Home Blog Page 227

ఆ 16 వేల కుటుంబాలు వైసిపి కి దూరం!

YSRCP
YSRCP

YSRCP: వైయస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి డీఎస్సీ- 2025 పై అనుమానాలు వ్యక్తం చేశారు. దానిని ఒక దగా డిఎస్సి గా పేర్కొన్నారు. డీఎస్సీ నియామక ప్రక్రియలో అవకతవకలు చోటు చూసుకున్నాయని ఆరోపించారు. గత ఏడాది కూటమి ప్రభుత్వం 16,400 ఉపాధ్యాయ పోస్టులతో డీఎస్సీ నియామక ప్రక్రియను పూర్తి చేసిన సంగతి తెలిసిందే. గత ఏడాది నియామకం జరిగి ఒక విద్యా సంవత్సరంలో విద్యాబోధన కూడా పూర్తి చేశారు సదరు ఉపాధ్యాయులు. ఇప్పుడు అదే డీఎస్సీ నియామక ప్రక్రియ పై ఆరోపణలు చేస్తున్నారు జగన్ మోహన్ రెడ్డి. దీంతో ఆ 16 వేల మందికి పైగా ఉపాధ్యాయులు తీవ్ర ఆందోళనతో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి తీరును తప్పు పడుతున్నారు. ఆయన స్థాయికి తగిన ఆరోపణలు కావని తేల్చి చెబుతున్నారు.

* ఎన్నికల ముందు హడావిడిగా..
2024 ఎన్నికల కు ముందు రోజుల వ్యవధిలో 6000 ఉపాధ్యాయ పోస్టులతో నోటిఫికేషన్ ఇచ్చింది జగన్ ప్రభుత్వం. కానీ దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభం కాలేదు. ఇంతలోనే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. దీంతో డీఎస్సీ నోటిఫికేషన్ రద్దయింది. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ 6000 ఉపాధ్యాయ పోస్టులకు తోడు.. మరో 10,000 కలిపి 16 వేల పోస్టులతో మెగా డీఎస్సీని ప్రకటించింది చంద్రబాబు సర్కార్. దానికి కూడా అడ్డు తగిలింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. లేనిపోని కేసులు కూడా మోపింది. లీగల్ పరంగా ఎటువంటి అడ్డంకులు ఎదురైనా నివృత్తి చేసుకొని ముందుకు సాగారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. అనుకున్న వ్యవధిలోనే 16 వేల ఉపాధ్యాయ పోస్టుల నియామకాలను పూర్తి చేశారు. అయితే ఇప్పుడు ఆ నియామకాలు అక్రమ పద్ధతిలో జరిపారని జగన్మోహన్ రెడ్డి ఆరోపిస్తున్నారు. దీంతో ఉపాధ్యాయులుగా ఎంపికైన 16000 మంది తీవ్ర ఆందోళనతో ఉన్నారు.

* నిరాశలో నిరుద్యోగులు…
2019 ఎన్నికలకు ముందు ఏటా డీఎస్సీ ప్రకటించి ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తానని జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క పోస్టు కూడా భర్తీ చేయలేదు. ఉపాధ్యాయ పోస్ట్పై ఆశలు పెట్టుకున్న చాలామంది నిరుద్యోగులు బీఈడీతో పాటు డీఎడ్ పూర్తి చేశారు. కానీ ఎటువంటి భర్తీ లేకపోవడంతో నిరాశ చెందారు. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 16 వేల పోస్టులు భర్తీ చేయడంతో చాలామంది ఉద్యోగాలు పొందారు. కానీ జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియాలో ఓ వార్తను పట్టుకొని.. డీఎస్సీలో అవకతవకలు జరిగాయి అంటూ ఆరోపణలు చేస్తున్నారు. అయితే ఏపీ విద్యాశాఖ ఫ్యాక్ట్ చెక్ లో భాగంగా ఆ ఆరోపణల్లో నిజం లేదని తెలిపింది. దీంతో ఈ ఉపాధ్యాయులంతా ఊపిరి పీల్చుకున్నారు. కానీ తన రాజకీయాల కోసం తమ జీవితాలను పణంగా పెట్టడాన్ని మాత్రం సహించుకోలేకపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి తీరును అసహ్యించుకుంటున్నారు. 16 వేల కుటుంబాలు నేరుగా వైసీపీకి దూరమైనట్టే. అయితే దాని ప్రభావం ఇంకా రెట్టింపు ఉంటుంది. అనవసరంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మూల్యం చెల్లించుకోబోతోంది.

