Home Blog Page 243

ఆపిల్ ఐ ఫోన్ కు పోటీగా.. ఒప్పో ఫైండ్ ఎక్స్ 9.. ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..

Oppo Find X9 Price And Features
Oppo Find X9 Price And Features

Oppo Find X9 Price And Features: ప్రీమియం ఫోన్లను ఇష్టపడే వారిలో ఎక్కువగా ఆపిల్ కంపెనీ తయారు చేసే ఐఫోన్లను కొనుగోలు చేస్తారు. ధర ఎంతైనా సరే పెట్టి కొనేస్తుంటారు. పైగా ఐఫోన్ వాడటాన్ని సామాజిక హోదాగా భావిస్తూ ఉంటారు. అయితే ఐఫోన్ స్థాయిలో ఫీచర్లు ఉండి.. అంతకంటే తక్కువ ధర ఉండే ఫోన్లు మార్కెట్లో చాలానే ఉన్నాయి. అయితే అవి ఇవి కూడా ఐఫోన్ స్థాయిలో అమ్మకాలను సాగించలేదు. అయితే తొలిసారి ఒప్పో కంపెనీ ఆపిల్ కంపెనీ మార్కెట్ మీద దృష్టి పెట్టింది. ఏకంగా ఐఫోన్ స్థాయిలో సౌకర్యాలు కల్పించి.. సరికొత్త మోడల్ ను మార్కెట్లోకి తీసుకొచ్చింది.

Oppo find x9 సిరీస్లో రెండు ఫోన్లు మన మార్కెట్లోకి విడుదలయ్యాయి.. oppo find x9, oppo find x9 ultra మోడల్ ఫోన్లను మనదేశంలో విడుదల చేశారు. ప్రీమియం సెగ్మెంట్ లో ఈ ఫోన్లను అందుబాటులోకి తీసుకువచ్చినట్టు ఒప్పో కంపెనీ ప్రకటించింది. ధరలు కూడా ప్రీమియం స్థాయిలో ఉన్నట్టు వెల్లడించింది.. దీంతో ఒక వర్గం వారిని లక్ష్యంగా చేసుకొని ఈ ఫోన్లను రూపొందించినట్టు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

ఫీచర్లు ఎలా ఉన్నాయంటే

ఈ మోడల్ ఫోన్లలో 6.82 అంగుళాల క్యూహెచ్డీ, ఫ్లెక్సిబుల్ అమోలెడ్ డిస్ప్లే వచ్చింది. 120 హెచ్ జెడ్ రిప్రెష్ రేట్, 1800 నెట్స్ పిక్ బ్రైట్నెస్ ఈ మోడల్ లో ఉన్న ప్రత్యేకత. ఆండ్రాయిడ్ 16 కలిగిన కలర్ ఓఎస్ 16 ఆధారంగా ఇది పనిచేస్తూ ఉంటుంది. ఇందులో స్నాప్ డ్రాగన్ 8 ప్రాసెసర్ ఉంది. 200 మెగాపిక్సల్ ఓఐఎస్ మెయిన్ కెమెరా.. 50 మెగాపిక్సల్ అల్ట్రా వైడ్ కెమెరా.. 200 మెగాపిక్సల్ టెలిఫోటో కెమెరా.. 50 మెగాపిక్సల్ టెలిఫోటో కెమెరా ఇందులో ఉంది. ముందువైపు 50 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా ఉంది. 7050 ఎంఏహెచ్ బ్యాటరీ.. 100 వైర్ పాస్ట్ చార్జింగ్.. 50 వైర్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఇది చేస్తుంది. కార్నింగ్ గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్ ఇందులో ఉంది. ఫోన్ దాదాపు 235 గ్రాముల బరువు ఉంటుంది.

ఒప్పో ఫైండ్ ఎక్స్ 9

ఇందులో 6.59 అంగుళాల ఫుల్ హెచ్డి, అమ్మో లెడ్ డిస్ప్లే ఇచ్చారు. 120 హెచ్ జెడ్ రి ఫ్రెష్ రేట్ ఇందులో ఉంది. 1800 nits పిక్ బ్రైట్నెస్ ఇందులో ఉంది. ఆండ్రాయిడ్ 16 సపోర్ట్ చేస్తే కాలర్ ఓఎస్ 16 ద్వారా ఇది పనిచేస్తూ ఉంటుంది. ఇందులో అక్టాకోర్ మీడియా టెక్ డైమెన్ సిటీ 9500 ఎస్ ప్రాసెసర్ ఇందులో ఉంది. 50 మెగా పిక్సెల్ ఓ ఐ ఎస్ మెయిన్ కెమెరా, 50 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా, 50 మెగాపిక్సల్ పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా, 32 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా ఇందులో ఉంది.. 7025 ఎంఎహెచ్ బ్యాటరీ, 30 వైర్ పాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో ఇది పని చేస్తూ ఉంటుంది. ఐపీ 66, ఐపి 68, ఐపీ సిక్స్టీ నైన్ రేటింగ్ దీనికి ఉంది.. ఇది లావెండర్ స్కై, మిడ్ నైట్ గ్రే, సన్ సెట్ ఆరెంజ్ కలర్స్ లో లభిస్తూ ఉంటుంది.

Oppo find x9 ultra ఫోన్ ను సింగిల్ వేరియంట్ లో మార్కెట్లోకి తీసుకొచ్చారు. 12gb, 512gb వేరియంట్ ధరను 1,69,999 గా నిర్ణయించారు. ఇప్పటికే అన్ని ఈ కామర్స్ సైట్లలో ప్రీ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ప్రీ బుకింగ్ చేసుకున్న వారికి 11 వేల విలువైన ఒప్పో ఇంకో ఎయిర్ ఫైవ్ ప్రో టి డబ్ల్యూ ఎస్ ఇయర్ బర్డ్స్, ఒప్పో ఫైండ్ ఎక్స్లెంట్ అల్ట్రా కవర్ కేస్ ఉచితంగా లభిస్తుంది. అంతేకాదు 22 వేల వరకు ఎక్స్చేంజ్ బోనస్ కూడా కంపెనీ ఇస్తోంది. ఎంపిక చేసిన బ్యాంకు కార్డు హోల్డర్లకు ఒప్పో కంపెనీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. 24 నెలల పాటు ఉచితంగా డౌన్ పేమెంట్.. దీంతోపాటు 10% వరకు ఇన్స్టంట్ క్యాష్ బ్యాక్ అందిస్తోంది.

బడ్జెట్ పద్మనాభాల కోసం.. Realme 16T మోడల్ ఫోన్.. ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..

Realme 16T Phone Price And Features
Realme 16T Phone Price And Features

Realme 16T Phone Price And Features: స్మార్ట్ ఫోన్ కంపెనీలలో రియల్ మీ కి మనదేశంలో బలమైన మార్కెట్ ఉంది. ఈ కంపెనీ బడ్జెట్, ప్రీమియం ఫోన్లను తయారు చేస్తూ ఉంటుంది. తాజాగా మనదేశం మార్కెట్ లో రియల్ మీ 16 టీ మోడల్ ఫోన్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఫోన్ పూర్తిగా బడ్జెట్ పద్మనాభాలను లక్ష్యంగా చేసుకుని రూపొందించింది.

ఫీచర్లు

ఇందులో 8000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం ఉంది. 50 మెగా ఫిక్సల్ కెమెరా ఉంది. ఏఐ పోర్ట్రెయిట్ గ్లో, ఏఐ ఇన్ స్టంట్ క్లిప్ వంటి సదుపాయం ఉంది. ఇది మూడు రంగుల్లో లభిస్తుంది. ఫోన్ లో ఎల్ సీడీ స్క్రీన్ ఉంది.

ఈ మోడల్ లో డిస్ ప్లే 6.8 ఆంగుళాల వరకు ఉంది. 144 హెచ్ జడ్ రిప్రేష్ రేట్ కలిగి ఉంది. 1200 నిట్స్ పీక్ బ్రైట్ నెస్ ఉంది. మీడియా టెక్ డైమెన్ సిటీ 6300 ప్రాసెసర్ ఇందులో ఉంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత రియల్ మీ యూఐ 7 ద్వారా ఇది పని చేస్తుంది. 50 మెగా ఫిక్సల్ సోనీ ఐఎంఎక్స్ 852కెమెరా ఇందులో ఉంది. 2 మోనో క్రోమ్ కెమెరాలు కూడా ఇందులో ఉన్నాయి.

