్యకు తెలియకుండా భర్త.. భర్తకు తెలియకుండా భార్య అనైతికమైన బంధాలను కొనసాగిస్తున్నారు. చివరికి అడ్డంగా దొరికిపోతున్నారు. అయిన వాళ్ల ముందు.. కన్న వాళ్ళ ముందు.. దోషులుగా మిగిలిపోతున్నారు. ఇటువంటి బంధాలు సంసార జీవితంలో తీవ్రమైన ఒడిదుడుకులకు కారణమవుతుంటాయి. అందువల్లే భార్య భర్తలు పరస్పరం నమ్మకంతో సంసారం సాగించినప్పుడే ఆ దాంపత్యం కలకాలం సాగిపోతూ ఉంటుంది.

 

View this post on Instagram

 

A post shared by For Men India (@for.men.india_)

అల్లు అర్జున్ తో సినిమా చేసే అవకాశం ఇప్పించండి ప్లీజ్ అంటూ బ్రతిమిలాడిన బాలీవుడ్ హీరోయిన్..

Allu Arjun
Allu Arjun

Allu Arjun: నేటి తరం హీరోయిన్స్ లో అందం తో పాటు అద్భుతమైన నటన కనబర్చగల అతి తక్కువ మందిలో ఒకరు కృతి సనన్. ఈమె అద్భుతమైన నటనకు గానూ నేషనల్ అవార్డు కూడా వచ్చిన సంగతి తెలిసిందే. మన టాలీవుడ్ ‘1 నేనొక్కడినే’ చిత్రం ద్వారా ఈమె వెండితెర అరంగేట్రం చేసింది , ఆ తర్వాత అక్కినేని నాగ చైతన్య తో ‘దోచేయ్’ అనే చిత్రం చేసింది. ఈ రెండు సినిమాలు కమర్షియల్ గా పెద్ద డిజాస్టర్ అవ్వడం తో , టాలీవుడ్ నుండి బాలీవుడ్ కి షిఫ్ట్ అయ్యింది. అక్కడ ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి, అతి తక్కువ సమయం లోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఇప్పుడు ఆమె ఇమేజ్ స్టార్ హీరోలతో సమానం. కేవలం కృతి సనన్ కోసమే థియేటర్స్ కి కదిలే ఆడియెన్ సంఖ్య లక్షల్లోనే ఉంటుంది, ఆ స్థాయికి చేరుకుంది.

ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గా ఈమె ‘కాక్టెయిల్ 2 ‘ అనే చిత్రం లో నటించింది. షాహిద్ కపూర్ హీరో గా నటించిన ఈ సినిమాలో రష్మిక మరో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా వచ్చే నెల 19 న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుండడంతో , మేకర్స్ ప్రమోషనల్ కార్యక్రమాలను ఇప్పటి నుండే మొదలు పెట్టారు. రీసెంట్ గానే ఒక సాంగ్ లాంచ్ ఈవెంట్ కూడా జరిగింది. ఈ ఈవెంట్ లో కృతి సనన్ అల్లు అర్జున్ గురించి చేసిన కొన్ని హాట్ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఒక రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు బదులుగా ఆమె సమాధానం చెప్తూ ‘ఒక నటుడిగా అల్లు అర్జున్ అంటే నాకు చాలా ఇష్టం, ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ కూడా అద్భుతంగా ఉంటుంది . కచ్చితంగా ఇండియా లోనే గొప్ప నటులలో ఒకరు అల్లు అర్జున్’.

