Home Blog Page 244

అక్కడ కూడా తగ్గనున్న వైసీపీ బలం!

YSRCP Caste Politics
YSRCP Caste Politics

YSRCP Rajya Sabha Strength Reduction: ఏపీలో రాజ్యసభ ఎన్నికల సందడి మొదలైంది. దేశవ్యాప్తంగా పది రాష్ట్రాల నుంచి ఖాళీ అవుతున్న 24 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు నోటిఫికేషన్ వెలువడింది. జూన్ 18న పోలింగ్ జరగనుంది. అయితే ఏపీ నుంచి ఖాళీ అవుతున్న నాలుగు రాజ్యసభ స్థానాలు కూటమికి ఏకగ్రీవం అయ్యే అవకాశం ఉంది. కూటమికి ఏకపక్ష బలం ఉండడంతో.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ఛాన్స్ లేదు. ఈ నాలుగు పదవులను కూటమి పార్టీలు పంచుకోనున్నాయి. అయితే ఇప్పటివరకు రాజ్యసభలో ఏపీ నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఆధిక్యం ఉండేది. కానీ ఇప్పుడు ఆ పార్టీకి ముగ్గురు సభ్యుల బలం తగ్గనుంది. దీంతో నాలుగు స్థానాలు మాత్రమే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మిగలనన్నాయి. అదే టైంలో కూటమికి రాజ్యసభలో బలం ఏడింటికి చేరనుంది.

నాలుగుకు పడిపోనున్న బలం..
ఏపీ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం 11 మంది ఎంపీలు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ 11 మంది సభ్యులతో బలీయమైన శక్తిగా ఉండేది.. 2024 సార్వత్రిక ఎన్నికల సమయానికి ఆ పార్టీ బలం 11 మంది రాజ్యసభ సభ్యులు. సంపూర్ణ బలంతో ఉన్న ఆ పార్టీకి అప్పట్లో ఉపశమనమే. రాష్ట్రంలో శాసనమండలి, కేంద్రంలో రాజ్యసభ ద్వారా రాజకీయం చేయదలచుకుంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. అయితే ఏపీలో కూటమి వచ్చిన తర్వాత చాలామంది రాజ్యసభ సభ్యులు తమ పదవులకు రాజీనామా చేశారు. ఓ నలుగురు రాజ్యసభ సభ్యులు రాజీనామాకు.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలం ఏడుకు తగ్గిపోయింది. చివరకు పార్టీలో నెంబర్ 2 గా ఉన్న విజయసాయిరెడ్డి సైతం రాజీనామా చేశారు. మిగిలిన ఏడింటిలో ముగ్గురు సభ్యులు ఇప్పుడు పదవి విరమణ చేస్తున్నారు. దీంతో వైసిపి బలం నాలుగుకు పడిపోనుంది. అదే సమయంలో కూటమి బలం ఏడుకు చేరుకోనుంది.

రాజ్యసభ తో పాటు ఎమ్మెల్సీల బలం..
తెలుగుదేశం పార్టీ 2019 ఎన్నికల్లో ఓడిపోయింది. 23 స్థానాలకు మాత్రమే పరిమితం అయింది. దీంతో వైసిపి శాసనమండలితో పాటు రాజ్యసభలో మెజారిటీ పెంచుకుంటూ వచ్చింది. అదే రాజ్యసభ బలంతో బిజెపికి ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. అయితే ఇప్పుడు బిజెపికి రాజ్యసభలో సంపూర్ణ మెజారిటీ దక్కనుండగా.. ఏపీ నుంచి భర్తీ అయ్యే రాజ్యసభ సీట్లు కూటమి ఖాతాలో పడనున్నాయి. వైసిపి బలం తగ్గిపోయి కూటమి బలం పెరగనుంది. దీంతో జాతీయ స్థాయిలో సైతం వైసీపీ బలం తగ్గిపోతోంది. ఇది ఆ పార్టీకి కాస్త మైనస్.

బంగారం తగ్గి.. వెండి పెరిగి.. హైదరాబాద్ లో ఈరోజు ధరలివే..

Gold Price Today In Hyderabad
Gold Price Today In Hyderabad

Gold Price Today In Hyderabad: బంగారం, వెండి ధరల్లో ఈరోజు మిశ్రమ ఫలితాలు కనిపించాయి. బంగారం ధరలు తగ్గింపు కనిపించగా.. వెండి ధరలు పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్ పరిణామాలు, ద్రవ్యోల్బణ భయాలు, బలమైన డాలర్ వంటి కారణాల వల్ల పసిడి ధరలలో స్వల్ప తగ్గుదల కనిపిస్తుండగా, వెండి ధరలు మాత్రం పెరుగుదల బాటలో పయనిస్తున్నాయి. మనదేశంలో ధరల ఎలా ఉన్నాయో చూద్దాం..

బులియన్ మార్కెట్ ప్రకారం.. హైదరాబాద్ లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాములకు రూ.440 పతనమై రూ.1,59,490 వద్ద ట్రేడవుతోంది. అదేవిధంగా, ఆభరణాల తయారీలో ఎక్కువగా ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.400 తగ్గి రూ.1,46,200గా నమోదైంది. అంతర్జాతీయంగా బలహీనమైన సంకేతాలు మరియు అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపుపై ఉన్న సందిగ్ధత కారణంగా పసిడిపై ఒత్తిడి నెలకొంది.

బంగారానికి భిన్నంగా వెండి ధరల్లో మాత్రం జోరు కనిపిస్తోంది. నేడు హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.5,000 పెరిగి రూ.2,95,000కు చేరింది. పారిశ్రామిక అవసరాల కోసం పెరుగుతున్న డిమాండ్, గ్లోబల్ మార్కెట్‌లోని అస్థిరతల వల్ల వెండి ధరలు ఊగిసలాటను ప్రదర్శిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా వెండి ధరలలో కనిపిస్తున్న ఈ హెచ్చుతగ్గులు ఇన్వెస్టర్లను అప్రమత్తం చేస్తున్నాయి.

మధ్య ప్రాచ్య దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు, క్రూడ్ ఆయిల్ ధరల ప్రభావం ప్రస్తుతం బంగారం, వెండి ధరలపై ఎక్కువగా ఉంది. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు ప్రపంచ దేశాలు తీసుకుంటున్న ఆర్థిక నిర్ణయాలు బులియన్ మార్కెట్‌పై నేరుగా ప్రభావం చూపుతున్నాయి. బలమైన అమెరికా డాలర్ విలువ కూడా విలువైన లోహాల ధరల మీద ఒత్తిడిని పెంచుతోంది.

అయితే ఈ ధరలు కేవలం సూచికలు మాత్రమే. తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో జ్యువెలరీ షాపులు, మేకింగ్ ఛార్జీలు, పన్నులు మరియు ఇతర స్థానిక మార్కెట్ పరిస్థితులను బట్టి ధరల్లో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉంది. కొనుగోలు చేసే ముందు స్థానిక మార్కెట్ రేట్లను సరిచూసుకోవడం ఉత్తమం.

వయసు 22 సంవత్సరాలు.. ఐదుగురు పిల్లల.తల్లి.. మరో బాబు కావాలట

Young Mother Of Five Kids Viral Story
Young Mother Of Five Kids Viral Story

Young Mother Of Five Kids Viral Story: ఎప్పుడు జరగాల్సిన ముచ్చట అప్పుడే పూర్తి కావాలి. కానీ ఆమెకు ఆ ముచ్చట ఎటు కానీ వయసులో జరిగిపోయింది.. చూస్తుండగానే ఆమె ఐదు సార్లు తల్లి అయిపోయింది. కానీ ఇప్పుడు ఒక చిక్కు వచ్చి పడింది. దీంతో ఆమె వ్యవహారం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది.

