Home Blog Page 22

వైసీపీ చేతిలో బ్రహ్మాస్త్రంగా మారిన సుగాలి ప్రీతి తల్లి.. ఇరకాటంలో పడ్డ పవన్ కళ్యాణ్..

Sugali Preethi
Sugali Preethi

Sugali Preethi: ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి మనమంతా చూస్తూనే ఉన్నాం . ముఖ్యంగా వైసీపీ పార్టీ ఇంకా పాత పద్ధతులనే అనుసరిస్తూ ముందుకు వెళ్తోంది. వాళ్ళ వ్యూహాలను చిన్న పిల్లలు కూడా కనిపెట్టేలా ఉన్నారు. జెన్ జీ కాలం లో ఇంకా ఈ పాత పద్ధతులు ఏంటి?, ఇకనైనా మారండి అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. రీసెంట్ గా వైసీపీ పార్టీ కి సుగాలి ప్రీతీ తల్లి పార్వతి బ్రహ్మాస్త్రం గా మారిపోయింది. సుగాలి ప్రీతీ అనే పేరు తెలియనోళ్లు ఎవ్వరూ ఉండరు , ఆమె కోసం ప్రతిపక్షం లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఏ రేంజ్ లో పోరాడాడో మన కళ్లారా చూసాము. 2017 లో సుగాలి ప్రీతీ అనే చిన్నారి స్కూల్ రూమ్ లో ఆత్మహత్య చేసుకొని చనిపోయింది.

కానీ అది ఆత్మహత్య కాదు , కావాలని ఆ బిడ్డపై అఘాయిత్యం చేసి చంపేశారు అని నిర్ధారణ అయ్యింది. ఈ అంశాన్ని తీసుకొని పోరాటం చేయడానికి అప్పట్లో ఎవ్వరు ముందుకు రాలేదు. ఎందుకంటే ఇందులో నిందితులుగా రాజకీయ నేపథ్యం ఉన్నోళ్లు ఉన్నారు. అందుకే కేవలం సోషల్ మీడియా లో ట్రెండింగ్ కి మాత్రమే పరిమితమైన ఈ అంశాన్ని పవన్ కళ్యాణ్ తన భుజాన వేసుకున్నారు. సుగాలి ప్రీతీ తల్లికి అండగా, ఆమెకు న్యాయం చేయడం కోసం లక్షలాది మంది జనం తో కవాత్తు నిర్వహించి , అప్పటి వైసీపీ ప్రభుత్వం పై తీవ్రమైన ఒత్తిడి కలిగేలా చేశారు. జనాల్లో ఈ అంశం పై ప్రభుత్వ అలసత్వం పట్ల నిరసన వ్యక్తం అవుతుండడంతో ప్రభుత్వం క్రిందకు దిగి ఈ కేసు ని CID కి అప్పగిస్తున్నట్టు ఒక జీవో ని విడుదల చేసింది . కానీ అది డమ్మీ జీవో అని స్వయంగా సుగాలి ప్రీతీ తల్లి గతంలో మాట్లాడిన వీడియోలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.

వైసీపీ ప్రభుత్వ హయాం లోనే ఆధారాలన్నీ మిస్ అయ్యాయి. ఈ విషయం లో ఎలాంటి న్యాయం జరగదు అనేది జగన్ హయాం లోనే అందరికీ తెలుసు. దీంతో ఆమెకు ఒక ప్రభుత్వం తరుపున ఒక భూమి, ఇల్లు , ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించారు. ఇక కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పవన్ కళ్యాణ్ తీసుకున్న మొదటి కేసు ఇదే. విచారణ చేపట్టి, పరిశీలించిన తర్వాత ఆధారాలు మిస్ అయ్యాయి అనే విషయం ఆయనకు తెలిసింది. ఇప్పుడు ఆయన కూడా న్యాయం చెయ్యలేని పరిస్థితి ఏర్పడింది. ఈ అంశం లో పవన్ కళ్యాణ్ మాత్రమే కాదు , స్వయంగా సుగాలి ప్రీతీ తల్లి పర్వతే ఎమ్మెల్యే అయినా కూడా న్యాయం చెయ్యలేదు , ఎందుకంటే ఆధారాలు లేవు కాబట్టి. ఇవన్నీ ఆమెకు తెలిసి కూడా నేడు మీడియా ముందుకొచ్చి పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేయడం అందరినీ షాక్ కి గురి చేస్తోంది.

నిన్న మొన్నటి వరకు జనాల్లో ఈమెపై సానుభూతి ఉండేది , పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా ఈ విషయం లో ఈమె వైపే ఉండేవారు. కానీ ఎప్పుడైతే ఈమె రావణ్ అరెస్ట్ ని వ్యతిరేకిస్తూ , వైసీపీ స్క్రిప్ట్ ని చదవడం మొదలు పెట్టిందో , ఈమెపై జనాల్లో సానుభూతి పోయింది. వైసీపీ ఈమెని రాజకీయంగా ఉపయోగించుకుంటుంది అనే విషయం చిన్న పిల్లవాడికి కూడా అర్థం అయ్యేలా మీడియా ముందుకొచ్చి పవన్ కళ్యాణ్ పై ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతోంది. ఇకపై ప్రభుత్వ తప్పుల మీద ప్రశ్నిస్తాను అంటోంది. పవన్ కళ్యాణ్ పై కేసులు పెడతాను అంటోది. ఎవ్వరు అండగా లేని సమయం లో నీకోసం నిలబడి పోరాడిన ఏకైక వ్యక్తి మీద ఇలాంటి ఆరోపణలు చేయడం చాలా ఛండాలంగా ఉంది అంటూ సోషల్ మీడియా లో ఈమెపై విరుచుకుపడుతున్నారు నెటిజెన్స్. రాబోయే రోజుల్లో ఈమెని వైసీపీ పవన్ మీదకు బ్రహ్మాస్త్రం లాగా వాడనుండి , వచ్చే ఎన్నికల్లో ఈమెని పిఠాపురం లో పవన్ కళ్యాణ్ కి సవాలు చేస్తూ, వైసీపీ ఈమెకు ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

కెరియర్ మొదట్లో నాగ చైతన్య ఆ స్టార్ హీరో తో పోటీ పెట్టుకున్నాడా..?

Naga Chaitanya
Naga Chaitanya

Naga Chaitanya: సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నప్పటికి కొంతమందికి మాత్రమే ఇక్కడ చాలా మంచి గుర్తింపైతే ఉంటుంది. అక్కినేని ఫ్యామిలీ హీరోలకు ఎనలేని క్రేజ్ ఉంది. కానీ ఈ తరం అక్కినేని హీరోలు మాత్రం వల్ల క్రేజ్ ను వాడుకోవడంలో చాలా వరకు వెనుకబడిపోతున్నారు. నాగ చైతన్య లాంటి హీరో జోష్ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినప్పటికి మొదటి సినిమాతో ఆకట్టుకోలేదు. ఆ తర్వాత చేసిన ‘ఏ మాయ చేసావే’ సినిమా అతనికి మంచి క్రేజ్ ను తీసుకొచ్చింది. కెరియర్ మొదట్లో నాగచైతన్య ఒక హీరోతో పోటీపడ్డాడనే విషయం చాలామందికి తెలియదు. ఇంతకీ ఆ హీరో ఎవరు అంటే వరుణ్ సందేశ్ కావడం విశేషం…కెరియర్ స్టార్టింగ్ లోనే హ్యాపీడేస్, కొత్త బంగారులోకం లాంటి రెండు బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ లను సాధించడంతో నాగచైతన్య కంటే ముందు వరుసలో వరుణ్ సందేశ్ ముందుకు దూసుకెళ్లాడు.

ఇక ఈ క్రమంలోనే అతన్ని బీట్ చేయాలనే ఉద్దేశంతో 100% లవ్ సినిమా స్టోరీని సుకుమార్ వరుణ్ సందేశ్ తో చేయాల్సి ఉన్నప్పటికి నాగ చైతన్య కావాలనే వరుణ్ సందేశ్ దగ్గర నుంచి ఆ కథను తీసుకున్నాడనే వార్తలైతే అప్పట్లో ఫిలింనగర్ సర్కిల్లో విపరీతంగా చక్కర్లు కొట్టాయి. మరి దానికి తగ్గట్టుగానే 100% లవ్ సినిమాతో నాగచైతన్య హీరోగా నిలబడ్డాడు.

వరుణ్ సందేశ్ మాత్రం అవకాశాలు లేక వచ్చిన అవకాశాలతో ఉపయోగం లేక చాలావరకు డీలా పడిపోతున్నాడు. ఇక నాగ చైతన్య ఒక మోస్తరు సక్సెస్ ని సాధిస్తూ ముందుకు సాగుతున్నప్పటికి ఆయన కూడా స్టార్ హీరో రేంజ్ కి వెళ్ళలేకపోతున్నాడు… మొత్తానికైతే ఇప్పుడున్న టైర్ వన్ హీరోల్లో చోటు సంపాదించుకోవాలంటే నాగచైతన్య ఇంకా చాలా రకాల కసరత్తు చేయాల్సి ఉంది…

ఇప్పటి వరకు ఆయన చేసిన సినిమాలు అతన్ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తే ఇకమీదట చేయబోయే సినిమాలు అతన్ని టాప్ లెవెల్ కి తీసుకెళ్లాల్సిన అవసరమైతే ఉంది…రాబోయే సినిమాలు తేడా కొడితే ఆయన చాలావరకు డీలాపడిపోయే ప్రమాదం ఉంది. అలాగే టైర్ వన్ హీరోలతో పోటీ పడడం కాదు కదా వాళ్ళ దరిదాపుల్లోకి కూడా వెళ్లే అవకాశం లేదు…

తెలుగులో సిద్ధార్థ్ సినిమా చేయకుండా అతన్ని తొక్కేసింది ఎవరు..?

