Home Blog Page 23

అఖిల్ పేరు మార్చుకున్నంత మాత్రాన హిట్ వస్తుందా..?

Akhil Akkineni
Akhil Akkineni

Akhil Akkineni: ఒకప్పుడు అక్కినేని ఫ్యామిలీకి చాలా మంచి క్రేజ్ ఉండేది. నాగేశ్వరరావు ఎన్నో వైవిద్యమైన పాత్రలను చేసి ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణను సంపాదించుకున్నాడు. ఎన్టీఆర్ తో పాటు పోటీపడి నటించి ప్రేక్షకుల మన్ననలు పొందుతున్నాడు. ఇక ఆయన తర్వాత తన నట వారసుడిగా ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన నాగార్జున సైతం ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోల్లో తను కూడా ఒకడిగా ఎదిగాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ఆ ఫ్యామిలీ నుంచి వచ్చిన మూడోతరం హీరోలు ఎంత మాత్రం వాళ్ళ సత్తాను చాటులేక పోతున్నారు. కారణం ఏంటి అంటే వాళ్ళు ఎంచుకున్న సబ్జెక్టులు ప్రేక్షకులను ఏమాత్రం అట్రాక్ట్ చేయలేకపోతున్నాయి. మిగతా హీరోలతో పోలిస్తే వీళ్ళు చాలా వరకు వెనుకబడిపోయారనే చెప్పాలి. ఇలాంటి క్రమంలోనే అఖిల్ ప్రస్తుతం లెనిన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు.

ఈ సినిమాతో ఎలాగైనా సరే తనకంటూ ఒక స్టాండర్డ్ ను ఏర్పాటు చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు. దానికోసమే ఆయన శతవిధాల కష్టపడుతున్నాడు. ఇక దాంతో పాటుగా తన పేరును నాగ అఖిల్ అని మార్చుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. లెనిన్ మూవీ టైటిల్ లో నాగ అఖిల్ గా మనం చూడబోతున్నాం. వాళ్ల ఫ్యామిలీ లో ఉన్న హీరోలందరికి నాగ అనేది వస్తే సక్సెస్ సాధిస్తారు అనే ఒక నమ్మకాన్ని వాళ్ళు ఫాలో అవుతున్నారు.

నాగేశ్వరరావు దగ్గర నుంచి నాగచైతన్య వరకు ప్రతి ఒక్కరికి పేరు ముందు నాగ అనేది కామన్ అయిపోయింది. అందుకే అఖిల్ సైతం తన పేరును నాగ అఖిల్ గా మార్చుకున్నట్టుగా తెలుస్తుంది. పేరు మార్చినంత మాత్రాన సక్సెస్ లు వస్తాయా అని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.

ఇక ఏది ఏమైనా కూడా కొన్ని సెంటిమెంట్లను ఫాలో అవుతూ ముందుకు సాగినప్పుడే ఇండస్ట్రీలో సక్సెస్ లను సాధించగలం అనే ఒక కాన్ఫిడెంట్ తో అఖిల్ ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఏది ఏమైనా లెనిన్ సినిమాతో ఆయన సక్సెస్ ని సాధించాల్సిన అవసరమైతే ఉంది…

ట్రంప్ మూడో టర్మ్ సంకేతాలు.. సిన్న శకలు లేవు సామీ!

Donald Trump
Donald Trump

Donald Trump: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వయసు ఏడు పదులు దాటింది. కానీ మనోడి కోరికలు మాత్రం గుర్రాల్లా పరిగెడుతున్నాయి. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. అమెరికా స్వాతంత్ర్యానికి 250 ఏళ్లు నిండిన సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సైన్యం బలోపేతం విషయంలో మూడో పర్యాయం కూడా కొనసాగిస్తామని సూచించారు. వెంటనే తన మాటను సరిదిద్దుకున్నప్పటికీ, ఈ వ్యాఖ్యలు ట్రంప్ రాజకీయ ఆకాంక్షలపై కొత్త చర్చను రేకెత్తించాయి.

ట్రంప్ ఏమన్నాడంటే..
అమెరికాకు స్వాతంత్రం వచ్చి 250 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ట్రంప్ మొదటి పర్యాయంలో సైన్యాన్ని బలపరిచామని చెప్పి, రెండో పర్యాయంలోనూ అదే కొనసాగుతుందని పేర్కొన్నారు. అయితే “రెండోది… కాదు, మూడో టర్మ్‌లో కూడా” అని అనడం అందరి దృష్టి ఆకర్షించింది. వెంటనే తేరుకున్న తర్వాత ఆయన “అలా అనకూడదు” అంటూ వెనక్కి. తగ్గారు. ఇది కేవలం ఒక్కసారి జరిగిన సంఘటన కాదు. గతంలో కూడా ట్రంప్ ఇలాంటి సంకేతాలు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. దీంతో ఆయన నిజంగా మూడో పర్యాయం గురించి ఆలోచిస్తున్నారా లేదా రాజకీయంగా దృష్టిని ఆకర్షించడానికి ఇలా మాట్లాడుతున్నారా అనే ప్రశ్నలు మళ్లీ తలెత్తాయి.

రాజ్యాంగ నిబంధనలు ఇలా..
అమెరికా రాజ్యాంగంలో 22వ సవరణ స్పష్టంగా ఏ వ్యక్తి అయినా రెండు పర్యాయాలకు మించి అధ్యక్షుడిగా ఉండలేడని నిర్దేశిస్తుంది. ఈ నిబంధనను మార్చాలంటే రాజ్యాంగ సవరణకు అవసరమైన కఠినమైన ప్రక్రియను పూర్తి చేయాలి. ఇది కాంగ్రెస్‌లో మూడింట రెండు వంతుల మెజారిటీ, రాష్ట్రాల్లో మూడింట నాలుగు వంతుల ఆమోదం అవసరం. ఈ నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలను చాలామంది రాజకీయ స్టంట్‌గా భావిస్తున్నారు. అయితే ఆయన మాటలు ఆయన మద్దతుదారుల్లో ఉత్సాహం కలిగించగా, ప్రత్యర్థుల్లో ఆందోళన రేకెత్తించాయి.

గత సంకేతాలు, ప్రస్తుత చర్చ..
ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇది మొదటిసారి కాదు. గతంలో కూడా ఆయన మూడో పర్యాయం గురించి సంకేతాలు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు రెండో పర్యాయం అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల ఆయన రాజకీయ ఆకాంక్షలు ఎంతవరకు వెళ్తాయనే చర్చ జోరందుకుంది. కొందరు దీన్ని ట్రంప్ తన బలమైన మద్దతు వర్గాన్ని కదిలించడానికి, రిపబ్లికన్ పార్టీలో తన ప్రభావాన్ని కొనసాగించడానికి చేసిన ప్రయత్నంగా చూస్తున్నారు. మరికొందరు ఇది భవిష్యత్తులో రాజ్యాంగ మార్పుల గురించి చర్చను రేకెత్తించడానికి ఉద్దేశించినదిగా అభిప్రాయపడుతున్నారు.

రాజకీయ రచ్చ..
ట్రంప్ వ్యాఖ్యలు అమెరికా రాజకీయాల్లో రెండు వైపులా ప్రభావం చూపుతున్నాయి. ఆయన మద్దతుదారులు దీన్ని ఆయన నాయకత్వ బలానికి సంకేతంగా చూస్తుంటే, ప్రత్యర్థులు దీన్ని ప్రజాస్వామ్య సంప్రదాయాలకు వ్యతిరేకంగా భావిస్తున్నారు. అధ్యక్ష పదవికి రెండు పర్యాయాలు మాత్రమే అనుమతించే నిబంధనను మార్చడం చాలా కష్టం. అయినప్పటికీ ఇలాంటి వ్యాఖ్యలు రాజకీయ వాతావరణాన్ని వేడెక్కిస్తాయి. ట్రంప్ ఇప్పటికే వలస విధానాలు, వాణిజ్య విధానాలతో తీవ్ర చర్చలను రేకెత్తించిన వ్యక్తి కాబట్టి, ఇప్పుడు మూడో టర్మ్ సంకేతం మరింత ఆందోళన కలిగిస్తోంది.

ట్రంప్ మూడో పర్యాయం గురించి చేసిన వ్యాఖ్యలు రాజకీయ స్టంట్ అని కొంతమంది భావిస్తున్నారు. మరికొందరు నిజమైన ఆకాంక్ష అంటున్నారు. అయితే రాజ్యాంగం స్పష్టంగా నిర్దేశించిన పరిమితులను అధిగమించడం చాలా కష్టం. ఇది ట్రంప్ రాజకీయ ఆకాంక్షలు ఎంతవరకు వెళ్తాయనే చర్చను రేకెత్తించింది.