‘ఆయనతో కలిసి ఒక్క సినిమా చెయ్యాలని నాకు ఎప్పటి నుండో ఒక కోరిక ఉంది. మిత్రులారా మీరంతా సోషల్ మీడియా ద్వారా పోస్టులు పెట్టి , ఈ విషయాన్నీ అల్లు అర్జున్ కి చేరేలా చేయండి , ఇలా అయినా మా కాంబినేషన్ లో సినిమా సెట్ అవుతుందో లేదో చూద్దాం’ అంటూ చెప్పుకొచ్చింది కృతి సనన్. బాలీవుడ్ లో అంత పెద్ద స్టార్ హీరోయిన్ , నేషనల్ అవార్డు కూడా సొంతం చేసుకుంది , ఇండియా లో ఇంతమంది సూపర్ స్టార్స్ ఉన్నప్పటికీ కూడా , ఆమె అల్లు అర్జున్ తో సినిమా చెయ్యాలనే కోరిక ని బయటపెట్టిందంటే , అల్లు అర్జున్ రేంజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్.

విడుదలై 5 రోజులైంది.. అప్పుడే OTT లోకి సూర్య 'కరుప్పు'.. ఎందులో చూడాలంటే..

Karuppu OTT Release Date
Karuppu OTT Release Date

Karuppu OTT Release Date: తమిళ హీరో సూర్య నటించిన లేటెస్ట్ చిత్రం ‘కరుప్పు’ బాక్స్ ఆఫీస్ వద్ద రాబడుతున్న వసూళ్లు , తమిళ సినిమా ఇండస్ట్రీ కి పెద్ద బూస్ట్ ఇచ్చింది. ఎందుకంటే ఈ ఏడాది ఒక్క సినిమా కూడా వాళ్ళవి హిట్ అవ్వలేదు , మరో పక్క బిగ్గెస్ట్ క్రౌడ్ పుల్లర్స్ అని పిలిచే అజిత్, విజయ్ వంటి వారు సినిమాలకు దూరం అయ్యారు , ఇక తమిళ సినిమా పరిస్థితి ఏంటో అని అందరూ బాధపడుతున్న సమయం లో ‘కరుప్పు’ చిత్రం వచ్చింది. ఈ సినిమా ఇంత పెద్ద కమర్షియల్ హిట్ అవుతుందని మేకర్స్ కూడా ఊహించలేదు. కానీ అందరి అంచనాలను తారుమారు చేస్తూ , ఈ చిత్రం కేవలం 3 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకొని క్లీన్ సూపర్ హిట్ స్టేటస్ ని సొంతం చేసుకుంది.

తెలుగు లో ఈ చిత్రం ‘వీరభద్రుడు’ అనే టైటిల్ తో విడుదలై , ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ మార్కుని సాధించి సూపర్ హిట్ గా నిల్చింది. ఇలాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ ని అందుకున్న ఈ చిత్రానికి సంబంధించిన ఓటీటీ అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఈ చిత్రాన్ని నెట్ ఫ్లిక్స్ సంస్థ కేవలం 35 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. తెలుగు తో పాటు , అన్ని ప్రాంతీయ భాషల్లో ఈ సినిమా ని నెట్ ఫ్లిక్స్ లో విడుదల చేయబోతున్నారు. మేకర్స్ తో కుదిరించుకున్న ఒప్పందం ప్రకారం ఈ చిత్రాన్ని థియేటర్స్ లో విడుదలైన 4 వారాలకు ఓటీటీ లో విడుదల చెయ్యాలి. అందుకే జూన్ 2 వ వారం లో ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ లోకి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. థియేటర్స్ లో రన్ ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుందో ఎవ్వరూ చెప్పలేకపోతున్నారు , ఆ రేంజ్ సునామీ ని తలపిస్తోంది ఈ చిత్రం.

మరి ఓటీటీ లో కూడా అదే రేంజ్ రెస్పాన్స్ ని సొంతం చేసుకుంటుందో లేదో చూడాలి. చాలా మంది ఫస్ట్ హాఫ్ అద్భుతంగా ఉంది , కానీ సెకండ్ హాఫ్ అసలు నచ్చలేదంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఓటీటీ నుండి కూడా ఇలాంటి రెస్పాన్స్ వస్తుందో లేదో చూడాలి. ఇకపోతే 5 రోజుల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి 162 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఈ వీకెండ్ తో 200 కోట్ల గ్రాస్ మార్కుని కూడా అందుకోబోతుంది ఈ చిత్రం. మరి ఫుల్ రన్ లో 300 కోట్ల మార్కుని అందుకుంటుందో లేదో చూడాలి.