Siddharth
Siddharth

Siddharth: తెలుగు సినిమా ఇండస్ట్రీలో వరుసగా సక్సెస్ లను సాధిస్తూ లవర్ బాయ్ ఇమేజ్ ను సంపాదించుకున్న హీరో సిద్ధార్థ్… శంకర్ డైరెక్షన్ లో తమిళంలో చేసిన బాయ్స్ సినిమాని తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేశారు. ఈ సినిమాతో సూపర్ సక్సెస్ ను సాధించాడు. ఇక ఈ సినిమా తర్వాత ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’, ‘బొమ్మరిల్లు’ సినిమాలతో భారీ విజయాలను అందుకొని తనకంటూ ఒక ఐడెంటిటిని ఏర్పాటు చేసుకున్నాడు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో లవర్ బాయ్ ఇమేజ్ ని సంపాదించుకొని అమ్మాయిల కలల రాకుమారుడి గా పేరు సంపాదించుకున్న సిద్ధార్థ్ చాలా సంవత్సరాల పాటు ఇండస్ట్రీని ఏలుతున్నాడని అందరు అనుకున్నారు. కానీ అనుకోని కారణాల వల్ల ఆయన చాలావరకు ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. ప్రస్తుతం అతను సినిమాలేమీ చేయకుండా ఖాళీగా ఉంటున్నాడు. తమిళ్ సినిమా ఇండస్ట్రీలో అవకాశాల కోసం ఎదురుచూస్తున్నాడు. దొరికిన ప్రతి అవకాశాన్ని వాడుకుంటున్నాడు. శంకర్ డైరెక్షన్ లో గత సంవత్సరం వచ్చిన ‘ఇండియన్ 2’ మూవీలో సైతం నటించాడు.

అయినప్పటికి ఆ సినిమా ఏ మాత్రం అతనికి హెల్ప్ కాలేదు… ఇక ఇప్పుడు మరికొన్ని సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. అయితే సిద్ధార్థ్ ను కావాలనే కొంతమంది తెలుగు సినిమా ఇండస్ట్రీలో తొక్కేసారు అంటూ అప్పట్లో వార్తలైతే వచ్చాయి.

కానీ ఆయన్ని తొక్కాల్సిన పనిలేదు ఆయనే సరైన సినిమాలు ఎంచుకోలేక సక్సెస్ లను సాధించలేక కెరీర్ ని పూర్తిగా కోల్పోయాడంటు మరి కొంతమంది కామెంట్స్ చేస్తుండడం విశేషం…ఇక దానికి తోడుగా ఆయన సినిమాలను ఎంచుకోవడమే కాకుండా హీరోయిన్లతో ఎఫైర్స్ పెట్టుకొని దాని వల్ల కూడా కొంతవరకు పర్సనల్ గా డిప్రెషన్ లోకి వెళ్ళాడంటూ మరి కొంతమంది చెబుతున్నారు.

ఇక ఏది ఏమైనా కూడా సిద్ధార్థ్ ప్రస్తుతం సినిమాలు చేసి మరోసారి తనను తాను ప్రూవ్ చేసుకోవాల్సిన సమయమైతే ఆసన్నమైంది… ఇక ఏది ఏమైనా కూడా సీనియర్ హీరోలందరు కూడా విజయాలను సాధిస్తున్నారు. కాబట్టి సిద్ధార్థ్ సైతం మరోసారి తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి వరుస సినిమాలను చేస్తే అతని అభిమానులు సైతం ఆనందపడతారు…

తొక్కలో అమెరికా లేకుంటే ఏంటీ.. ఇండియా ఉందన్న ఇజ్రాయెల్

Israel India Relationship
Israel India Relationship

India Israel Relations: భారత్ – ఇజ్రాయెల్ మధ్య దశాబ్దాలుగా పత సంబంధాలు కొనసాగుతున్నాయి. ఇరుదేశాల మధ్య రక్షణ వ్యాపార సంబంధాలు క్రమంగా పెరుగుతున్నాయి. ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ ఇజ్రాయెల్ లో పర్యటించారు. కీలక ఒప్పందాలు చేసుకున్నారు. ఆపరేషన్ ఇందూరు సమయంలో ఇజ్రాయెల్ భారత్ కు రహస్యంగా సహకారం అందించిందని ప్రచారం కూడా ఉంది. ఇలాంటి తరుణంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇటీవలి వ్యాఖ్యలు ప్రపంచ రాజకీయాల్లో కొత్త అధ్యాయాన్ని సూచిస్తున్నాయి. అమెరికా వైస్ ప్రెసిడెంట్ జెడి వాన్స్ అమెరికాను ఇజ్రాయెల్‌కు ఏకైక ప్రధాన మద్దతుదారుగా పేర్కొన్నారు. దీనికి నెతన్యాహు ఇండియాను బలమైన, విశ్వసనీయ మిత్రుడిగా ప్రకటించారు. “ఇండియాకు 1.4 బిలియన్ జనాభా ఉంది. అక్కడ మాకు అద్భుతమైన మద్దతు లభిస్తోంది” అని ఆయన పేర్కొన్నారు. ఇది అమెరికా మద్దతు ఎలా ఉన్నా ఇండియా ఒక బలమైన ఆధారం అనే సందేశాన్ని ఇస్తోంది.

నెతన్యాహు వ్యాఖ్యల నేపథ్యం..
ఇజ్రాయెల్‌పై అంతర్జాతీయ ఒత్తిడి పెరిగిన సమయంలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కీలక వ్యాఖ్యలు చేశారు. గాజా, ఇరాన్, లెబనాన్ సంఘర్షణల నేపథ్యంలో ఇజ్రాయెల్‌పై విమర్శలు పెరగడం, కొన్ని దేశాల్లో దాని విధానాలపై వ్యతిరేకత పెరిగింది.. ఈ నేపథ్యంలో నెతన్యాహు “ఇజ్రాయెల్‌కు అనేక మిత్రులు ఉన్నారు. ముఖ్యంగా ఇండియా నుంచి వచ్చే మద్దతు అద్భుతం” అని స్పష్టం చేశారు. ఇది ఇజ్రాయెల్ తన మిత్ర దేశాల వృత్తాన్ని విస్తరించుకుంటున్నట్లు సూచిస్తోంది.

ఇండియా-ఇజ్రాయెల్ సంబంధాలు..
ఇజ్రాయెల్ కు ఇండియాతో ఉన్న సంబంధాలు 1992లో పూర్తి దౌత్య సంబంధాలు ఏర్పడిన తర్వాత వేగంగా అభివృద్ధి చెందాయి. అయితే, దీనికి ముందు నుంచే రెండు దేశాల మధ్య సాంస్కృతిక, వాణిజ్య సంబంధాలు ఉన్నాయి. ఇజ్రాయెల్ ఇండియాను ఆసియాలో తన కీలక భాగస్వామిగా చూస్తోంది. ఇండియా ప్రజాస్వామ్యం, ఉగ్రవాద వ్యతిరేకత, ఆర్థిక అభివృద్ధి వంటి విలువలను పంచుకుంటుంది. ఇజ్రాయెల్ ఈ సంబంధాలను “వ్యూహాత్మక భాగస్వామ్యం”గా భావిస్తోంది. ఇటీవలి సంవత్సరాల్లో రెండు దేశాల ప్రధానుల మధ్య సమావేశాలు, ఉమ్మడి ప్రకటనలు ఈ బంధాన్ని మరింత బలపరిచాయి.

రక్షణ సహకారం..
ఇజ్రాయెల్ ఇండియాను దాని అతిపెద్ద రక్షణ కస్టమర్‌. ఇజ్రాయెల్ ఆయుధ ఎగుమతుల్లో 34 నుంచి 42 శాతం వరకు ఇండియాకు వెళ్తున్నాయి. రక్షణ ఒప్పందాలు, డ్రోన్లు, క్షిపణి వ్యవస్థలు, సైబర్ భద్రత, ఇంటెలిజెన్స్ షేరింగ్ వంటి రంగాల్లో సహకారం గణనీయం. ఇజ్రాయెల్ ఇండియాతో ఉమ్మడి సైనిక శిక్షణలు, సాంకేతికత బదిలీలు చేస్తోంది. ఇది ఇజ్రాయెల్‌కు రక్షణ స్వావలంబనను పెంచడంలో సహాయపడుతోంది. అమెరికా మద్దతు ఎలా ఉన్నా, ఇండియా వంటి భాగస్వామి ఉండటం వల్ల ఇజ్రాయెల్ తన రక్షణ సామర్థ్యాలను మరింత మెరుగుపరుచుకునే అవకాశం ఉంది.

వ్యవసాయం, సాంకేతికత, ఆర్థిక సహకారం..
ఇజ్రాయెల్ ఇండియాతో వ్యవసాయ రంగంలో లోతైన సహకారం కలిగి ఉంది. ఇండో-ఇజ్రాయెల్ అగ్రికల్చరల్ ప్రాజెక్ట్ (ఐఐఏపీ) కింద భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లో సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ) ఏర్పాటు చేయబడ్డాయి. డ్రిప్ ఇరిగేషన్, నీటి సామర్థ్యం పెంపు, పంటల వైవిధ్యం వంటి ఇజ్రాయెల్ సాంకేతికత ఇండియాకు అందించబడుతోంది.