ఆయేషా.. నీ తెరచాటు అందాలు చూడతరమా?

Aisha Sharma Mirror Selfie
Aisha Sharma Mirror Selfie

తనలో బాధను బయటపెట్టిన పవన్!

Pawan Kalyan Farm House Allegations
Pawan Kalyan Farm House Allegations

Pawan Kalyan Emotional Comments: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మనసు తెరిచి మాట్లాడారు. రాజమండ్రి పర్యటనలో ఉన్న ఆయన పార్టీ శ్రేణులతో మమేకమై అనేక రకాల వ్యాఖ్యానాలు చేశారు. ముఖ్యంగా కాపుల పరంగా తనపై జరుగుతున్న రాజకీయ దాడిని ప్రస్తావించారు. సీఎం చంద్రబాబుకు, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై లేని ఈ కుల బాధ తన విషయంలో ఎందుకు అని ఆయన ప్రశ్నించారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నేను ఒక కులం కోసమే పార్టీ ఏర్పాటు చేయలేదని.. అన్ని కులాల కోసం పనిచేసే గుణం తనది అని చెప్పుకున్నారు. మరి ఎందుకు ఒక్క కాపు కులం లోనే తనను టార్గెట్ చేస్తున్నారు అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గత 12 సంవత్సరాలుగా ఈ బాధ అనుభవిస్తున్నానని కూడా చెప్పుకొచ్చారు. అందుకే ఇప్పుడు బయట పెడుతున్నట్లు తెలిపారు. ఇతర కులాల్లో నాయకులు ఉన్నారని.. మరి ఎందుకు ఒక కులంలో కులం పేరు చెప్పి రాజకీయాలు చేస్తున్నారని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ ఆసక్తికర విషయాలను బయటపెట్టారు.

* వారికి లేనిది తనకే..
కులం పేరుతో జగన్మోహన్ రెడ్డిని ఎవరైనా రెడ్డి సామాజిక వర్గం వారు ప్రశ్నించారా అంటూ నిలదీశారు పవన్ కళ్యాణ్. ఒక్క రెడ్డి సామాజిక వర్గం నేతైనా తన పేరు మార్చుకున్నారా? అంటూ పరోక్షంగా ముద్రగడ పద్మనాభం ప్రస్తావన తీసుకొచ్చారు. పవన్ కళ్యాణ్ గెలిస్తే పేరు మార్చుకున్న విషయాన్ని కూడా మరోసారి గుర్తు చేశారు. పోనీ చంద్రబాబును సొంత కులం వారు ఓడించాలని చూశారా? కనీసం ఆ సామాజిక వర్గం నేతలు కుల ప్రస్తావన తీసుకొస్తున్నారా? చంద్రబాబు ఓడిపోతే పేరు మార్చుకుంటామని ఎవరైనా చెప్పారా అంటూ.. ఆలోచనకర రీతిలో మాట్లాడారు పవన్ కళ్యాణ్. కేవలం తనను ఒక కుల నాయకుడిగా ముద్ర వేసి ఇతర కులాలను దూరం చేయాలన్న ఎత్తుగడ మంచిది కాదు అని బాధపడ్డారు పవన్.

