YSRCP Rajya Sabha Strength Reduction: ఏపీలో రాజ్యసభ ఎన్నికల సందడి మొదలైంది. దేశవ్యాప్తంగా పది రాష్ట్రాల నుంచి ఖాళీ అవుతున్న 24 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు నోటిఫికేషన్ వెలువడింది. జూన్ 18న పోలింగ్ జరగనుంది. అయితే ఏపీ నుంచి ఖాళీ అవుతున్న నాలుగు రాజ్యసభ స్థానాలు కూటమికి ఏకగ్రీవం అయ్యే అవకాశం ఉంది. కూటమికి ఏకపక్ష బలం ఉండడంతో.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ఛాన్స్ లేదు. ఈ నాలుగు పదవులను కూటమి పార్టీలు పంచుకోనున్నాయి. అయితే ఇప్పటివరకు రాజ్యసభలో ఏపీ నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఆధిక్యం ఉండేది. కానీ ఇప్పుడు ఆ పార్టీకి ముగ్గురు సభ్యుల బలం తగ్గనుంది. దీంతో నాలుగు స్థానాలు మాత్రమే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మిగలనన్నాయి. అదే టైంలో కూటమికి రాజ్యసభలో బలం ఏడింటికి చేరనుంది.
నాలుగుకు పడిపోనున్న బలం..
ఏపీ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం 11 మంది ఎంపీలు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ 11 మంది సభ్యులతో బలీయమైన శక్తిగా ఉండేది.. 2024 సార్వత్రిక ఎన్నికల సమయానికి ఆ పార్టీ బలం 11 మంది రాజ్యసభ సభ్యులు. సంపూర్ణ బలంతో ఉన్న ఆ పార్టీకి అప్పట్లో ఉపశమనమే. రాష్ట్రంలో శాసనమండలి, కేంద్రంలో రాజ్యసభ ద్వారా రాజకీయం చేయదలచుకుంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. అయితే ఏపీలో కూటమి వచ్చిన తర్వాత చాలామంది రాజ్యసభ సభ్యులు తమ పదవులకు రాజీనామా చేశారు. ఓ నలుగురు రాజ్యసభ సభ్యులు రాజీనామాకు.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలం ఏడుకు తగ్గిపోయింది. చివరకు పార్టీలో నెంబర్ 2 గా ఉన్న విజయసాయిరెడ్డి సైతం రాజీనామా చేశారు. మిగిలిన ఏడింటిలో ముగ్గురు సభ్యులు ఇప్పుడు పదవి విరమణ చేస్తున్నారు. దీంతో వైసిపి బలం నాలుగుకు పడిపోనుంది. అదే సమయంలో కూటమి బలం ఏడుకు చేరుకోనుంది.
రాజ్యసభ తో పాటు ఎమ్మెల్సీల బలం..
తెలుగుదేశం పార్టీ 2019 ఎన్నికల్లో ఓడిపోయింది. 23 స్థానాలకు మాత్రమే పరిమితం అయింది. దీంతో వైసిపి శాసనమండలితో పాటు రాజ్యసభలో మెజారిటీ పెంచుకుంటూ వచ్చింది. అదే రాజ్యసభ బలంతో బిజెపికి ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. అయితే ఇప్పుడు బిజెపికి రాజ్యసభలో సంపూర్ణ మెజారిటీ దక్కనుండగా.. ఏపీ నుంచి భర్తీ అయ్యే రాజ్యసభ సీట్లు కూటమి ఖాతాలో పడనున్నాయి. వైసిపి బలం తగ్గిపోయి కూటమి బలం పెరగనుంది. దీంతో జాతీయ స్థాయిలో సైతం వైసీపీ బలం తగ్గిపోతోంది. ఇది ఆ పార్టీకి కాస్త మైనస్.
















తెలుగులో లోకేష్ కనకరాజ్ ఫేవరేట్ హీరో అతనేనా..?
Lokesh Kanagaraj Favorite Hero: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్న దర్శకుడు లోకేష్ కనకరాజు… ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. గత సంవత్సరం ఆయన రజనీకాంత్ తో చేసిన కూలీ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించకపోయిన కూడా ఆయన ఇమేజ్ మాత్రం తగ్గలేదు. కారణమేంటంటే ముందుగానే ఆయన భారీ మార్కెట్ ను కలిగివున్నాడు. కాబట్టి ప్రస్తుతం అదే మార్కెట్ ను కొనసాగిస్తున్నాడు. ఇక ఈ క్రమంలోనే ఇప్పుడు ఆయన అల్లు అర్జున్ తో ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా వచ్చింది. అయితే ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది నుంచి జరగబోతున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఆ మూవీ కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉన్న లోకేష్ కనకరాజు తన తదుపరి సినిమా విషయంలో కూడా చాలా కేర్ ఫుల్ గా వ్యవహరిస్తున్నాడు. అయితే తెలుగు సినిమా ఇండస్ట్రీలో లోకేష్ కనకరాజ్ కి బాగా నచ్చిన హీరో ఎవరు అంటు సోషల్ మీడియాలో కొన్ని వార్తలైతే వైరల్ అవుతున్నాయి.
ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం లోకేష్ కనకరాజు ప్రభాస్ కి వీరాభిమాని అనే విషయం తెలుస్తుంది. ప్రభాస్ సినిమాలన్ని చూస్తూ ఉంటాడట. అందువల్లే అతనితో సినిమా చేయడానికి కూడా సన్నాహాలు చేసుకున్నప్పటికి ప్రభాస్ బిజీగా ఉండటం వల్ల వర్కౌట్ కాలేదు.
ఫ్యూచర్ లో వీళ్ళిద్దరి కాంబినేషన్ లో సినిమా తప్పకుండా వస్తుందంటూ అటు ప్రభాస్ అభిమానులు, ఇటు లోకేష్ కనకరాజ్ ఫ్యాన్స్ సైతం కాన్ఫిడెంట్ ను వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇప్పటివరకు లోకేష్ కనకరాజు చేసిన సినిమాల్లో విక్రమ్ మూవీ భారీ విజయాన్ని సాధించింది. కార్తీ తో చేసిన ‘ఖైదీ’ సినిమా కూడా ప్రేక్షకులను విశేషంగా అలరించింది.
నిజానికి ఆ సినిమాతోనే పెను ఒక యూనివర్స్ ను క్రియేట్ చేయాలనే ఆలోచన లోకేష్ కనకరాజ్ కు రావడం దాన్ని చాలామంది దర్శకులు ఫాలో అవుతూ ముందుకు సాగడం అనేది మనం రెగ్యులర్ గా చూస్తూనే ఉన్నాం… ఇక లోకేష్ కనకరాజ్ అల్లు అర్జున్ ను ఏ క్యారెక్టర్ లో చూపిస్తాడు. ఎలాంటి ఎలివేషన్స్ ను ఇస్తాడు. తన ఇమేజ్ ని పెంచేలా సినిమా చేస్తాడా లేదా అనే ధోరణిలో కూడా కొన్ని అనుమానులైతే వ్యక్తమవుతున్నాయి…