బిజినెస్ చేయాలనుకుంటున్నారా.. ఈ ట్రిక్స్ ఫాలో అయితే లాభాలే లాభాలు

Business success tips for beginners
Business success tips for beginners

Business success tips for beginners: బిజినెస్ అంటే కేవలం పెట్టుబడి మాత్రమే కాదు.. దిమాక్ ఉపయోగించి సాగించే వ్యవహారం. అందువల్లే వ్యాపారంలో చాలామంది విజయవంతం కాలేరు. మార్కెట్ అవసరాలు.. డిమాండ్.. సప్లై.. క్యాష్ ఫ్లోటింగ్.. ఇంకా రకరకాల వ్యవహారాల మీద పట్టుకుంటేనే బిజినెస్ అనేది లాభ సాటి అవుతుంది. లేకపోతే అంతే సంగతులు..

అప్పట్లో ధీరుబాయ్ అంబానీ ఆయిల్ రిఫైనరీ పెడితే చాలామంది నవ్వుకున్నారు. సరైన కనెక్టివిటీ లేని గుజరాత్ రాష్ట్రంలో రిఫైనరీ పెడుతున్నాడని ఎగతాళి చేశారు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు అది ప్రపంచంలోనే అతిపెద్ద ఆయిల్ రిఫైనరీలలో ఒకటి. పైగా దానివల్ల గుజరాత్ రాష్ట్రానికి బీభత్సంగా ఆదాయం వస్తుంది. కొన్ని వేల కుటుంబాలకు అది ఒక కల్ప తరువు. పరోక్షంగా లక్షల కుటుంబాలకు ఆసరా..

సాధారణంగా బిజినెస్ మొదలు పెట్టేవాళ్ళు మార్కెట్ స్ట్రాటజీ కచ్చితంగా ఫాలో కావాలి. మార్కెట్ అవసరాలు తెలుసుకోవాలి. సప్లై పెంచుకోవాలి. డిమాండ్ కు తగ్గట్టుగా వస్తువులను రవాణా చేయాలి. అంతేతప్ప.. ఆడంబరంగా వ్యాపారం మొదలుపెట్టి.. తర్వాత నష్టాల పాలు కావొద్దు. ఉదాహరణకు ఒక ప్రభుత్వ కార్యాలయం వద్ద ఫోటోకాఫీ షాప్.. జిరాక్స్ షాప్ ఏర్పాటు చేస్తే.. లాభం ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వ కార్యాలయాలకు వివిధ పనుల మీద వచ్చేవారు కచ్చితంగా జిరాక్స్ లేదా ఫోటోలు తీసుకుంటారు. వివిధ రకాల దరఖాస్తులు కూడా అందుబాటులో ఉంచితే.. అప్పుడు లాభదాయకంగా ఉంటుంది.

ఇప్పుడు ప్రతి గుడి కూడా రద్దీగానే ఉంటోంది. అలాంటి ప్రాంతాలలో పూల దుకాణం పెడితే గిట్టుబాటు అవుతుంది. పూలతోపాటు కొబ్బరికాయలు.. ఇతర పూజ సామగ్రి గనక విక్రయించడం మొదలుపెడితే.. వ్యాపారం లాభసాటిగా సాగుతూ ఉంటుంది. పైగా పూల వ్యాపారంలో అంతగా నష్టాలు ఉండవు. పూజా సామగ్రి అమ్మకంలో కూడా పెద్దగా ఇబ్బందులు ఉండవు. హైవే రోడ్ల పక్కన బైక్ రిపేర్ షాప్ పెడితే.. లాభాలే లాభాలు.. ఎందుకంటే హైవేల పక్కన పెద్దగా షాపులు ఉండవు. ఏవైనా వాహనాలకు మరమ్మతులు ఏర్పడితే.. అప్పటికప్పుడు ఎక్కడ ఉన్న రిపేర్ షాప్ దగ్గరికి వెళ్లాలంటే ఇబ్బందిగా ఉంటుంది. అందువల్లే హైవేల పక్కన బైక్ రిపేర్ షాప్ లు పెడితే లాభదాయకంగా ఉంటుంది.. వాటికి అనుసంధానంగా EV చార్జింగ్ పాయింట్ ఏర్పాటు చేస్తే ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు.