ఆమెకు 22 సంవత్సరాలు. ఉండేది రాజస్థాన్ రాష్ట్రంలో. ఆమెకు చిన్నతనంలోనే వివాహం జరిగింది. తొలి కాన్పులో ఆడపిల్ల జన్మించింది. రెండవ కాన్పులో కూడా అమ్మాయి పుట్టింది. మూడు, నాలుగు కాన్పుల్లో కూడా ఆమెకు అమ్మాయిలు పుట్టారు.. అత్తింటి వారు వారసుడు కావాలని ఆమెకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించలేదు.. దీంతో ఐదవ కాన్పులో ఆమెకు బాబు జన్మించాడు. అయితే ఇప్పుడు అత్తింటి వారు సరికొత్త డిమాండ్ తెరపైకి తీసుకొచ్చారు. ఒక బాబు మాత్రమే వారికి సరిపోడట. వాళ్లకు ఇప్పుడు మరొక బాబు కూడా కావాలట.

ఇదే విషయాన్ని ఆసుపత్రి సిబ్బందికి చెబితే వారు ఆ గ్రహం వ్యక్తం చేశారు. ఆమె భర్త తీరు పట్ల మండిపడ్డారు..”ఆమెను బాల్య వివాహం చేసుకున్నావు. ఇప్పటికే అయిదుగురికి జన్మనిచ్చింది. 22 సంవత్సరాల వయసులో ఆమె ఐదుగురు పిల్లల తల్లి అంటే మామూలు విషయం కాదు. మరో గర్భం దాల్చితే ఆమె ఆరోగ్యానికి ప్రమాదం. దయచేసి ఇంకో బాబు కోసం ఆమె ఇబ్బంది పెట్టకూడదు.. ఇంతటితోనే దీనిని ఆపేయండి. లేకపోతే ఆమె ఆరోగ్య పరంగా అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆరవసారి గర్భం దాల్చే అవకాశాన్ని దాదాపు విరమించుకోండి” అని ఆస్పత్రి సిబ్బంది చెప్పారు.. అయితే ఆసుపత్రి సిబ్బంది చెప్పినప్పటికీ ఆ మహిళ భర్త తరపు కుటుంబం మరో వారసుడు కావాలని చెప్పడం ఇక్కడ విశేషం.

పరిపక్వత రాని వయసులో వివాహాలు చేస్తే ఆడవాళ్ళ అంతర్గత ఆరోగ్యం తీవ్రంగా ప్రభావితం అవుతుంది. అదే సమయంలో వారు పిల్లలకు జన్మనిస్తే మరింత ఇబ్బందికరమైన పరిస్థితిలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అందువల్లే ఆడపిల్లలు 21 సంవత్సరం దాటిన తర్వాతే పెళ్లి చేయాలని వైద్యులు చెబుతున్నారు. చిన్నతనంలో పెళ్లి చేస్తే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని వారు హెచ్చరిస్తున్నారు.

ఎబోలా మరో కరోనా కానుందా.. ఆందోళన రేకెత్తిస్తున్న పరిణామాలు

Ebola Outbreak Concern
Ebola Outbreak Concern

Ebola Outbreak Concern: ప్రపంచ ఆరోగ్య రంగంలో మళ్లీ ఆందోళనలు మొదలయ్యాయి. ఆఫ్రికాలోని డెమోక్రటిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ కాంగో, ఉగాండాలో కొత్త ఎబోలా విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికా ప్రభుత్వం అలర్ట్‌ అయింది. విమానాశ్రయ స్క్రీనింగ్, ప్రయాణ నిబంధనలు కఠినతరం చేసింది. ఈ చర్యలు రాబోయే రోజుల్లో ఇతర దేశాలపై కూడా ప్రభావం చూపవచ్చు.

మళ్లీ ముప్పుగా మారిత ఎబోలా?
ఇటీవలి వారాల్లో ఆఫ్రికాలోని ఇటురి ప్రావిన్స్‌లో బుండిబుగ్యో స్ట్రెయిన్‌ ఎబోలా వ్యాప్తి తీవ్రరూపం దాల్చింది. ఈ స్ట్రెయిన్‌కు ప్రస్తుతం ప్రత్యేక వ్యాక్సిన్‌ లేదు. మరణాల రేటు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ వ్యాధి ఇప్పటికే ఉగాండాలోకి కూడా వ్యాపించడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) దీన్ని అంతర్జాతీయ ప్రజా ఆరోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించింది. అమెరికాలో ఒక అమెరికన్‌ ఎబోలా బారిన పడినట్లు సమాచారం నేపథ్యంలో ట్రావెల్‌ రూల్స్‌ను కఠినతరం చేసింది. డ్రామాటిక్‌ రెస్ట్రిక్షన్లలో భాగంగా, డెమొక్రటిర్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ కాంగో, ఉగాండా, సౌత్‌ సూడాన్‌ నుంచి వచ్చే ప్రయాణికుల విమానాలను వాషింగ్టన్‌ డల్లెస్‌ ఎయిర్‌పోర్టుకు మాత్రమే మార్చి, అక్కడ విస్తృత స్క్రీనింగ్‌ చేపట్టాలని నిర్ణయించారు.

ట్రంప్‌ ప్రభుత్వం స్పందన..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఈ విషయంపై స్పందిస్తూ, ‘‘ఎబోలా ప్రస్తుతం ఆఫ్రికాకు మాత్రమే పరిమితమై ఉంది’’ అని చెప్పారు. అయితే ఆయన ప్రభుత్వం చేపట్టిన చర్యలు కేవలం స్క్రీనింగ్‌కు మాత్రమే పరిమితం కాకుండా, కొన్ని దేశాల నుంచి వచ్చే విదేశీయులకు ఎంట్రీ రెస్ట్రిక్షన్లు విధించడం వరకు విస్తరించాయి. ఈ నిర్ణయాలు సమయోచితమని ఆరోగ్య నిపుణులు ఒకవైపు చెబుతున్నా, మరోవైపు ట్రంప్‌ ప్రభుత్వం గ్లోబల్‌ హెల్త్‌ ఫండింగ్‌లను తగ్గించడం వల్ల ఆఫ్రికాలోని ఎబోలా నియంత్రణ చర్యలు బలహీనపడ్డాయని విమర్శలు వస్తున్నాయి. మెమోరియల్‌ డే వంటి ట్రావెల్‌ సీజన్‌లో ఈ నిబంధనలు అమెరికా వెళ్లే యాత్రికులకు ఇబ్బంది కలిగించవచ్చు.

ఆర్థిక ప్రభావం…
ఆఫ్రికా దేశాలతో వాణిజ్య, ప్రయాణ సంబంధాలు దెబ్బతినవచ్చు. ఎబోలా సులభంగా వ్యాపించే వ్యాధి కాకపోయినా, ఆధునిక ప్రయాణ సౌకర్యాలు ఉన్న ఈ రోజుల్లో జాగ్రత్త అవసరం.అమెరికా తీసుకున్న చర్యలు ఇతర దేశాలకు హెచ్చరికగా మారి, ప్రపంచవ్యాప్తంగా స్క్రీనింగ్‌ వ్యవస్థలను బలోపేతం చేయడానికి దోహదపడవచ్చు.