వాణిజ్యం..
గతంలో ఇండో ఇజ్రాయిల్ వాణిజ్యం 10 బిలియన్ల డాలర్ల వరకు చేరింది. వజ్రాలు, ఫార్మా, రసాయనాలు, యంత్రాలు వంటి రంగాల్లో ఇరు దేశాలు పరస్పరం లాభపడుతున్నాయి. ఇజ్రాయెల్ ఇండియాను తన ఆర్థిక వృద్ధికి ముఖ్యమైన మార్కెట్‌గా చూస్తోంది. ఏఐ, సెమీకండక్టర్స్, క్వాంటంటెక్నాలజీజీ వంటి ఆధునిక రంగాల్లో కూడా సహకారం పెరుగుతోంది.

నెతన్యాహు “ఇండియాలో ఇజ్రాయెల్‌పై అద్భుతమైన, క్రేజీ లవ్ ఉంది” అని పలుమార్లు పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాల్లో, ప్రజా అభిప్రాయంలో ఇండియన్ల నుంచి వచ్చే సానుకూల స్పందనలు ఇజ్రాయెల్‌కు బలం చేకూరుస్తున్నాయి. ఇజ్రాయెల్ ఇండియాను గ్లోబల్ సౌత్‌లో తన వాయిస్‌గా చూస్తోంది. ఇది ఇజ్రాయెల్‌ను అంతర్జాతీయంగా ఒంటరిగా ఉండకుండా కాపాడుతోంది. ఇజ్రాయెల్ ఇండియాను “విశ్వసనీయ భాగస్వామి”గా భావిస్తోంది.

'విజయ్‌' విజన్‌.. భారత ఆర్మీ చీఫ్ కొత్త వ్యూహం

Vijay Vision Indian Army
Vijay Vision Indian Army

Vijay Vision Indian Army: భారత సైన్యం 31వ చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌గా జనరల్‌ ధీరజ్‌ సేథ్‌ ఇటీవల బాధ్యతలు స్వీకరించారు. ఆయన బాధ్యతలు చేపట్టిన మరుసటి రోజే ఆర్మీని ఆధునిక, సాంకేతికత-ఆధారిత, భవిష్యత్‌-సన్నద్ధ సైన్యంగా మార్చేందుకు ‘విజయ్‌’ అనే కొత్త విజన్‌ను ప్రకటించారు. ఇది ఆధునిక యుద్ధాల మారుతున్న స్వరూపానికి అనుగుణంగా సైన్యాన్ని సిద్ధం చేసే సమగ్ర రూపరేఖ.

విజయ్‌ విజన్‌ అంటే..
జనరల్‌ సేథ్‌ ‘విజయ్‌'(VIJAY)ఐదు ప్రధాన స్తంభాలుగా నిర్వచించారు. ఇవి సైన్యంలో సమన్వయం, ఆవిష్కరణ, స్వావలంబన మరియు మానవ వనరులపై దృష్టి పెట్టాయి. ఈ విజన్‌ ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ మధ్య సమగ్ర సమన్వయాన్ని, సాంకేతికతను, స్వదేశీ సామర్థ్యాలను బలోపేతం చేస్తుంది.

V – విజిలెన్స్‌ (నిరంతర జాగరూకత)..
సరిహద్దుల వెంబడి, అంతర్గత, బాహ్య బెదిరింపులపై నిరంతర నిఘా, సంసిద్ధతను నొక్కి చెబుతుంది. హైబ్రిడ్‌ యుద్ధాలు, సైబర్‌ బెదిరింపులు, సముద్ర మరియు ఆకాశ మార్గాల్లోని సవాళ్లను దృష్టిలో పెట్టుకుని వ్యూహాలు రూపొందించడం దీని లక్ష్యం. ఇది రక్షణ సిద్ధతను ఎప్పటికీ ఉన్నత స్థాయిలో ఉంచుతుంది.

I – ఇన్నోవేషన్‌ (ఆవిష్కరణ, మార్పు)..
యుద్ధాల స్వభావం మారుతున్న నేపథ్యంలో సాంకేతికత, కొత్త విధానాలు, ఆయుధ వ్యవస్థలను అనుసరించి సైన్యాన్ని మార్చడం. డ్రోన్లు, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, సైబర్‌ సామర్థ్యాలు వంటి ఆధునిక సాధనాలను సమర్థవంతంగా వినియోగించడం దీనిలో భాగం. ఇది సైన్యాన్ని 21వ శతాబ్దపు అవసరాలకు అనుగుణంగా మార్చేందుకు సహాయపడుతుంది.

J – జాయింట్‌నెస్‌ అండ్‌ ఇంటిగ్రేషన్‌ (సమగ్ర సమన్వయం)..
ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ మధ్య పూర్తి సమన్వయం, సమగ్ర వ్యూహాలు. వివిధ యుద్ధ క్షేత్రాలకు (భూ, సముద్ర, ఆకాశ) అనుగుణంగా మూడు దళాలు ఎలా కలిసి పనిచేయాలో నిర్ణయించడం. ఇది థియేటర్‌ కమాండ్‌ వ్యవస్థ వైపు మార్పుకు మద్దతు ఇస్తుంది. ఆపరేషనల్‌ సామర్థ్యాన్ని పెంచుతుంది.

A – ఆత్మనిర్భరత (స్వావలంబన)..
స్వదేశీ సాంకేతికతతో ఆయుధాల తయారీ, పరిశోధన, ఉత్పత్తి నుంచి వినియోగం వరకు స్వయం సమృద్ధి సాధించడం. ఇది ‘ఆత్మనిర్భర భారత్‌’ లక్ష్యానికి అనుగుణంగా సైన్యాన్ని విదేశీ ఆధారపడటం నుండి విముక్తి చేస్తుంది. ఆయుధాల స్వదేశీకరణ ద్వారా ఆర్థిక భారం తగ్గించడం, సాంకేతిక స్వాతంత్ర్యం సాధించడం దీని ఉద్దేశం.

Y – యోధా ఫస్ట్‌ (సైనికుడు మొదటి ప్రాధాన్యత)..
జవాన్‌కు ధైర్యం, భరోసా, కుటుంబ మద్దతు అందించడం. ఆధునిక సాంకేతికతను అర్థం చేసుకోవడం, శిక్షణ, సంక్షేమం, ఆరోగ్యం వంటి అంశాలపై దృష్టి. యుద్ధంలో విజయం సాధించేందుకు సైనికుడి మానసిక, శారీరక సన్నద్ధతను బలోపేతం చేయడం దీని ప్రధాన లక్ష్యం.

ఈ ఐదు అంశాలు ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉన్నాయి. నిరంతర జాగరూకత లేకుండా ఆవిష్కరణ సాధ్యం కాదు. సమన్వయం లేకుండా స్వావలంబన పూర్తి కాదు. సైనికుడి సంక్షేమం లేకుండా సాంకేతికత వృథా అవుతుంది. ఆర్టిలరీ నేపథ్యం ఉన్న జనరల్‌ సేథ్‌ ఆయుధాలు, వ్యూహాలపై లోతైన అవగాహన కలిగి ఉన్నారు. ఈ విజన్‌ భారత సైన్యాన్ని బహుళ-డొమైన్‌ యుద్ధాలకు సిద్ధం చేస్తుంది. చైనా, పాకిస్తాన్‌ సరిహద్దుల్లోని సవాళ్లు, సాంకేతిక యుద్ధాల నేపథ్యంలో ఇది సకాలంలో వచ్చిన చర్య.జనరల్‌ సేథ్‌ ఈ విజన్‌ను తన పదవి కాలం మించి కొనసాగేలా రూపొందించారు. ఇది సైన్యంలో సంస్థాగత మార్పు తీసుకురావడానికి, జాతీయ భద్రతను బలోపేతం చేయడానికి దోహదపడుతుంది.

ఆఫ్రికా ఎడారి పచ్చగా మారుతోంది.. ఏంటి గ్రేట్ గ్రీన్ వాల్.. ఎలా చేస్తున్నారు

Great Green Wall Project
Great Green Wall Project

Great Green Wall Project: థార్‌ ఎడారి విస్తరణను నియంత్రించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏటా కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాయి. ఫలితంగా అక్కడక్కడ గడి, చెట్టు పెరుగుతున్నాయి. ఇక గల్ఫ్‌ దేశాలు కూడా తమ దేశాల్లో వర్షం కురిసేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నాయి. దుబాయ్‌లో ప్రయత్నం కొంత ఫలించి వర్షాలు కురుస్తున్నాయి. ఇలాగే ఆఫ్రికా యూనియన్‌ కూడా ఎడారిని పచ్చగా మార్చేందుకు 2007లో మహత్తర ప్రాజెక్టును చేపట్టింది. సెనెగల్ నుంచి జిబూటి వరకు సహెల్ ప్రాంతం గుండా విస్తరించిన ఎడారి విస్తరణను అరికట్టడానికి దీనిని రూపొందించారు. మొదట్లో ఇది కేవలం చెట్ల గోడగా భావించబడినప్పటికీ, కాలక్రమేణా ఇది ఒక సమగ్ర “మొజాయిక్” విధానంగా మారింది. అంటే కేవలం చెట్లు నాటడం మాత్రమే కాకుండా, స్థానిక సాంప్రదాయ పద్ధతులు, నీటి నిర్వహణ, వ్యవసాయ పద్ధతుల మార్పు, జీవవైవిధ్య పరిరక్షణ వంటి అనేక అంశాలను కలిపి అమలు చేస్తున్నారు.