బస్టాండ్ ఏరియాలలో టీ, స్నాక్స్ అమ్మే స్టాల్ ఏర్పాటు చేస్తే ఎంతో లాభం ఉంటుంది. ఇలాంటి బిజినెస్ ట్రిక్ ప్లే చేసింది కాబట్టే పారడైజ్ ఈరోజు నెంబర్ వన్ రెస్టారెంట్ గా ఉంది. ఇప్పటికీ హైదరాబాద్ లోని ఎంజీబీఎస్, ఇమ్లిబన్, సికింద్రాబాద్ వంటి ఏరియాలలో ప్యారడైజ్ టీ, స్నాక్ స్టాల్స్ ఉన్నాయి. అందులో బిర్యాని కూడా అమ్ముతుంటారు. ఇక కాలేజీ ఏరియాలలో లాండ్రీ సర్వీస్ ఏర్పాటు చేస్తే.. గిట్టుబాటు అవుతూ ఉంటుంది.

పెద్దపెద్ద అపార్ట్మెంట్లు ఉన్న ఏరియాలలో ఇస్త్రి షాప్ పెడితే కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. హైదరాబాదులోని మాదాపూర్ ఏరియాలో ఒక వ్యక్తి ఇస్త్రీ షాప్ పెట్టి.. రోజుకు 5000 వరకు సంపాదిస్తున్నాడు. తన ఆదాయం గురించి సోషల్ మీడియాలో అతడు పోస్ట్ పెడితే.. లక్షలలో వీక్షణలు వచ్చాయి. జిమ్ సెంటర్ లు ఉన్న ఏరియాలలో జ్యూస్, హెల్దీ డైట్ వంటి షాపులు పెడితే.. లాభ సాటిగా ఉంటుంది. పైగా చాలామందికి ఈ రోజుల్లో ఆరోగ్య మీద శ్రద్ధ పెరిగిపోయింది. అందువల్లే పండ్ల రసాలు.. జావాలు.. ఫ్రూట్ సలాడ్ లు తింటున్నారు.

ఇవన్నీ కేవలం ఉదాహరణలు మాత్రమే. చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఒక వ్యాపారంలో భారీగా పెట్టుబడి పెట్టే బదులు.. ముందుగా అక్కడి స్థానిక పరిస్థితులను ఆకలింపు చేసుకోవాలి. ఆ తర్వాత అక్కడి ప్రజల అవసరాలు.. సరుకులు తీసుకొచ్చే విధానం.. డెలివరీ చేసే విధానంపై పూర్తి అవగాహన కలిగి ఉండాలి. అప్పుడే వ్యాపారం లోకి దిగాలి. అది ఎంతైనా సరే ముందుగా దిగిన తర్వాత మార్కెట్ వ్యాల్యూ పెంచుకోవాలి. అదిగో అప్పుడే వ్యాపారంలో నిలదొక్కుకోవడానికి ఆస్కారం ఏర్పడుతుంది.

Virat Kohli 18 commune: తందూరి రోటి 118 రూపాయలా..

Virat Kohli One8 commune
Virat Kohli One8 commune

Virat Kohli One8 commune: తందూరి రోటి 118 రూపాయలు. సాల్టెడ్ ప్రైస్ 348 రూపాయలు. లక్నో వీ దమ్ లాంబ్ బిర్యానీ 978. స్టీమ్ రైస్ 318. మాస్కోర్పోన్ చీజ్ కేక్ 748.. ఇవి కేవలం ధరలు మాత్రమే. పన్నులు కలుపుకుంటే మరింత అదనం. ఇదేదో పార్క్ హయత్ హోటల్ లో వసూలు చేసే రేట్లో.. తాజ్ బంజారాలో ఫైవ్ స్టార్ మెనూనో కాదు.. ఇది మన విరాట్ కోహ్లీ హోటల్లో వసూలు చేసే ధరలు..