నాగబంధం సినిమాకి నష్టం తప్పదా..? దీనికంతటికీ కారణం ఎవరు..?

Nagabandham Movie
Nagabandham Movie

Nagabandham Movie: అభిషేక్ నామా దర్శకత్వంలో విరాట్ కర్ణ హీరోగా నటించిన ‘నాగబంధం’ సినిమా ఈనెల మూడోవ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా మొదటి రోజు నాలుగు కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టింది. వీకెండ్ కాబట్టి ఈ 3 రోజులు కలెక్షన్స్ బాగానే వచ్చాయి. మూడు రోజులు కలిపి ఈ సినిమాకి 11 కోట్ల 50 లక్షల వరకు కలెక్షన్స్ వచ్చాయి. ఇక ఇప్పుడు ఈ సినిమాకి అసలైన పరీక్ష మొదలుకానుంది. సోమవారం నుంచి ఈ సినిమాని ఎంతమంది ప్రేక్షకులు చూస్తారు ఈ సినిమాని ఎలా ఆదరిస్తారు అనేదే పెద్ద ప్రశ్నగా మారింది. మొదటి షో తోనే ఈ సినిమా డివైడ్ టాక్ ను తెచ్చుకోవడంతో చాలామంది ఈ సినిమాని చూడడానికి పెద్దగా ఇష్టపడడం లేదు.

కొంతమంది విజువల్ గా ఈ సినిమా చాలా గ్రాండీయర్ గా ఉంది. కాబట్టి ఇలాంటి సినిమాను ఓటిటి లోకి వచ్చిన తర్వాత చూడడం కంటే థియేటర్ ఎక్స్పీరియన్స్ చేస్తేనే బాగుంటుందని చెబుతున్నారు.
మరికొంతమంది థియేటర్ కైతే వస్తున్నారు. కానీ కథలో అంత పెద్దగా వైవిధ్యం లేకపోవడం వల్ల ఈ సినిమా చాలావరకు ప్రేక్షకులను ఇరిటేట్ చేస్తుందనే చెప్పాలి. ఏది ఏమైనా కూడా కథలో దమ్మున్నప్పుడే ఏ సినిమా అయినా సక్సెస్ఫుల్గా ఆడుతుంది.

స్టోరీ తేడా కొడితే మాత్రం సినిమాలో ఎన్ని హంగులు ఉన్నా అది ప్రేక్షకుడిని ఎంటర్టైన్ చేయలేదు. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమా 100 కోట్లకు పైన బడ్జెట్ తో నిర్మించారు. కాబట్టి ఈ సినిమాకి భారీ నష్టాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని పలువురు సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.

అనుకున్న కాన్సెప్ట్ ను పెర్ఫెక్ట్ గా స్క్రీన్ మీద ప్రజెంట్ చేయగలిగితే ఈ సినిమా 500 కోట్ల వరకు కలెక్షన్స్ ను రాబట్టగలిగే కెపాసిటి ఉన్న మూవీగా మారేది. కానీ దర్శకుడి లోపమా లేదంటే ఇతర సాంకేతిక నిపుణుల వల్ల ఏదైనా ఇబ్బంది జరిగిందా అనేది తెలియదు గానీ మొత్తానికైతే సినిమా సోల్ ని చెడగొట్టారనే చెప్పాలి… ఇక ఈ మూవీ లాంగ్ రన్ లో ఎంతటి కలెక్షన్స్ ని రాబడుతుంది అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…

జగన్ ను నమ్మి మోసపోయాం!

YS Jagan Mohan Reddy
YS Jagan Mohan Reddy

YS Jagan Mohan Reddy: ఏపీలో ప్రతి రాజకీయ పార్టీపై కులముద్ర ఉంది. ఫలానా పార్టీ ఫలానా సామాజిక వర్గానికి అనుకూలం అన్నట్టు పరిస్థితి మారిపోయింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అంటే రెడ్డి సామాజిక వర్గం.. టిడిపికి కమ్మ సామాజిక వర్గం… జనసేనకు కాపు సామాజిక వర్గం వెన్నుదన్నుగా నిలుస్తుందన్న అభిప్రాయం చాలా ఈజీగా అర్థం అవుతుంది. అయితే అన్ని పార్టీల్లో.. అన్ని సామాజిక వర్గాల వారు ఉన్నారు. ఉంటారు కూడా. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న కమ్మ సామాజిక వర్గం వారిది మాత్రం వింత పరిస్థితి. వారిని రాజకీయంగా చాలా వినియోగించుకున్నారు జగన్మోహన్ రెడ్డి. ప్రత్యర్థులను వారితో తిట్టించారు. దారుణంగా దూషణలపర్వం నడిపించారు. దీంతో వారికి రాజకీయ జీవితం లేకుండా చేశారు. ఒకరు కాదు ఇద్దరు కాదు దాదాపు పదిమంది నేతల రాజకీయ జీవితాలను తారుమారు చేశారు జగన్మోహన్ రెడ్డి. చివరకు సొంతవారే అసహ్యించుకునేలా చేయడంలో ప్రత్యేక రాజకీయ వ్యూహం ఉంది. వారు జగన్మోహన్ రెడ్డిని విడిచి వెళ్ళలేరు. వారికి ప్రత్యామ్నాయ అవకాశాలు కూడా ఉండవు. అంతలా చేసేసారు జగన్మోహన్ రెడ్డి.

* పాపం దేవినేని అవినాష్..
ముఖ్యంగా కమ్మ సామాజిక వర్గం లో యువనేత దేవినేని అవినాష్ రాజకీయ జీవితంతో ఆటలు ఆడుకున్నారు జగన్మోహన్ రెడ్డి. ఆయనతో చేయని తప్పులంటూ లేవు. కాంగ్రెస్ పార్టీ నుంచి అనూహ్యంగా టిడిపిలో చేరిన అవినాష్ మంచిగా ప్రోత్సహించాలని చంద్రబాబు భావించారు. అందుకే గుడివాడ నియోజకవర్గంలో పోటీ చేయించారు. అక్కడ ఓటమి చవి చూడడంతో దేవినేని అవినాష్ ను ప్రత్యేకంగా పిలిపించుకుని పార్టీలో చేర్పించుకున్నారు జగన్మోహన్ రెడ్డి. వైసిపి అధికారంలో ఉండడంతో అమరావతిపై విషం చిమ్మడంలో ఆ ప్రాంత నేతల అవసరం ఉంది. పైగా కమ్మ సామాజిక వర్గం వారిని ప్రయోగిస్తే.. ఆ ప్రాంతంలో రాజకీయంగా కలిసి వస్తుందని అంచనా వేసుకున్నారు జగన్. అలా దేవినేని అవినాష్ జగన్ చేతిలో పావుగా మారారు. అమరావతి తో పాటు కమ్మ సామాజిక వర్గం పై జరిగిన కుట్రలో ఆయనను ప్రధాన భాగం చేశారు. ఇప్పుడు దేవినేని అవినాష్ అంటేనే విజయవాడ ప్రాంతంలో ప్రజలు వ్యతిరేకించేలా పరిస్థితి వచ్చింది. దీనికి ముమ్మాటికీ కారణం జగన్మోహన్ రెడ్డి.

* వివాదాస్పద నేతలుగా..
మరోవైపు కమ్మ సామాజిక వర్గం నేతలుగా ఉన్న కొడాలి నాని, వల్లభనేని వంశీ మోహన్ లను ఏ స్థాయిలో వివాదాస్పద నేతలుగా మార్చారో తెలియనిది కాదు. వారు బలమైన కమ్మ సామాజిక వర్గం ప్రాబల్యం ఉన్న నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చారు. సహజంగానే వీరి మాటలు కమ్మ సామాజిక వర్గానికి నచ్చవు. దీంతో ఆ ఇద్దరితో వివాదాస్పద ప్రకటనలు చేయించి.. అంతకుమించి తప్పుడు మార్గాల్లో మాట్లాడించి కమ్మ వ్యతిరేకులుగా చిత్రీకరించడంలో సక్సెస్ అయ్యారు. ఆపై బొల్లా బ్రహ్మనాయుడు, తలశిల రఘురాం లాంటి నాయకుల విషయంలో సైతం ఆశించిన స్థాయిలో రాజకీయ ప్రోత్సాహం అందించలేదు. అందుకే ఇప్పుడు కమ్మ నేతలు డిఫెన్స్ లో పడిపోయారు. అటువంటి నాయకులకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తప్ప మరో ఆప్షన్ లేదు కూడా. అలా వారిని రాజకీయంగా ఎదగనివ్వకుండా.. మరో మార్గం లేకుండా చేయడంతో వారు.. పొలిటికల్ సైలెన్స్ పాటించాల్సి వస్తోంది.