భారీ విస్తీర్ణంలో..
ఈ ప్రాజెక్టు సుమారు 8 వేల కిలోమీటర్ల పొడవు, 15 కిలోమీటర్ల వెడల్పుతో అభివృద్ధి చేయబడుతోంది. ఇది అనేక దేశాల సరిహద్దులను కలిపి ఒకే లక్ష్యం వైపు నడుస్తోంది. ప్రధానంగా 11 దేశాలు ఈ ప్రాజెక్టులో కీలక పాత్ర పోషిస్తున్నాయి. సెనెగల్, మౌరిటానియా, మాలి, బుర్కినా ఫాసో, నైజర్, నైజీరియా, చాద్, సుడాన్, ఎరిట్రియా, ఇథియోపియా, జిబూటి మొదట ఇందులో ఉండగా, తర్వాత ఇతర దేశాలు కూడా జత కలిపాయి. మొత్తం 20కి పైగా ఆఫ్రికా దేశాలు ఇందులో భాగమయ్యాయి. ఈ సహకారం ద్వారా సరిహద్దు సమస్యలు, వనరుల పంపిణీ, సాంకేతిక జ్ఞానం భాగస్వామ్యం సాధ్యమవుతోంది.

ప్రాజెక్టు ప్రధాన లక్ష్యాలు..
ఈ ప్రాజెక్టు కేవలం ఎడారిని అరికట్టడం మాత్రమే కాదు పర్యావరణం, ఆర్థికం, సామాజిక అంశాలను ఒకే వేదికపైకి తీసుకురావడానికి రూపొందించబడ్డాయి. దీనికి బహుముఖ లక్ష్యాలు ఉన్నాయి. 100 మిలియన్ హెక్టార్లు(సుమారు 24.7 కోట్ల ఎకరాలు) భూమిని సారవంతం చేయడం. కోటి(10 మిలియన్) ఆకుపచ్చ ఉద్యోగాలు కల్పించడం, 250 మిలియన్ టన్నుల కార్బన్ డయాక్సైడ్‌ను సంగ్రహించడం, వాతావరణ మార్పుల ప్రభావాలను తగ్గించడం, ఆహార భద్రతను పెంపొందించడం, లక్షలాది కుటుంబాలకు ఆదాయం, స్థిరత్వం కల్పించడం

సాధించిన విజయాలు..
ఇప్పటికి సుమారు 7.41 కోట్ల ఎకరాల (సుమారు 30 మిలియన్ హెక్టార్లు) భూమి సారవంతం చేయబడింది. ఇది గణనీయమైన పురోగతి. చెట్ల నాటడం, నేల పరిరక్షణ, స్థానిక మొక్కల పెంపకం ద్వారా భూమి యొక్క సహజ సామర్థ్యం తిరిగి వస్తోంది. లక్షలాది మందికి తాత్కాలిక, శాశ్వత ఉద్యోగాలు లభించాయి. స్త్రీలు, యువత ఈ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. ఆహార ఉత్పత్తి పెరగడం, నీటి నిల్వలు మెరుగుపడటం వంటి ప్రయోజనాలు కనిపిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో జీవవైవిధ్యం కూడా పెరిగింది.

సవాళ్లను ఎదుర్కొంటూ..
ఈ ప్రాజెక్టు విజయవంతం కావడానికి అనేక సవాళ్లు ఉన్నాయి. నిధులు పూర్తిగా అందకపోవడం, దేశాల మధ్య సమన్వయం లోపం, కొన్ని ప్రాంతాల్లో భద్రతా సమస్యలు, చెట్లు బతకడం తక్కువగా ఉండడం వంటివి ఎదురయ్యాయి. అవుతున్నాయి. 2021లో “గ్రేట్ గ్రీన్ వాల్ అక్సిలరేటర్” అనే కొత్త వ్యూహం ద్వారా నిధులు, పర్యవేక్షణ, సహకారాన్ని మెరుగుపరచడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ప్రపంచానికి ఆదర్శంగా..
ఈ ప్రాజెక్టు విజయం సాధిస్తే ఆఫ్రికాకు మాత్రమే కాకుండా ప్రపంచానికి ఒక ఆదర్శంగా నిలుస్తుంది. ఎడారి విస్తరణతో వలసలు, ఆహార కొరత, వనరుల కోసం సంఘర్షణలు తగ్గుతాయి. అయితే, స్థానిక సమాజాల భాగస్వామ్యం, సుస్థిర నిధులు, శాస్త్రీయ పర్యవేక్షణ లేకుండా లక్ష్యాలు చేరుకోవడం కష్టం. ఇది “ఆఫ్రికా కోసం ఆఫ్రికా” అనే స్ఫూర్తిని ప్రతిబింబిస్తుంది.

టార్గెట్‌ 2030..
2030 నాటికి పూర్తి లక్ష్యం చేరుకోవాలంటే ఏటా సగటున కోట్ల ఎకరాల భూమిని సారవంతం చేయాలి. కొత్త సాంకేతికతలు (డ్రోన్లు, స్మార్ట్ ఇరిగేషన్), అంతర్జాతీయ సహకారం, స్థానిక జ్ఞానం కలపడం ద్వారా ఇది సాధ్యం. ఈ ప్రాజెక్టు విజయవంతమైతే వాతావరణ మార్పులతో పోరాడేందుకు ప్రపంచానికి ఒక మార్గదర్శకంగా మారుతుంది.

గ్రేట్ గ్రీన్ వాల్ పర్యావరణ పునరుజ్జీవనం, ఆర్థిక సాధికారత, సామాజిక స్థిరత్వాన్ని కలిపిన ఒక సమగ్ర విప్లవం. ఎడారిని జయించడం అంటే భవిష్యత్ తరాలకు మెరుగైన భూమి, ఆహారం, ఉపాధి అందించడం. ఈ ప్రయత్నం విజయవంతం కావాలంటే అన్ని దేశాలు, సంస్థలు, స్థానిక ప్రజలు ఏకమవ్వాలి. ఈ పచ్చని గోడ ఆశను, సహకారాన్ని, స్థిరమైన అభివృద్ధిని సూచిస్తోంది.

బాలయ్య - కొరటాల శివ విషయంలో హ్యాపీగా ఉన్నాడా..?

Balakrishna Koratala Shiva Movie
Balakrishna Koratala Shiva Movie

Balakrishna Koratala Shiva Movie: నందమూరి నటసింహం బాలయ్య బాబు చేసే ప్రతి సినిమా విషయంలో చాలా క్లారిటిని మెయింటైన్ చేస్తున్నాడు. గతంలో ఆయన చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇప్పుడు చేస్తున్న సినిమాలకు చాలా విశిష్టత ఉంటుంది. ఎందుకంటే ఆయన కథల విషయంలో కూడా చాలా కేర్ఫుల్ గా వ్యవహరిస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇంతకుముందు వరుసగా నాలుగు విజయాలను సాధించిన ఆయన బోయపాటి శ్రీను డైరెక్షన్లో చేసిన ‘అఖండ 2’ సినిమా విషయంలో కొంతవరకు తడబడ్డాడు. అయినప్పటికి ఆయన ఎక్కడ కూడా డౌన్ ఫాల్ అయితే అవ్వలేదు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. అలాగే గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేస్తున్న సినిమా నుంచి ఒక గ్లింప్స్ కూడా రిలీజ్ అయింది. అది ప్రేక్షకులందరిని ఎంగేజ్ చేస్తుంది. ఇక ఇందులో మాస్ ఎలిమెంట్స్ కూడా పుష్కలంగా ఉండబోతున్నట్టుగా తెలుస్తున్నాయి. ప్రస్తుతం బాలయ్య – కొరటాల శివ కాంబినేషన్ లో చేస్తున్న సినిమా మీద భారీ అంచనాలు పెట్టుకున్నాడు.

ఇక కొరటాల కి ఫుల్ స్వేచ్ఛని కూడా ఇచ్చారట. తను ఎలాగైతే అనుకుంటున్నాడో దాన్ని అలాగే తీర్చిదిద్దామని దానికోసం ఎంత రిస్క్ అయినా సరే తను చేస్తానని కూడా చెప్తున్నాడట. కొరటాల శివ స్క్రిప్ట్ చూసి బాలయ్య కు చాలా సంతోషం వేస్తుందట.

ఎందుకంటే ఇప్పటివరకు ఆయన అలాంటి స్క్రిప్ట్ తో సినిమా చేయలేదు. కాబట్టి ఆ స్క్రిప్ట్ కి తను పూర్తిగా సరెండర్ అయిపోయి దర్శకుడు ఏం కావాలంటే అది చేయడానికి తన సిద్ధంగా ఉన్నారట. మొత్తానికైతే కొరటాల – బాలయ్య కాంబినేషన్లో రాబోతున్న సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ గా నిలువబోతోందటూ చాలామంది కామెంట్లు చేస్తున్నారు.