ఈ డబ్బులు పెడితే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వారం పాటు హోటల్లో దర్జాగా తినవచ్చు. ఇదే మెనూ ను హాయిగా ఆస్వాదించవచ్చు. ఈ రేట్లు ఎందుకంటారా.. అది విరాట్ కోహ్లీ హోటల్ కాబట్టి. పైగా దాని పేరు one 8 commune కాబట్టి.. విరాట్ కోహ్లీ ఫుడ్ బిజినెస్ లోకి వచ్చి చాలా రోజులైంది. ఇందులో ఉన్న రేట్ల గురించి రకరకాల ప్రచారాలు జరిగాయి. అయినప్పటికీ అందులో ధరలు ఏమాత్రం తగ్గడం లేదు. ఇప్పుడంటే ఫుడ్ ఐటమ్స్ ధరలు పెరిగాయి. గ్యాస్ లభించకపోవడం.. కమర్షియల్ గ్యాస్ మీద ధర పెంచడం.. ఇతర కూరగాయలు.. వస్తువుల ధర కూడా పెరగడం వల్ల చాలామంది హోటల్ నిర్వాహకులు ఫుడ్ ఐటమ్స్ రేట్లు పెంచేశారు.

విరాట్ కోహ్లీ హోటల్లో ఈ రేట్లు ఎప్పటి నుంచో ఉన్నాయి. తాజాగా బెంగళూరులో హోటల్ ను మూసి వేసిన తర్వాత.. గోవాలో సీయోలిమ్ ఏరియాలో విరాట్ కోహ్లీ హోటల్ మొదలుపెట్టాడు. ఇందులో కాంటినెంటల్.. వెస్ట్రన్ ఫుడ్ ఐటమ్స్ లభిస్తుంటాయి. ఇద్దరు వ్యక్తులు తినడానికి వెళ్తే తక్కువలో తక్కువ అక్కడ 2000 వరకు బిల్ అవుతూనే ఉంటుంది. పైగా అదనపు ఖర్చులు ఉండనే ఉన్నాయి. ఒకవేళ బార్ లో తాగుతూ ఎంజాయ్ చేయాలనుకుంటే.. జేబుకు బొక్క పెట్టుకోవాల్సిందే. ఈ స్థాయిలో ధరలు ఎందుకంటే అది విరాట్ కోహ్లీ రెస్టారెంట్ కాబట్టి.. పైగా అందులో ఉన్న ఫుడ్ ఐటమ్స్ అలా ఉంటాయి కాబట్టి..

ఇంత ధర పెట్టి అక్కడికి వెళ్లాల్సిన అవసరం ఏముంది.. ఇంట్లో కూడా వండుకోవచ్చు కదా.. హాయిగా కుటుంబ సభ్యులతో తినవచ్చు కదా.. అని అనుకుంటున్నారా.. అలా అయితే సంతోషం. ఎందుకంటే డబ్బులు ఆదా అవుతాయి. పైగా ఇంట్లో కూర్చొని తిన్న అనుభూతి లభిస్తుంది. ఇప్పటి కాలంలో బయట తిండి కంటే ఇంట్లో తినడమే మంచిది. ఇంట్లో తాగే అవకాశం ఉండదు కదా.. అలాంటప్పుడు ఇంట్లో ఎలా తింటామని అంటారా.. అది మీ ఇష్టం.. కాకపోతే వన్ 8 కమ్యూన్ లో కేవలం హై-ఫై వ్యక్తులు మాత్రమే తింటారు. ఎందుకంటే అది విరాట్ కోహ్లీ రెస్టారెంట్ కాబట్టి..