వెనక వైపు సెల్పీ మిర్రర్ ఉంది. పంచ్ హోల్ దగ్గర డిస్ ప్లే ప్రాంతంలో ఏకంగా 16 మెగా ఫిక్సల్ కెమెరా ఉంది. 8000 ఎంఏహెచ్ బ్యాటరీ 45 వాట్స్ సూపర్ వూక్ చార్జింగ్ ను సపోర్ట్ చేస్తుంది. 6.5 వైర్డ్ రివర్స్ చార్జింగ్ సపోర్ట్ ఇందులో ఉంది.

ధరలు ఎలా ఉన్నాయంటే

ఇది మూడు వేరియంట్లలో లభిస్తుంది. 6 జీబీ 128 జీబీవేరియంట్ 29,999, 8 జీబీ, 128 జీబీ వేరియంట్ 31,999, 8 జీబీ, 256 జీబీ వేరియంట్ ధర 34,999 ధరలలో లభిస్తాయి. రెడ్ కలర్, స్టార్ లైట్, స్టార్ లైట్ బ్లూ వంటి రంగుల్లో ఈ ఫోన్ లభిస్తుంది. మరో ఐదు రోజుల్లో అమ్మకాలు మొదలవుతాయి. ఎంపిక చేసిన క్రెడిట్ కార్డుల ద్వారా రూ.మూడు వేలవరకు డిస్కౌంట్ లభిస్తుందని రియల్ మీ కంపెనీ పేర్కొంది.

వెంకటేష్ తో ఆ సినిమా చేస్తే ఆడదని చెప్పిన స్టార్ డైరెక్టర్...ఫైనల్ గా ఏం జరిగిందంటే..?

Venkatesh Movie Controversy
Venkatesh Movie Controversy

Venkatesh Movie Controversy: వెంకటేష్ హీరో గా తెరకెక్కిన చాలా సినిమాలు ప్రేక్షకులను అలరించాయి. కెరియర్ మొదట్లో ఆయన మాస్ సినిమాలు చేసినప్పటికి ఒకానొక టైమ్ లో ఫ్యామిలీ ఆడియన్స్ ను మెప్పిస్తూ ప్రేక్షకులందరిని అలరించాడు. ముఖ్యంగా శోభన్ బాబు తర్వాత అంతటి ఇమేజ్ ను సంపాదించుకున్న తెలుగు హీరో కూడా తనే కావడం విశేషం…వెంకటేష్ వైవిధ్య భరితమైన పాత్రలను పోషించడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు. అయితే ఆయన చేసిన చంటి సినిమా విషయంలో అప్పట్లో చాలా వరకు నెగెటివ్ కామెంట్స్ వచ్చాయి…ఇక సినిమా స్టార్ట్ చేసే సమయంలో ఈ మూవీ ని వెంకటేష్ తో చేస్తున్నాము అని అనౌన్స్ చేసినప్పుడు చాలా మంది చాలా రకాలుగా విమర్శించారు. తమిళంలో ‘చిన్న తంబి’ పేరుతో తెరకెక్కిన ఈ సినిమాని తెలుగులో రీమేక్ చేశారు. అయితే ఒరిజినల్ వెర్షన్ ను పి వాసు డైరెక్షన్ చేశాడు.

తెలుగులో కూడా అతనితోనే డైరెక్షన్ చేయిద్దామని రామానాయుడు అడిగితే వెంకటేష్ హీరోగా చేస్తే ఈ సినిమా అనుకున్న రేంజ్ లో ఆడదని చెప్పారట. కారణం ఏంటంటే అప్పటికే వెంకటేష్ మాస్ హీరోగా అవతరించాడు. ఈ సినిమాలో హీరో పెద్దగా మైండ్ మెచ్యూరిటి లేని క్యారెక్టర్ లో నటించాల్సి ఉంటుంది.

అది వెంకటేష్ చేస్తే అంత పెద్దగా ఎఫెక్టివ్ గా ఉండదని దానికంటే ఇమేజ్ లేని హీరోతో చేస్తే బాగుంటుందని చెప్పారట. ఆ విషయానికి కన్విన్స్ కానీ రామానాయుడు రవిరాజా పినిశెట్టిని తీసుకొచ్చి చంటి పేరుతో ఆ సినిమాను రీమేక్ చేయించాడు. మొత్తానికైతే ఈ సినిమా సూపర్ సక్సెస్ ని సాధించింది. ఇక వెంకటేష్ కెరీర్లో ఉన్న బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సక్సెస్ లలో చంటి సినిమా కూడా ఒకటిగా నిలవడం విశేషం…

ఇక ఏది ఏమైనా కూడా ఏ సినిమా ఎవరికి బాగుంటుంది. ఎవరు ఆ క్యారెక్టర్ లో ఒదిగిపోతారనేది చెప్పడం చాలా కష్టం…స్క్రీన్ మీద ఒకసారి కనిపిస్తే ప్రేక్షకులు ఆటోమేటిగ్గా వాళ్ళని ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఏ క్యారెక్టర్ ని ఎవరు చేసిన కూడా దాన్ని సక్సెస్ ఫుల్ గా నిలుపవచ్చనే ఉద్దేశ్యంతోనే వెంకటేష్ ‘చంటి’ సినిమాతో ప్రూవ్ చేశాడు…

నాగార్జున చేసిన మూవీ రీమేక్ లో నాగ చైతన్య అఖిల్ నటిస్తున్నారా..?

Nagarjuna Movie Remake
Nagarjuna Movie Remake

Nagarjuna Movie Remake: అక్కినేని నాగేశ్వరరావు నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నాగార్జున కెరియర్ మొదట్లోనే రొమాంటిక్ సినిమాలను చేసి మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఆ తర్వాత మాస్ కమర్షియల్ సినిమాలను చేస్తూనే ప్రయోగాత్మకమైన సినిమాల వైపు అడుగులు వేశాడు. ఆయన చేసిన చాలా సినిమాలు మంచి విజయాలను సాధించాయి. ఇక ఇండస్ట్రీలో ఎలాంటి కొత్త కథతో సినిమా రావాలన్నా కూడా అది నాగార్జున వల్లే సాధ్యమవుతుంది. అనేంతలా పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నాడు. ఒకప్పుడు ఆయన ఇండస్ట్రీలో ఉన్న నలుగురు టాప్ హీరోల్లో ఒకడిగా నిలిచాడు. ఇప్పటికే ఆయన వరుస సినిమాలను చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడు. గత సంవత్సరం కూలీ, కుబేర సినిమాల్లో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించాడు. ఇక ఇప్పుడు తన వందో సినిమా కోసం తీవ్రమైన కసరత్తులు చేస్తున్నాడు.

ఇక ఇప్పటికే 70% షూట్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీతో మరోసారి ప్రేక్షకులను మెప్పించాలనే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే నాగార్జున ఇంతకుముందు చేసిన కొన్ని సినిమాలను తమ వారసులు రీమేక్ చేయాలనే ప్రయత్నం చేస్తున్నారట. దానికి అనుగుణంగానే నాగార్జున, హరికృష్ణ చేసిన సీతారామరాజు సినిమాను నాగ చైతన్య, అఖిల్ కలిసి రీమేక్ చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది.

ఆ సినిమా స్టోరీ ఇప్పటికీ రొటీన్ గా అయిపోయింది. కాబట్టి దాన్ని ఈ జనరేషన్ కి తగ్గట్టుగా కథ రూపంలో మార్చి ఇద్దరి క్యారెక్టర్లకి ఇంపార్టెన్స్ ఉండే విధంగా ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక వాళ్ళు అనుకున్నట్టుగానే నాగార్జున సినిమాను రీమేక్ చేసే అవకాశం దక్కితే మాత్రం అక్కినేని అభిమానుల ఆనందాన్ని వ్యక్తం చేస్తారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…

ఇక ఇప్పటికే నాగచైతన్య చాలా రోజుల నుంచి నాగార్జునకి సంబంధించిన ఏదో ఒక సినిమాను రీమేక్ చేయాలని చూస్తున్నాడు. ఇక దానికి తోడుగా అఖిల్ కూడా అతనితో జత కట్టడంతో ఇద్దరు కలిసి ఒక మల్టీ స్టారర్ సినిమాని రూపొందించాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తుంది…

తాపీ మేస్త్రీలుగా రోబోలు.. ఏకంగా హైస్పీడ్ రైల్వే స్టేషన్ నే నిర్మించాయి..

Robots Building Railway Station
Robots Building Railway Station

Robots Building Railway Station: ఆ మధ్య చైనాలో మారథాన్ జరిగింది. మనుషులతో పాటు రోబోలు కూడా ఇందులో పాల్గొన్నాయి. మనుషుల మీద రోబోలు గెలిచాయి. ఆ పోటీలో టాప్ 5 స్థానాలు కూడా రోబోలు సాధించాయి. కేవలం ఆటవిడుపు కోసమో, ఇతర వ్యవహారాల కోసమో రోబోలను కనిపెట్టలేదని, వాటి ఒళ్లు వంచిపని చేయిస్తామని చైనా చెబుతోంది. చెప్పడమే కాదు, చేసి కూడా చూపించింది. చివరికి ప్రపంచంమొత్తం తమ వైపు చూసేలా చైనా చేసింది.