* కులం పేరుతో రాజకీయం..
పవన్ కళ్యాణ్ కోసం కులమంతా బాధ పడుతుందని.. ఆయన సీఎం కావాలని కులం కోరుకుంటే ఆయన మాత్రం కావడం లేదని కొందరు కాపు నేతలు చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. పవన్ కళ్యాణ్ తీరుతో కాపులు చాలా మోసపోతున్నారని అంబటి లాంటివారు బాధపడుతుంటారని.. వారి బాధ కాపుల కోసమా.. లేకుంటే వారి కోసమా అని ప్రశ్నించారు. వంగవీటి మోహన్ రంగా బతికి ఉన్నప్పుడు కనీసం పలకరించేవారు కాదని.. ఆయన చనిపోయిన తరువాత తమ వాడంటే తమ వాడు అని.. ఆయనను హత్య చేసింది ఒక సామాజిక వర్గం వారు అని ఆరోపణలు చేస్తున్న విషయాన్ని ప్రస్తావించారు. కానీ రంగా గారి భార్య, పిల్లల వైవాహిక జీవితంలో కుల ప్రస్తావన లేదు అని గుర్తు చేశారు. మొత్తానికి అయితే పవన్ తన 12 సంవత్సరాల కుల బాధను బయటపెట్టారు. ప్రస్తుతం అదే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
.

ప్లే ఆఫ్ సమరం: రాజస్థాన్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్.. ఫైనల్ వెళ్లేది ఎవరంటే..

Rajasthan Royals Vs Sunrisers Hyderabad
Rajasthan Royals Vs Sunrisers Hyderabad

Rajasthan Royals Vs Sunrisers Hyderabad: తొలి ప్లే ఆఫ్ లో గుజరాత్ మీద బెంగళూరు విజయం సాధించింది. దర్జాగా రెండోసారి ఫైనల్ వెళ్లిపోయింది. రెండో ప్లే ఆఫ్ బుధవారం జరగనుంది. రాజస్థాన్ రాయల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ మ్యాచ్ లో పోటీ పడపోతున్నాయి. ఈ మ్యాచ్ లో ఓడిన జట్టు నేరుగా టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. గెలిచిన జట్టు క్వాలిఫైయర్2 లో ఆడుతుంది. అందువల్ల విజయం కోసం అటు రాజస్థాన్, ఇటు హైదరాబాద్ హోరాహోరీగా ఆడతాయనడంలో ఎటువంటి సందేహం లేదు.

లీగ్ పోటీలు జరుగుతున్నప్పుడు హైదరాబాద్ 14 మ్యాచ్ లలో 9 విజయాలు సాధించింది. గుజరాత్ జట్టుతో సమానంగా పాయింట్లు సాధించినప్పటికీ నెట్ రన్ రేట్ వల్ల మూడో స్థానానికి పరిమితంకావాల్సి వచ్చింది. రాజస్థాన్ ఈ సీజన్ లో 8 విజయాలు అందుకుంది. పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది.

ఇక మ్యాచ్ లో సన్ రైజర్స్ సత్తా చూపించాలని భావిస్తోంది. ఐపీఎల్ సీజన్లో చివరి పది మ్యాచ్ లలో హైదరాబాద్ ఏకంగా ఎనిమిదింట్లో విజయం సాధించింది. గడిచిన ఏడు మ్యాచ్ లకు హైదరాబాద్ జట్టుకు కమిన్స్ నాయకత్వం వహించాడు. ప్రస్తుత సీజన్ లో హైదరాబాద్ రాజస్థాన్ తో ఆడిన రెండు మ్యాచ్ లలో విజయం సాధించింది. దీంతో ఆరెంజ్ ఆర్మీలో సానుకూలత తొణికిసలాడుతోంది. సన్ రైజర్స్ లో అభిషేక్ శర్మ(563), హెడ్(393), ఇషాన్ కిషన్(569), క్లాసెన్(606) సూపర్ ఫామ్ లో ఉన్నారు.

హెడ్ స్థిరమైన ఇన్నింగ్స్ ఆడలేకపోతున్నాడు. బౌలింగ్ లో కూడా హైదరాబాద్ సత్తా చూపిస్తోంది. కమిన్స్ ఏడు మ్యాచ్లలో 8 వికెట్లు సొంతం చేసుకున్నాడు. ఇషాన్ మలింగ 19 వికెట్లు, సాకిబ్ హుస్సేన్ 15 వికెట్లను తమ ఖాతాలో వేసుకున్నారు. మిడిల్ ఓవర్లలో శివాంగ్ కుమార్ దుమ్ము రేపుతున్నాడు. వీరంతా సూర్యవంశీని కట్టడి చేస్తేనే రాజస్థాన్ దూకుడుకు కళ్లెం వేయవచ్చు.