 

View this post on Instagram

 

A post shared by UPDATE ADDA (@updateadda__)

ఎన్టీఆర్ కి 2 పుట్టిన రోజులు..ఎలాగో తెలుసా?..ఎవరికీ తెలియని షాకింగ్ నిజాలు..

NTR
NTR

NTR two birthdays mystery: చిన్న వయస్సులోనే ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి , ఇండియా లోనే బిగ్గెస్ట్ మాస్ హీరో గా ఎదిగి తిరుగిలేని ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న ఎన్టీఆర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అప్పటి వరకు మెగాస్టార్ చిరంజీవి కి డ్యాన్స్ , యాక్షన్ , డైలాగ్ డెలివరీ, ఫైట్స్ వంటి విభాగాల్లో పోటీ వచ్చే హీరోనే లేడు , తిరుగులేని నెంబర్ 1 సూపర్ స్టార్ గా కొనసాగుతున్న చిరంజీవి కి , అన్ని విధాలుగా పోటీ ఇచ్చాడు ఎన్టీఆర్. అలాంటి బిగ్గెస్ట్ సూపర్ స్టార్ , నేడు పాన్ వరల్డ్ స్థాయిలో తెచ్చుకున్న గుర్తింపు ఎలాంటిదో మన కళ్లారా చూశాము. నందమూరి అభిమానులు గర్వంగా కాలర్ ఎత్తుకొని తిరిగేలా చేస్తానని చెప్పాడు , అంతకు మించే చేసి చూపించాడు. నేడు ఎన్టీఆర్ పుట్టిన రోజు , ఈ సందర్భంగా ఆయన హీరో హీరో గా నటించిన అత్యంత పరిష్టాత్మక చిత్రం ‘డ్రాగన్’ కి సంబంధించిన గ్లింప్స్ వీడియో విడుదలైంది.

ఈ వీడియో కి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇది ఇలా ఉండగా, గతం లో ఒక ఇంటర్వ్యూ లో ఎన్టీఆర్ తన పుట్టినరోజు గురించి మాట్లాడిన కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారాయి. ఆయన మాట్లాడుతూ ‘2009 , మార్చి 26 న జరిగిన రోడ్డు ప్రమాదం నుండి ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డాను. అందుకే నేను మార్చి 26 ని నా రెండవ పుట్టిన రోజు గా భావిస్తాను. మొదటి పుట్టినరోజు తల్లి ప్రసాదించిన జీవితం కాగా, రెండవ పుట్టిన రోజు ప్రేక్షక దేవుళ్ళ ఆశీర్వాదం తో ప్రసాదించిన జీవితం, అందుకే నాకు కేవలం ఒక్క పుట్టినరోజు కాదు , 2 పుట్టినరోజులు ఉన్నాయి అని అంటుంటాను’ అంటూ చెప్పుకొచ్చాడు ఎన్టీఆర్.

ఇక ఎన్టీఆర్ ‘డ్రాగన్’ విశేషాల్లోకి వెళ్తే , గ్లింప్స్ వీడియో తోనే ఈ సినిమా స్టోరీ ఏంటి అనేది మొత్తం చెప్పేశాడు ప్రశాంత్ నీల్. అయితే ఆడియన్స్ కి మాత్రం కొన్ని క్వశ్చన్ మార్కులు వదిలేసాడు. నిన్న రాత్రి విడుదల చేసింది లూగర్ క్యారక్టర్ కి సంబంధించిన గ్లింప్స్ , ఇది నెగెటివ్ షేడ్స్ లో ఉంటుంది. ‘డ్రాగన్’ క్యారక్టర్ కి సంబంధించిన గ్లింప్స్ ని త్వరలోనే విడుదల చేస్తారట. ఈ క్యారెక్టర్ లో ఎన్టీఆర్ లుక్ ని చూసి అందరూ షాక్ కి గురి అవుతారని, చాలా కాలం తర్వాత డ్యూయల్ రోల్ చేస్తున్నాడు కాబట్టి ఎన్టీఆర్ నటవిశ్వరూపం మామూలు రేంజ్ లో ఉండడం అనడంలో ఎలాంటి సందేహం లేదు.