టెక్నాలజీ రంగంలో అమెరికా, జపాన్, ఇజ్రాయిల్, దక్షిణకొరియాకు తిరుగులేదని చాలా మంది అనుకుంటారు. కానీ, ఆ దేశాలు కూడా కుళ్లు కునేలా చేయడంలో చైనా ముందు వరసలో ఉంటుంది. ఏకంగా ప్రపంచదేశాలు ఆశ్చర్యపోయే విధంగా ఉత్పత్తులు తయారు చేసి.. అదరగొడుతుంది. చైనా టెక్నాలజీ రంగంలో చేస్తున్న ప్రయోగాలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. ముఖ్యంగా రోబోలను ఉపయోగించి చైనా చేస్తున్న పనులు ప్రపంచానికి కొత్త దారిని పరిచయం చేస్తున్నాయి.

చాలా దేశాలలో ప్రస్తుతం మ్యాన్ పవర్ షార్టేజ్ ఉంది. మనుషులు ఒకప్పటి మాదిరిగా పని చేయడం లేదు. యంత్రాల మీద ఆధారపడటం పెరిగిపోయింది. అయితే యంత్రాలు కూడా చేయలేని పనులు రోబోలు చేస్తాయి. ఈ విధానాన్ని చైనా నూటికి నూరుశాతం చేసి చూపించింది. రోబోలను ఏకంగా నిర్మాణరంగంలోకి దించింది. వాటిని తాపీ మేస్త్రీలుగా మార్చింది. కేవలం 38 నెలల్లో చాంగ్ కింగ్ ఈస్ట్ హై స్పీడ్ రైల్వే హబ్ నిర్మించింది. ఇందుకోసం భారీగా రోబోలను వినియోగించింది.

నాలుగు సంవత్సరాల క్రితం చాంగ్ కింగ్ లోని నాన్స్ జిల్లాలో రైల్వే స్టేషన్ పనులు షురూ అయ్యాయి. 2025 జూన్ లో రైల్వే స్టేషన్ ప్రారంభమైంది.మొత్తం 12.1 లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో రైల్వే స్టేషన్ నిర్మించారు. హై స్పీడ్ రైళ్లు, మెట్రో రైళ్లు, బస్సులు, ట్యాక్సీలు, అనేక రకాల ప్రయాణ సాధనాలకు ఇది కేరాఫ్ అడ్రస్. ఇందులో ఏకంగా 15 ప్లాట్ ఫాంలు, 29 ట్రాక్ లు ఉన్నాయి. గంట వ్యవధిలో 16,000 మంది సేవలు అందించే ఏర్పాట్లు ఇందులో ఉన్నాయి. ఏడాదికి పది కోట్లమంది ఇక్కడి రైల్వే స్టేషన్ లో ప్రయాణిస్తారు. దీనిని స్టీల్, గాజు వంటి పదార్థాలు ఉపయోగించి నిర్మించారు. అందువల్ల ఇక్కడ సహజసిద్దంగానే కాంతి ఉంటుంది.

రైల్వే స్టేషన్ నిర్మాణ సమయంలో అనేక కష్టాలు ఎదురయ్యాయి. క్లిష్టమైన వాతావరణం ఇబ్బంది పెట్టింది. అందువల్లే చైనా రోబోలను వాడింది. పనులకు పూర్తిగా లేజర్ గైడెడ్ నాలుగు చక్రాల స్క్రీడ్ రోబోలను వాడారు. లైడార్, ఏఐ, 5జీ టెక్నాలజీని ఉపయోగించారు. కాంక్రీట్ లెవలింగ్ లో అత్యంత కచ్చితత్వాన్ని పాటించారు. మనుషులతో పోల్చి చూస్తే ఏకంగా మూడు రెట్ల వేగంతో రోబోలు పని చేశాయి. కార్మికుల అవసరాన్ని దాదాపు 40 శాతం తగ్గించాయి. రైల్వే హబ్ నిర్మాణంలో ఏకంగా 800 కేజీల గ్లాస్ ప్యానెల్స్ ఉపయోగించారు. ఫలితంగా 90శాతంవరకు ప్రమాద తీవ్రత తగ్గింది. చైనా రోబోలు చేసిన అద్భుతాన్ని ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఈ వీడియోను ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఆ వీడియో కోట్లాది వీక్షణలు సొంతంచేసుకుంది.

చిరంజీవి లైనప్ లోకి చేరిపోయిన స్టార్ డైరెక్టర్స్..

Chiranjeevi
Chiranjeevi

Chiranjeevi Upcoming Movies: తెలుగు సినిమా ఇండస్ట్రీకి సోలో హీరోగా ఎంట్రీ ఇచ్చి తనదైన రీతిలో సత్తా చాటుకున్న నటుడు చిరంజీవి… గత 50 సంవత్సరాల నుంచి ఆయనే ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తున్నాడు. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు అతన్ని టాప్ లెవెల్లో నిల్చోబెట్టాయి. డ్యాన్సులు, ఫైట్ లలో వైవిధ్యాన్ని చూపించిన చిరంజీవి ఇప్పటికీ నెంబర్ వన్ పొజిషన్ లోనే కొనసాగుతున్నాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. అలాంటి చిరంజీవి భారీ విజయాలను సాధించడంలో మాత్రం డీలా పడిపోతున్నాడు. ఇక దాంతో ఇప్పుడు టాప్ డైరెక్టర్లతో లైనప్ సెట్ చేసుకుంటున్నాడు. రీసెంట్ గా అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేసిన ‘మన శంకర్ వరప్రసాద్’ సినిమా భారీ విజయాన్ని సాధించింది… ప్రస్తుతం ఆయన యంగ్ డైరెక్టర్లతోనే సినిమాలు చేయాలనే ఉద్దేశ్యంతో చిరంజీవి ఉన్నట్టుగా తెలుస్తుంది. దాని కోసమే చాలామంది దర్శకులను తన లైనప్ లోకి తెచ్చుకుంటున్నాడు. ఇక ఇప్పటికే బాబీ తో సినిమా చేస్తున్న ఆయన శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో మరొక సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఇక వీళ్లిద్దరితో పాటుగా వెంకీ కుడుముల దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడట…

అలాగే కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో కూడా ఒక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనే వార్తలైతే వస్తున్నాయి. తొందరలోనే వీటికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా రాబోతున్నాయి… ఇండస్ట్రీ కి వచ్చిన కుర్రదర్శకులు చిరంజీవి సినిమాలను చూసే ఇండస్ట్రీకి రావాలని అనుకున్నారు.

కాబట్టి అతనితో సినిమా చేసే అవకాశం వస్తే అతన్ని టాప్ లెవెల్లో చూపించాలనే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇక వాళ్ళు అనుకున్నట్టుగానే సినిమా భారీ విజయాన్ని సాధించి చిరంజీవికి ఎనలేని గుర్తింపుని తీసుకొచ్చే విధంగా సినిమాలను రూపొందిస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది…

ప్రస్తుతం ఆయన కమర్షియల్ సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నాడు. వాటిలో కొన్ని సక్సెస్ అయితే మరికొన్ని డీలా పడుతున్నాయి. మొత్తానికైతే ఆయనకి సెకండ్ ఇన్నింగ్స్ లో చెప్పుకోదగ్గ సినిమా ఒక్కటి కూడా పడలేదు. కాబట్టి ఇక మీదట చేయబోయే సినిమాలతో ఒక భారీ సక్సెస్ ను సాధించాల్సిన అవసరమైతే ఉంది…

బాలయ్య - ప్రభాస్ కాంబోలో మిస్ అయిన సినిమా.. డైరెక్టర్ ఎవరంటే..?

Balayya And Prabhas Missed Film
Balayya And Prabhas Missed Film

Balayya And Prabhas Missed Film: నందమూరి నటసింహం బాలయ్య బాబు హీరోగా చేసిన చాలా సినిమాలు అతన్ని టాప్ లెవెల్లో నిల్చోబెట్టాయి. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇప్పుడు చేస్తున్న మాస్ సినిమాలతో మరింత ముందుకు దూసుకెళ్తున్నాడు. వరుసగా నాలుగు విజయాలతో సక్సెస్ లను సాధించిన ఆయనకి ‘అఖండ 2’ సినిమాతో బ్రేక్ పడింది. అయినప్పటికి గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేయబోతున్న సినిమా విషయంలోనే చాలా క్లారిటిని మెయింటైన్ చేస్తున్నాడు. ఇక ఇప్పటికే ఈ సినిమా విషయంలో ఆయన తన సజెషన్స్ ని కూడా చెబుతున్నారట. మొత్తానికైతే ఈ సినిమాతో మరోసారి హిట్ ట్రాక్ ఎక్కాలని చూస్తున్నాడు. ఈశ్వర్ సినిమాతో భారీ విజయాన్ని సాధించిన ప్రభాస్ తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు.