తన కెరియర్ లో ఆచార్య సినిమాను మినహాయిస్తే మిగిలిన అన్ని సినిమాలు కూడా సూపర్ సక్సెస్ లను సాధించాయి. మరి ఇప్పుడు బాలయ్యతో చేస్తున్న సినిమాతో ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు. తద్వారా మరోసారి స్టార్ హీరోలను డైరెక్షన్ చేసే స్థాయికి వెళ్తాడా? లేదంటే డౌన్ ఫాల్ అయిపోతాడా అనేది తెలియాలంటే బాలయ్య బాబు సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే…

పవన్ తో 'వంగవీటి'.. ఏంటి కథ?

Pawan Kalyan Vangaveeti Meeting
Pawan Kalyan Vangaveeti Meeting

Pawan Kalyan Vangaveeti Meeting: ఏపీ రాజకీయాల్లో వంగవీటి కుటుంబానికి ప్రత్యేక స్థానం. 1988లో వంగవీటి మోహన్ రంగ చనిపోయారు. ఇప్పటికీ ఆయన పేరు రాజకీయాల్లో వినిపిస్తూనే ఉంటుంది. కాపుల ఆశాజ్యోతి గా రంగాను అభివర్ణిస్తారు. కానీ ఉమ్మడి రాష్ట్రంలో విజయవాడ వేదికగా అన్ని వర్గాల ప్రజల కోసం పనిచేశారు. అయితే ఆయన మరణానికి సంబంధించి నిందితులను గుర్తించలేకపోయాయి ప్రభుత్వాలు. కానీ రాజకీయంగా కాపుల కోసం ఆయన పేరును ప్రతి ఎన్నికల్లోను వినియోగిస్తుంటారు. తాజాగా ఆయన జయంతి జరగగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నివాళులు అర్పించారు. దీనిపై రంగ కుమార్తె ఆశా కిరణ్ స్పందించారు. పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు చెబుతూనే త్వరలో ఆయనను కలుస్తానని చెప్పుకొచ్చారు.

* గత కొద్దిరోజులుగా యాక్టివ్..
కొద్దిరోజుల కిందట ఏపీలో రంగారాధ మిత్రమండలి పూర్వ వైభవం కోసం ఆశాకిరణ్ ఎంట్రీ ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు కూడా చేశారు. త్వరలో పొలిటికల్ ఎంట్రీ ఉంటుందన్న ప్రచారం కూడా జరిగింది. అయితే ఇప్పుడు తాజాగా ఆమె జనసేనలో చేరుతారని పెద్ద ఎత్తున ప్రచారం ప్రారంభం అయింది. దానికి కారణం లేకపోలేదు. రంగా జయంతి నాడు పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా నివాళులు అర్పించేసరికి కృతజ్ఞతలు చెప్పారు. త్వరలో పవన్ కళ్యాణ్ ను కలిసి రంగా ఆశయాలకు సంబంధించి కొన్ని అంశాలను చర్చిస్తానని చెప్పుకొచ్చారు. ప్రధానంగా కృష్ణాజిల్లాకు వంగవీటి మోహన్ రంగ పేరు, రంగా పుష్కర్ ఘాట్ ఏర్పాటు వంటి వాటిపై చర్చించేందుకు త్వరలో ఆమె పవన్ కళ్యాణ్ ను కలవనున్నట్లు తెలుస్తోంది. అయితే ఆమె జనసేనలో చేరిక కోసమే ఈ ప్రయత్నం చేస్తున్నట్లు ప్రచారం నడుస్తోంది.

* రంగా వారసులుగా..
వంగవీటి మోహన్ రంగా మరణం అనంతరం ఆయన రాజకీయ వారసుడిగా కుమారుడు రాధాకృష్ణ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. 2004లో కాంగ్రెస్ పార్టీ ద్వారా అసెంబ్లీకి పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తరువాత ప్రజారాజ్యం పార్టీలో చేరారు. అక్కడ నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి.. ఆ పార్టీ యువజన విభాగం అధ్యక్షుడిగా పని చేశారు. జగన్మోహన్ రెడ్డితో విభేదించి తెలుగుదేశం పార్టీలో చేరారు. ప్రస్తుతం ఆ పార్టీలోనే కొనసాగుతున్నారు. త్వరలో ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఖాయమన్న ప్రచారం నడుస్తోంది. ఇంతలోనే ఆశాకిరణ్ జనసేనలో చేరుతారని తెలుస్తోంది. ప్రస్తుతం కాపుల చుట్టూ వైసిపి రాజకీయం చేస్తోంది. అందుకే టిడిపిలో రాధాకృష్ణకు.. జనసేనలో ఆశా కిరణ్ కు ప్రాధాన్యం కల్పించడం ద్వారా చెక్ చెప్పాలన్నది చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఆలోచనగా తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో..

రణబాలి మూవీలో రష్మిక క్యారెక్టర్ ఏంటంటే..?

Ranabali Movie
Ranabali Movie

Ranabali Movie: విజయ్ దేవరకొండ హీరోగా రాహుల్ సంకృత్యాయన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రణబాలి’ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. సెప్టెంబర్ 11వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఇప్పటికే ఈ సినిమాతో ఎలాగైనా సరే భారీ సక్సెస్ ని సాధించాలనే దృక్పథంతో విజయ్ దేవరకొండ ఉన్నాడు. దానికి తగ్గట్టుగానే ఆయన ఈ సినిమాతో భారీ కసరత్తులైతే చేస్తున్నారట. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో మరోసారి తన స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకుంటేనే తప్ప లేకపోతే మాత్రం విజయ్ దేవరకొండ స్టార్ హీరోగా మరి అవకాశాలైతే లేవు. ఈ సినిమాలో రష్మిక మందాన హీరోయిన్ గా నటిస్తుంది. పెళ్లి తర్వాత వీళ్ళిద్దరు కలిసి నటిస్తున్న సినిమా కూడా ఇదే కావడం విశేషం…

ఇక ఈ సినిమాలో రష్మిక డ్యూయల్ రోల్ లో నటిస్తుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఒక క్యారెక్టర్ లో తను వేశ్య పాత్రలో కనిపించగా, మరో క్యారెక్టర్ లో మాత్రం హోమ్లీ లేడీ గా కనిపించబోతుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనే విషయం తెలీదు కానీ మొత్తానికైతే ఆమె డ్యూయల్ రోల్లో నటిస్తుందనేది వాస్తవం అంటూ సినిమా యూనిట్ నుంచి కూడా కొన్ని వార్తలైతే వస్తున్నాయి…

ప్రస్తుతం రష్మిక ఆచితూచి మరి సినిమాలను సెలెక్ట్ చేసుకుంటుంది. ఇక ఇలాంటి క్రమంలోనే ‘రణబాలి’ సినిమాతో సక్సెస్ ని సాధిస్తే పెళ్లి తర్వాత వీళ్ళిద్దరు కలిసి నటించిన సినిమా సూపర్ సక్సెస్ అయిందనే ఒక రికార్డ్ వల్ల పేరు మీద ఉంటుందనే ఉద్దేశ్యంతోనే వాళ్ళు ఈ సినిమా కోసం భారీ కసరత్తులైతే చేస్తున్నారట.

దర్శకుడు రాహుల్ సంకృత్యాయన్ ఈ సినిమాని చాలా ఎఫెక్టివ్ గా తెరకెక్కిస్తున్నట్టుగా తెలుస్తుంది. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు. ప్రేక్షకుల్లో ఎలాంటి ఐడెంటిటి ని క్రియేట్ చేసుకుంటాడు అనేది తెలియాల్సి ఉంది…

పెళ్లి కుమార్తె డ్యాన్స్.. వద్దన్న వరుడు.. కీలక నిర్ణయం తీసుకున్న వధువు తండ్రి..

Bride Dance Wedding Cancelled
Bride Dance Wedding Cancelled

Bride Dance Wedding Cancelled: నేటి కాలంలో మనుషులు చిన్న చిన్న విషయాలకే ఆహాలను పెంచుకుంటున్నారు. కఠినమైన నిర్ణయాలు తీసుకోవడానికి వెనుకాడడం లేదు. అటువంటిదే ఈ సంఘటన కూడా. పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకు మందలించడం.. అది కాస్త పెళ్లి కుమార్తె తండ్రికి తెలియడం.. ఆయన కీలక నిర్ణయం తీసుకోవడం.. వంటివి క్షణాలలో జరిగిపోయాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మార్కాపురం జిల్లా రాచర్ల మండలం చిన్నగానిపల్లి ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది.

చిన్నగాని పల్లి ప్రాంతానికి చెందిన ఓ యువకుడు.. కంభం మండలం తురుమెల్ల గ్రామానికి చెందిన ఓ యువతి తో వివాహం కుదిరింది.. వివాహం జరిగే రోజు రానే వచ్చింది. పెళ్లికి ముందు రోజు రాత్రి వరుడి గ్రామంలో ఊరేగింపు ప్రారంభించారు. ఊరేగింపు నేపథ్యంలో వధూవరులను డ్యాన్స్ చేయాలని చుట్టుపక్కల వారు అడిగారు. డ్యాన్స్ చేసేందుకు వధువు సిద్ధమైంది. ఈ సమయంలో వరుడికి కోపం వచ్చింది. ఆమె మీద ఆగ్రహం వ్యక్తం చేశాడు. డ్యాన్స్ చేయడానికి వీలు లేదని చెప్పాడు. దీంతో ఆ వధువు అలిగింది. ఈ విషయం వధువు తండ్రికి తెలిసింది. పెళ్లికి ముందే ఇలా ఉంటే.. పెళ్లి జరిగిన తర్వాత ఎలా ఉంటాడోనని ఆ తండ్రి మదనపడ్డాడు. కీలక నిర్ణయం తీసుకున్నాడు.

