Imran Khan removal conspiracy: దేశాల మీద యుద్దాలు చేస్తుంది. అధ్యక్షులను అపహరిస్తుంది. చివరికి వారి ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడదు. తన ప్రయోజనాల కోసం ఏమైనా చేస్తుంది. ఎంతకైనా తెగిస్తుంది. సుంకాల విధింపు నుంచి మొదలు పెడితే ఎన్నో దారుణాల దాకా అమెరికా చేసే పనులు ఉపోద్ఘాతాలకు అందవు. అందుకే అమెరికాను అత్యంత సామ్రాజ్యవాద దేశమని అంటుంటారు. గిట్టని వాళ్లను కొట్టి.. దండుకోవడంలో అమెరికా తర్వాతే ఎవరైనా. తనకు నచ్చని పాలకుడు అధికారంలో ఉంటే..అతడిని గద్దె నుంచి దించే దాకా అమెరికా నిద్రపోదు.
మన పొరుగున ఉన్న పాకిస్థాన్ కు గతంతో క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ ప్రధానమంత్రిగా పని చేశాడు. కొన్ని సందర్భాల్లో భారత్ అంటే కొంతలో కొంత అభిమానం చూపించే వాడు. పాకిస్థాన్ సైన్యాధిపతి పెత్తనాన్ని, సైనికుల దుర్మార్గాలను అతడు ప్రశ్నించేవాడు. పరిపాలనలో సంస్కరణలు చేపట్టేవాడు. అతడి పాలనలో దుర్మార్గాలు అంతగా సాగకపోవడంతో కొందరు అతడిని పదవి నుంచి తొలగించేందుకు పావులు కదపడం మొదలు పెట్టారు. దీనికి అమెరికా కూడా సహకరించిందనే ఆరోపణలున్నాయి.
ఇమ్రాన్ ఖాన్ నుంచి పదవి నుంచి తొలగించేందుకు అమెరికా కుట్ర పన్నిందని ఆరోపణలు వినిపించాయి. ముఖ్యంగా దౌత్య పత్రాలలీక్(సైఫర్ వివాదం) ఇటీవల వెలుగులోకి వచ్చింది. అమెరికా దౌత్యవేత్తగా పని చేసిన డొనాల్డ్ లూ, పాకిస్థాన్ రాయబారి మధ్య చర్చలు జరిగాయి. ఇమ్రాన్ ఖాన్ అవిశ్వాస తీర్మానం ఓడిపోవాలని, అతడు దిగిపోతేనే అమెరికా, పాకిస్థాన్ సంబంధాలు మెరుగుపడతాయని చర్చలు జరిగాయని విమర్శలు వినిపించాయి.
ఈ విమర్శలను అమెరికా తోసిపుచ్చింది. నాయకత్వ మార్పు విషయంలో తమకు సంబంధం లేదని అమెరికా స్పష్టం చేసింది. ఇదంతా కూడా పాకిస్థాన్ అంతర్గత వ్యవహారమని పేర్కొంది. అయితే ఇమ్రాన్ ఖాన్ పదవి కోల్పోవడానికి అమెరికానే కారణమని డ్రాస్ సైట్ అనే ఇన్వెస్టిగేటింగ్ న్యూస్ ఏజెన్సీ సైఫర్ అనే దౌత్య పత్రాన్ని వెలుగులోకి తెచ్చింది. దీనిని ‘కేబుల్ ఐ 0678’ గా గుర్తించింది. ఆరేళ్ల క్రితం అవిశ్వాసతీర్మానంలో ఓడిపోవడానికి కంటే ముందు వాషింగ్టన్ లో నాటి పాకిస్థాన్ రాయబారి అసద్ ముజీద్, అమెరికా విదేశాంగ శాఖ సీనియర్ అధికారి డొనాల్డ్ లూ కీలక చర్చలు జరిగినట్టు సమాచారం.
అప్పట్లో ఇమ్రాన్ ఖాన్ తన పదవి పోవడానికి అమెరికానే కారణమని ఆరోపించారు. దీని వెనుక పాకిస్థాన్ ముస్లిం లీగ్ ఎన్, పాకిస్థాన్ పీపుల్స్ వంటిపార్టీలు ఉన్నాయని విమర్శించారు. చివరికి డ్రాప్ సైట్ ఈ విషయాన్ని బయటపెట్టడంతో అసలు నిజం వెలుగులోకి వచ్చింది.
















ప్రెస్ మీట్ పెడితే జగన్ లో ఫ్రస్టేషన్!