బాహుబలి సినిమాతో పాన్ ఇండియాలో పెను సంచలనాన్ని క్రియేట్ చేసిన ఆయన ఇప్పుడు చేయబోతున్న సినిమాల విషయంలో మరింత ముందుకు అడుగులు వేస్తున్నాడు. ప్రస్తుతం హను హను రాఘవపూడి దర్శకత్వంలో చేస్తున్న ఫౌజీ, సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో చేస్తున్న స్పిరిట్ సినిమాలతో పెను సంచలనాన్ని క్రియేట్ చేయాలని చూస్తున్నాడు…

ఒకానొక టైమ్ లో బాలయ్య, ప్రభాస్ లను హీరోలుగా పెట్టి ఒక భారీ మల్టీ స్టారర్ సినిమా చేయడానికి కొంత మంది దర్శక నిర్మాతలు ఆసక్తిని చూపించారు. దానికి తగ్గట్టుగా ఒక మంచి కథను కూడా డిజైన్ చేసినట్టుగా తెలుస్తుంది. వీళ్లిద్దరు కూడా సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికి అనుకోని కారణాల వల్ల సినిమా అయితే పట్టాలెక్కలేదట. ఇక బాలయ్య, ప్రభాస్ మధ్య చాలా మంచి సన్నిహిత్యం ఉందనే విషయం మనందరికి తెలిసిందే…

ఇక ఏది ఏమైనా కూడా ఫ్యూచర్ లో వీళ్ళ కాంబినేషన్ లో సినిమా వస్తే చూడాలని అటు ప్రభాస్ అభిమానులు, ఇటు బాలయ్య బాబు ఫ్యాన్స్ సైతం ఆసక్తిని చూపిస్తుండటం విశేషం…వీళ్ళు అనుకున్నట్టుగానే వీళ్ళ కాంబినేషన్లో సినిమా వస్తుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే… ఒకవేళ ఈ కాంబోలో సినిమా వస్తే మాత్రం సూపర్ హిట్ అవుతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…

దిల్ రాజు vs మైత్రి మూవీ మేకర్స్.. వీళ్లలో ఎవరు టాప్ ప్రొడ్యూసర్స్..?

Dil Raju vs Mythri Movie Makers
Dil Raju vs Mythri Movie Makers

Dil Raju vs Mythri Movie Makers: సినిమా ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్ల మధ్య తీవ్రమైన పోటీ ఉంది. ఎవరి సినిమాలు ఎక్కువ విజయాలను సాధిస్తాయి. ఎవరు టాప్ ప్రొడ్యూసర్ గా మారతారు అనే విషయాల మీద గత కొద్దిరోజులుగా తీవ్రమైన చర్చలైతే జరుగుతున్నాయి. ప్రస్తుతం దిల్ రాజు సక్సెస్ ల పరంగా చాలా టాప్ లో ముందుకు సాగుతున్నాడు. ఇక మైత్రి మూవీ మేకర్స్ సైతం భారీ బడ్జెట్ తో సినిమాలను చేస్తూ సక్సెస్ లను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తుండటం విశేషం… ఇక వీళ్ళతో పాటుగా నాగ వంశీ, అల్లు అరవింద్ లాంటి వాళ్లు సైతం ప్రస్తుతం టాప్ ప్రొడ్యూసర్స్ గా ముందుకు సాగుతున్నారు… ప్రొడ్యూసర్ల మధ్య తీవ్రమైన పోటీ ఉంది వాళ్ళు ఇతర ప్రొడ్యూసర్స్ నుంచి ఎలాంటి సినిమాలు వస్తున్నాయి. మనం ఎలాంటి సినిమాలు చేస్తే ఇండస్ట్రీలో సక్సెస్ ని సాధించొచ్చు అని ఎప్పటికప్పుడు బెరీజులు వేసుకుంటూ మరి సినిమాలు చేస్తున్నారు. దీని వల్ల హీరోలకు విపరీతంగా రెమ్యూనరేషన్స్ పెంచేసి మన డేట్స్ ని బ్లాక్ చేసుకుంటున్నారు… ఈ క్రమంలోనే దిల్ రాజు మైత్రి మూవీ మేకర్స్ మధ్య విపరీతమైన పోటీ నడుస్తుంది.

ఇక వాళ్ళలో ఎవరు పై చేయి సాధిస్తున్నారు ఎవరు ముందుకు సాగుతున్నారంటే, దిల్ రాజ్ చాలా క్వాలిక్లేటేడ్ గా సినిమాలను చేస్తూ సక్సెస్ లను సాధిస్తూ ముందుకు వెళుతుండగా మైత్రి వాళ్ళు మాత్రం భారీ బడ్జెట్ తో సినిమాలను చిత్రీకరించి దానిని ఎలాగైనా సరే క్యాష్ చేసుకోవాలనే ఉద్దేశ్యంతో ముందుకు సాగుతున్నారు.

ఇక మైత్రి వాళ్లు పుష్ప 2 సినిమాతో పదిమందిలో కోట్ల కలెక్షన్స్ ని కొల్లగొట్టారు. అయితే దిల్ రాజు ఇప్పటివరకు అంత మొత్తంలో కలెక్షన్స్ ను అయితే రాబట్టలేదు. దానికి తోడుగా ఆయన భారీ బడ్జెట్ సినిమాలను కూడా పెద్దగా చేయడం లేదు. గతంలో చేసిన గేమ్ చేంజర్ సినిమా సక్సెస్ సాధించకపోవడంతో దాదాపు 200 కోట్ల వరకు నష్టమైతే వచ్చింది.

ఇక ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీతో 350 కోట్లకు పైన సినిమా కలెక్షన్స్ ను రాబట్టి ఆ నష్టాన్ని భర్తీ చేసుకున్నాడు… రాబోయే రోజుల్లో ఈ ఇద్దరు నిర్మాతల్లో ఎవరు టాప్ ప్రొడ్యూసర్ గా మారతారు అనేది తెలియాలంటే మాత్రం ఇంకో సంవత్సరం పాటు వెయిట్ చేయాల్సిన అవసరమైతే ఉంది…

మండిపోతున్న భారత్.. ప్రపంచంలోనే టాప్ -50 హాట్ నగరాలు మనవే

Top 50 Hottest Cities In The World
Top 50 Hottest Cities In The World

Top 50 Hottest Cities In The World: సరిగ్గా మూడు రోజులక్రితం ఉత్తర ప్రదేశ్ లో 46కు మించిన డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ప్రస్తుత సీజన్ లో ఇదే హైయెస్ట్ రికార్డు అనుకుంటే.. ఇప్పుడు అంతకుమించిన స్థాయిలో టెంపరేచర్ రికార్డు అవుతోంది. భయటికి వెళ్లాలంటేనే భయం కలుగుతోంది. ఒకవేళ బయటికి వెళ్తే క్షేమంగా ఇంటికి వస్తామా అనే ఆందోళన కలుగుతోంది. ఎందుకంటే ఎండలు ఆ స్థాయిలో ఉన్నాయి మరి. ఎండలు ఇలా పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు నరకం చూస్తున్నారు. డీ హైడ్రేషన్ వంటి సమస్యలతో బాధపడుతున్నారు. కొన్ని సందర్భాలలో తీవ్రమైన అనారోగ్యానికి కూడా గురవుతున్నారు.

శుక్రవారం రోజున దేశవ్యాప్తంగా సగటున 40 డిగ్రీలకు మించిన ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో జనం బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. అంతేకాదు వడగాలులు కూడా తీవ్రంగా వీచాయి. వడదెబ్బ మరణాలు కూడా నమోదయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా టాప్ హీట్ నగరాలు కూడా మనదగ్గర నమోదయ్యాయంటే ఎండ తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. వడగాలుల వల్ల శుక్రవారం మధ్యాహ్నం వరకే 40 డిగ్రీలకు మించి టెంపరేచర్ రికార్డయింది.