రాజస్థాన్ లో సూర్యవంశీ(583), యశస్వి జైస్వాల్(397), ధ్రువ్ జూరెల్(458) పరుగులతో సూపర్ ఫామ్ లో కొనసాగుతున్నారు. జైస్వాల్ స్థిరంగా ఆడాల్సిన అవసరం ఉంది. రాజస్థాన్ భవితవ్యం మొత్తం 15 ఏళ్ల సూర్యవంశీ మీద ఆధారపడి ఉంది. అతడు గనుక అదరగొడితే రాజస్థాన్ బీభత్సంగా రన్స్ సాధించడం ఖాయం. రాజస్థాన్ లో జోఫ్రా ఆర్చర్ కీలక బౌలర్ గా కొనసాగుతున్నాడు. అతడు రాణిస్తే మాత్రం ఆ జట్టుకు తిరుగుండదు. ఆర్చర్ ఇప్పటివరకు 21,. బ్రిజేష్ శర్మ 13, బర్గర్ 11 వికెట్లను దక్కించుకున్నారు . యశ్ రాజ్ పుంజా కూడా 8 వికెట్లను పడగొట్టారు. జడేజా కూడా ఇప్పటివరకు 8 వికెట్లను తీయడమే కాకుండా, 209 పరుగులు చేశాడు.

రాజస్థాన్ తో హైదరాబాద్ ఇప్పటి వరకు 23 మ్యాచ్ లు ఆడింది. ఇందులో 14 మ్యాచ్ లలో విజయం సాధించింది. రాయల్స్ 9 విజయాలు సొంతంచేసుకుంది. ప్రస్తుత సీజన్ లో రెండు, గతంలో మూడు, మొత్తం ఐదు మ్యాచ్ లలో హైదరాబాద్ విక్టరీలను అందుకోవడం విశేషం.

ఏఐ వల్ల ఇది శాంపిల్ మాత్రమే.. ముందుంది మొసళ్ల పండగ

AI Impact On Jobs
AI Impact On Jobs

AI Impact On Jobs: శాస్త్ర సాంకేతిక రంగాలలో ఏఐ నెలకొల్పుతున్న సంచలనం మాములుగా లేదు. అన్ని విభాగాలలో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ పెను ప్రకంపనలు కలిగిస్తోంది. ఏఐ వల్ల అన్ని రంగాలలో విపరీతమైన మార్పులు వస్తున్నాయి. తయారీ రంగం నుంచి అంతరిక్షం వరకు ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ గణనీయమైన మార్పును చూపిస్తోంది. దీంతో పనులన్నీ అత్యంత కచ్చితత్వంతో జరుగుతున్నాయి. మానవవనరుల అవసరం కూడా చాలా తగ్గుతోంది.

ఏఐ వల్ల ప్రపంచవ్యాప్తంగా అన్ని ఐటీ కంపెనీలు ఆటోమేషన్ వైపు వెళ్లిపోతున్నాయి. మనుషుల అవసరం లేకుండా పనులను చక్కపెట్టుకుంటున్నాయి. దీనివల్ల ఉద్యోగుల అవసరం లేకుండాపోతోంది. ఇప్పటికే అన్ని కంపెనీలు ఉద్యోగులను బయటకు పంపేశాయి. పంపిస్తున్నాయి కూడా. తొలిసారిగా ఏఐ విషయంలో కీలక ప్రకటన చేశాడు ఓపెన్ ఏఐ సీఈవో శామ్ అల్ట్ మన్.