జోసెఫ్ రావణ్ తో వైసిపికి డ్యామేజ్!

Joseph Ravan
Joseph Ravan

Joseph Ravan: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలిసి చేస్తుందో.. తెలియక చేస్తుందో.. తెలియదు కానీ.. సమాజం పై వ్యతిరేక ప్రభావం చూపే వారి విషయంలో ఆ పార్టీ మద్దతు చూస్తుంటే మాత్రం.. చాలామంది ఆ పార్టీకి దూరం కాక తప్పదు. వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో అంతర్వేదిలో రథం దగ్ధం చేస్తే.. కొత్త రథం తెచ్చి పెడతామని.. రామతీర్థలో విగ్రహం ధ్వంసమైతే కొత్త విగ్రహం పెడతామని అప్పటి మంత్రి హోదాలో చాలా తేలిగ్గా మాట్లాడారు కొడాలి నాని. దాని ప్రభావం హిందూమతంపై విపరీతంగా ప్రభావం చూపింది. మొన్నటి ఎన్నికల్లో చాలా నష్టం చేకూర్చింది. అయినా దాని నుంచి గుణపాఠాలు నేర్చుకోలేదు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు జోసెఫ్ రావణ్ విషయంలో సమర్ధించి అడ్డగోలుగా బుక్ అయింది. జోసెఫ్ రావణ్ కుటుంబ సభ్యులు నేరుగా జగన్మోహన్ రెడ్డిని కోరి న్యాయ సహాయం అందించడం.. వైసీపీ లీడర్ టీం రంగంలోకి దిగి సాయం అందించడం మాత్రం ఆ పార్టీకి డ్యామేజ్ చేసింది. కచ్చితంగా దాని ప్రభావం ఆ పార్టీ చూడక తప్పదు.

* విష సంస్కృతికి ఆధ్యుడు..
హిందూ దేవుళ్లను దారుణంగా మాట్లాడారు జోసెఫ్ రావణ్. అయితే ఈ విష సంస్కృతి అన్నిచోట్ల ఉంది. దురదృష్టవశాత్తు ఏపీకి కూడా విస్తరించింది జోసెఫ్ రావణ్ ద్వారా. ఒక మతాన్ని ఆచరించడంలో తప్పులేదు. గౌరవించడంలో అస్సలు తప్పులేదు. కానీ మరో మతాన్ని వ్యతిరేకించే హక్కు ఎవరికీ ఉండదు. అది సమ్మతం కూడా కాదు. కానీ జోసెఫ్ రావణ్ అదేపనిగా హిందూ మతాన్ని వ్యతిరేకించారు. కించపరిచారు. అసభ్య పదజాలాలతో దూషించారు. సభ్య సమాజం తలదించుకునేలా మాట్లాడారు. అటువంటి వ్యక్తిని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వెనుకేసుకు రావడం చాలా తప్పు. ఆ తప్పిదానికి వ్యక్తిగతంగా ఆయనకు డ్యామేజ్ కలగవచ్చు కానీ.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మాత్రం దారుణ డ్యామేజ్ జరగడం ఖాయం ఇప్పటికే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై హిందుత్వ వ్యతిరేక ముద్ర ఉంది. ఇప్పుడు దానిని రెట్టింపు చేసుకుంటోంది ఆ పార్టీ.

* హిందుత్వ నమ్మకం పై దాడి..
ఏదైనా భావజాలాన్ని ప్రదర్శించడం వేరు. సమర్ధించడం వేరు. హిందుత్వ వ్యతిరేక భావజాలాన్ని ప్రదర్శించడమే కాదు. ఆ సమాజం చిన్నబోయేలా.. వారి ఆధ్యాత్మిక నమ్మకం పై దెబ్బతీసేలా జోసెఫ్ రావణ్ వ్యాఖ్యలు నడిచాయి. అనవసరంగా ఆ వివాదాన్ని తలకు ఎక్కించుకుంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఈ మొత్తం ఎపిసోడ్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హస్తం ఉందన్న అనుమానాలు పెరిగిపోతున్నాయి. జోసెఫ్ రావణ్ కు మద్దతుగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లీగల్ టీం రంగంలోకి దిగడం.. ఆ పార్టీకి జోసెఫ్ రావణ్ విషయంలో ఉన్న ప్రత్యేక శ్రద్ధ బయటపడింది. గతంలో అధికారంలో ఉన్నప్పుడు మాజీ మంత్రి కొడాలి నాని వైఖరి పై హిందుత్వవాదులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతర్వేది రథం దగ్ధం సమయంలో బాధ్యతారాహిత్యంగా మాట్లాడారు. అటువంటి వ్యాఖ్యలకే డ్యామేజ్ జరిగితే… జోసెఫ్ రావణ్ లాంటి వారి వ్యాఖ్యలకు ఏ స్థాయిలో డ్యామేజ్ జరుగుతుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.

'ఆట మొదలైంది' అంటూ పవన్ కళ్యాణ్ పై ప్రకాష్ రాజ్ ఛాలెంజ్.. వీడియో వైరల్..

Prakash Raj
Prakash Raj

Prakash Raj: సినీ నటుడు ప్రకాష్ రాజ్ సోషల్ మీడియా ద్వారా ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై విమర్శలు ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు. టెర్రరిస్టులకు , సంఘ విద్రోహ శక్తులకు సపోర్టుగా మాట్లాడి అరెస్ట్ అయినటువంటి యూట్యూబర్ రావణ్ కి మద్దతుగా ఆయన గత కొద్దీ రోజుల నుండి అలుపెరుగని పోరాటం చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. నిన్న రావణ్ పై UAPA చట్టం పై కేసు నమోదైంది , దీనిపై గన్నవరం కోర్టులో సుదీర్ఘ విచారణ జరిగిన తర్వాత రావణ్ కి 14 రోజుల రిమాండ్ పడింది. దీంతో ఆయన్ని నెల్లూరు సెంట్రల్ జైలుకి తరలించారు. దీంతో బద్దలైన గుండెతో ప్రకాష్ రాజ్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడ్డారు. ఆట మొదలైంది అంటూ తనదైన స్టైల్ లో వ్యంగ్యంగా నవ్వుతూ ఒక వీడియో ని విడుదల చేశారు.

ఆ వీడియోలో ఆయన మాట్లాడుతూ ‘ఏంటో.. వరుసగా తప్పుడు కేసులు పెట్టి , నాలుగు సార్లు కోర్టు బెయిల్ ఇస్తే , UAPA వాడి ఒక యూట్యూబర్ ని రిమాండ్ లోకి పంపిస్తారా?, అంటే యువరాజు ని ప్రశ్నిస్తే దేశద్రోహం, వెరీ గుడ్. ఇది ప్రశ్నించే గొంతులని నొక్కడానికి మీరు చేస్తున్న కుట్ర అని అందరికీ క్లియర్ గా అర్థమైంది. తర్వాత ఏంటి?, క్యారెక్టర్ అస్సాసినేషన్, ఇప్పటికే జన సైనికులు AI వీడియోలు చేసి మొదలు పెట్టేసారు . మీరేమి చేస్తారు , వాడి ఫోన్ మీ దగ్గర ఉంది , అందులో సమాచారాన్ని వక్రీకరించి , దాన్ని లీక్ చేస్తూ , ఆయన్ని ఇబ్బంది పెడుతూ , ఆ మూలంగా ఆయనకీ అండగా నిల్చున్న వాళ్ళని , ఎన్నో ప్రశ్నించే గొంతులని భయపెట్టే ప్రయత్నం చేస్తారు కదా. దిగజారండి , దిగజారుతూ ఉండండి, ఎంత క్రిందకు దిగజారుతారో ప్రజలు చూస్తూ ఉంటారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ రావు గారితో మీ ఆట మొదలైంది, కానీ ఈ ఆటకు ముగింపు ప్రజలే చేస్తారు , గేమ్ ఆన్’ అంటూ చెప్పుకొచ్చారు.