జాగ్రత్తతోపాటు సహకారం కావాలిఅమెరికా చేపట్టిన ఈ కఠిన చర్యలు స్వల్పకాలిక రక్షణకు మంచివే అయినా, దీర్ఘకాలిక పరిష్కారం ఆఫ్రికాలోని ఆరోగ్య వ్యవస్థలను బలపరచడంలో ఉంది. ఎబోలా వంటి అంటువ్యాధులు ఏ దేశానికీ సరిహద్దులు గౌరవించవు. కాబట్టి అమెరికా, యూరప్, ఆసియా దేశాలు కలిసి ఆఫ్రికాకు సాంకేతిక, ఆర్థిక సహాయం అందించడం ద్వారా మాత్రమే నియంత్రణ సాధ్యమవుతుంది. ప్రస్తుతం ప్రపంచం మళ్లీ ఒకసారి జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది. భయపడకుండా, సమాచారం ఆధారంగా చర్యలు తీసుకోవడం ఇప్పటి అవసరం.

 

View this post on Instagram

 

A post shared by WION (@wionews)

తెలుగులో లోకేష్ కనకరాజ్ ఫేవరేట్ హీరో అతనేనా..?

Lokesh Kanagaraj Favorite Hero
Lokesh Kanagaraj Favorite Hero

Lokesh Kanagaraj Favorite Hero: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్న దర్శకుడు లోకేష్ కనకరాజు… ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. గత సంవత్సరం ఆయన రజనీకాంత్ తో చేసిన కూలీ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించకపోయిన కూడా ఆయన ఇమేజ్ మాత్రం తగ్గలేదు. కారణమేంటంటే ముందుగానే ఆయన భారీ మార్కెట్ ను కలిగివున్నాడు. కాబట్టి ప్రస్తుతం అదే మార్కెట్ ను కొనసాగిస్తున్నాడు. ఇక ఈ క్రమంలోనే ఇప్పుడు ఆయన అల్లు అర్జున్ తో ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా వచ్చింది. అయితే ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది నుంచి జరగబోతున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఆ మూవీ కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉన్న లోకేష్ కనకరాజు తన తదుపరి సినిమా విషయంలో కూడా చాలా కేర్ ఫుల్ గా వ్యవహరిస్తున్నాడు. అయితే తెలుగు సినిమా ఇండస్ట్రీలో లోకేష్ కనకరాజ్ కి బాగా నచ్చిన హీరో ఎవరు అంటు సోషల్ మీడియాలో కొన్ని వార్తలైతే వైరల్ అవుతున్నాయి.

ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం లోకేష్ కనకరాజు ప్రభాస్ కి వీరాభిమాని అనే విషయం తెలుస్తుంది. ప్రభాస్ సినిమాలన్ని చూస్తూ ఉంటాడట. అందువల్లే అతనితో సినిమా చేయడానికి కూడా సన్నాహాలు చేసుకున్నప్పటికి ప్రభాస్ బిజీగా ఉండటం వల్ల వర్కౌట్ కాలేదు.

ఫ్యూచర్ లో వీళ్ళిద్దరి కాంబినేషన్ లో సినిమా తప్పకుండా వస్తుందంటూ అటు ప్రభాస్ అభిమానులు, ఇటు లోకేష్ కనకరాజ్ ఫ్యాన్స్ సైతం కాన్ఫిడెంట్ ను వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇప్పటివరకు లోకేష్ కనకరాజు చేసిన సినిమాల్లో విక్రమ్ మూవీ భారీ విజయాన్ని సాధించింది. కార్తీ తో చేసిన ‘ఖైదీ’ సినిమా కూడా ప్రేక్షకులను విశేషంగా అలరించింది.

నిజానికి ఆ సినిమాతోనే పెను ఒక యూనివర్స్ ను క్రియేట్ చేయాలనే ఆలోచన లోకేష్ కనకరాజ్ కు రావడం దాన్ని చాలామంది దర్శకులు ఫాలో అవుతూ ముందుకు సాగడం అనేది మనం రెగ్యులర్ గా చూస్తూనే ఉన్నాం… ఇక లోకేష్ కనకరాజ్ అల్లు అర్జున్ ను ఏ క్యారెక్టర్ లో చూపిస్తాడు. ఎలాంటి ఎలివేషన్స్ ను ఇస్తాడు. తన ఇమేజ్ ని పెంచేలా సినిమా చేస్తాడా లేదా అనే ధోరణిలో కూడా కొన్ని అనుమానులైతే వ్యక్తమవుతున్నాయి…

సలార్ 2.. అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్...

Salaar 2
Salaar 2

Salaar 2 Update: ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సలార్’ సినిమా భారీ విజయాన్ని సాధించింది. ఇక ఈ మూవీ చివర్లో సీక్వెల్ ఉంటుందని అనౌన్స్ చేశారు. కానీ ప్రశాంత్ నీల్ ఇప్పుడు ఎన్టీఆర్ తో డ్రాగన్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది జూన్ లో రిలీజ్ కి రెడీ అవుతుంది. ఇక ఇలాంటి క్రమంలోనే ఇప్పుడు ప్రశాంత్ నీల్ ఈ సినిమా పూర్తి అయిన తర్వాత ప్రభాస్ తో సలార్ 2 సినిమా ను తెరకెక్కిస్తానని చెబుతున్నాడు. సలార్ 2 స్క్రిప్ట్ మొత్తం రెడీ అయిపోయినట్టుగా కూడా ఆయన గతంలోనే క్లారిటీ ఇచ్చాడు. ఈ సినిమాతో ప్రభాస్ ను టాప్ లెవల్లో చూపిస్తానని కూడా చెబుతుండడం విశేషం… ఇక కేజిఎఫ్ 3 సినిమా ఎప్పుడు వస్తుందనే విషయం తనకి కూడా తెలియదని చెప్పాడు. ఎందుకంటే దాని మీద ఇంకా వర్క్ అయితే స్టార్ట్ చేయలేదట. ప్రస్తుతానికి ఆయన ‘సలార్ 2’ సినిమాను చేసిన తర్వాత దాని గురించి ఆలోచించే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇప్పుడు మాత్రం జూనియర్ ఎన్టీఆర్ తో చేస్తున్న డ్రాగన్ సినిమాని నెక్స్ట్ లెవెల్ సక్సెస్ గా నిలపాలని చూస్తున్నాడు.

ఇక సిజిఐ వాడకుండా హీరో బాడీని చూపించాలనే ఉద్దేశంతోనే ఎన్టీఆర్ బాడీ ఫిట్ అయ్యేవరకు లేట్ చేశాం అంటూ కరణ చెప్పారు. నిజానికి తన బాడీని ఆ లెవల్లో మార్చడానికి ఎన్టీఆర్ తీవ్రమైన ఇబ్బందులు పడ్డాడని ఫైనల్ గా తను అనుకున్న లుక్ తీసుకురాగలిగానని చెప్పాడు.

ఈ మూవీ లో కొత్త ఎన్టీఆర్ ని చూడబోతున్నారు అంటూ ఆయన కామెంట్లు చేస్తుండటం విశేషం… డ్రాగన్ మూవీ దేశం కోసం ఉంటుందట. ఇందులో దేశభక్తి కూడా ఉంటుందని ప్రశాంత్ నీల్ చెబుతుండటం విశేషం…హీరో ఈ మూవీలో ఎవరిని ఎదిరిస్తాడు. ఎంత మంది పోటీ యుద్ధం చేయాల్సి వస్తుంది. అందులో హీరో క్యారెక్టర్ ఏంటి అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే… జూనియర్ ఎన్టీఆర్ సైతం ఈ సినిమా మీద భారీ ఆశలైతే పెట్టుకున్నాడు.

ఇంతకుముందు ఆయన చేసిన ‘వార్ 2’ సినిమా విజయాన్ని సాధించకపోవడంతో ఆయన తీవ్రంగా నిరాశచెందాడు. కాబట్టి ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కి భారీగా సక్సెస్ ని కట్టబెట్టి తన ఇమేజ్ ను రెట్టింపు చేయాలని చూస్తున్నాడు…ఇక ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన గ్లింప్స్ సైతం ప్రేక్షకుడిని విశేషంగా అలరించింది..