వైట్ కాలర్ ఉద్యోగాలు ఏఐవల్ల ప్రభావితం కావని అల్ట్ మన్ చేసిన ప్రకటన ఇప్పుడు సంచలనంగా మారింది. చాట్ జీపీటీని ఓపెన్ ఏఐ ప్రారంభించినప్పుడు ఆర్థికవ్యవస్థల మీద తీవ్రంగా ప్రభావం పడుతుందని అందరూ అనుకున్నారు. ఆల్ట్ మన్ కూడా ఇదే భావించాడు. కానీ ఈ విషయంలో ఆల్ట్ మన్ అంచనా పూర్తిగా తప్పింది. చాలావరకు ప్రారంభస్థాయి వైట్ కాలర్ ఉద్యోగాలు స్థిరంగా సాగుతున్నాయి. మార్కెట్ లో ఏర్పడిన ఒడిదుడుకులు కొంతమేర ఇబ్బంది కలిగించినప్పటికీ వాటి ప్రభావం తీవ్రంగానే ఉంది.

ఏఐ అత్యంత సమర్థవంతమైన టెక్నాలజీ అయినప్పటికీ మనుషుల భాగస్వామ్యం లేకుండా అది పనిచేయడం దాదాపు అసాధ్యమని ఆల్ట్ మన్ పేర్కొన్నారు. శ్లాక్, ఇమెయిల్ సందేశాలకు ఏఐ టెక్నాలజీని ఉపయోగించినా..అది ఆశించిన స్థాయిలో అనుభూతి ఇవ్వడం లేదని ఆల్ట్ మన్ ప్రకటించడం విశేషం.

ఏఐ వల్ల అమెజాన్, హెచ్ ఎస్ బీసీ, స్టాండర్డ్ చార్టర్డ్, సీబీఏ వంటి సంస్థలు తమ ఉద్యోగులను ఏఐతో భర్తీ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈధోరణిని మిగతా కంపెనీలు కూడా పాటిస్తున్నాయి. ఈ విషయాన్ని ఆల్ట్ మన్ ప్రకటించలేదు. కొన్ని అవసరాలు మాత్రమే ఏఐ ద్వారా తీరుతాయని ఆల్ట్ మన్ ప్రకటించినప్పటికీ.. అన్ని కంపెనీలు దాదాపు మెజార్టీ ఉద్యోగాలను ఏఐతో భర్తీ చేస్తుండటం ఇక్కడ గమనార్హం.

మరో వైపు ఓపెన్ ఏఐ సరికొత్తగా అడుగులు వేస్తోంది. అమెరికాలో ఐపీవో కోసం సిద్ధమవుతోంది.ఏకంగా లక్ష కోట్ల డాలర్ల మార్కెట్ విలువను సొంతం చేసుకోవడానికి రెడీ అవుతోంది. కనీసం 5.7 లక్షల కోట్లను సమీకరించేందుకు ప్రణాళికలు రూపొందించుకుంది. కాగా, ఆల్ట్ మన్ ప్రకటనను ఐటీ నిపుణులు మరో విధంగా చెబుతున్నారు. ఆల్ట్ మన్ ప్రకటనకు క్షేత్రస్థాయి పరిస్థితికి సంబంధం లేదని, ఏఐ వల్ల ఇది శాంపిల్ మాత్రమే.. ముందుంది మొసళ్ల పండగ అని ఐటీ నిపుణులు చెబుతున్నారు.

ప్రొఫెసర్ నాగేశ్వర్ అరెస్టుపై పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు!

Professor Nageshwar
Professor Nageshwar

Professor Nageshwar Arrest: తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ వివాదానికి కారణమయ్యారు ప్రొఫెసర్ నాగేశ్వర్. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ సందర్భంగా చాలా రకాల పరిణామాలు చోటు చేసుకున్నాయని వివరించే ప్రయత్నం చేశారు నాగేశ్వర్. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ కు జగన్మోహన్ రెడ్డి విషయంలో అమిత్ షా క్లాస్ పీకినట్లు కూడా చెప్పుకొచ్చారు.. జగన్ నమ్మదగిన మిత్రుడు అని.. చంద్రబాబు తాత్కాలిక మిత్రుడు అన్నట్టు కూడా విశ్లేషించారు ప్రొఫెసర్ నాగేశ్వర్. అయితే ఏపీ రాజకీయాల్లో ఇది దుమారానికి దారితీసింది. పవన్ కళ్యాణ్ విరుచుకుపడ్డారు. టిడిపి శ్రేణులు కూడా మండిపడ్డాయి. పోలీస్ కేసులు కూడా నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారు ప్రొఫెసర్ నాగేశ్వర్. అటు జనసేన సైతం ఇంతటితో ఈ వివాదానికి పుల్ స్టాప్ పెడతామని ప్రకటించింది. అయినా సరే వివాదం కొనసాగుతోంది. దీనిపై తాజాగా స్పందించారు పవన్ కళ్యాణ్. కీలక వ్యాఖ్యలు కూడా చేశారు.