రావణ్ ని ఒక అభినవ భగత్ సింగ్ లాగా అనుకొని ప్రకాష్ రాజ్ చేస్తున్న ఈ కామెంట్స్ పై సోషల్ మీడియా లో నెటిజెన్స్ తీవ్రమైన అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. హిందూ దేవుళ్లపై అతను చేసిన అత్యంత నీచమైన కామెంట్స్ , అదే విధంగా టెర్రరిస్టులకు సపోర్టు చేస్తూ అతను మాట్లాడిన మాటలని సమర్థిస్తూ ప్రకాష్ రాజ్ ఈ సమాజానికి ఏమి చెప్పాలని అనుకుంటున్నారు?, మాటికొస్తే జనాలు చూస్తున్నారు అని అంటున్నారు, నిజంగానే జనాలు మీ బుద్ధి ని గమనిస్తున్నారు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ అంటున్నారు. చూస్తుంటే రావణ్ ని రిమాండ్ కి పంపడం ద్వారా , అతని మొబైల్ లో ఉన్న సమాచారం మొత్తం బయటపడితే , తన బండారం ఎక్కడ లీక్ అవుతుందో అనే భయం ప్రకాష్ రాజ్ లో స్పష్టంగా కనిపిస్తోంది అంటూ విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు.

అమెరికా పెంటగాన్‌ను అధిగమించిన ఈజిప్టు.. మామూలు పవర్ కాదు ఇదీ

Egypt Military
Egypt Military

Egypt Military: ప్రపంచ పెద్దన్న అమెరికా. ఆర్థికంగా, సైనిక పరంగా, ఆయుధ శక్తి పరంగా ఇలా అన్నింటిలో మొదటిస్థానంలో ఉంది. అయితే మారుతున్న పరిణామాలతో అగ్రరాజ్యం కొన్ని అంశాల్లో వెనుకబడుతుంది. మరోవైపు కొన్ని దేశాలు అమెరికాను అధిగమించేందుకు పోటీ పడుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఈజిప్టు ఇటీవల కైరో సమీపంలోని న్యూ అడ్మినిస్ట్రేటివ్‌ క్యాపిటల్‌లో ‘ఆక్టగాన్‌’ అనే అత్యాధునిక రక్షణ కార్యాలయాన్ని ప్రారంభించింది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద సైనిక–రక్షణ ప్రధాన కార్యాలయంగా గుర్తింపు పొందింది. అధ్యక్షుడు అబ్దెల్‌ ఫత్తా ఎల్‌ సిసి దీన్ని ఉన్నతమైన జాతీయ కట్టడంగా అభివర్ణించారు. ఈ ప్రాజెక్టు ఈజిప్టు సాయుధ దళాల కేంద్రీకృత నిర్వహణను బలోపేతం చేస్తూ, ఆధునిక సైనిక వ్యవస్థకు కొత్త దిశను సూచిస్తోంది.

ఆక్టగాన్‌ అంటే ఏమిటి?
ఆక్టగాన్‌ (State Strategic Command Center) ఈజిప్టు రక్షణ మంత్రిత్వ శాఖ, సాయుధ దళాలకు కేంద్రీకృత ప్రధాన కార్యాలయం. ఇది ఒకే స్థలంలో అన్ని సైనిక శాఖలు, ఇంటెలిజెన్స్, కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ వ్యవస్థలను సమన్వయం చేసేలా రూపొందించబడింది. దీని నిర్మాణం ఆక్టగాన్‌ (ఎనిమిది భుజాల) ఆకారంలో ఉండటం వల్ల ఈ పేరు వచ్చింది. ఇది సంక్షోభ నిర్వహణ, సమాచార వినిమయం, ఆపరేషనల్‌ సమన్వయానికి ఒక సమగ్ర వేదిక.

నిర్మాణ విశేషాలు..
ఈ కాంప్లెక్స్‌ కైరోలో సుమారు 22 వేల ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఇందులో బహుళ భవనాలు, డేటా సెంటర్లు, కమ్యూనికేషన్‌ సిస్టమ్స్, భద్రతా ఏర్పాట్లు ఉన్నాయి. ఇది న్యూ అడ్మినిస్ట్రేటివ్‌ క్యాపిటల్‌ ప్రాజెక్టులో భాగంగా నిర్మించబడింది. దీని ఉద్దేశం పాత కైరోలోని రద్దీని తగ్గించి, ఆధునిక, సురక్షితమైన వాతావరణంలో సైనిక–పరిపాలనా కార్యాలను కేంద్రీకరించడం.

పెంటగాన్‌ కన్నా పెద్దది..
అమెరికాలోని ప్రసిద్ధ పెంటగాన్‌ భవనం కేవలం 29 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. చుట్టుపక్కల ప్రాంతాలు కలిపినా సుమారు 41 ఎకరాలకు మించదు. ఆక్టగాన్‌ యొక్క 22 వేల ఎకరాల విస్తీర్ణంలో ఉంది. పెంటగాన్‌ ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన రక్షణ వ్యవస్థకు చిహ్నం అయినప్పటికీ, ఆక్టగాన్‌ భౌతిక పరిమాణం, కేంద్రీకృత సామర్థ్యం, ఆధునిక సాంకేతికతలతో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది. ఇది భౌతిక విస్తీర్ణంలోనే కాకుండా, ఏకీకృత కమాండ్‌ వ్యవస్థలో కూడా ప్రత్యేకతను చూపుతుంది.

సాయుధ దళాలకు వ్యూహాత్మక కేంద్రం..
ఈజిప్టు సాయుధ దళాలు మధ్యప్రాచ్యం, ఆఫ్రికాలో అతిపెద్ద వాటిలో ఒకటి. ఆక్టగాన్‌ ఈ దళాలన్నింటినీ ఒకే కేంద్రం నుంచి నియంత్రించడానికి, సమన్వయం చేయడానికి, సంక్షోభ సమయాల్లో వేగవంతమైన నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడుతుంది. ఇది సాంప్రదాయిక సైనిక కార్యాలయాల నుండి ఆధునిక, సమగ్రమైన వ్యవస్థకు మార్పును సూచిస్తుంది. జాతీయ భద్రత, సరిహద్దు రక్షణ, అంతర్గత స్థిరత్వం వంటి అంశాల్లో ఇది కీలక పాత్ర పోషిస్తుంది.

ఈజిప్టు ‘న్యూ రిపబ్లిక్‌’ విజన్‌లో భాగం..
ఇది సైనిక ఆధునీకరణ, మౌలిక సదుపాయాల అభివృద్ధి, జాతీయ గర్వాన్ని ప్రతిబింబిస్తుంది. అయితే, ఇలాంటి భారీ ప్రాజెక్టులు ఆర్థిక వనరులు, నిర్వహణ సామర్థ్యం, సాంకేతిక నైపుణ్యాలపై ఆధారపడి ఉంటాయి.న్యూ క్యాపిటల్‌ మొత్తం ప్రాజెక్టు ఖర్చులు, ఆర్థిక సవాళ్ల నేపథ్యంలో ఈ కేంద్రం దీర్ఘకాలికంగా ఎంత సమర్థవంతంగా పనిచేస్తుందో చూడాలి. అయినప్పటికీ, ఇది ఈజిప్టు సైనిక మరియు జాతీయ సామర్థ్యాన్ని ప్రపంచ వేదికపై మరింత బలపరుస్తుందనడంలో సందేహం లేదు.

ఆక్టగాన్‌ ప్రారంభం ఈజిప్టు చరిత్రలో ఒక ముఖ్యమైన అధ్యాయం. ఇది కేవలం ఒక భవనం కాదు – జాతీయ సార్వభౌమత్వం, సైనిక సామర్థ్యం, ఆధునిక దృక్పథానికి సంకేతం. ప్రపంచ రక్షణ రంగంలో ఈజిప్టు ఇకపై మరింత శక్తివంతమైన స్థానాన్ని ఆక్రమించే అవకాశం ఉంది.

నెవ్వర్ బిఫోర్.. ఎవ్వర్ ఆఫ్టర్.. మనోడు పట్టిన ఈ క్యాచ్ అద్భుతం..అనన్యసామన్యం

Telangana T20 League
Telangana T20 League

Telangana T20 League: అది మామూలు క్యాచ్ కాదు. అమాంతం గాలిలో ఎగిరి సూపర్ మ్యాన్ లాగా అందుకున్నాడు. అదే సమయంలో తన శరీరాన్ని నియంత్రించుకున్నాడు.. బౌండరీ లైన్ కు సెంటీమీటర్ల దూరంలోనే ఆ క్యాచ్ అందుకొని అదరగొట్టాడు. ఈ అద్భుతం తెలంగాణ టి20 లీగ్ లో చోటుచేసుకుంది.