అందాల కామాక్షిని చూడతరమా?

Kamakshi Bhaskarla latest photos
Kamakshi Bhaskarla latest photos

పాపం బుచ్చిబాబు.. ముంబైలో ప్రెస్ మీట్ లో అడ్డంగా బుక్కయ్యాడు...వైరల్ వీడియో...

Buchi Babu Next Movie
Buchi Babu Next Movie

Buchi Babu Viral Video: తెలుగు సినిమా ఇండస్ట్రీ ఎల్లలు దాటి ముందుకు దూసుకెళ్తుంది. ఇక మన దర్శకులు సైతం ఇతర భాషల్లో సినిమాలను చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. మన దర్శకులు చేస్తున్న సినిమాలు యావత్ ప్రేక్షక లోకాన్ని మెప్పించడం అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అందువల్లే మన దర్శకులతో సినిమాలు చేయడానికి ఇతర భాషల హీరోలు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ మన దర్శకులు కొంతమందికి లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల కూడా ఇతర భాషల్లో సినిమాలు చేయలేకపోతున్నారనే వార్తలు వస్తున్నాయి. లాంగ్వేజ్ ప్రాబ్లం ఉన్నంత మాత్రాన సినిమాలు చేయకుండా ఉండటం అనేది ఏమి ఉండదు. ఎందుకంటే లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటే ట్రాన్స్లేట్ చేసేవాళ్లను పెట్టుకుని సినిమాని చేయడం పెద్ద ప్రాబ్లం కాదు. కానీ కొన్ని సందర్భాల్లో లాంగ్వేజ్ రాకపోవడం చాలా ఇబ్బందిని కలిగిస్తుందనే విషయం మనకు రీసెంట్ గా బుచ్చిబాబు ని చూస్తే అర్థమవుతుంది.

పెద్ది సినిమా గ్లింప్స్ రిలీజ్ లో భాగంగా ముంబైలో ఒక ఈవెంట్ ను కండక్ట్ చేశారు. అక్కడ బుచ్చిబాబును ఇంగ్లీషులో కొన్ని క్వశ్చన్స్ అడిగితే ఆయన దానికి సమాధానం చెప్పలేకపోయాడు. తెలుగుకి మాత్రమే ప్రిఫరెన్స్ ఇస్తున్నాను అంటూ చెప్పడం అక్కడ ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేసింది.

ఇక ఎవరో అడిగిన ఒక ప్రశ్నకి సమాధానం చెప్పలేక ఆయన ‘దిస్ ఇస్ ఆల్సో తెలుగు’ అని చెప్పడం వల్ల అక్కడున్న వాళ్ళందరు నవ్వుకున్నారు. ఇక ఏది ఏమైనా కూడా బుచ్చిబాబు కి చాలా టాలెంట్ ఉన్నప్పటికి లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల తను ఎక్కువగా మాట్లాడలేకపోయాడు అంటూ కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే సినిమా తీసే కెపాసిటి ఉంటే సరిపోతుంది.

లాంగ్వేజ్ ఏముంది అది రాకపోయినా పెద్దగా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏమీ లేదు అంటూ మరి కొంతమంది కామెంట్స్ చేస్తుండటం విశేషం… ఇక బుచ్చిబాబు డైరెక్షన్ లో తెరకెక్కిన పెద్ది సినిమా భారీ విజయాన్ని సాధిస్తుందని రామ్ చరణ్ ఇమేజ్ ను సైతం పెంచుతుందని మేకర్స్ చాలా కాన్ఫిడెంట్ ను వ్యక్తం చేస్తున్నారు…

ఇవి కలిపి తింటే నిజంగానే సమస్యలా.. అసలు నిజం ఏంటీ..

Food Combinations Myths
Food Combinations Myths

Food Combinations Myths: మన ఇంట్లో పెద్దలు కొన్ని ఆహార పదార్థాలను కలిసి తినొద్దని చెబుతుంటారు. ఇవి కలిపి తింటే విషం అవుతుంది , కడుపు పాడవుతుంది అంటూ హెచ్చరిస్తుంటారు. అయితే వీటిలో కొన్ని నిజాలు ఉన్నా.. మరికొన్ని కేవలం అపోహలే. కానీ కొన్ని ఆహార కలయికలు జీర్ణ సమస్యలు, అసౌకర్యం లేదా అలర్జీకి కారణమయ్యే అవకాశం ఉందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అలాంటి సమస్యలు వచ్చే ఆహార పదార్థాలు ఏవో చూద్దాం..

కాకరకాయ – పాలు
కాకరకాయలో చేదు గుణాలు ఎక్కువగా ఉంటాయి. పాలు మాత్రం శీతల స్వభావం కలిగినవి. ఈ రెండింటిని ఒకేసారి తీసుకుంటే కొందరిలో జీర్ణక్రియ మందగించడం, కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్యలు రావచ్చు. ఆయుర్వేదం ప్రకారం.. ఈ కలయిక వల్ల చర్మ అలర్జీలు లేదా అజీర్ణం వచ్చే అవకాశం ఉందని చెబుతారు. అయితే ఇది ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా జరుగుతుందని శాస్త్రీయ ఆధారాలు లేవు.

పెరుగు – దోసకాయ
దోసకాయ, పెరుగు రెండూ చల్లదనాన్ని ఇచ్చే ఆహారాలు. సాధారణంగా రైతా రూపంలో వీటిని చాలామంది తింటారు. ఎక్కువ మందికి ఎలాంటి సమస్య ఉండదు. కానీ జీర్ణశక్తి బలహీనంగా ఉన్నవారిలో చల్లదనం అధికమై కఫం, జలుబు, కడుపు బరువు వంటి సమస్యలు రావచ్చు. రాత్రి సమయంలో ఈ కలయికను అధికంగా తీసుకోవడం కొందరికి అసౌకర్యం కలిగిస్తుంది.

పుచ్చకాయ తిన్న తరువాత నీళ్లు తాగడం:
పుచ్చకాయలో సహజంగానే నీటి శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. దీన్ని తిన్న వెంటనే ఎక్కువగా నీళ్లు తాగితే జీర్ణరసాలు పలుచబడే అవకాశం ఉందని చెబుతారు. దీని వల్ల కడుపు ఉబ్బరం, అజీర్ణం లేదా అసౌకర్యం కలగొచ్చు. ముఖ్యంగా చిన్నపిల్లలు లేదా సున్నితమైన జీర్ణవ్యవస్థ ఉన్నవారు కొంత జాగ్రత్తగా ఉండటం మంచిది.

టీ లేదా కాఫీతో సమోసా
సమోసాలో నూనె, మసాలాలు అధికంగా ఉంటాయి. టీ లేదా కాఫీలో కేఫిన్ ఉంటుంది. ఈ కలయికను తరచుగా తీసుకుంటే ఆమ్లత్వం (అసిడిటీ), గ్యాస్, అజీర్ణం సమస్యలు రావచ్చు. అలాగే డీప్ ఫ్రైడ్ ఆహారం మరియు కేఫిన్ కలిసి జీర్ణవ్యవస్థపై ఒత్తిడి పెంచుతాయని నిపుణులు చెబుతున్నారు. ఖాళీ కడుపుతో ఈ కాంబినేషన్ తీసుకోవడం మరింత ఇబ్బందులు కలిగించవచ్చు.