* తెలంగాణ నేతల మద్దతు..
ప్రొఫెసర్ నాగేశ్వర్ అరెస్ట్ అంటూ పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తోంది. అయితే ఆయనను అరెస్టు చేస్తే ఊరుకునేది లేదని తెలంగాణ నేతలు హెచ్చరిస్తున్నారు. మరోవైపు చాలామంది నాగేశ్వర్ కు మద్దతు ఇస్తున్నారు. యుద్ధం మీరు ప్రారంభించారు.. ముగింపు నేను ఇస్తానంటూ ప్రొఫెసర్ నాగేశ్వర్ సైతం సవాల్ చేశారు. హైదరాబాదులో ఏపీ పోలీసులు దిగారని.. ఈ క్షణంలోనైనా ప్రొఫెసర్ నాగేశ్వర్ అరెస్టు జరుగుతుందని పెద్ద ఎత్తున ప్రచారం నడిచింది. తాజా వివాదం నేపథ్యంలో తెలంగాణ పోలీసులు ప్రొఫెసర్ నాగేశ్వర్ కు రక్షణ కల్పిస్తున్నారు. అయితే అరెస్టులపై తెగ హడావిడి నడుస్తోంది హైదరాబాదులో. ఈ తరుణంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అరెస్టుపై స్పందించి మాట్లాడారు.

* వదిలేయండి అంటూ తేలిగ్గా..
రాజమండ్రి పర్యటనలో ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జనసేన శ్రేణులతో వరుసగా సమావేశం అవుతూ వస్తున్నారు. ఇదే సమావేశంలోనే ప్రొఫెసర్ నాగేశ్వర్ తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు పవన్ కళ్యాణ్. హద్దులు మీరు వ్యవహరిస్తే తాటతీస్తాం అంటూ హెచ్చరించారు. అయితే ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ అరెస్టుపై పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తున్న తరుణంలో మూడు రోజుల తర్వాత మళ్లీ స్పందించారు పవన్ కళ్యాణ్. ప్రొఫెసర్ నాగేశ్వర్ అరెస్టు సమాచారం తనకు వచ్చిందని.. వద్దని ఆదేశాలు ఇచ్చామని.. ఆయన సైతం మంచివాడు అని.. ఏదో ఆ సమయానికి అలా అనేసారు అంటూ చాలా తేలిగ్గా తీసుకున్నారు. దీంతో ప్రొఫెసర్ నాగేశ్వర్ వివాదానికి పవన్ కళ్యాణ్ ఫుల్ స్టాప్ పెట్టినట్లు భావించాలి.

ప్లే ఆఫ్ సమరం: వారి వల్లే బెంగళూరు గెలుపు.. గుజరాత్ ఓటమి

RCB Vs Gujarat Titans
RCB Vs Gujarat Titans

RCB Vs Gujarat Titans: బెంగళూరు సత్తా చూపించింది. నేరుగా ఫైనల్ దూసుకుపోయింది. ఫైనల్ మ్యాచ్ లో బెంగళూరు ఏకంగా గుజరాత్ పై 92 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. తద్వారా వరుసగా రెండోసారీ ఫైనల్ వెళ్లిన జట్టుగా రికార్డు నెలకొల్పింది. క్వాలిఫైయర్ 1 మ్యాచ్ హోరాహోరీగా సాగుతుందనుకుంటే పూర్తి ఏకపక్షంగా సాగింది. బెంగళూరు విధించిన కొండంత లక్ష్యాన్ని ఛేదించడంలో గుజరాత్ విఫలమైంది.