ఒడిశాలోని బాలన్ గిర్ ప్రాంతంలో ఏకంగా 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ట్రాకర్ ఈ విషయాన్ని బయట పెట్టింది. చంద్రాపూర్(మహారాష్ట్ర), ప్రయాగ్ రాజ్(ఉత్తరప్రదేశ్), ఛత్తీస్ గఢ్, బిహార్, తెలంగాణ, హర్యానా, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాలలో పలు ప్రాంతాలలో రికార్డు స్థాయిలో టెంపరేచర్ నమోదయింది. టాప్ 50 నగరాలలో సగం ఉత్తర ప్రదేశ్ లోనే ఉన్నాయి. ఇప్పటికే వాయవ్య, మధ్యభారత్ ప్రాంతంలో వడగాలులు చుక్కలు చూపిస్తున్నాయి. అనేక ప్రాంతాల్లో రెడ్, ఆరెంజ్ అలర్ట్ లను వాతావరణ శాఖ జారీ చేసింది.

శుక్రవారం మధ్యాహ్నంవరకు వాతావరణ శాఖ విడుదల చేసిన వరల్డ్ హాట్50 నగరాలలో అన్ని కూడా మనదేశంలోనే ఉన్నాయి. వేడి మాత్రమే కాదు, వడగాలుల తీవ్రత మనదగ్గర అధికంగా ఉంది. వాతావరణంలో మార్పులు, కాలుష్యం, పారిశ్రామీకకరణ, చెట్లను నరకడం వంటి పరిణామాలు ఎండ వేడిమి పెరగడానికి దోహదం చేస్తున్నాయని పర్యావరణ వేత్తలు చెబుతున్నారు.

ట్రంప్ కు ప్రాణభయం.. కుమారుడి పెళ్లికి వెళ్లకుండా దాక్కుంటున్నాడు..

Trump Life Threat
Trump Life Threat

Trump Life Threat: ప్రపంచ దేశాల మీద టారిఫ్ లు విధించాడు. వెనిజులా నుంచి ఇరాన్ వరకు యుద్దాలు చేస్తూనే ఉన్నాడు. గిట్టని దేశాల మీద రకరకాల రూపాలలో ఒత్తిళ్లు తీసుకొస్తూనే ఉన్నాడు. ఇంకా ఏం చేస్తాడో తెలియదు. అటువంటి ట్రంప్ భయపడుతున్నాడు. ప్రాణభయంతో దాక్కుంటున్నాడు. కట్టుదిట్టమైన భద్రత ఉండే ట్రంప్ ఇలా భయపడటం ఒక ఆశ్చర్చం.. అన్నింటికీ మించి తనకు ప్రాణభయం ఉందని అతడు చెప్పడం మరింత ఆశ్చర్యం.

ట్రంప్ పెద్దకుమారుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్ పెళ్లి త్వరలో జరగనుంది. ఈ వివాహాన్ని ఘనంగా జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఈ వివాహానికి తాను హాజరు కాకపోవచ్చని ట్రంప్ బాంబు పేల్చారు. ఒకవేళ ఆ పెళ్లికి తాను హాజరైతే సత్యదూరమైన వార్తలతో తనను వేధిస్తారని, అవసరమైతే చంపేస్తారని ట్రంప్ వ్యాఖ్యానించారు. సాధ్యమైనంత వరకు వివాహానికి హాజరుకావడానికి ప్రయత్నిస్తానని ట్రంప్ పేర్కొన్నారు. అయితే ట్రంప్ హాజరుకావడం అంత ఈజీ కాకపోవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. భద్రతా అధికారులుచివరి వరకు గోప్యత పాటించే అవకాశం ఉందని వారు చెబుతున్నారు. ట్రంప్ మీడియాను కూడా పక్కదారి పట్టించే విధంగా మాట్లాడుతున్నారనే వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి.

అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్నపరిణామాలు, రకరకాల పరిణామాల నేపథ్యంలో ట్రంప్ పెళ్లికిహాజరు కావడం ఒకరకంగా సవాల్ గా మారే అవకాశం ఉంది. ట్రంప్ పెద్ద కుమారుడికి 48 సంవత్సరాల వయసు ఉంటుంది. అతడికి ఈ వీకెండ్ లో తన ప్రియురాలు బెట్టినాతో వివాహం జరగనుంది. బహమాస్ లో ఈ వివాహం జరుగుతుంది.కేవలం సన్నిహితులకు మాత్రమే వివాహానికి ఆహ్వానం లభించింది. ట్రంప్ పెద్దకుమారుడికి 2005లో వెనెసాతో వివాహం జరిగింది. 2018లో వీరిద్దరూ విడిపోయారు. వీరు ఏకంగా ఐదుగురు పిల్లలకు జన్మనిచ్చారు. 2020లో ఫాక్స్ న్యూస్ లో ప్రజెంటర్ గా పని చేసే కింబర్లీతో ట్రంప్ జూనియర్ కు నిశ్చితార్థం జరిగింది. కారణాలు తెలియవు గాని.. అది పెళ్లి దాకా వెళ్లలేదు. ప్రస్తుతం ట్రంప్ జూనియర్ మోడల్ బెట్టినాతో రిలేషన్ లో ఉన్నాడు. గత ఏడాది బెట్టినాతో ఎంగేజ్ మెంట్ చేసుకున్నాడు.

200 కోట్ల క్లబ్ లో చేరిన సూర్య 'కరుప్పు'..

Karuppu 11 Days Collections
Karuppu 11 Days Collections

Suriya Karuppu 200 Crore Club: సూర్య హీరోగా ఆర్జే బాలాజీ దర్శకత్వంలో చేసిన ‘కరుప్పు’ (వీరభద్రుడు) సినిమా రీసెంట్ గా రిలీజ్ అయింది. ఇక ఈ సినిమాకి మొదటి షో తో డివైడ్ టాక్ వచ్చినప్పటికి క్రమక్రమంగా ఈ సినిమా సక్సెస్ఫుల్ టాక్ ను సంపాదించుకుంటూ ముందుకు సాగుతుంది. గతవారం రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా అలరించడమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులను మెప్పిస్తూ ముందుకు దూసుకెళ్తుండడం విశేషం… ఇక ఈ సినిమా ఇప్పటివరకు 200 కోట్లకు పైన కలెక్షన్స్ ని రాబట్టింది అంటూ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

సూర్య ఈ మధ్యకాలంలో చేస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అయినప్పటికి ఆయనకు సక్సెస్ దక్కడం లేదు. చాలా సంవత్సరాల తర్వాత ఆయనకు భారీ విజయమైతే దక్కింది. ఈ మధ్యకాలంలో ఆయన చేసిన సినిమాలన్నీ డిజాస్టర్లుగా మారాయి. దానివల్ల అతని మార్కెట్ పూర్తిగా పడిపోయింది. తమిళ్ తో పాటు తెలుగులో ఒకప్పుడు స్టార్ హీరోగా వెలుగొందిన ఆయన ఈ మధ్యకాలంలో సక్సెస్ ల విషయంలో వెనుకబడిపోవడం వల్ల ఆయన తన పూర్తి ఫామ్ ని అందుకోలేకపోతున్నాడు.

ప్రస్తుతం ఈ సినిమాతో మరోసారి ఫామ్ లోకి వచ్చిన ఆయన తన తదుపరి సినిమాను వెంకీ అట్లూరితో చేస్తున్నాడు. కాబట్టి ఆ సినిమాతో కూడా భారీ విజయాన్ని సాధిస్తాననే ఒక కాన్ఫిడెన్స్ ను వ్యక్తం చేస్తున్నాడు. విశ్వనాథ్ అండ్ సన్స్ అనే పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా ఒక డిఫరెంట్ ప్రయత్నం అనే చెప్పాలి. సూర్య కెరియర్ లోనే ఇలాంటి సినిమా మరోసారి రాదని ఆయన పలు సందర్భాల్లో చెబుతున్నాడు.

ఇక ఈ క్రమంలోనే సూర్య తెలుగులో సైతం మరోసారి తన సత్తా చాటాడు. గత సంవత్సరం వచ్చిన కంగువ సినిమాతో భారీ దెబ్బ తిన్న ఆయన ఆ తర్వాత చేసిన ఒకటి రెండు సినిమాలతో సైతం డీలా పడ్డాడు… ఇక ఇప్పుడు గొప్ప విజయాన్ని అందుకోవడంతో అతని అభిమానులు పండగ చేసుకుంటున్నారు…

ప్రభుత్వ భూములు కాజేసి డిప్యూటీ కలెక్టర్ వందల కోట్ల ఆస్తులు.. ఏసీబీ అధికారులకు దిమ్మతిరిగిపోయింది..