చేపలు – పెరుగు
చేపలు మరియు పెరుగు కలిపి తింటే చర్మంపై తెల్ల మచ్చలు వస్తాయని చాలామంది నమ్ముతారు. కానీ దీనికి స్పష్టమైన శాస్త్రీయ ఆధారాలు లేవు. అయితే చేపలు ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారం. పెరుగు కూడా ప్రోటీన్, కొవ్వు కలిగిన పదార్థం కావడంతో కొందరిలో అజీర్ణం, గ్యాస్ లేదా అలర్జీ లక్షణాలు కనిపించవచ్చు. సముద్ర ఆహారాలకు అలర్జీ ఉన్నవారు మాత్రం ఈ కలయిక విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

జామకాయ – నీళ్లు
జామకాయ తిన్న వెంటనే చల్లని నీళ్లు తాగితే కడుపు నొప్పి వస్తుందని పెద్దలు చెబుతుంటారు. జామలో ఫైబర్ అధికంగా ఉంటుంది. వెంటనే ఎక్కువ నీళ్లు తాగితే కొందరిలో జీర్ణక్రియలో మార్పులు జరిగి కడుపు ఉబ్బరం లేదా నొప్పి రావచ్చు. అయితే పూర్తిగా పండని జామకాయలతో ఈ సమస్య ఎక్కువగా ఉండొచ్చు.

అసలు జాగ్రత్త ఏంటి?
ఆహార కలయికల వల్ల వచ్చే ప్రభావం ప్రతి ఒక్కరి శరీర నిర్మాణం, జీర్ణశక్తి, అలర్జీలు, తీసుకునే పరిమాణం మీద ఆధారపడి ఉంటుంది. ఒకరికి ఇబ్బంది కలిగించే ఆహారం మరొకరికి ఎలాంటి సమస్య ఇవ్వకపోవచ్చు. కాబట్టి శరీరానికి ఏది సరిపోతుందో గమనించడం ముఖ్యం. తరచుగా అసౌకర్యం కలిగితే వైద్యుడు లేదా పోషకాహార నిపుణుడిని సంప్రదించడం మంచిది.

గేమ్ ఆడేవారి కోసం Lenovo నుంచి కొత్త డివైజ్..

Lenovo Legion Y960 Headset
Lenovo Legion Y960 Headset

Lenovo Legion Y960 Headset: ఎలక్ట్రానిక్ విభాగంలో Lenovo కంపెనీ తనదైన ముద్ర వేసుకుంది. వినియోగదారులను ఆకర్షించేందుకు విభిన్న రీతిలో డివైజ్ లను తీసుకువస్తూ ఉంటుంది. ఇందులో భాగంగా గేమర్స్ కోసం ‘లీజియన్’ (Legion)అనే హెడ్‌సెట్‌ను తాజాగా మార్కెట్లోకి తీసుకువచ్చింది. మంచి సౌండింగ్ లో ఉండే ఈ డివైజ్ తో మంచి అనభూతిని పొందుతారు. దీని ధర, ఇతర వివరాల్లోకి వెళితె..

Lenovo నుంచి Legion Y960 అనే హెడ్‌సెట్ ఇటీవల చైనాలో విడుదలైంది. దీని ధర సుమారు 599 చైనీస్ యువాన్లు (భారత కరెన్సీలో సుమారు రూ.7,100). ఇది బ్లాక్ మరియు సిల్వర్ రంగులలో లభిస్తుంది. గేమింగ్ ఆడేవారికి ఇది బాగా యూజ్ ఫుల్ గా ఉంటుంది. ఇది అత్యాధునిక ఆడియో అనుభవాన్ని అందించడానికి సిద్ధంగా ఉంది.

ఈ హెడ్‌సెట్ లో ప్రధాన ఆకర్షణ ఇందులో ఉండే ‘ఫిజికల్ 7.1 ఛానెల్ సరౌండ్ సౌండ్’ సిస్టమ్. ఇందులో ప్రతి ఇయర్‌కప్‌లో రెండు 40mm డ్రైవర్లు, నాలుగు 20mm డ్రైవర్లు కలిపి మొత్తం ఆరు డ్రైవర్ల సెటప్‌ను ఉపయోగించారు. దీనివల్ల గేమ్ ఆడుతున్నప్పుడు శబ్దాలు ఏ దిశ నుంచి వస్తున్నాయో చాలా స్పష్టంగా తెలుస్తుంది. ముఖ్యంగా షూటింగ్ గేమ్స్‌లో శత్రువుల అడుగుజాడలు, కాల్పుల శబ్దాలను కచ్చితంగా గుర్తించవచ్చు.

ఈ హెడ్‌సెట్ ‘హై-రెస్ ఆడియో’ (Hi-Res Audio) సర్టిఫికేషన్ పొందింది. 20Hz నుంచి 40kHz ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ రేంజ్‌తో, టైటానియం కోటెడ్ డయాఫ్రమ్స్ అమర్చడం వల్ల ఆడియో చాలా స్పష్టంగా ఉంటుంది. అలాగే, ‘సౌండ్ ప్రింట్ పర్స్‌పెక్టివ్’ అనే ఫీచర్ గేమింగ్‌లో అవసరమైన సౌండ్స్ న హైలైట్ చేస్తుంది. దీనికి ఉన్న ఇన్‌లైన్ కంట్రోలర్ ద్వారా సాఫ్ట్‌వేర్ అవసరం లేకుండానే గేమ్, మ్యూజిక్, మరియు సినిమా మోడ్స్‌ను మార్చుకోవచ్చు.

వాయిస్ చాట్ కోసం ఇందులో ఏఐ (AI) నాయిస్ క్యాన్సిలేషన్ సపోర్ట్ ఉన్న డిటాచబుల్ మైక్రోఫోన్ ఉంది. ఇది అనవసరపు శబ్దాలను తొలగించి, మీ వాయిస్‌ను అవతలి వారికి స్పష్టంగా వినిపిస్తుంది. కనెక్టివిటీ విషయానికి వస్తే, ఇది వైర్డ్ హెడ్‌సెట్. యూఎస్‌బీ టైప్-సీ మరియు టైప్-ఏ కనెక్టివిటీతో పిసి (PC), కన్సోల్స్, గేమింగ్ డివైజ్‌లకు సులభంగా కనెక్ట్ చేసుకోవచ్చు. అలాగే, దీనికి 16 మిలియన్ రంగులతో కూడిన ఆకర్షణీయమైన ఆర్జీబీ (RGB) లైటింగ్ ఉంది. ఈ హెడ్‌సెట్ గేమర్లకు, ప్రొఫెషనల్ స్థాయి ఆడియో అనుభవాన్ని అందించేందుకు రూపొందించారు.

వ్యాపారుల కోసం Microsoft నుంచి Surface for Business లాంచ్.. ధర ఎంతంటే..

Microsoft Surface For Business 2026
Microsoft Surface For Business 2026

Microsoft Surface For Business 2026: బిజినెస్ చేసేవారికి మైక్రోసాఫ్ట్ కొత్తగా Surface for Business (2026) అనే ల్యాప్ టాప్ ను లాంచ్ చేసింది. ఈ లైనప్‌లో Surface Pro for Business, Surface Laptop for Business మోడళ్లతో పాటు కొన్ని కాన్ఫిగరేషన్లలో Intel Core Ultra X7 వరకు ఆప్షన్ ఇస్తోంది, ముఖ్యంగా AI పనితీరు, ప్రొడక్టివిటీ కోసం వీటిని రూపొందించారు. దీంతో ఆప్ గ్రేడ్ ల్యాప్ టాప్ కోసం ఎదురుచూసేవారికి ఇది బాగా ఉపయోగపడుతుందని కంపెనీ ప్రతినిధులు పేర్కొంటున్నారు. ఇందులో ఉండే ఫీచర్స్ ఏంటో చూద్దాం..