వధువుపై వరుడు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడం.. డ్యాన్స్ చేయడానికి వీలు లేదని చెప్పడంతో ఆ విషయం వధువు తండ్రికి తెలిసింది. దీంతో వెంటనే ఇటువంటి వ్యక్తికి తన బిడ్డను ఇచ్చి పెళ్లి చేసే ఉద్దేశం లేదని అతడు తేల్చి చెప్పేశాడు. అంతే వివాహం ఒక్కసారిగా రద్దయిపోయింది. పెళ్లి మండపంలో ఉండాల్సిన సందడి మాయమైపోయింది. బంధువులు ఎన్ని విధాలుగా నచ్చ చెప్పినప్పటికీ వధువు తండ్రి నిర్ణయాన్ని మార్చుకోలేదు. వధువు కూడా తన తండ్రి నిర్ణయానికి ఓకే చెప్పింది. వరుడు తరుపున వారు రకరకాల రాయబారాలు పంపినప్పటికీ అతడు కరిగిపోలేదు. “నా కుమార్తె ను ఎన్నో విధాలుగా చూసుకున్నాను. ఆమెను ఆడంబరంగా పెంచాను. అన్ని సమకూర్చాను. కానీ ఇతడు డ్యాన్స్ కూడా చేయద్దని చెప్తున్నాడు. ఇటువంటి వ్యక్తికి నేను బిడ్డను ఇచ్చే ఉద్దేశం లేదు. అందువల్లే పెళ్లి రద్దు చేశాను. నా బిడ్డను నా స్థాయికి తగ్గట్టు వాళ్లకు ఇచ్చుకుంటానని” ఆ వ్యక్తి చెప్పాడు.. ఈ విషయం బయటకు పొక్కడంతో సంచలనంగా మారింది.

లోకేష్ కోసం వైసీపీ ప్రత్యేక ఆలోచన!

Nara Lokesh
Nara Lokesh

Nara Lokesh: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక బలమైన చర్చ నడుస్తోంది. ఇప్పుడు ఆలోచించాల్సింది చంద్రబాబు గురించి కాదు.. లోకేష్ కోసం అనే హెచ్చరికలు నేరుగా జగన్మోహన్ రెడ్డికి వస్తున్నట్లు తెలుస్తోంది. నేరుగా పార్టీ ఏర్పాటు చేసి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి దానిని ఒక సగర్వంగా చెప్పుకునే వారు. ప్రజలు 151 సీట్లు ఇచ్చారని పదేపదే ప్రకటించుకునేవారు. కానీ జగన్ పాలన చూసిన ప్రజలు 11 స్థానాలకు దించేశారు. తండ్రి చాటు బిడ్డ, భాష రాదు, రాజకీయం తెలియదు అన్నట్టు ఆరోపణలు చేసిన లోకేష్ ఒక స్థాయికి వెళ్లిపోయారు. ఎవరు అందనంత రీతికి దూసుకెళ్తున్నారు. అందుకే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక వణుకు మొదలైంది. ఇప్పుడు దృష్టి సారించాల్సింది.. టార్గెట్ చేయాల్సింది చంద్రబాబుపై కాదు. లోకేష్ పై అన్నట్టు ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

* పరిణితి పెంచుకున్న యువనేత..
లోకేష్ పరిణితి చెందిన నాయకుడిగా ఎప్పుడో మారిపోయారు. ఆయన అదరడం లేదు.. బెదరడం లేదు. మాట్లాడే క్రమంలో తప్పులు ఉచ్చరించడం లేదు. వేలు పెట్టి చూపించే స్థితి నుంచి.. వేలు చూపి ఖబడ్దార్ అన్న రీతికి మారిపోయారు లోకేష్. ఇది ముమ్మాటికి ఆయనలో పరిణితి. రాజకీయం చేస్తున్నారు. పార్టీని ఒంటి చేత్తో నడుపుతున్నారు. పాలనలో తనదైన ముద్ర చూపుతున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు తెస్తున్నారు. తన విద్యా శాఖలో విప్లవాత్మక మార్పులు తేగలుగుతున్నారు. అదే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మింగుడు పడని అంశము. సైలెంట్ గా తన పని తాను చేసుకుని అనుకున్నది అనుకున్నట్టు సాధించగలుగుతున్నారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేసుకుంటున్నారు.

* చాలా తక్కువ అంచనా
ఏపీలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లోకేష్ పేరు కూడా ఉచ్చరించేది కాదు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు లోకేష్ ను అస్సలు ప్రస్తావించేవారు కాదు జగన్మోహన్ రెడ్డి. లోకేష్ తనకు సమకాలీకుడు కాదు అనేది జగన్ అభిప్రాయం. ఒక్క మాటలో చెప్పాలంటే ఒక పిల్ల బచ్చాగా చూసేవారు. కానీ ఇప్పుడు అదే లోకేష్ ఒక బ్రహ్మాస్త్రంగా మారిపోయారు తెలుగుదేశం పార్టీకి. జగన్మోహన్ రెడ్డికి మించి సమ్మోహన శక్తిగా మారిపోయారు. పార్టీతో పాటు ప్రభుత్వంలో కీలకపాత్ర పోషిస్తున్నారు. అన్నింటికీ మించి రాజకీయాలు ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఒక రాజకీయ పార్టీ నేతగా, ఒక పాలన దక్షుడిగా, ఈ రాష్ట్రానికి భవిష్యత్తు చూపే నాయకుడిగా సంపూర్ణత్వం చూపిస్తున్నారు లోకేష్. వైసిపి చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసుకుంటూ వస్తోంది. కానీ ఇకనుంచి అలా కాదు. లోకేష్ ను టార్గెట్ చేసుకోవాలని తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది.

ఆ నలుగురికి పవనే స్పెషల్ టాస్క్!

Pawan Kalyan
Pawan Kalyan

Pawan Kalyan: ఏపీలో ఒక విచిత్ర రాజకీయ పరిస్థితి నడుస్తోంది. పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా పెద్ద సోషల్ మీడియా యుద్ధమే నడుస్తోంది అడ్డగోలుగా. పవన్ కళ్యాణ్ ను వ్యక్తిగతంగా టార్గెట్ చేయడమే వారి ఉద్దేశ్యంగా కనిపిస్తోంది. ఈ విషయంలో ఓ నలుగురిపై ప్రధానంగా అనుమానం ఉంది. కేవలం బిజెపిని వ్యతిరేకిస్తూ పవన్ కళ్యాణ్ టార్గెట్ చేయడమే వారి ముఖ్య ఉద్దేశం. ఓ నలుగురు టాస్క్ఫోర్స్ గా ఏర్పడి.. వారికి ఎవరో టాస్క్ ఇచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు. ఆ నలుగురు ఒకే భావజాలంతో మాట్లాడుతుండడం.. వివాదం చేయదలుచుకోవడం వంటివి చూస్తుంటే మాత్రం ఏదో ఒక అనుమానం కలగక మానదు. వారే జర్నలిస్టు తులసి చందు, ప్రొఫెసర్ నాగేశ్వరరావు, నటుడు ప్రకాష్ రాజ్, యూట్యూబర్ జోసెఫ్ రావణ్. ఈ నలుగురు బిజెపిని వ్యతిరేకిస్తూ పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. తప్పకుండా వీరి వెనుక అదృశ్య శక్తి ఉందన్న అనుమానం పెరుగుతోంది.

* పవన్ కు వ్యతిరేకంగా..
జర్నలిస్ట్ తులసి చందు ప్రత్యేక యూట్యూబ్ ఛానల్ ద్వారా సూపరిచితురాలు అయ్యారు. ఆమె ఇటీవల బీజేపీని దారుణంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు. నేరుగా హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో పవన్ కళ్యాణ్ మీడియా సమావేశంలో కూడా ఆమె మాట్లాడారు అభ్యంతరకర వ్యాఖ్యలు.తులసి చందు జర్నలిస్ట్ ఆంధ్రజ్యోతిలో పనిచేశారు. ప్రముఖ మీడియా ఛానల్లో పనిచేశారు. ప్రస్తుతం యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్నారు. అయితే ఆమె సైతం ఒకే లైన్లో మాట్లాడుతుండడం అనుమానాలకు తావిస్తోంది. మంచి ఇన్వెస్టిగేటెడ్ జర్నలిస్ట్ గా పేరుపొందిన ఆమె.. ఇటీవల వ్యవహరిస్తున్న తీరు అనుమానాస్పదంగా ఉంది.

* అడ్డంగా బుక్ అయిన ప్రొఫెసర్ నాగేశ్వర్..
సమకాలీన రాజకీయ అంశాలపై తనదైన శైలిలో విశ్లేషిస్తుంటారు ప్రొఫెసర్ నాగేశ్వర్. తెలుగు నాట ప్రత్యేకంగా గుర్తింపు పొందారు. ఆయన సైతం బిజెపికి వ్యతిరేకి అనే ముద్ర ఉంది. అయితే అనుకోని విధంగా పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేశారు. బిజెపితో పవన్ ను జతచేస్తూ ఏపీ రాజకీయాలపై మాట్లాడుతూ జగన్ ప్రస్తావన తీసుకొచ్చారు. ఒక గాలి కబురు జనాల్లోకి వదిలారు. అది మిస్ ఫైర్ అయ్యింది. దీంతో ప్రొఫెసర్ నాగేశ్వర్ అంతటివాడే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. కానీ తెలంగాణలో జర్నలిస్టులను పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా ఉసిగొలుపుతూ.. చేసిన బీభత్సం అంతా ఇంతా కాదు.