సాధారణంగా ఆటగాళ్ల అద్భుత ప్రదర్శన ఐపిఎల్ లేదా.. అంతర్జాతీయ మ్యాచ్లలో మనకు కనిపిస్తూ ఉంటుంది. కానీ తెలంగాణ టి20 లీగ్ లో అంతకు మించిన స్థాయిలో ఆటగాళ్లు ప్రదర్శన చేస్తున్నారు. ఈ టోర్నీ మీద అంచనాలు పెంచేస్తున్నారు.. ఈ టోర్నీలో వర్ధమాన ప్లేయర్లు ఎక్కువగా ఆడుతున్న నేపథ్యంలో అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. పైగా ఆటగాళ్లు కూడా అద్భుతంగా ఆడుతున్నారు. ప్రతి మ్యాచ్ ఏకపక్షంగా కాకుండా నువ్వా నేనా అన్నట్టుగా సాగుతోంది. దీంతో చూసే ప్రేక్షకులకు నరాలు తెగే ఉత్కంఠ లభిస్తుంది.. సాధారణంగా ఇటువంటి అనుభవాన్ని ప్రేక్షకులు అంతర్జాతీయ లేదా ఐపీఎల్ లాంటి మ్యాచ్ల సందర్భంగా సొంతం చేసుకుంటారు. కానీ తెలంగాణ టి20 లీగ్ లో అంతకుమించిన క్రికెట్ మజా అభిమానులకు లభిస్తోంది.

ఆదివారం ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో ఖమ్మం, రంగారెడ్డి జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో జైస్వాల్ అనే క్రీడాకారుడు పట్టిన క్యాచ్ అత్యద్భుతమైన స్థాయిలో ఉంది. బ్యాటర్ కొట్టిన బంతి బౌండరీ వైపు లేచింది.. బౌండరీ లైనుకు సెంటీమీటర్ల దూరంలో ఉన్న జైస్వాల్ అమాంతం గాలిలోకి ఎగిరాడు. స్పైడర్ మాన్ మాదిరిగా క్యాచ్ అందుకున్నాడు. తనను తాను నియంత్రించుకొని.. బంతిని పట్టుకున్నాడు. దీంతో బ్యాటర్ నిరాశతో మైదానాన్ని వీడి వెళ్లిపోయాడు.

దీనికి సంబంధించిన వీడియోను తెలంగాణ బిజెపి సి వి ఆనంద్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. 1982లో క్రికెట్ లీగ్ ఆడటం మొదలు పెట్టిన నాటి నుంచి అన్ని రకాల అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లలో ఇటువంటి మంచి క్యాచ్ ఎప్పుడూ చూడలేదని ఆనంద్ వ్యాఖ్యానించారు. జైస్వాల్ బౌండరీ లైన్ దాటకుండా.. తనను తాను నియంత్రించుకొని.. బంతిని అందుకున్న విధానం అద్భుతమంటూ సివి ఆనంద్ తన వ్యాఖ్యలను ఆ వీడియోకు జోడించారు.

'అయ్యగారే నెంబర్ 1' అంటూ అఖిల్ ని ర్యాగింగ్ చేసిన హీరోయిన్ భాగ్యశ్రీ.. వీడియో వైరల్..

Lenin First Day Collections
Lenin First Day Collections

Akhil Lenin Movie: అక్కినేని అఖిల్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘లెనిన్’ ఈ నెల 10 న ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిన్న తిరుపతి లో ఏర్పాటు చేశారు మేకర్స్. ఈ ఈవెంట్ కి , ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించిన అక్కినేని నాగార్జున విచ్చేసి అభిమానుల్లో ఉత్సాహం కలిగించే మాటలు మాట్లాడారు. ఈసారి కచ్చితంగా కొట్టబోతున్నాం అంటూ అభిమానులకు భరోసా ఇచ్చారు. ఇదంతా పక్కన పెడితే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ భాగ్యశ్రీ భొర్సే అఖిల్ ని ర్యాగింగ్ చేస్తునట్టు చేసిన కొన్ని స్లొగన్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. యాంకర్ సుమ హీరో , హీరోయిన్ , అక్కినేని నాగార్జున తో సరదాగా చేసిన చిట్ చాట్ లో ఈ అరుదైన ఘటన చోటు చేసుకుంది.

ముందుగా సుమ హీరోయిన్ భాగ్యశ్రీ తో మాట్లాడుతూ ‘మీరు ఏదైనా డైలాగ్ చెప్పండి.. దాన్ని ఎవరో ఒకరు అనుకరిస్తారు..ఎవరు మీ డైలాగ్ ని అనుకరించాలని అనుకుంటున్నారు’ అని అడగ్గా, భాగ్యశ్రీ శివాజీ పేరు చెప్తుంది. అప్పుడు శివాజీ , భాగ్యశ్రీ పోటాపోటీ గా సీనియర్ ఎన్టీఆర్ డైలాగ్ చెప్పడం ఈ ఈవెంట్ లో హైలైట్ గా నిల్చింది. అనంతరం సుమ మరో ప్రశ్న అడుగుతూ ‘మీ ఈవెంట్ ఆర్గనైజర్ (అఖిల్) మంచోడేనా.. పక్కనే కూర్చొని ఉన్నాడు’ అని అడగ్గా, అందుకు భాగ్యశ్రీ ‘అయ్యగారే నెంబర్ 1’ అని అంటుంది. దీనికి అఖిల్ తలపెట్టుకొని నవ్వడం కొసమెరుపు. ఈ వీడియో ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి. ఇక ఈ ఈవెంట్ లో మూవీ లో నటించిన ప్రతీ ఒక్కరు మాట్లాడిన మాటలు చూస్తుంటే , సినిమా ఔట్పుట్ అద్భుతంగా వచ్చిందని తెలుస్తోంది. సెకండ్ హాఫ్ లో ట్విస్టులు , ఎమోషన్స్ వర్కౌట్ అయితే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద వండర్స్ క్రియేట్ చేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికే ఈ ఏడాది సెకండ్ హాఫ్ లో విడుదలైన ‘పెద్ది’, ‘మా ఇంటి బంగారం’ చిత్రాల కారణంగా థియేటర్స్ హౌస్ ఫుల్స్ బోర్డ్స్ తో కళకళలాడాయి. ఇప్పుడు ‘లెనిన్’ దాన్ని కొనసాగిస్తుందో లేదో చూడాలి.

 

 

ప్రకాష్ రాజ్ మరి మారరా?

Prakash Raj
Prakash Raj

Prakash Raj: సినీ నటుడు ప్రకాష్ రాజ్ ఏం చేస్తున్నారో ఆయనకు అర్థం కావడం లేదు. ఇప్పటివరకు సమకాలిన అంశాలపై ఆయన స్పందిస్తున్నారని అంతా భావించారు. కానీ క్రమేపి ఆయన రూట్ తప్పుతున్నారు. దేశం కోసం వ్యతిరేకంగా మాట్లాడే వారిని.. ఉగ్రవాదులకు మద్దతు తెలిపే వారికి.. దైవదూషణలను చేసే వారికి… ప్రకాష్ రాజ్ మద్దతు తెలుపుతూ ఉండడం మాత్రం ఆందోళన కలిగిస్తోంది. ఆయన బలమైన వ్యూహంతో ఉన్నట్టు అనిపిస్తోంది. తాజాగా జోసెఫ్ రావణ్ విషయంలో ప్రకాష్ రాజ్ వ్యవహార శైలి విమర్శలకు గురిచేస్తోంది. పదే పదే వీడియోలను పోస్ట్ చేస్తూ.. జోసెఫ్ రావడం చేస్తున్నది కరెక్ట్ అన్నట్టు మాట్లాడడం మాత్రం తీవ్ర విమర్శలకు గురిచేస్తోంది. ప్రకాష్ రాజ్ శైలి ఈ దేశానికి, ఒక కులానికి, ఒక మతానికి, అంతకుమించి ఆధ్యాత్మిక నమ్మకాలకు వ్యతిరేకంగా ఉన్నారని అర్థం అవుతోంది.