మైక్రోసాఫ్ట్ గతంలో బిజినెస్ Surface డివైజ్ ల గురించి ప్రకటించింది. ఇందులో భాగంగా కొత్తగా లాంచ్ చేసిన సిరీస్‌లో Intel Core Ultra Series 3 ప్రాసెసర్లతో పాటు ఎంపిక చేసిన మోడళ్లలో Intel Core Ultra X7 అప్ గ్రేడ్ ఆప్షన్ ఉంది. ఈ కొత్త ల్యాప్ టాప్ లు బిజినెస్ యూజర్లు, మల్టీటాస్కింగ్, ఆన్ డివైస్ AI ఉపయోగించేవారి కోసం తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.

కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం.. Surface for Business (2026) ధరలు మోడల్‌ను బట్టి మారుతున్నాయి. 13 అంగుళాల డిస్ ప్లేతో కలిగిన Surface Laptop 1,499 డాలర్ల నుంచి ప్రారంభమవుతోంది. 3.8 అంగుళాలు, 15 అంగుళాల మోడళ్లు 1,949.99 డాలర్లతో విక్రయించే అవకాశం ఉంది. భారతదేశంలో కూడా ఈ సిరీస్‌కు సంబంధించిన లిస్టింగ్‌లు కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడ మార్కెట్‌ను బట్టి ధరలు మారే అవకాశం ఉంది.

ఈ కొత్త Surface for Business మోడళ్లలో 13, 13.8, 15 అంగుళాల స్క్రీన్ ఆప్షన్లు ఉన్నాయి. మొదటి వేరియంట్ Laptop 16GB నుంచి 24GB వరకు ర్యామ్ సపోర్టు చేస్తుంది. ఇవి కొన్ని మార్కెట్లలో అందుబాటులో ఉన్నాయి. అయితే ఆ తర్వాత 8GB వెర్షన్ కూడా రావచ్చు. వీటిల్లో Wi‑Fi 7, ఆన్-డివైస్ AI సామర్థ్యంతో పాటు కొన్ని మోడళ్లలో 5G కనెక్టివిటీ కూడా ఉన్నాయి. 13 అంగళాల మోడల్ లో 1,920 x 1,280 పిక్సెల్స్ డిస్‌ప్లే ఉండగా.. ఇది టచ్‌స్క్రీన్ తో పనిచేస్తుంది. ఈ ల్యాప్ టాప్ ఏదైనా సుమారు 1.24 kg బరువు ఉన్నట్లు చూపిస్తన్నారు.

Motorola Edge 70 Pro రివ్యూ.. ఇది ఎవరికి బాగా అవసరం..

Motorola Edge 70 Pro Review
Motorola Edge 70 Pro Review

Motorola Edge 70 Pro Review: ప్రముఖ మొబైల్ కంపెనీ Motorola తన ‘ఎడ్జ్’ సిరీస్‌లో భాగంగా ఇటీవల Motorola Edge 70 Pro తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ మొబైల్ ప్రీమియం డిజైన్ తో పాటు శక్తివంతమైన ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకుంటోంది. దీని గురించి పూర్తి వివరాల్లో కి వెళితె..

Motorola Edge 70 Pro స్మార్ట్‌ఫోన్ అత్యంత సన్నగా 6.99mm మందంతో ఆకర్షణీయమైన క్వాడ్-కర్వ్డ్ డిజైన్‌తో తయారు చేశారు. ఇది కేవలం 190 గ్రాముల బరువు కలిగి ఉండి, చేతిలో పట్టుకోవడానికి చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. ఇందులో 6.78-అంగుళాల ‘ఎక్స్‌ట్రీమ్’ AMOLED డిస్‌ప్లేను అందించారు. ఇది 144Hz రిఫ్రెష్ రేట్ తో పనిచేస్తూ.. 1.5K రిజల్యూషన్ ను అందిస్తుంది. అలాగే 5,200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో పనిచేయడం వల్ల ఎండలో కూడా స్క్రీన్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే, ఇది IP68 లేదా IP69 రేటింగ్ ఉండడంతో వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ నుంచి రక్షణ పొందవచ్చు.

ఈ ఫోన్ శక్తివంతమైన ‘మీడియాటెక్ డైమెన్సిటీ 8500 ఎక్స్‌ట్రీమ్’ చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. దీంతో వేగంగా పనులు చేసేవారికి బాగా ఉపయోగపడుతుంది. అలాగే మల్టీ టాస్కింగ్ కోసం ఇందులో 12GB వరకు LPDDR5X RAM సెటప్ చేశారు. అలాగే స్టోరేజ్ కోసం 256GB నుంచి 512GB UFS 4.1 ఆప్షన్లు ఉన్నాయి. ఇది లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది. దీనివల్ల సాఫ్ట్‌వేర్ అనుభవం చాలా స్మూత్‌గా ఉంటుంది.

ఫొటోగ్రఫీ ప్రియుల కోసం ఈ ఫోన్‌లో ట్రిపుల్ కెమెరా సెటప్ చేశారు. ఇందులో 50MP సోనీ LYTIA 710 మెయిన్ సెన్సార్ (OISతో), 50MP అల్ట్రా-వైడ్ లెన్స్ మరియు 3.5x ఆప్టికల్ జూమ్ సామర్థ్యం ఉన్న 50MP పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీల కోసం ముందు భాగంలో కూడా 50MP కెమెరాను అందించారు. ఈ స్మార్ట్‌ఫోన్ 6,500mAh సామర్థ్యం గల భారీ సిలికాన్ కార్బన్ బ్యాటరీని కలిగి ఉంది, ఇది సాధారణ వాడకంతో రోజంతా సులభంగా వస్తుంది. ఈ బ్యాటరీ 90W టర్బోపవర్ వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండటంతో ఫోన్ చాలా వేగంగా ఛార్జ్ అవుతుంది. అదనంగా, ఇది 15W వైర్‌లెస్ ఛార్జింగ్ మరియు రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కూడా కలిగి ఉంది.

భారత మార్కెట్లో మోటరోలా ఎడ్జ్ 70 ప్రో ధర వేరియంట్‌ను బట్టి సుమారు రూ. 38,999 నుంచి ప్రారంభమవుతుంది. 8GB/256GB వేరియంట్ ₹38,999 ఉండగా, 12GB/256GB వేరియంట్ ధర సుమారు ₹41,999గా ఉంది. ప్రీమియం లుక్, మంచి డిస్‌ప్లే, మరియు సుదీర్ఘ బ్యాటరీ లైఫ్ కోరుకునే వారికి ఇది ఒక గొప్ప ఎంపికగా నిలుస్తుంది. స్లిమ్ డిజైన్, అద్భుతమైన బ్యాటరీ లైఫ్ మరియు స్మూత్ డిస్‌ప్లే కోరుకునే వారికి ఇది ఒక గొప్ప ఎంపిక.

మహిళలకు గొప్ప శుభవార్త చెప్పిన రేవంత్ రెడ్డి

CM Revanth Reddy
CM Revanth Reddy

CM Revanth Reddy: తెలంగాణ ప్రభుత్వం మహిళలకు గొప్ప శుభవార్త చెప్పింది. అంతేకాదు త్వరలోనే ఇది అమల్లోకి వస్తుందని ప్రకటించింది. దీంతో ఆశావాహుల్లో సందడి నెలకొంది. అయితే ప్రభుత్వం చెప్పిన గుడ్ న్యూస్ నామినేటెడ్ పోస్టుల భర్తీకి సంబంధించింది కాదు.. మహిళ రుణాలకు సంబంధించింది అంతకంటే కాదు..

రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికే మహిళలకు మహాలక్ష్మి.. వడ్డీ లేని రుణాలు.. ఇతర సదుపాయాలను కల్పిస్తోంది. తాజాగా మహిళల విషయంలో మరొక అడుగు ముందుకేసింది. ముఖ్యంగా స్త్రీ శిశు సంక్షేమ శాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసేందుకు రేవంత్ ప్రభుత్వం సిద్ధమైంది.. ఈ క్రమంలోనే రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ మహిళలకు శుభవార్త చెప్పింది. అంగన్వాడి కేంద్రాలలో ఖాళీగా ఉన్న 15,982 పోస్టులను ఈ ఏడాదిలోగా భర్తీ చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ నియామక ప్రక్రియ జరుగుతుంది. త్వరలోనే జిల్లాల వారీగా నోటిఫికేషన్లు విడుదలయ్యే అవకాశం ఉంది. ఇందులో హెల్పర్ పోస్ట్లు 12,882 ఉన్నాయి. టీచర్ పోస్టులు మూడువేల ఒక వంద వరకు ఉన్నాయి. హెల్పర్ పోస్ట్ లకు 10.. టీచర్ ఉద్యోగాలకు ఇంటర్ విద్యను కనీస ఉత్తీర్ణతగా నిర్ణయించారు.

స్త్రీ శిశు సంక్షేమ శాఖలో కొన్నాళ్లుగా పోస్టుల భర్తీ ప్రక్రియ ఆగిపోయింది. ఈ నేపథ్యంలో అంగన్వాడీ కేంద్రాల పనితీరు దారుణంగా మారింది. ప్రభుత్వం కొంతకాలంగా స్త్రీ శిశు సంక్షేమ శాఖను ప్రక్షాళన చేస్తోంది. ఇందులో భాగంగా అంగన్వాడికి భాగంలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆర్థిక శాఖ కూడా దీనికి ఆమోదం తెలిపింది. దీంతో త్వరలోనే ఈ పోస్టుల భర్తీ ప్రక్రియ జరుగుతుందని తెలుస్తోంది. కలెక్టర్ ఆధ్వర్యంలోనే నియామక ప్రక్రియ మొత్తం పూర్తవుతుంది.. ఆ తర్వాత వెంటనే కొత్త ఉద్యోగులు విధుల్లో చేరుతారు. పైగా జనాభా పెరిగిన నేపథ్యంలో చాలావరకు కొత్త అంగన్వాడీ సెంటర్లను ఏర్పాటు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. కొత్త గ్రామపంచాయతీలు ఏర్పడిన నేపథ్యంలో.. వాటికి తగ్గట్టుగా అంగన్వాడి కేంద్రాలను ఏర్పాటు చేసే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

అంగన్వాడి కేంద్రాల్లో చిన్నపిల్లలకు ఇప్పటికే ప్రభుత్వం పౌష్టికాహారం అందిస్తోంది. కేంద్రం సహకారంతో చిన్నపిల్లలకు గుడ్లు.. ఇతర బలవర్ధకమైన ఆహార పదార్థాలను సరఫరా చేస్తోంది. గర్భిణులకు కూడా పాలు.. గుడ్లు.. కందిపప్పు.. అందజేస్తోంది..

బెంగళూరు మీద గెలవడమే కాదు.. ఈ సమీకరణాలు సాధ్యమైతేనే సన్ రైజర్స్ కు రెండో స్థానం..

SRH Vs RCB
SRH Vs RCB

SRH Vs RCB: ఐపీఎల్ గ్రూప్ దశ సమరం ముగింపునకు వచ్చింది. ప్లే ఆఫ్ లోకి బెంగళూరు, గుజరాత్, హైదరాబాద్ వెళ్ళిపోయాయి. నాలుగు స్థానం కోసం కోల్కతా, రాజస్థాన్ పోటీ పడుతున్నాయి. రాజస్థాన్ కాస్త ముందంజలో ఉన్నప్పటికీ.. తదుపరి మ్యాచ్లో గెలిస్తేనే ఆ జట్టుకు ప్లే ఆఫ్ వెళ్లడానికి అవకాశం ఉంటుంది. కోల్కతా కూడా వరుస విజయాలు సాధిస్తోంది కాబట్టి.. ప్లే ఆఫ్ వెళ్ళే అవకాశాలు ఆ జట్టుకు ఉన్నాయి. తదుపరి మ్యాచ్ లు గెలవడం మాత్రమే కాకుండా.. రాజస్థాన్ జట్టు ఓడిపోతే ఆ జట్టుకు లైన్ క్లియర్ అవుతుంది.

ప్లే ఆఫ్ వెళ్లిన జట్లలో హైదరాబాద్ కూడా ఉంది. హైదరాబాద్ జట్టు లీగ్ దశలో తన చివరి మ్యాచ్ శుక్రవారం బెంగళూరు తో ఆడుతోంది. ఈ మ్యాచ్ లో కనుక హైదరాబాద్ విజయం సాధిస్తే జట్టు ఖాతాలో 18 పాయింట్లు ఉంటాయి. ఫలితంగా బెంగళూరు, గుజరాత్ జట్లతో హైదరాబాద్ సమానంగా నిలుస్తుంది. ఈ మ్యాచ్లో ఓడిపోయినంత మాత్రాన బెంగళూరుకు పెద్దగా ఇబ్బంది ఉండదు. ఎందుకంటే ఆ జట్టు ఖాతాలో నెట్ రన్ రేట్ 1.065 ఉంది. గుజరాత్ జట్టు ఖాతాలో కూడా నెట్ రన్ రేట్ 0.695 ఉంది. గుజరాత్ ను పక్కనపెట్టి రెండవ స్థానంలోకి హైదరాబాద్ వెళ్లాలంటే కచ్చితంగా విజయం మాత్రమే కాకుండా. అంతకుమించి అనే స్థాయిలో గెలుపును దక్కించుకోవాలి.

శుక్రవారం బెంగళూరులో జరిగే మ్యాచ్లో హైదరాబాద్ ముందుగా బ్యాటింగ్ చేసి 220 పరుగులు సాధించాలి. అంతేకాదు 88 పరుగుల వ్యత్యాసంతో బెంగళూరు మీద గెలుపును దక్కించుకోవాలి. ఒకవేళ టార్గెట్ ఫినిష్ చేసే క్రమంలో.. బెంగళూరు కనక 150 పరుగుల లక్ష్యాన్ని విధిస్తే.. దానిని 11.1 నుంచి 11.3 ఓవర్లలో పూర్తి చేయాలి. అప్పుడే హైదరాబాద్ జట్టు నెట్ రన్ రేట్ పెరుగుతుంది. తద్వారా రెండవ స్థానానికి చేరుకునే అవకాశం ఉంటుంది. రెండో స్థానానికి చేరుకుంటే ఎలిమినేటర్ మ్యాచ్ ఆడే అవకాశం కూడా ఉంటుంది. బెంగళూరు.. ఈ సీజన్లో హైదరాబాద్ జట్టుతో తొలి మ్యాచ్ ఆడింది. ఆ మ్యాచ్లో హైదరాబాద్ జట్టు 200కు పైగా లక్ష్యాన్ని విధించినప్పటికీ.. బెంగళూరు ఈజీగా ఫినిష్ చేసింది. ఇప్పుడు బెంగళూరు జట్టును ఓడించి ఈ సీజన్ లో తొలి ఓటమికి రివెంజ్ తీర్చుకోవాలని హైదరాబాద్ భావిస్తుంది.

కేవలం గెలుపు మాత్రమే కాదని.. భారీ వ్యత్యాసంతో గెలవాలని.. అప్పుడే రెండో స్థానంలో నిలిచే అవకాశం ఉంటుందని హైదరాబాద్ అభిమానులు సోషల్ మీడియాలో పేర్కొంటున్నారు. బెంగళూరు జట్టుతో జరిగే మ్యాచ్లో హైదరాబాద్ ఆటగాళ్లు అంతకుమించి అనే స్థాయిలో ప్రదర్శన చేయాలని.. అప్పుడే ఆశించిన లక్ష్యం సాధ్యమవుతుందని అభిమానులు భావిస్తున్నారు.