'పెద్ది' సెన్సార్ కార్యక్రమాలు పూర్తి.. ఇలాంటి టాక్ వచ్చిందేంటి బాబోయ్..

Peddi movie censor talk
Peddi movie censor talk

Peddi movie censor talk: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ చిత్రం మరో రెండు వారాల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సంక్రాంతి తర్వాత టాలీవుడ్ కి సరైన సూపర్ హిట్ లేక తీవ్రమైన కరువులో ఉంది. బయ్యర్స్ చేతుల్లో ఒక్క పైసా కూడా రొటేషన్ కోసం లేవు, ఇలాంటి సమయం లో థియేటర్స్ మరోసారి కళకళలాడుతూ , కాసుల కనకవర్షం కురవాలంటే కచ్చితంగా ‘పెద్ది’ చిత్రం వల్లే అది సాధ్యం అవుతుందని బలంగా నమ్ముతున్నారు బయ్యర్స్. దానికి తోడు మేకర్స్ కూడా ఈ సినిమా ప్రొమోషన్స్ విషయం లో అసలు ఎక్కడా తగ్గడం లేదు. వరుస పెట్టి ఇంటర్వ్యూస్ ఒక పక్క చేస్తూనే, మరో పక్క ఈవెంట్స్ ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. రీసెంట్ గానే ముంబై లో ఏర్పాటు చేసిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ పెద్ద సక్సెస్ అయ్యింది.

ఈ ఈవెంట్ ద్వారా విడుదల చేసిన థియేట్రికల్ ట్రైలర్ కి ఆడియన్స్ నుండి డివైడ్ రెస్పాన్స్ వచ్చింది. సినిమా చాలా డల్ గా ఉన్నట్టు ఉంది , ఇలా అయితే ఈ చిత్రం సక్సెస్ అవ్వడం చాలా కష్టమని అనుకున్నారు , కానీ నేడే ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. సెన్సార్ సభ్యులు చెప్పిన టాక్ ని చూస్తే రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎగిరి గంతులేస్తారు. సినిమా ఆరంభం నుండి ఎండింగ్ వరకు , ఒక్క సన్నివేశం కూడా బోర్ కొట్టాడట. ఆద్యంతం గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో , గూస్ బంప్స్ మూమెంట్స్ తో ఈ సినిమాని నింపేసాడట డైరెక్టర్ బుచ్చి బాబు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో చివరి 45 నిమిషాలు రామ్ చరణ్ నటనకు ఏడవని మనిషంటూ ఎవ్వరూ ఉండరట. ఆ రేంజ్ లో జీవించాడని టాక్. అదే విధంగా పాటలు వినేందుకు ఎంత వినసొంపుగా ఉన్నాయో , సినిమాలో కూడా అంతే అందంగా చిత్రీకరించారట.

ఈ చిత్రం లో రామ్ చరణ్ నటనతో పాటు, జగపతి బాబు నటన కూడా బాగా హైలైట్ అయ్యిందని, ఫస్ట్ హాఫ్ కే ప్రేక్షకుల కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయని అంటున్నారు. ఇకపోతే ఈ చిత్రానికి U/A సర్టిఫికేట్ ని జారీ చేశారు. సినిమా నిడివి 3 గంటల 2 నిమిషాలు ఉంటుందట. పెద్దగా కట్స్ ఏమి చెప్పలేదట కానీ , కొన్ని డైలాగ్స్ కి మాత్రం అభ్యంతరం వ్యక్తం చేశారట సెన్సార్ సభ్యులు. వాటిని మ్యూట్ చేసినట్టు సమాచారం. ఓవరాల్ గా టాలీవుడ్ లో ఏర్పడిన నాలుగు నెలల కరువుని ఈ సినిమా తీర్చబోతుందని, రామ్ చరణ్ కెరీర్ లో ‘రంగస్థలం’ ని మించిన సినిమా గా నిలుస్తుందని అంటున్నారు. ఆ స్థాయి సినిమా ఐటితే కచ్చితంగా ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద వెయ్యి కోట్ల గ్రాస్ ని రాబట్టగలదు.