Deputy Collector Illegal Assets Case
Deputy Collector Illegal Assets Case

Deputy Collector Illegal Assets Case: అవినీతిలో ఇదో వండర్. టాప్ రికార్డ్ కూడా. అవినీతికి పాల్పడే ఏ ప్రభుత్వ అధికారైనా సరే లంచాలు తీసుకుంటాడు. పనులు చేసిపెట్టి డబ్బులు లేదా బంగారం లేదా ఇతర ఖరీదైన వస్తువులు తీసుకుంటాడు. ఇతడు మాత్రం అంతకుమించి అనేలా వ్యవహరించాడు. ఏకంగా వందల కోట్లు కొట్టేశాడు. వాటిని రకరకాలుగా మార్చి దర్జాగా దండుకున్నాడు. చివరికి పాపం పండి దొరికిపోయాడు.

తెలంగాణ ఏసీబీ అధికారులు మరో మెరుపు దాడి చేశారు. అవినీతికి పాల్పడుతున్న ఓ భారీ అనకొండను శుక్రవారం పట్టుకున్నారు. అతడు సంపాదించిన ఆస్తులను చూసి ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. అతడు సంపాదించిన ఆస్తులు, వాటిని అతడు సొమ్ము చేసుకున్న విధానం చూసి నివ్వెరపోయారు. కొద్ది రోజులుగా ఇతడి మీద ఏసీబీ అధికారులు నజర్ పెట్టారు. చివరికి అన్ని ఆధారాలు సేకరించిన తర్వాత శుక్రవారందాడులు మొదలు పెట్టారు.

మేడ్చల్ మాల్కాజ్ గిరి డిప్యూటీ కలెక్టర్ గా పని చేస్తున్నారు వంశీమోహన్. ఈయన ఇంట్లో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. రూ. వందల కోట్ల ఆస్తులను అక్రమంగా సంపాదించినట్టు అధికారులు గుర్తించారు. హైదరాబాద్ నగరానికి శివారు ప్రాంతంలో ఉన్న శేరిలింగంపల్లిలో ఇతడు భారీగా ప్రభుత్వ భూములను కాజేసినట్టు ఏసీబీ అధికారుల సోదాలలో తేలింది. గతంలో శేరిలింగంపల్లి ప్రాంతంలో మోహన్ ఆర్డీవోగా పని చేశాడు. అప్పట్లో ప్రభుత్వ భూములను భారీగా దండుకున్నాడు.

అబ్దుల్లాపూర్ మెట్, పిగ్లీపురంలో 8 ఎకరాల ప్రభుత్వ భూమిని కాజేశాడు. ఆ భూములను తన మామ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. ఓ స్థిరాస్తి వ్యాపారికి అమ్మాడు. అందులో దాదాపు 8 ప్లాట్లను గిఫ్ట్ డీడ్ చేయించుకున్నాడు. వంశీ మోహన్ విలాసవంతమైన ఇంట్లో నివాసం ఉంటున్నాడు. ఖరీదైన ఆస్తులు సంపాదించాడు. దీంతో అనుమానం వచ్చిన ఏసీబీ అధికారులు దాడులు చేశారు. కాగా, ఇతడు కొన్ని కంపెనీలలో పెట్టుబడులు పెట్టినట్టు తెలుస్తోంది. వాటిపై కూడా ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. శుక్రవారం ఉదయం నుంచే ఏసీబీ అధికారులు తనిఖీలు మొదలు పెట్టారు. ప్రొటెక్షన్ కోసంస్థానిక పోలీసుల సహకారాన్ని ఏసీబీ అదికారులు తీసుకున్నట్టు సమాచారం.

2026 ఏప్రిల్ అమ్మకాల్లో TVS జోరు.. ఈ బైక్స్ దే హవా..

TVS Bikes Sales Growth
TVS Bikes Sales Growth

TVS Bikes Sales Growth: భారతదేశంలో TVS కంపెనీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. టూవీలర్స్ విక్రయాల్లో ఈ కంపెనీ ఎప్పటికీ టాప్ లెవల్లో ఉంటూ వస్తోంది. ఇందులో భాగంగా 2026 ఏప్రిల్ నెలలో టీవీఎస్ మోటార్ కంపెనీ అమ్మకాలు వృద్ధిని చూపించాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ కంపెనీ అమ్మకాలు ఈ ఏడాది 8 శాతం పెరిగాయి. అయితే, మార్చి 2026తో పోలిస్తే మాత్రం అమ్మకాలు స్వల్పంగా తగ్గుదలని నమోదు చేశాయి. ఈ అమ్మకాల గురించి పూర్తి వివరాల్లోకి వెళితె..

2026 ఏప్రిల్ లో కంపెనీ మొత్తం అమ్మకాలు 3,48,545 యూనిట్లకు చేరుకున్నాయి. గత మార్చి 2026తో పోలిస్తే 8 శాతం వృద్ధిని సాధించాయి. వీటిలో జూపిటర్, అపాచీ బైక్స్ టాప్ లెవల్లో ఉన్నాయి. టీవీఎస్ అమ్మకాల్లో జూపిటర్ అత్యధిక వాటాను (సుమారు 33.68%) కలిగి ఉండి, కంపెనీకి ‘వాల్యూమ్ కింగ్’గా నిలిచింది. ఏప్రిల్‌లో మొత్తం 1,17,383 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇది గతేడాదితో పోలిస్తే 14 శాతం వృద్ధి సాధించింది. ప్రతి ముగ్గురు టీవీఎస్ వినియోగదారులలో ఒకరు జూపిటర్‌ను ఎంచుకోవడం విశేషం. ఆ తరువాత టీవీఎస్ అపాచీ (Apachi)అద్భుతమైన ప్రదర్శనను కొనసాగిస్తూ 49,390 యూనిట్ల అమ్మకాలతో రెండో స్థానంలో నిలిచింది . స్పోర్టీ స్కూటర్ ఎన్ టార్క్ (Ntorq) 33,994 యూనిట్లతో 34 శాతం వృద్ధిని నమోదు చేసి, యువతలో తన ఆదరణను చాటుకుంది.

ఎలక్ట్రిక్ విభాగంలో టీవీఎస్ ఐక్యూబ్ (iQube) ఎలక్ట్రిక్ స్కూటర్ ఏకంగా 35 శాతం వృద్ధిని నమోదు చేసి, 37,193 యూనిట్లతో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ టూ-వీలర్‌గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. మోపెడ్ విభాగంలో సంప్రదాయ ఎక్స్‌ఎల్ (XL) మోపెడ్ 42,246 యూనిట్ల అమ్మకాలతో స్థిరమైన డిమాండ్‌ను కలిగి ఉంది ఈ నెలలో టీవీఎస్ రైడర్ (Raider) అమ్మకాలు కొంత నిరాశపరిచాయి. ఏప్రిల్ 2025తో పోలిస్తే, రైడర్ అమ్మకాలు 32 శాతం తగ్గి 29,064 యూనిట్లకే పరిమితమయ్యాయి. దీనికి ప్రధానంగా 125cc బైక్ సెగ్మెంట్‌లో పెరుగుతున్న పోటీని కారణంగా భావిస్తున్నారు. మరోవైపు, టీవీఎస్ రోనిన్ (Ronin) 64 శాతం భారీ వృద్ధితో 8,981 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసి మార్కెట్‌లో జోరు చూపిస్తోంది.

మొత్తంగా చూస్తే, టీవీఎస్ తన స్కూటర్ మరియు ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో తిరుగులేని ఆధిక్యాన్ని ప్రదర్శిస్తుండగా, కొన్ని మోటార్ సైకిల్ మోడల్స్‌లో మార్కెట్ పోటీని ఎదుర్కొంటోంది.

పెట్రోల్ వాహనాలకు ప్రత్యామ్నాయం ఇవేనా.. మరెందుకు కొనడం లేదు..

Alternatives To Petrol Vehicles
Alternatives To Petrol Vehicles

Alternatives To Petrol Vehicles: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా పెరుగుతుండటంతో సామాన్య ప్రజలపై భారీ భారం పడుతోంది. ముఖ్యంగా నగరాల్లో ట్రాఫిక్ ఎక్కువగా ఉండటం వల్ల మైలేజ్ తగ్గిపోవడంతో నెలకు వేల రూపాయలు అదనంగా ఖర్చవుతున్నాయని వాహనదారులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో చాలామంది ప్రజలు ఇప్పుడు ప్రత్యామ్నాయాల కోసం చూస్తున్నారు. అందులో ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనాలపై ఆసక్తి పెరుగుతోంది. పెట్రోల్ అవసరం లేకుండా కేవలం విద్యుత్తుతో నడిచే ఈ వాహనాలు దీర్ఘకాలంలో ఖర్చు తగ్గిస్తాయని భావిస్తున్నారు. అయితే ఈవీల ధరలు సామాన్యుడికి అందనంత దూరంలో ఉన్నాయి. దీనిపై వినియోగదారులు ఏం కోరుతున్నారంటే?