అల్లు అర్జున్ 'రాకా' మూవీలో రాక్షసుడిగా నటిస్తున్న స్టార్ హీరో...

Allu Arjun Raaka Movie
Allu Arjun Raaka Movie

Allu Arjun Raaka Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కని విని ఎరుగని రీతిలో గొప్ప విజయాలను సాధిస్తున్న హీరోలు చాలామంది ఉన్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే అల్లు అర్జున్ లాంటి నటుడు సైతం తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు తీసుకెళుతున్నాడు. అట్లీ అల్లు అర్జున్ ఇద్దరు వీలైనంత తొందరగా ఈ సినిమాను పూర్తి చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. రాక సినిమాలో రాక్షసుడి పాత్రలో ఒక బాలీవుడ్ నటుడు నటిస్తున్నారట. ప్రస్తుతం ఆయన ఎవరు అనే విషయాన్ని సినిమా యూనిట్ గోప్యంగా ఉంచినప్పటికి ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఇందులో రాక్షసుడి క్యారెక్టర్ లో బాలీవుడ్ స్టార్ హీరో అయిన వరుణ్ ధావన్ కనిపించబోతున్నాడనే వార్తలు కూడా వస్తున్నాయి. ఇక ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనే విషయం తెలియదు. కానీ మొత్తానికైతే రీసెంట్ గా అట్లీ అతనితో సంప్రదింపులు కూడా జరిపినట్టుగా తెలుస్తుంది.

ఇక ఇప్పటికే 50 పర్సెంట్ షూటింగ్ ను కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా తొందరలోనే బ్యాలెన్స్ షూటింగ్ ను కూడా కంప్లీట్ చేసి వచ్చే ఏడాది ఈ మూవీని రిలీజ్ చేయాలని చూస్తున్నారు. ఇక ఏది ఏమైనా అల్లు అర్జున్ ఈ మధ్యకాలంలో చేస్తున్న సినిమాలతో పెను ప్రభంజనాలను క్రియేట్ చేస్తూ ముందుకు సాగుతున్నాడు.

కాబట్టి అతనితో సినిమాలు చేయడానికి చాలామంది దర్శక నిర్మాత ఆసక్తి చూపిస్తుండటం విశేషం… ఇక రాకా సినిమాతో అల్లు అర్జున్ ఇమేజ్ తారాస్థాయికి వెళ్ళిపోతుందని భావిస్తున్నాడు. ఇక దానికి తగ్గట్టుగానే ఇదొక డిఫరెంట్ సబ్జెక్టు కాబట్టి ఇలాంటి సబ్జెక్టుని డీల్ చేస్తున్నందుకు కూడా అతనికి మంచి పేరైతే వస్తుంది…

ఇక ఈ సినిమా కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఉంటూనే టెక్నికల్ గా హై విజువల్స్ ని చూపించాలనే ప్రయత్నం చేస్తున్నారట. మరి ఇంతకుముందు అట్లీ చేసిన సినిమాలన్నీ కమర్షియల్ సక్సెస్ లను సాధించాయి. కాబట్టి ఇప్పుడు చేస్తున్న ఈ సినిమా కూడా కమర్షియల్ గా సూపర్ సెక్షన్స్ అవుతుందని అట్లీ భావిస్తున్నాడు… అల్లు అర్జున్ సైతం అట్లీ విజన్ ను నమ్మి ముందుకు సాగుతున్నాడు…

ప్రదక్షిణ చేస్తూ ఇతరులతో మాట్లాడుతున్నారా..మీ పుణ్యఫలం గోవిందా...

Chaganti Koteswara Rao
Chaganti Koteswara Rao

Chaganti Koteswara Rao: మనలో చాలామందికి దైవభక్తి అధికంగా ఉంటుంది. వారాలవారీగా ఆలయాలకు వెళ్లే అలవాటు కూడా ఉంటుంది. అవకాశం కుదిరితే దూర ప్రాంతాలలో కొలువై ఉన్న ఆలయాలను కూడా సందర్శించే అవకాశం ఉంటుంది. ఇష్ట దైవానికి మెండుగా పూజలు చేస్తూ.. స్వామివారి కరుణాకటాక్షాలు లభించే విధంగా చూడాలని మొక్కుకుంటాం..

ఆలయాలకు వెళ్ళినప్పుడు ప్రదక్షిణాలు చేయడం సర్వసాధారణం. కొందరైతే ఫలానా సార్లు ప్రదక్షిణాలు చేస్తామని మొక్కుకుంటారు. కొందరైతే అంగప్రదక్షిణలు కూడా చేస్తుంటారు. తమ నమ్మకం ఆధారంగా పూజలు జరుపుతుంటారు. అయితే ప్రదర్శనలు చేస్తున్నప్పుడు కొందరు నోటికి తాళం వేసుకొని. పక్కవారితో మాట్లాడుకుంటూ ఆ క్రతువును పూర్తి చేస్తుంటారు. ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు ఇలా చేయకూడదట. ఈ విషయాన్ని ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు ఇటీవల వివరించారు. ఆలయంలో ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు కచ్చితంగా నియమాలు పాటించాలని ఆయన సూచించారు. ప్రదర్శన చేస్తున్నప్పుడు నోటికి తాళం వేయాలని.. పక్కవారితో కనీసం మాట్లాడకూడదని ఆయన పేర్కొన్నారు. ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు ఇతరులతో మాట్లాడితే ఉపయోగం ఉండదట. దాని వల్ల లభించే పుణ్యం పక్కన ఉన్న వాళ్లకు వెళ్లిపోతుందట. అందువల్లే ప్రతిపానికి ఒక పద్ధతి ఉంటుందని.. భగవత్ సంబంధిత క్రతవులలో శ్రద్ధ పాటించాలని.. క్రమశిక్షణ అనుసరించాలని కోటేశ్వరరావు వివరించారు.

కోటేశ్వరరావు ప్రముఖ ప్రవచనకర్తగా తెలుగు రాష్ట్రాలలోనే కాదు, దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందారు. దేశవ్యాప్తంగా ఉన్న శైవ, వైష్ణవ క్షేత్రాల గురించి ఆయన అద్భుతంగా వివరిస్తూ ఉంటారు. పైగా సనాతన ధర్మం గురించి లోతుగా విశ్లేషణ చేస్తూ ఉంటారు. గ్రాంధికంలో పౌరాణిక పద్యాలను చదువుకుంటూ.. వాటి అర్ధాన్ని అర్థవంతంగా చెబుతుంటారు. పైగా ఆయన గొంతు కూడా అద్భుతంగా ఉంటుంది. అందువల్లే ఆయన ప్రవచనాలను వినడానికి చాలామంది ఆసక్తి చూపిస్తుంటారు.

ఆమధ్య కోటేశ్వరరావు తమిళనాడులో ఉన్న అరుణాచలం క్షేత్రం గురించి చెప్పారు. ఆ క్షేత్రం గొప్పతనం.. దాని చుట్టూ ప్రదక్షిణాలు చేయడం ద్వారా వచ్చే ఉపయోగాన్ని వివరించారు. దీంతో తెలుగు రాష్ట్రాల నుంచి అరుణాచలం క్షేత్రానికి భక్తులు విరివిగా వెళ్తున్నారు.. ఇలా దేశంలో ఉన్న అనేక క్షేత్రాల గురించి చాగంటి కోటేశ్వరరావు వివరిస్తుంటారు. ఇప్పుడు ఆ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయంటే దానికి ప్రధాన కారణం చాగంటి కోటేశ్వరరావే.