* జోసెఫ్ రావణ్ తో ప్రకాష్ రాజ్..
ఇక ప్రకాష్ రాజ్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. భారతీయ జనతా పార్టీకి, పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా ఏ చిన్న కంటెంట్ దొరికిన.. ఆ కామెంట్ ఎవరు చేశారు? ఎందుకు చేశారు? అనేది గుర్తించకుండా రభస చేసే తత్వం ప్రకాష్ రాజ్ ది. హిందూ దేవుళ్ళతో పాటు దేవతలను దారుణంగా దూషిస్తున్న జోసెఫ్ రావణ్ ను అడ్డగోలుగా సమర్థిస్తూ.. తెర వెనుక ప్రోత్సాహం అందిస్తూ.. పవన్ కళ్యాణ్ పై దూషణలు కొనసాగించాలని సూచిస్తూ సాగిన ఆడియో సంభాషణలు సైతం బయటకు వచ్చాయి. ఇలా ఈ నలుగురు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ మాదిరిగా.. ఎవరో ప్రయోగిస్తున్న అస్త్రం అన్నట్టు పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం విశేషం. అయితే ఇటువంటి వ్యక్తుల వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ ఇమేజ్ ను మరింత పెంచుతాయే తప్ప తగ్గించవు అన్న విషయాన్ని గ్రహించుకోవాలి.

అఖిల్ పేరు మార్చుకున్నంత మాత్రాన హిట్ వస్తుందా..?

Akhil Akkineni
Akhil Akkineni

Akhil Akkineni: ఒకప్పుడు అక్కినేని ఫ్యామిలీకి చాలా మంచి క్రేజ్ ఉండేది. నాగేశ్వరరావు ఎన్నో వైవిద్యమైన పాత్రలను చేసి ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణను సంపాదించుకున్నాడు. ఎన్టీఆర్ తో పాటు పోటీపడి నటించి ప్రేక్షకుల మన్ననలు పొందుతున్నాడు. ఇక ఆయన తర్వాత తన నట వారసుడిగా ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన నాగార్జున సైతం ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోల్లో తను కూడా ఒకడిగా ఎదిగాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ఆ ఫ్యామిలీ నుంచి వచ్చిన మూడోతరం హీరోలు ఎంత మాత్రం వాళ్ళ సత్తాను చాటులేక పోతున్నారు. కారణం ఏంటి అంటే వాళ్ళు ఎంచుకున్న సబ్జెక్టులు ప్రేక్షకులను ఏమాత్రం అట్రాక్ట్ చేయలేకపోతున్నాయి. మిగతా హీరోలతో పోలిస్తే వీళ్ళు చాలా వరకు వెనుకబడిపోయారనే చెప్పాలి. ఇలాంటి క్రమంలోనే అఖిల్ ప్రస్తుతం లెనిన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు.

ఈ సినిమాతో ఎలాగైనా సరే తనకంటూ ఒక స్టాండర్డ్ ను ఏర్పాటు చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు. దానికోసమే ఆయన శతవిధాల కష్టపడుతున్నాడు. ఇక దాంతో పాటుగా తన పేరును నాగ అఖిల్ అని మార్చుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. లెనిన్ మూవీ టైటిల్ లో నాగ అఖిల్ గా మనం చూడబోతున్నాం. వాళ్ల ఫ్యామిలీ లో ఉన్న హీరోలందరికి నాగ అనేది వస్తే సక్సెస్ సాధిస్తారు అనే ఒక నమ్మకాన్ని వాళ్ళు ఫాలో అవుతున్నారు.

నాగేశ్వరరావు దగ్గర నుంచి నాగచైతన్య వరకు ప్రతి ఒక్కరికి పేరు ముందు నాగ అనేది కామన్ అయిపోయింది. అందుకే అఖిల్ సైతం తన పేరును నాగ అఖిల్ గా మార్చుకున్నట్టుగా తెలుస్తుంది. పేరు మార్చినంత మాత్రాన సక్సెస్ లు వస్తాయా అని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.

ఇక ఏది ఏమైనా కూడా కొన్ని సెంటిమెంట్లను ఫాలో అవుతూ ముందుకు సాగినప్పుడే ఇండస్ట్రీలో సక్సెస్ లను సాధించగలం అనే ఒక కాన్ఫిడెంట్ తో అఖిల్ ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఏది ఏమైనా లెనిన్ సినిమాతో ఆయన సక్సెస్ ని సాధించాల్సిన అవసరమైతే ఉంది…

ట్రంప్ మూడో టర్మ్ సంకేతాలు.. సిన్న శకలు లేవు సామీ!

Donald Trump
Donald Trump

Donald Trump: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వయసు ఏడు పదులు దాటింది. కానీ మనోడి కోరికలు మాత్రం గుర్రాల్లా పరిగెడుతున్నాయి. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. అమెరికా స్వాతంత్ర్యానికి 250 ఏళ్లు నిండిన సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సైన్యం బలోపేతం విషయంలో మూడో పర్యాయం కూడా కొనసాగిస్తామని సూచించారు. వెంటనే తన మాటను సరిదిద్దుకున్నప్పటికీ, ఈ వ్యాఖ్యలు ట్రంప్ రాజకీయ ఆకాంక్షలపై కొత్త చర్చను రేకెత్తించాయి.

ట్రంప్ ఏమన్నాడంటే..
అమెరికాకు స్వాతంత్రం వచ్చి 250 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ట్రంప్ మొదటి పర్యాయంలో సైన్యాన్ని బలపరిచామని చెప్పి, రెండో పర్యాయంలోనూ అదే కొనసాగుతుందని పేర్కొన్నారు. అయితే “రెండోది… కాదు, మూడో టర్మ్‌లో కూడా” అని అనడం అందరి దృష్టి ఆకర్షించింది. వెంటనే తేరుకున్న తర్వాత ఆయన “అలా అనకూడదు” అంటూ వెనక్కి. తగ్గారు. ఇది కేవలం ఒక్కసారి జరిగిన సంఘటన కాదు. గతంలో కూడా ట్రంప్ ఇలాంటి సంకేతాలు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. దీంతో ఆయన నిజంగా మూడో పర్యాయం గురించి ఆలోచిస్తున్నారా లేదా రాజకీయంగా దృష్టిని ఆకర్షించడానికి ఇలా మాట్లాడుతున్నారా అనే ప్రశ్నలు మళ్లీ తలెత్తాయి.

రాజ్యాంగ నిబంధనలు ఇలా..
అమెరికా రాజ్యాంగంలో 22వ సవరణ స్పష్టంగా ఏ వ్యక్తి అయినా రెండు పర్యాయాలకు మించి అధ్యక్షుడిగా ఉండలేడని నిర్దేశిస్తుంది. ఈ నిబంధనను మార్చాలంటే రాజ్యాంగ సవరణకు అవసరమైన కఠినమైన ప్రక్రియను పూర్తి చేయాలి. ఇది కాంగ్రెస్‌లో మూడింట రెండు వంతుల మెజారిటీ, రాష్ట్రాల్లో మూడింట నాలుగు వంతుల ఆమోదం అవసరం. ఈ నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలను చాలామంది రాజకీయ స్టంట్‌గా భావిస్తున్నారు. అయితే ఆయన మాటలు ఆయన మద్దతుదారుల్లో ఉత్సాహం కలిగించగా, ప్రత్యర్థుల్లో ఆందోళన రేకెత్తించాయి.

గత సంకేతాలు, ప్రస్తుత చర్చ..
ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇది మొదటిసారి కాదు. గతంలో కూడా ఆయన మూడో పర్యాయం గురించి సంకేతాలు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు రెండో పర్యాయం అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల ఆయన రాజకీయ ఆకాంక్షలు ఎంతవరకు వెళ్తాయనే చర్చ జోరందుకుంది. కొందరు దీన్ని ట్రంప్ తన బలమైన మద్దతు వర్గాన్ని కదిలించడానికి, రిపబ్లికన్ పార్టీలో తన ప్రభావాన్ని కొనసాగించడానికి చేసిన ప్రయత్నంగా చూస్తున్నారు. మరికొందరు ఇది భవిష్యత్తులో రాజ్యాంగ మార్పుల గురించి చర్చను రేకెత్తించడానికి ఉద్దేశించినదిగా అభిప్రాయపడుతున్నారు.

రాజకీయ రచ్చ..
ట్రంప్ వ్యాఖ్యలు అమెరికా రాజకీయాల్లో రెండు వైపులా ప్రభావం చూపుతున్నాయి. ఆయన మద్దతుదారులు దీన్ని ఆయన నాయకత్వ బలానికి సంకేతంగా చూస్తుంటే, ప్రత్యర్థులు దీన్ని ప్రజాస్వామ్య సంప్రదాయాలకు వ్యతిరేకంగా భావిస్తున్నారు. అధ్యక్ష పదవికి రెండు పర్యాయాలు మాత్రమే అనుమతించే నిబంధనను మార్చడం చాలా కష్టం. అయినప్పటికీ ఇలాంటి వ్యాఖ్యలు రాజకీయ వాతావరణాన్ని వేడెక్కిస్తాయి. ట్రంప్ ఇప్పటికే వలస విధానాలు, వాణిజ్య విధానాలతో తీవ్ర చర్చలను రేకెత్తించిన వ్యక్తి కాబట్టి, ఇప్పుడు మూడో టర్మ్ సంకేతం మరింత ఆందోళన కలిగిస్తోంది.