* మెగా కుటుంబానికి టార్గెట్..
ప్రకాష్ రాజ్ మంచి నటుడు. అది కాదనలేని సత్యం కూడా. ప్రకాష్ రాజ్ లో ఉన్నది ఉన్నట్టు మాట్లాడే తత్వం గుర్తించి మెగా కుటుంబం ఆయనకు మూవీ ఆర్ట్స్ అసోసియేషన్ అధ్యక్ష పదవికి పోటీలో పెట్టింది. సినీ పరిశ్రమ వ్యతిరేకించినా ప్రకాష్ రాజు విషయంలో స్ట్రాంగ్ గా నిలబడింది మెగా ఫ్యామిలీ. ఆయన కోసం చిత్ర పరిశ్రమలో తన పరపతిని వదులుకుంది. అటువంటి మెగా ఫ్యామిలీ పై ఇప్పుడు కత్తి కట్టినట్లు మాట్లాడుతున్నారు ప్రకాష్ రాజ్. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ విషయంలో ఆయన వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకున్నారు. అదేపనిగా విమర్శలు చేస్తున్నారు. ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్ తో పాటు మెగా కుటుంబాన్ని టార్గెట్ చేశారు జోసెఫ్ రావణ్. ఇప్పుడు ఆయన చేస్తున్నది కరెక్ట్ అన్నట్టు ప్రకాష్ రాజ్ మాట్లాడుతున్నారు. ఇది ఎంత మాత్రం సహేతుకం కాదు.

* ఉగ్రవాదులకు మద్దతు..
ఉగ్రవాదుల కు హక్కులు ఉన్నాయి అన్నట్టు వాదిస్తున్నారు ప్రకాష్ రాజ్. చేతిలో ఆయుధం పట్టుకొని.. ప్రత్యర్థిని సంహరించే వ్యక్తులకు సైతం హక్కులు ఉన్నాయంటూ కొత్త పలుకులు పలుకుతున్నారు ప్రకాష్ రాజ్. ఇప్పటివరకు ఆయన భావజాలంలో స్పష్టమవుతోంది హిందుత్వ వ్యతిరేకం. ఆపై తప్పు చేసే వారిని.. తప్పులు మాట్లాడుతున్న వారికి అడ్డగోలుగా సమర్థిస్తున్నారు. అదే మంచి అని వాదిస్తున్నారు. తప్పులు చేసేవారిని సరిదిద్దుకోవాలని సూచించడం అసలైన మనిషి తత్వం. కానీ ఆ తప్పులను సమర్థించడం కాదు.. సమాజంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగేలా వ్యవహరించడం మాత్రం ముమ్మాటికీ తప్పిదమే. ఈ విషయంలో ప్రకాష్ రాజ్ మారకపోతే మాత్రం దోషికాక తప్పదు.

తుని చిన్నారి అదృశ్యమై నెల.. పాపం తల్లితండ్రీ పరిస్థితి చూడండి

Tuni Missing Girl
Tuni Missing Girl

Tuni Missing Girl: * వీడని మిస్టరీ..
తుని చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమై నేటితో నెల రోజులు గడుస్తోంది. కానీ ఇంతవరకు ఆమె ఆచూకీ దొరకలేదు. పోలీసులు చేయని ప్రయత్నం అంటూ లేదు. గత నెల ఆరున జ్ఞానేశ్వరి అదృశ్యమయింది. తన ఇంటి సమీపంలో పని నిమిత్తం బయటకు వెళ్లిన తండ్రిని వెతుక్కుంటూ వెళ్లిన చిన్నారి.. తరువాత కనిపించకుండా మానేసింది. వెంటనే కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. స్థానికులు సైతం చిన్నారి కోసం వెతుకులాట ప్రారంభించారు. కానీ గంటలు, రోజులు, వారాలు దాటుతున్న జ్ఞానేశ్వరి ఆచూకీ లేదు. దీంతో ఎన్టీఆర్ ఎఫ్, ఎస్టిఆర్ఎఫ్, ప్రత్యేక పోలీస్ బలగాలు జల్లెడ పట్టాయి. చుట్టుపక్కల ఉన్న తోటలు, పొదలు, బావులు, రైల్వే ట్రాక్ పరిసరాలతో పాటు అనుమానాస్పద ప్రాంతాలన్నింటిని డ్రోన్ కెమెరాల సాయంతో.. రోజుల తరబడి క్షుణ్ణంగా గాలించారు. అయినా ఆచూకీ లేకుండా పోయింది. సిసి ఫుటేజీలను పరిశీలించి.. అన్వేషించినా ఆచూకీ లేదు.

తొలుత అనుమానాస్పద కేసుగా భావించిన పోలీసులు ఆ దిశగా దర్యాప్తు ప్రారంభించారు. కిడ్నాప్ కోణంలో కూడా విచారణ చేపట్టారు. కుటుంబ సభ్యులను సైతం విచారించి అంతర్గత విషయాలను తెలుసుకున్నారు. అయినా కేసు మిస్టరీ విడలేదు. మరోవైపు ఈ కేసులో కీలకంగా ఉన్న పెంపుడు కుక్క కూడా అనారోగ్యంతో మృతి చెందింది. ఏదైనా అటవీ జంతువుల బారిన పడి ఉంటుంది అన్న అనుమానంతో పోలీసులు.. ఆ దిశగా కూడా విచారణ చేపట్టారు. కానీ అందులో కూడా ఎటువంటి పురోగతి లభించలేదు. దీంతో నెల రోజులు గడుస్తున్న చిన్నారి ఆచూకీ దొరకకపోవడం పోలీస్ శాఖకు ఒక సవాల్.

* తల్లిదండ్రులకు కడుపుకోత.
తమ కళ్ళముందు ఆడుకుంటూ తిరిగిన బిడ్డ నెలరోజులైనా ఇంటికి చేరకపోవడంతో ఆ తల్లిదండ్రుల కడుపుకోత వర్ణనాతీతం. కూతురిపై బెంగతో తల్లి కన్నీరు మున్నేరుగా వినిపిస్తోంది. అన్న పానీయాలు మానేసి అపస్మారక స్థితికి చేరుకొంటోంది. మరోవైపు గుండె నిండా బాధగా ఉన్నప్పటికీ ఎలాగైనా తన ప్రాణ సమానమైన బిడ్డను వెతికి పట్టుకోవాలని పట్టుదలతో తండ్రి ఉన్నారు. చిన్నారి ఫోటో, వివరాలతో కూడిన పోస్టర్లు బస్టాండ్ లతోపాటు రైల్వేస్టేషన్లో అతికించారు. ఏదోరోజు పాప ప్రాణాలతో తమకు చిక్కుతుందన్న ఆశ వారిలో ఉంది. అందుకే పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.

అనసూయ అందాలు చూడతరమా?

Anasuya Bharadwaj
Anasuya Bharadwaj

1995 లోనే మోహన్ బాబు కి 45 లక్షలు ఇచ్చి ఆదుకున్న ఆ స్టార్ హీరో...

Mohan Babu
Mohan Babu

Mohan Babu: ఒకప్పుడు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు సినిమా ఇండస్ట్రీలో పెను సంచలనాలను క్రియేట్ చేశాడు. కెరియర్ మొదట్లో విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన ఆయన ఆ తర్వాత హీరోగా మారి సూపర్ హిట్ సినిమాలను చేశాడు. ఒకానొక సందర్భంలో మోహన్ బాబు కి వరుసగా ఫ్లాప్ సినిమాలు రావడంతో రజనీకాంత్ సలహా మేరకు ‘పెదరాయుడు’ సినిమా చేసి సూపర్ సక్సెస్ ని సాధించాడు. పెదరాయుడు సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు మోహన్ బాబు దగ్గర డబ్బులైతే అంత ఎక్కువగా లేవట. ఇక ప్రొడ్యూసర్ కూడా తనే కావడం వల్ల ఏం చేయాలో తెలియని ఒక పరిస్థితిలో ఉన్నప్పుడు రజినీకాంత్ కి ఆ విజయం తెలిసిందట.

దాంతో తనే స్వయంగా హైదరాబాద్ వచ్చి మోహన్ బాబుని కలిసి అతనికి 45 లక్షల రూపాయలను ఇచ్చారట. నీ దగ్గర డబ్బులు లేవని అర్థమైంది. ప్రస్తుతానికైతే ఈ డబ్బులతో సినిమా చేసేయ్ మూవీ సక్సెస్ అయిన తర్వాత నాకు ఇచ్చేయి అని ఆయన చెప్పారట.

మొత్తానికైతే మోహన్ బాబుకి అంత మంచి సపోర్ట్ ఇచ్చిన వారు ఎవరు ఇండస్ట్రీలో లేరంటు ఆయన ఒక సందర్భంలో చెప్పడం ఇప్పుడు సోషల్ మీడియా విపరీతంగా వైరల్ అవుతుంది. మోహన్ బాబు లాంటి నటుడిని ఎంకరేజ్ చేసిన వ్యక్తులు చాలా మంది ఉండొచ్చు. కానీ అతను ప్లాపుల్లో ఉన్నప్పుడు తనకు డబ్బులు ఇచ్చి మరి ఒక సినిమాని రీమేక్ చేయమని చెప్పి, ఆ మూవీ రీమేక్ రైట్స్ కూడా రజినీకాంత్ ఇచ్చాడు.