ప్రీమియం కార్లు కొనేవారికి గుడ్ న్యూస్..

Honda ZR-V premium SUV launch
Honda ZR-V premium SUV launch

Honda ZR-V premium SUV launch: ప్రీమియం కార్లు కొనాలని చూసేవారికి Honda కంపెనీ అనుకూలంగా ఉంటుంది. వీరి కోసం లేటెస్ట్గా కొత్త కారును తీసుకురాబోతుంది.. ఇప్పటికే దీని గురించి పరిచయం చేసిన కంపెనీ మొత్తానికి మరో రెండు రోజుల తర్వాత కారును ప్రవేశపెట్టనుంది. ఈ కారులో మెరుగైన పర్ఫామెన్స్ తో పాటు ఆకట్టుకునే డిజైన్ కలిగి ఉన్నట్లు ఇప్పటికే టీజర్ రిలీజ్ అయింది. అయితే దీని గురించి పూర్తి వివరాల్లోకి వెళ్తే..

Honda ZR-V కారులో ప్రధానంగా 2.0 లీటర్ e:HEV స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజిన్‌ ఉండనుంది. ఇది పెట్రోల్ ఇంజిన్, ఎలక్ట్రిక్ మోటార్ల కలయికతో పనిచేస్తుంది. ఈ ఇంజిన్ సుమారు 181 bhp పవర్‌, 315 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కేవలం 8 సెకన్లలోనే 0 నుండి 100 కి.మీవేగాన్ని అందుకోగల సామర్థ్యం దీని సొంతం. అంతేకాకుండా, ఇందులో ఉన్న e-CVT గేర్‌బాక్స్ వల్ల ప్రయాణం చాలా స్మూత్‌గా ఉంటుంది. ఇది ఎకానమీ (Econ), నార్మల్, స్నో, స్పోర్ట్ అనే నాలుగు డ్రైవింగ్ మోడ్స్‌తో వస్తోంది.

ఈ SUV కారు స్పోర్టీ లుక్‌తో పాటు ప్రీమియం ఇంటీరియర్‌ను కలిగి ఉంటుంది. ఇందులో 9-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, పనోరమిక్ సన్‌రూఫ్ మరియు వైర్‌లెస్ ఛార్జింగ్ వంటి ఆధునిక ఫీచర్లు ఉన్నాయి. భద్రత పరంగా హోండా యొక్క ‘Sensing’ (ADAS) టెక్నాలజీ, 8 నుండి 11 వరకు ఎయిర్‌బ్యాగ్‌లు, 360-డిగ్రీ కెమెరా వంటివి ప్రయాణీకులకు పూర్తి రక్షణ కల్పిస్తాయి.

హోండా ZR-V ని పూర్తిస్థాయిలో విదేశాల నుండి దిగుమతి చేసుకుంటున్నందున, దీని ధర కొంచెం ప్రీమియంగా ఉండబోతోంది. మార్కెట్ అంచనాల ప్రకారం, దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.40 లక్షల నుండి రూ. 55 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది. ఇది భారత మార్కెట్లో Skoda Kodiaq, Volkswagen Tiguan వంటి లగ్జరీ SUVలకు గట్టి పోటీ ఇవ్వనుంది.

ముఖ్యంగా మైలేజీ విషయంలో కూడా ఇది లీటరుకు సుమారు 22 నుంచి 25 కి.మీ వరకు ఇచ్చే అవకాశం ఉండటంతో, ప్రీమియం సెగ్మెంట్లో పొదుపుగా ప్రయాణించాలనుకునే వారికి ఇది మంచి ఆప్షన్ అవుతుంది.