ట్రంప్ మూడో పర్యాయం గురించి చేసిన వ్యాఖ్యలు రాజకీయ స్టంట్ అని కొంతమంది భావిస్తున్నారు. మరికొందరు నిజమైన ఆకాంక్ష అంటున్నారు. అయితే రాజ్యాంగం స్పష్టంగా నిర్దేశించిన పరిమితులను అధిగమించడం చాలా కష్టం. ఇది ట్రంప్ రాజకీయ ఆకాంక్షలు ఎంతవరకు వెళ్తాయనే చర్చను రేకెత్తించింది.

నాగబంధం సినిమాకి నష్టం తప్పదా..? దీనికంతటికీ కారణం ఎవరు..?

Nagabandham Movie
Nagabandham Movie

Nagabandham Movie: అభిషేక్ నామా దర్శకత్వంలో విరాట్ కర్ణ హీరోగా నటించిన ‘నాగబంధం’ సినిమా ఈనెల మూడోవ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా మొదటి రోజు నాలుగు కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టింది. వీకెండ్ కాబట్టి ఈ 3 రోజులు కలెక్షన్స్ బాగానే వచ్చాయి. మూడు రోజులు కలిపి ఈ సినిమాకి 11 కోట్ల 50 లక్షల వరకు కలెక్షన్స్ వచ్చాయి. ఇక ఇప్పుడు ఈ సినిమాకి అసలైన పరీక్ష మొదలుకానుంది. సోమవారం నుంచి ఈ సినిమాని ఎంతమంది ప్రేక్షకులు చూస్తారు ఈ సినిమాని ఎలా ఆదరిస్తారు అనేదే పెద్ద ప్రశ్నగా మారింది. మొదటి షో తోనే ఈ సినిమా డివైడ్ టాక్ ను తెచ్చుకోవడంతో చాలామంది ఈ సినిమాని చూడడానికి పెద్దగా ఇష్టపడడం లేదు.

కొంతమంది విజువల్ గా ఈ సినిమా చాలా గ్రాండీయర్ గా ఉంది. కాబట్టి ఇలాంటి సినిమాను ఓటిటి లోకి వచ్చిన తర్వాత చూడడం కంటే థియేటర్ ఎక్స్పీరియన్స్ చేస్తేనే బాగుంటుందని చెబుతున్నారు.
మరికొంతమంది థియేటర్ కైతే వస్తున్నారు. కానీ కథలో అంత పెద్దగా వైవిధ్యం లేకపోవడం వల్ల ఈ సినిమా చాలావరకు ప్రేక్షకులను ఇరిటేట్ చేస్తుందనే చెప్పాలి. ఏది ఏమైనా కూడా కథలో దమ్మున్నప్పుడే ఏ సినిమా అయినా సక్సెస్ఫుల్గా ఆడుతుంది.

స్టోరీ తేడా కొడితే మాత్రం సినిమాలో ఎన్ని హంగులు ఉన్నా అది ప్రేక్షకుడిని ఎంటర్టైన్ చేయలేదు. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమా 100 కోట్లకు పైన బడ్జెట్ తో నిర్మించారు. కాబట్టి ఈ సినిమాకి భారీ నష్టాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని పలువురు సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.

అనుకున్న కాన్సెప్ట్ ను పెర్ఫెక్ట్ గా స్క్రీన్ మీద ప్రజెంట్ చేయగలిగితే ఈ సినిమా 500 కోట్ల వరకు కలెక్షన్స్ ను రాబట్టగలిగే కెపాసిటి ఉన్న మూవీగా మారేది. కానీ దర్శకుడి లోపమా లేదంటే ఇతర సాంకేతిక నిపుణుల వల్ల ఏదైనా ఇబ్బంది జరిగిందా అనేది తెలియదు గానీ మొత్తానికైతే సినిమా సోల్ ని చెడగొట్టారనే చెప్పాలి… ఇక ఈ మూవీ లాంగ్ రన్ లో ఎంతటి కలెక్షన్స్ ని రాబడుతుంది అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…

జగన్ ను నమ్మి మోసపోయాం!

YS Jagan Mohan Reddy
YS Jagan Mohan Reddy

YS Jagan Mohan Reddy: ఏపీలో ప్రతి రాజకీయ పార్టీపై కులముద్ర ఉంది. ఫలానా పార్టీ ఫలానా సామాజిక వర్గానికి అనుకూలం అన్నట్టు పరిస్థితి మారిపోయింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అంటే రెడ్డి సామాజిక వర్గం.. టిడిపికి కమ్మ సామాజిక వర్గం… జనసేనకు కాపు సామాజిక వర్గం వెన్నుదన్నుగా నిలుస్తుందన్న అభిప్రాయం చాలా ఈజీగా అర్థం అవుతుంది. అయితే అన్ని పార్టీల్లో.. అన్ని సామాజిక వర్గాల వారు ఉన్నారు. ఉంటారు కూడా. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న కమ్మ సామాజిక వర్గం వారిది మాత్రం వింత పరిస్థితి. వారిని రాజకీయంగా చాలా వినియోగించుకున్నారు జగన్మోహన్ రెడ్డి. ప్రత్యర్థులను వారితో తిట్టించారు. దారుణంగా దూషణలపర్వం నడిపించారు. దీంతో వారికి రాజకీయ జీవితం లేకుండా చేశారు. ఒకరు కాదు ఇద్దరు కాదు దాదాపు పదిమంది నేతల రాజకీయ జీవితాలను తారుమారు చేశారు జగన్మోహన్ రెడ్డి. చివరకు సొంతవారే అసహ్యించుకునేలా చేయడంలో ప్రత్యేక రాజకీయ వ్యూహం ఉంది. వారు జగన్మోహన్ రెడ్డిని విడిచి వెళ్ళలేరు. వారికి ప్రత్యామ్నాయ అవకాశాలు కూడా ఉండవు. అంతలా చేసేసారు జగన్మోహన్ రెడ్డి.

* పాపం దేవినేని అవినాష్..
ముఖ్యంగా కమ్మ సామాజిక వర్గం లో యువనేత దేవినేని అవినాష్ రాజకీయ జీవితంతో ఆటలు ఆడుకున్నారు జగన్మోహన్ రెడ్డి. ఆయనతో చేయని తప్పులంటూ లేవు. కాంగ్రెస్ పార్టీ నుంచి అనూహ్యంగా టిడిపిలో చేరిన అవినాష్ మంచిగా ప్రోత్సహించాలని చంద్రబాబు భావించారు. అందుకే గుడివాడ నియోజకవర్గంలో పోటీ చేయించారు. అక్కడ ఓటమి చవి చూడడంతో దేవినేని అవినాష్ ను ప్రత్యేకంగా పిలిపించుకుని పార్టీలో చేర్పించుకున్నారు జగన్మోహన్ రెడ్డి. వైసిపి అధికారంలో ఉండడంతో అమరావతిపై విషం చిమ్మడంలో ఆ ప్రాంత నేతల అవసరం ఉంది. పైగా కమ్మ సామాజిక వర్గం వారిని ప్రయోగిస్తే.. ఆ ప్రాంతంలో రాజకీయంగా కలిసి వస్తుందని అంచనా వేసుకున్నారు జగన్. అలా దేవినేని అవినాష్ జగన్ చేతిలో పావుగా మారారు. అమరావతి తో పాటు కమ్మ సామాజిక వర్గం పై జరిగిన కుట్రలో ఆయనను ప్రధాన భాగం చేశారు. ఇప్పుడు దేవినేని అవినాష్ అంటేనే విజయవాడ ప్రాంతంలో ప్రజలు వ్యతిరేకించేలా పరిస్థితి వచ్చింది. దీనికి ముమ్మాటికీ కారణం జగన్మోహన్ రెడ్డి.

* వివాదాస్పద నేతలుగా..
మరోవైపు కమ్మ సామాజిక వర్గం నేతలుగా ఉన్న కొడాలి నాని, వల్లభనేని వంశీ మోహన్ లను ఏ స్థాయిలో వివాదాస్పద నేతలుగా మార్చారో తెలియనిది కాదు. వారు బలమైన కమ్మ సామాజిక వర్గం ప్రాబల్యం ఉన్న నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చారు. సహజంగానే వీరి మాటలు కమ్మ సామాజిక వర్గానికి నచ్చవు. దీంతో ఆ ఇద్దరితో వివాదాస్పద ప్రకటనలు చేయించి.. అంతకుమించి తప్పుడు మార్గాల్లో మాట్లాడించి కమ్మ వ్యతిరేకులుగా చిత్రీకరించడంలో సక్సెస్ అయ్యారు. ఆపై బొల్లా బ్రహ్మనాయుడు, తలశిల రఘురాం లాంటి నాయకుల విషయంలో సైతం ఆశించిన స్థాయిలో రాజకీయ ప్రోత్సాహం అందించలేదు. అందుకే ఇప్పుడు కమ్మ నేతలు డిఫెన్స్ లో పడిపోయారు. అటువంటి నాయకులకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తప్ప మరో ఆప్షన్ లేదు కూడా. అలా వారిని రాజకీయంగా ఎదగనివ్వకుండా.. మరో మార్గం లేకుండా చేయడంతో వారు.. పొలిటికల్ సైలెన్స్ పాటించాల్సి వస్తోంది.