అలాగే ఆ మూవీలో యాక్టింగ్ చేసి మరి ఆ సినిమా సక్సెస్ సాధించడానికి కీలకపాత్ర వహించిన రజనీకాంత్ కి నేను ఎప్పుడు రుణపడి ఉంటానని మోహన్ బాబు పలు సందర్భాల్లో చెప్పాడు. ఇక ఏది ఏమైనా కూడా వీళ్లిద్దరి మధ్య చాలా మంచి ఫ్రెండ్షిప్ ఉంది. ఒకరికి ఒకరు అరేయ్ అనుకునే అంత చనువు ఉంది. దాంతోనే వీళ్ళిద్దరు ఎప్పటికప్పుడు కలుసుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు…

ప్యారడైజ్ బ్లాక్ బస్టర్ అంటున్న నాగవంశీ... కారణం ఇదేనా..?

Paradise Movie
Paradise Movie

Paradise Movie: ఎప్పుడు ఏదో ఒక కాంట్రవర్సీ కామెంట్ చేసి ప్రేక్షకులు అటెన్షన్ ను తన వైపు తిప్పుకునే ప్రొడ్యూసర్ నాగ వంశీ… భారీ సినిమాలను నిర్మిస్తూ టాప్ ప్రొడ్యూసర్ గా పేరు సంపాదించుకున్నప్పటికి ఆయన ఏదో ఒక విషయంలో కాంట్రవర్సీ కామెంట్స్ అయితే చేస్తాడు. అలాంటి నాగ వంశీ ఇప్పుడు ప్యారడైజ్ సినిమా విషయంలో చాలా కాన్ఫిడెంట్ ను వ్యక్తం చేస్తున్నాడు. ఈ మూవీ ఎప్పుడు వచ్చిన సూపర్ సక్సెస్ ని సాధిస్తుంది అంటూ ఆయన చెప్పిన మాటలు ఇప్పుడు సైకిల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇప్పటికే పారడైజ్ సినిమా మీద భారీ అంచనాలైతే ఉన్నాయి. మరి ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఆ సినిమాను తెరకెక్కిస్తున్నట్టుగా తెలుస్తుంది. 200 కోట్లకు పైన బడ్జెట్ ను కేటాయిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ సినిమా ఏ రేంజ్ కలెక్షన్స్ ని రాబడుతుంది. తద్వారా ప్రేక్షకుల్లో ఎలాంటి ఐడెంటిటి ని సంపాదించుకుంటుంది అనేది ఇప్పుడు కీలకమైన అంశంగా మారింది.

ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో తనకంటూ ఒక క్రెడిబులిటిని సంపాదించుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు. అలాగే ఈ మధ్య కాలంలో నాని చేసిన సినిమాలకు భారీ కలెక్షన్స్ రావడం లేదనే ఒక విమర్శిని ఆయన మోస్తున్నాడు. కాబట్టి ఈ సినిమాతో 300 కోట్లకు పైన కలెక్షన్స్ రాబట్టాలనే ప్రయత్నం చేస్తున్నాడు. తను అనుకున్నట్టుగానే ఈ సినిమా సక్సెస్ ను సాధిస్తుందా?

ప్రేక్షకుడికి ఒక గొప్ప అనుభూతిని ఇస్తుందా? లేదా అనేది తెలియాల్సి ఉంది. మధ్యలో నాగ వంశీ ఈ సినిమా మీద చాలా కాన్ఫిడెంట్ గా ఉండటం అనేది ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది…ఈ సినిమాకి నాగ వంశీ డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరిస్తున్నాడా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మొత్తానికైతే ఆయన కనక డిస్ట్రిబ్యూట్ చేసినట్లయితే మాత్రం సినిమా మంచి రిలీజ్ అవుతుంది. అలాగే ప్రేక్షకుల నుంచి కూడా ఈ సినిమా భారీ వసూళ్లను రాబట్టే అవకాశాలైతే ఉన్నాయి…

నాని మార్కెట్ ను బీట్ చేయాలని చూస్తున్న అఖిల్...దాని కోసం మాస్టర్ ప్లాన్ వేశాడుగా...

Akhil vs Nani
Akhil vs Nani

Akhil vs Nani: తెలుగు సినిమా ఇండస్ట్రీలో తమకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటి క్రియేట్ చేసుకున్న నటులలో నాని ఒకరు… ఆయన నుంచి వచ్చిన ప్రతి సినిమా ఏదో ఒక వైవిధ్యాన్ని సంతరించుకుంటుంది. ఇప్పుడు ఆయన మాస్ హీరోగా మారడానికి తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇంతకుముందు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో చేసిన దసర సినిమాతో లో మంచి ఫాలోయింగ్ ను సంపాదించుకున్న ఆయన ప్యారడైజ్ సినిమాతో తనకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు. తను అనుకున్నట్టుగానే ఈ సినిమాతో భారీ విజయాన్ని సాధిస్తాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే… ఇక ఇదిలా ఉంటే అక్కినేని ఫ్యామిలీ మూడో తరం నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అఖిల్ ప్రస్తుతం ఒక్క సక్సెస్ ని సాధించడానికి నానా తంటాలు పడుతున్నాడు. ప్రస్తుతం ‘లెనిన్’ సినిమాతో ఈవారం ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమా ఏ రేంజ్ సక్సెస్ ని సాధిస్తుంది. ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణ ను రాబడుతుందా? లేదా అనేది కీలకంగా మారింది…

మొత్తానికైతే నానిని బీట్ చేసి అతని మార్కెట్ ని కబ్జా చేయాలని అఖిల్ చూస్తున్నాడు. ప్రస్తుతం నానికి 100 కోట్లకు పైన మార్కెట్ ఉంది. అఖిల్ కి 30 కోట్ల మార్కెట్ కూడా లేదు. మరి ఇలాంటి క్రమంలో ఆయన నాని ని బీట్ చేయడం సాధ్యమవుతుందా? లెనిన్ సినిమా బ్లాక్ బస్టర్ అయితే తప్ప 100 కోట్ల కలెక్షన్స్ ని రాబట్టే అవకాశాలైతే లేవు.

మరి ఇలాంటి క్రమంలో అఖిల్ ఈ మూవీ తో ఏ రేంజ్ సక్సెస్ ని సాధిస్తాడు. ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణ సంపాదించుకోగలిగే కెపాసిటి అఖిల్ కి ఉందా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది… మొత్తానికైతే నాని మాస్ హీరోగా మారుతున్నాడు. కాబట్టి అఖిల్ తన మార్కెట్ ను బీట్ చేయగలిగితే నాని కంటే పెద్ద హీరో అయిపోవచ్చు అనే ధోరణిలో ఆలోచిస్తున్నాడు.

ఇప్పటివరకు అఖిల్ చేసిన సినిమాలు అతనికి ఏ రకంగాను హెల్ప్ కాలేదు. మరి ఇకమీదటైనా ఆయన జాగ్రత్తగా వ్యవహరిస్తూ కథల విషయంలో క్లారిటిని మెయింటైన్ చేస్తూ ముందుకు సాగితే బాగుంటుందని సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు…

రావణ్ కు బ్రతికేహక్కు లేదు.. మరణశిక్ష పడే సెక్షన్ల కింద సంచలన కేసు

YouTuber Ravan
YouTuber Ravan

Joseph Ravan: జోసెఫ్ రావణ్ అరెస్టు ఒక ఎత్తు అయితే.. ఆయనపై నమోదైన కేసులు మరో ఎత్తు. ఏకంగా మరణశిక్షపడేలా సెక్షన్లు నమోదు చేశారని ఆయన తరుపు వాదిస్తున్న జడ శ్రావణ్ కుమార్ చెబుతున్నారు. ఆయనకు వ్యతిరేకంగా 25 మంది న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఇప్పట్లో ఆయనకు బెయిల్ వచ్చే అవకాశం కూడా లేదు ఇప్పటివరకు ఆయన సాధారణ సోషల్ మీడియా కేసుల్లో అరెస్టు చేసినట్లు అంతా భావించారు. కానీ ఆయనపై గన్నవరం పోలీస్ స్టేషన్ లో ఉపా చట్టం కింద కేసు నమోదయింది. ఈ అఫీషియల్ అరెస్ట్ నోటీసు ప్రకారం.. చట్టంలోని సెక్షన్ 13, సెక్షన్ 39 ప్రకారం ఉగ్రవాద సంస్థలకు మద్దతిచ్చిన కారణంగా ఈ కేసులు పెట్టారు. అత్యంత కఠినమైన దేశద్రోహం ముద్ర కలిగిన సెక్షన్లను చేర్చారు. వీటితోపాటు భారతీయ న్యాయ సంహితలోని పలు తీవ్రమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడం విశేషం.