ఎలక్ట్రిక్ వాహనాలు కొనాలని చాలా మంది అనుకుంటున్నారు. అయితే వీటి ధరలు అడ్డంకిగా మారాయి. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న చాలా EV స్కూటర్లు, కార్లు సాధారణ పెట్రోల్ వాహనాలతో పోలిస్తే ఎక్కువ ధరకు విక్రయించబడుతున్నాయి. దీంతో మధ్యతరగతి కుటుంబాలు కొనుగోలు చేయడానికి వెనుకాడుతున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాల అధిక ధరలకు ప్రధాన కారణం బ్యాటరీలేనని నిపుణులు చెబుతున్నారు. EVలో ఉపయోగించే లిథియం-అయాన్ బ్యాటరీల తయారీ ఖర్చు చాలా ఎక్కువగా ఉంటుంది. వాహనం మొత్తం ధరలో పెద్ద భాగం బ్యాటరీ ఖర్చుకే వెళ్తుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాకుండా బ్యాటరీ మార్పిడి అవసరం వచ్చినప్పుడు మరింత ఖర్చు అవుతుందని వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కొంతమంది వాహనదారులు వీటిపై ప్రభుత్వాలు సబ్సిడీలు ఇవ్వాలని కోరుతున్నారు. ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని ప్రోత్సాహకాలు అందిస్తున్నప్పటికీ అవి సరిపోవడం లేదని అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా సామాన్యులకు అందుబాటులో ఉండే తక్కువ ధర EVలను ప్రోత్సహిస్తే వినియోగం పెరుగుతుందని చెబుతున్నారు. మరోవైపు దేశంలో ఛార్జింగ్ స్టేషన్ల కొరత కూడా ప్రజలను వెనక్కి తగ్గిస్తోంది. పెద్ద నగరాల్లో కొంతవరకు సదుపాయాలు ఉన్నప్పటికీ చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఛార్జింగ్ సౌకర్యాలు తక్కువగా ఉన్నాయని వినియోగదారులు చెబుతున్నారు. దీంతో ప్రయాణాల సమయంలో ఇబ్బందులు ఎదురవుతాయనే భయం ఉంది.

ఆటోమొబైల్ రంగ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. భవిష్యత్తు ఎలక్ట్రిక్ వాహనాలదే అయినప్పటికీ, వాటి ధరలు తగ్గకపోతే విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లడం కష్టమని అంటున్నారు. బ్యాటరీ తయారీని దేశీయంగా పెంచడం, సబ్సిడీలు విస్తరించడం, ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం ద్వారా మాత్రమే EVలు నిజమైన ప్రత్యామ్నాయంగా మారతాయని సూచిస్తున్నారు.

ప్రస్తుతం పెట్రోల్ ధరల భారంతో ఇబ్బంది పడుతున్న ప్రజలు పర్యావరణానికి మేలు చేసే ఎలక్ట్రిక్ వాహనాలు సామాన్యుడికి అందుబాటులోకి రావాలి అని కోరుతున్నారు. ధరలు తగ్గితే భవిష్యత్తులో దేశంలో EVల వినియోగం భారీగా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.

'దృశ్యం 3' మూవీ ప్లసులు, మైనస్ లు ఇవే...

Drishyam 3 Movie Plus And Minus
Drishyam 3 Movie Plus And Minus

Drishyam 3 Movie Plus And Minus: జీతూ జోసఫ్ దర్శకత్వంలో మోహన్ లాల్ హీరోగా వచ్చిన ‘దృశ్యం’ సినిమా భారీ విజయాన్ని సాధించింది. ఇక ఈ సినిమాని తెలుగులో వెంకటేష్ హీరోగా దృశ్యం పేరుతో రీమేక్ చేశారు. అయితే ఈ సినిమాకి రెండు పార్టులు రావడం ఆ రెండు కూడా సూపర్ సక్సెస్ ని సాధించడంతో ప్రేక్షకులు దృశ్యం సినిమా అంటే సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకు మాస్టర్ పీస్ అనే ఒక మార్క్ అయితే పడిపోయింది. ఇక అలాంటి క్రమంలోనే దృశ్యం 3 సినిమా రాబోతుంది అంటూ గత కొన్ని నెలల నుంచి అనౌన్స్మెంట్ అయితే ఇస్తున్నారు. ఎట్టకేలకు ఈ సినిమా రీసెంట్ గా థియేటర్లోకి వచ్చింది. ఈ సినిమాలోని ప్లస్ పాయింట్స్ ఏంటి మైనస్ పాయింట్స్ ఏంటి అనేది మనం ఒకసారి తెలుసుకుందాం…

ప్లస్ పాయింట్స్

ఈ సినిమాలో మోహన్ లాల్ నటన చాలా అద్భుతంగా ఉంది. తనని కంప్లీట్ యాక్టర్ అని ఏ క్షణాన అన్నారో తెలియదు కానీ ఈ మూవీలో ఆయన నట చూస్తే ఆయన్ని అందరూ క్లిట్ యాక్టర్ అని పిలుస్తారు… ఒక ఫ్యామిలీ పడే ఇబ్బందిని అలాగే ఆ ఫ్యామిలీలో ఉన్న పెద్ద ఎలా సఫర్ అవుతాడు అనేది మన కండ్లకు కట్టినట్టుగా నటించి మెప్పించాడు…

సెకండాఫ్ లో వచ్చే కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు ప్రేక్షకుడిని ఆకట్టుకుంటాయి. అలాగే క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ ప్రేక్షకుడిని మెప్పిస్తుంది. దాంతో ఒక హై ఫీల్ కలుగుతుంది…

మైనస్ పాయింట్స్

ఫస్టాఫ్ మొత్తం చాలా స్లో నేరేషన్ తో ముందుకు సాగుతుంది. ముఖ్యంగా థ్రిల్లర్ సినిమాల్లో ఉండకూడనిదే స్లో నేరేషన్ అలాంటిది ఈ సినిమాలో అది ఉండడంవల్ల మూవీ చూసే ప్రతి ప్రేక్షకుడికి మనం ఎందుకు ఈ సినిమాకు వచ్చామురా బాబోయ్ అనే ఫీల్ కలుగుతుంది. ఇక ఇంటర్వెల్ కి వచ్చేసరికి సినిమా మీద ప్రేక్షకుడికి హోప్ పోతుంది…

ఇక దర్శకుడు జీతూ జోసఫ్ స్క్రీన్ ప్లే ని సరైన రీతిలో రాసుకోలేకపోయాడు. ఈ సినిమా ఆధ్యాంతం ప్రేక్షకుడిని ఎంగేజ్ చేయలేకపోయింది.ఇక దానికి తోడు ఆయన ఇంతకు ముందు చేసిన దృశ్యం, దృశ్యం 2 రెండు పార్ట్ లలో హీరో ఎలా సేవ అవుతాడా అనే పాయింట్ హైలెట్ అయ్యేది. ఇక ఈ మూవీలో మాత్రం హీరో ఎలాగైనా సేవ అవుతడులే అనే నమ్మకం ప్రేక్షకుడిలో కలిగింది. దాని వల్ల సినిమాలో క్యూరియాసిట్ మిస్ అయింది.

ఇక ఈ సినిమాలో ఎంతసేపు హీరో కూతురికి పెళ్లి చేయాలనే పాయింట్ మీదనే తిరుగుతూ ఉంటుంది. కానీ సరైన కాన్ఫ్లిక్ట్ అయితే ఎక్కడ పడలేదు. దృశ్యం రెండు పార్టులు తీసుకుంటే ఆ కుటుంబం పడే సఫర్ ను ప్రతి ఒక్క ప్రేక్షకుడు ఆన్ చేసుకొని చూశాడు. కానీ ఈ పార్ట్ లో అది మిస్ అయింది…

ఏం ఐడియా రైతన్న.. నీలాంటివాళ్లుంటే దేశానికి మేలు..రైతులకు లాభాలు..

Farmer innovative idea
Farmer innovative idea

Farmer innovative idea: ఆరుగాలం కష్టించి పండించిన పంట దొంగలపాలైతే ఆ రైతు కష్టం ఎలా ఉంటుందో మాటల్లో చెప్పలేం. గతంలో ఈ పరిస్థితి ఎక్కువగా ఉండేది. ధాన్యం కుప్పల నుంచి కొందరు ధాన్యాన్ని దొంగిలించి తీసుకెళ్లేవారు. అయితే ఈ సమస్య పరిష్కారం కోసం ఓ రైతు వినూత్నంగా ఆలోచించాడు. ఆ రైతు తీసుకున్న నిర్ణయంతో పాటు ఏర్పాటు చేసిన భద్రతా చర్యలపై అందరూ ప్రశంసిస్తున్నారు. ఇంతకీ ఆ రైతు ఏం చేశాడంటే..?

తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా పరిధిలో ఉన్న కొలనూరు గ్రామం లో ఓ రైతు తీసుకున్న జాగ్రత్త ఇప్పుడు స్థానికంగా చర్చనీయాంశమైంది. గతంలో తన ధాన్యం కుప్పల నుంచి దొంగలు బస్తాలు ఎత్తుకెళ్లడంతో తీవ్రంగా నష్టపోయిన ఆ రైతు ఈసారి ముందుగానే అప్రమత్తమయ్యాడు. ధాన్యం కొనుగోలు కేంద్రం వద్దనే సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి తన పంటను కాపాడుకునే ప్రయత్నం చేశాడు.

రైతులు నెలల తరబడి శ్రమించి పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్తుంటారు. అయితే కొన్ని చోట్ల రాత్రి సమయంలో ధాన్యం బస్తాల దొంగతనాలు జరుగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా కొనుగోలు ప్రక్రియ ఆలస్యం కావడంతో ధాన్యం కుప్పలు రోజుల తరబడి యార్డుల్లోనే ఉండాల్సి వస్తోంది. ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకుని కొందరు దుండగులు బస్తాలు మాయం చేస్తున్నారని రైతులు చెబుతున్నారు.

ఇలాంటి అనుభవమే కొలనూరు గ్రామానికి చెందిన ఈ రైతుకూ ఎదురైంది. గత సీజన్‌లో తన ధాన్యం బస్తాలు కనిపించకుండా పోవడంతో అతడు తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. అప్పట్లో సరైన ఆధారాలు లేకపోవడంతో దొంగలను గుర్తించడం కష్టమైందని గ్రామస్థులు చెబుతున్నారు. దీంతో ఈసారి ఎలాంటి ప్రమాదం జరగకుండా ముందుగానే టెక్నాలజీ సహాయం తీసుకోవాలని రైతు నిర్ణయించుకున్నాడు.

ధాన్యం కుప్పల చుట్టూ ప్రత్యేకంగా సీసీ కెమెరాలను అమర్చి, రాత్రివేళల కదలికలను రికార్డ్ అయ్యేలా ఏర్పాటు చేశాడు. కెమెరాలకు లైటింగ్ సదుపాయం కూడా కల్పించడంతో ఎవరు వచ్చినా స్పష్టంగా కనిపించేలా జాగ్రత్తలు తీసుకున్నాడు. రైతు తీసుకున్న ఈ చర్యను చూసి ఇతర రైతులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

గ్రామంలో ఈ విషయం వైరల్ కావడంతో పలువురు రైతులు కూడా ఇలాంటి భద్రతా చర్యలపై ఆలోచిస్తున్నారు. ‘పంట పండించడమే కాదు, దాన్ని కాపాడుకోవడం కూడా ఇప్పుడు పెద్ద సవాలుగా మారింది’ అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు రైతులు కొనుగోలు కేంద్రాల్లో ప్రభుత్వం మరింత భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.

ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో కూడా చర్చనీయాంశంగా మారింది. రైతు తెలివైన నిర్ణయాన్ని పలువురు ప్రశంసిస్తుండగా, మరోవైపు రైతుల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఈ సంఘటన చూపిస్తోందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

57 రోజుల జైలు శిక్షకు రూ.10 లక్షల పరిహారం.. పోలీసుల అక్రమ కేసుకు కోర్టు చారిత్రక తీర్పు..

Court Historic Judgment
Court Historic Judgment

Court Historic Judgment: ఒక చిన్న పొరపాటు.. పోలీసుల నిర్లక్ష్యం ఒక వ్యక్తి జీవితాన్ని కీలక మలుపు తిప్పింది. అతడు తన ప్రయాణంలో పోలీసుల విచారణను ఎదుర్కొని వారి తప్పిదం వల్ల 57 రోజుల పాటు జైలు శిక్ష అనుభవించడంతో పాటు సమాజంలో ఎన్నో అవమానాలు పొందాడు. అయితే 16 ఏళ్ల తరువాత అతడు దీనిపై న్యాయం పొందినా.. తన జీవితంలోని విషాధ రోజులను మాత్రం తిరిగి తీసుకురాలేకపోయాడు. దోషులను శిక్షించకపోయినా.. నిర్దోషికి మాత్రం శిక్ష పడొద్దు.. అన్న వాదానికి వ్యతిరేకంగా సాగిన ఈ స్టోరీ వింటే ఎవరినైనా కలిచివేస్తుంది. ఆ వివరాల్లోకి వెళితె..

సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న అజయ్ సింగ్ 2010వ సంవత్సరంలో తన వ్యక్తిగత పనుల నిమిత్తం ఢిల్లీకి పయనమయ్యాడు. ఇందు కోసం ఆయన భోపాల్ విమానాశ్రయంకు వచ్చాడు. అయితే విమానాశ్రయంలోని భద్రతా తనిఖీల సమయంలో, ఆయన బ్యాగులో ఉన్న తెల్లటి పొడిని చూసి అధికారులు అనుమానించారు. పోలీసులు దాన్ని ‘నార్కోటిక్ డ్రగ్’ అని ప్రాథమికంగా నిర్ధారించి, ఆయనను వెంటనే అదుపులోకి తీసుకున్నారు. అయితే తాను తీసుకెళ్తున్నది కేవలం మామిడికాయ పొడి (ఆమ్చూర్ పౌడర్) అని, అది వంట కోసం అని అజయ్ పదేపదే మొరపెట్టుకున్నా అధికారులు వినిపించుకోలేదు. ఫలితంగా, ఎటువంటి నేరం చేయకపోయినా ఆయన 57 రోజుల పాటు జైలు జీవితాన్ని గడపాల్సి వచ్చింది.అజయ్ సింగ్ తన అమాయకత్వాన్ని నిరూపించుకోవడానికి అప్పట్లో తీవ్ర ప్రయత్నం చేశారు. కానీ సాధ్యం కాలేదు.

ఆ తరువాత ఆ పొడిని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపగా.. అది డ్రగ్స్ కాదని, సాధారణ మామిడికాయ పొడి అని నివేదికలో స్పష్టమైంది. ఆ నివేదిక తర్వాత అజయ్ జైలు నుంచి విడుదలైనప్పటికీ, సమాజంలో జరిగిన పరువు నష్టం, మానసిక వేదన, కెరీర్‌లో ఎదురైన ఇబ్బందులు ఆయన్ను వెంటాడాయి. తన గౌరవాన్ని కాపాడుకోవాలని, జరిగిన అన్యాయానికి పరిహారం పొందాలని నిర్ణయించుకున్న ఆయన న్యాయపోరాటం మొదలుపెట్టారు.

దీంతో తనకు నష్టపరిహారం చెల్లించాలని హైకోర్టును సంప్రదించాడు. సుదీర్ఘంగా 16 ఏళ్ల పాటు సాగిన ఈ న్యాయపోరాటం తాజాగా అజయ్ సింగ్‌కు ఊరటనిచ్చింది. ఈ కేసును విచారించిన హైకోర్టు, పోలీసుల నిర్లక్ష్యం, అపక్వమైన విచారణ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎలాంటి ఆధారాలు లేకుండానే ఒక వ్యక్తిని 57 రోజుల పాటు జైలులో ఉంచడం ప్రాథమిక హక్కుల ఉల్లంఘన అని కోర్టు పేర్కొంది. బాధితుడికి జరిగిన మానసిక క్షోభకు, పరువు నష్టానికి పరిహారంగా రూ. 10 లక్షలను చెల్లించాలని అధికారులను ఆదేశిస్తూ చారిత్రాత్మక తీర్పునిచ్చింది.

ఈ తీర్పు వ్యవస్థలో తప్పు చేసిన వారిని ప్రశ్నించే ధైర్యాన్ని సామాన్యులకు కల్పిస్తోంది. 16 ఏళ్ల పాటు పోరాడి, చివరకు సత్యమే గెలిచేలా చేసిన అజయ్ సింగ్ ప్రయాణం, చట్టం ముందు ఎవరూ అతీతులు కాదని, బాధ్యతారాహిత్యంగా వ్యవహరించే అధికారులకు ఇది ఒక హెచ్చరిక అని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అన్యాయంగా జైలుకు వెళ్లిన వ్యక్తికి దక్కిన ఈ పరిహారం, కోల్పోయిన కాలాన్ని తిరిగి తీసుకురాకపోయినా, ఆయనకు జరిగిన అన్యాయానికి ఒక గుర్తింపుగా నిలుస్తుంది.