Jagan Frustration: జగన్మోహన్ రెడ్డి మీడియా ముందుకు వస్తే ఏదో సంచలనం ఉంటుంది అనే రోజులు పోయాయి. ఎందుకంటే ప్రతివారం సంచలనాలు అంటే సాధ్యం కాదు కానీ. ఆయన సోషల్ మీడియాకు కావాల్సిన వార్తలను, ప్రాధాన్యత అంశాలను ఇచ్చి పోతున్నారన్న కామెంట్ ఉంది. ఈరోజు తాజాగా మీడియా ముందుకు వచ్చారు జగన్మోహన్ రెడ్డి. మొన్న ఆ మధ్యన విదేశీ పర్యటనకు వెళ్లి వచ్చారు. చాలా రోజుల గ్యాప్ తర్వాత తాడేపల్లికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు. ఏదో విశేషం ఉంటుంది అని అంతా ఆశించారు. కానీ ఆయన మాత్రం తనలో ఉన్న ఫ్రస్టేషన్ ను బయట పెట్టుకున్నారు. మరోసారి చంద్రబాబు వయస్సును గుర్తు చేసుకున్నారు. ఎంతోకాలం రాజకీయాలు చేయలేరని తనలో తాను ధైర్యం తెచ్చుకున్నట్టు ఉన్నారు. చంద్రబాబుకు గుండెపోటు వస్తే బాగుంటుందన్న అభిప్రాయంతో మాటలు చెప్పారు.
మావిగన్ పేరు చెబితే చంద్రబాబుకు గుండెపోటు..
అయితే మరిచిపోయారు అనుకున్న మావిగన్ రాజధాని గురించి మరోసారి గుర్తు చేసుకున్నారు జగన్. ఆ పేరు వింటేనే చంద్రబాబుకు గుండెపోటు వస్తుందని చెప్పారు. అయితే ఒక విషయం జగన్మోహన్ రెడ్డి మరిచారు. ఆయన ఏనాడైతే మావిగన్ అని ప్రతిపాదన చేశారో.. నాటి నుంచే విపరీతమైన ట్రోల్స్ కు గురయ్యారు. సోషల్ మీడియా కోడై కూసింది. వైసీపీ నేతలు సైతం ఆ పేరు పలికేందుకు ఇష్టపడలేదు. ఇప్పుడు అదే మావిగన్ పేరుతో చంద్రబాబు హడలెత్తిపోయారట.. ఆయనకు గుండెపోటు వచ్చినంత పనైందట.. ఇలా జగన్మోహన్ రెడ్డి చెప్పేసరికి అక్కడ ఉన్న మీడియా ప్రతినిధులు సైతం షాక్ కు గురయ్యారు.. మరోవైపు అమరావతిపై మరోసారి విషం చిమ్మె ప్రయత్నం చేశారు. అయితే అందులో ఎవరికి పెద్దగా ఆశ్చర్యం లేదు కూడా. ఎందుకంటే సాక్షిలో వచ్చిన కథనాలనే తర్వాత ప్రెస్ మీట్ లో ప్రస్తావిస్తారు జగన్. అమరావతి విషయంలో జగన్ ఏం కామెంట్స్ చేసిన జనాలు పెద్దగా పట్టించుకోరు.
శాంతి భద్రతల విషయంలో..
మరోవైపు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ లో రాష్ట్రంలో శాంతిభద్రతల విషయం ప్రస్తావనకు వచ్చింది. కడపలో పెద్ద దస్తగిరి హత్య.. నకిలీ మద్యం దందాలు.. జోగి రమేష్ పై ప్రస్తావన ఇలా అన్నింటిని టిడిపి ఖాతాలో వేసి ప్రయత్నం చేశారు జగన్. జాతరలో జరిగిన గొడవతో పెద్ద దస్తగిరి హత్యకు గురయ్యారని ఆయన భార్య చెప్పిన విషయాన్ని ఇప్పుడు జగన్ మరోసారి గుర్తు చేశారు. జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ తీరు చూస్తుంటే వైసీపీ నేతలకు సైతం మింగుడు పడడం లేదు. ప్రారంభంలో ఆహా ఓహో అన్నారు కానీ.. క్రమేపి వైసిపి నేతలు కూడా పెదవి విరుస్తున్నారు. రాజకీయ ప్రత్యర్థి మరణాన్ని కోరుకోవడం.. ఆయన వయసును ప్రస్తావించడం.. ఇంకా ఎన్నాళ్లు బతుకుతాడు లే అనే మాటలు మాత్రం జగన్మోహన్ రెడ్డి నైజాన్ని బయటపెడుతోంది. ఈ వారాంతపు ప్రెస్ మీట్ జగన్మోహన్ రెడ్డికి లాభం కంటే నష్టమే ఎక్కువగా చేకూరుస్తోంది.