* బలమైన వాదనలు..
ప్రస్తుతం జోసెఫ్ రావణ్ తరఫున జడ శ్రవణ్ కుమార్ వాదనలు వినిపిస్తున్నారు. కేసు విచారణలో భాగంగా 25 మంది న్యాయవాదులు ప్రభుత్వం తరఫున రంగంలోకి దిగడంతో శ్రావణ్ కుమార్ ఉక్కిరి బిక్కిరి అయ్యారు. ముఖ్యంగా ఉపా చట్టం కింద కేసు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. సాధారణ కేసుల్లో నిందితుడిని అరెస్టు చేసిన 24 గంటల్లోపు తప్పనిసరిగా స్థానిక మేజిస్ట్రేట్ లేదా కోర్టు ముందు ప్రవేశపెట్టాలి. కానీ ఈ ఉపా చట్టం కింద నిర్బంధించినప్పుడు పోలీసులకు లీగల్ గా అదనపు సమయం, కొన్ని మినహాయింపులు లభిస్తాయి. నిందితుడిని కోర్టు అనుమతితో గరిష్టంగా 30 రోజుల వరకు పోలీస్ కస్టడీకి తీసుకునే వెసులుబాటు ఉంటుంది. సాధారణ కేసుల్లో 60 నుంచి 90 రోజుల్లోగా చార్జ్ షీట్ దాఖలు చేయాల్సి ఉండగా.. ఉపా కేసుల్లో దర్యాప్తు సంస్థలకు కోర్టు అనుమతితో 180 రోజుల వరకు చార్జ్ షీట్ దాఖలు చేసే గడువు ఇస్తుంది.

* బెయిల్ సులభం కాదు..
ఈ చట్టం కింద ఒక్కసారి కేసు నమోదు అయితే నిందితుడికి అంత సులభంగా బెయిల్ లభించదు. ఈ చట్టంలోని సెక్షన్ 43డ్ (5) ప్రకారం నిందితుడిపై మోపిన ఆరోపణలు ప్రాథమికంగా నిజం అని కోర్టు భావిస్తే.. సదరు నిందితుడికి బెయిల్ నిరాకరించే సంపూర్ణ హక్కు న్యాయస్థానాలకు ఉంటుంది. సాధారణ కేసుల్లో బెయిల్ అనేది ఒక హక్కు, జైలు అనేది ఒక మినహాయింపు. కానీ ఈ చట్టం కింద మాత్రం అది వర్తించదు. ఈ కేసులో నిందితుడు తరుపు వాదించే లాయర్లకు కూడా కోర్టులో తక్షణ ఉపశమనం లేదా బెయిల్ తీసుకురావడం చట్టపరంగా అతిపెద్ద సవాల్. ఇప్పుడు అదే
నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు జోసఫ్ రావణ్ తరఫున వాదిస్తున్న జడ శ్రావణ్ కుమార్. మరణశిక్షతో సమానమైన సెక్షన్లు పెట్టారని.. 25 మంది న్యాయవాదులు వాదిస్తున్నారని.. వందలాదిమంది పోలీసులను ప్రయోగిస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు. ఇప్పట్లో రావణ్ బయటకు రావడం అసాధ్యం అని సంకేతాలు ఇస్తున్నారు.

వైసీపీకి ఆ సీనియర్ నేత గుడ్ బై!

YSR Congress Party
YSR Congress Party

YSR Congress Party: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలమైన కుటుంబాలు గుడ్ బై చెప్పేందుకు సిద్ధమవుతున్నాయి. ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. అటువంటి వారంతా పార్టీని వీడలేక.. ఉండలేక సతమతం అవుతున్నారు. జగన్ సీరియస్ రాజకీయాలు చేయకపోవడం, మళ్లీ అధికారం తనదేనని ధీమా వ్యక్తం చేస్తుండడం, అందుకు ఎటువంటి కృషి చేయకపోవడంతో సీనియర్లు చేతులెత్తేస్తున్నారు. ఇక పార్టీలో ఉండలేమని తేల్చి చెబుతున్నారు. తాజాగా ఉమ్మడి నెల్లూరు జిల్లాకు చెందిన మేకపాటి కుటుంబం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. టిడిపిలో చేరికకు రంగం సిద్ధమైనట్లు టాక్ నడుస్తోంది. చంద్రబాబు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

* కాంగ్రెస్ ను విభేదించి..
కాంగ్రెస్ పార్టీని విభేదించి జగన్మోహన్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేశారు. ఆ సమయంలో చాలా కుటుంబాలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాయి. ప్రధానంగా నెల్లూరు జిల్లాకు చెందిన మేకపాటి ఫ్యామిలీ జగన్మోహన్ రెడ్డిని అనుసరించింది. రాజశేఖర్ రెడ్డి పై ఉన్న అభిమానంతో కాంగ్రెస్ పార్టీతో ఉన్న సుదీర్ఘ అనుబంధాన్ని తెంచుకున్నారు మేకపాటి. అయితే మేకపాటి ఫ్యామిలీకి క్రమేపి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ప్రాధాన్యత తగ్గుతోంది. ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి వెంట ఉంటే ఇబ్బందికర పరిస్థితులు వస్తాయని మేకపాటి ఫ్యామిలీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెబుతానని గత కొన్నేళ్లుగా ప్రచారం జరుగుతోంది. కానీ జగన్ మోహన్ రెడ్డి వైపు ఎటువంటి బుజ్జగింపులు లేవు. అదే సమయంలో టిడిపి నుంచి సానుకూలత రావడంతో మేకపాటి ఫ్యామిలీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడేందుకు దాదాపు ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

* పట్టున్న నేత..
ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు జిల్లాలో మేకపాటి ఫ్యామిలీకి మంచి పట్టు ఉంది. రాజశేఖర్ రెడ్డితో మంచి సంబంధాలు కొనసాగించేవారు మేకపాటి రాజమోహన్ రెడ్డి. ఎంపీగా సుదీర్ఘకాలం ప్రాతినిధ్యం వహించారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో రాజకీయంగా ఆయనది చెరగని ముద్ర. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఆయన కుమారుడు మేకపాటి గౌతమ్ రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా కూడా పని చేశారు. ఆయన అకాల మృతితో మరో కుమారుడు విక్రమ్ రంగంలోకి దిగారు. ఒకసారి మాత్రమే ఎమ్మెల్యేగా పనిచేశారు. మొన్నటి ఎన్నికల్లో మేకపాటి రాజమోహన్ రెడ్డి తో పాటు విక్రమ్ రెడ్డి సైతం పోటీ చేశారు. కానీ ఇద్దరు ఓడిపోయారు. మేకపాటి గౌతంరెడ్డి మరణం తర్వాత ఆ ఫ్యామిలీకి రాజకీయంగా ప్రాధాన్యత తగ్గిపోయింది. ప్రస్తుతం మేకపాటి రాజమోహన్ రెడ్డి కుమారులు వ్యాపారాల్లో నిమగ్నమయ్యారు.

* ఆ కారణంతోనే..
జగన్మోహన్ రెడ్డి ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకోలేదు. ఇప్పటికీ ఆ జూనియర్లను నమ్ముకొని రాజకీయాలు చేస్తున్నారు. ఇది ఎంత మాత్రం మింగుడు పడడం లేదు సీనియర్లకు. ఇదే విషయాన్ని పలుమార్లు ప్రస్తావించారు మేకపాటి రాజమోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి తీరు మారాలని ఎక్కువగా కోరుకున్నారు. కానీ ఆయన వైఖరిలో ఎటువంటి మార్పు రాలేదు. అందుకే తన దారి తాను చూసుకోవాలని భావిస్తున్నారు. మేకపాటి రాజమోహన్ రెడ్డి లాంటి సీనియర్ నేత పార్టీలోకి వస్తానంటే కచ్చితంగా ఆహ్వానం పలుకుతామని చంద్రబాబు నుంచి సమాచారం రావడంతో తీవ్ర నిర్ణయం దిశగా మేకపాటి రాజమోహన్ రెడ్డి అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. చూడాలి మరి ఆ ప్రచారంలో నిజం ఎంత ఉందో..