బెంగళూరు ప్రారంభం నుంచి అత్యంత కచ్చితత్వంతో బ్యాటింగ్ చేసింది. కెప్టెన్ రజత్ పాటిదార్(93) తిరుగులేని ఇన్నింగ్స్ ఆడాడు. కోహ్లీ(43), క్రుణాల్ పాండ్యా (43) సూపర్ బ్యాటింగ్ చేశారు. బెంగళూరు భారీ స్కోర్ చేయడంలో వీరు ముగ్గరు అత్యంతకీలక పాత్ర పోషించారు. ఫలింతగా బెంగళూరు సగం మ్యాచ్ గెలిచేసేంది.

బౌలింగ్ లో డఫీ(3/39), రసిఖ్ సలామ్ (2/24), భువనేశ్వర్ కుమార్ (2/28), హేజిల్ వుడ్(1/39) సత్తా చూపించారు. ఈ నలుగురు మిగతా సగం బాధ్యతను నెరవేర్చడంతో బెంగళూరు దర్జాగా గెలుపును అందుకుంది. పవర్ ప్లే లోనే బెంగళూరు 51 పరుగులకు ఐదు వికెట్లు కోల్పోయింది. దీనిని బట్టి గుజరాత్ జట్టు బ్యాటింగ్, బెంగళూరు బౌలింగ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

భీకరమైన ఫామ్ లో ఉన్న సాయి సుదర్శన్14 పరుగులకే దారుణంగా హిట్ వికెట్ గా వెనుదిరిగాడు. ఫోర్ కొట్టిన అతడు బ్యాట్ మీద నియంత్రణ కోల్పోయాడు. అది చేతుల నుంచి జారి వికెట్ల మీద పడిపోయింది. భువనేశ్వర్ వేసిన బంతి వల్ల గిల్(2) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. బట్లర్(29) హేజిల్ వుడ్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. నిశాంత్ సింధు(5), హోల్డర్(0) గోల్డెన్ డక్ గా ఔటయ్యాడు. చివర్లో రాహుల్ తేవాటియా(68) అదరగొట్టడంతో ఓటమి అంతరంమాత్రమే తగ్గింది.

పాటిదార్ ను ఔట్ చేయలేకపోవడం.. గుజరాత్ బౌలర్లు దారుణంగా పరుగులు సమర్పించుకోవడంతో బెంగళూరు 20 ఓవర్లలో ఏకంగా 254 పరుగులు చేసింది. గుజరాత్ లో సాయి సుదర్శన్, గిల్ విఫలం కావడం, కీలక ఆటగాళ్లు ఔట్ కావడంతో ఓటమి తప్పలేదు. గుజరాత్ నుంచి ఈ స్థాయి ఆటను అంచనా వేయలేదని అభిమానులు పేర్కొంటున్నారు. గుజరాత్ జట్టు కేవలం 162 పరుగులకు ఆలౌట్ కావడం ఆ జట్టు బ్యాటింగ్ వైఫల్యానికి అద్దం పడుతోంది.

హైబ్రిడ్ మహానాడు.. అంతా లోకేష్ మేనియా!

Hybrid Mahanadu 2026
Hybrid Mahanadu 2026

Hybrid Mahanadu 2026: తెలుగుదేశం పార్టీ వార్షిక పండుగ మహానాడుకు రంగం సిద్ధం అయ్యింది. ఎప్పుడు అట్టహాసంగా జరిగే మహానాడు ఈసారి హైబ్రిడ్ విధానంలో జరపనున్నారు. కరోనా లాంటి విపత్తు సమయంలో సైతం ఆన్లైన్లో మహానాడు నిర్వహించారు. ఈసారి మాత్రం మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతికత జోడించి సరికొత్తగా మహానాడు పండుగ జరుపుతున్నారు. పశ్చిమ ఆసియా యుద్ధ ప్రభావంతో ప్రపంచం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. ముఖ్యంగా ఇంధన సంక్షోభం తలెత్తింది. ఈ పరిస్థితుల్లో పొదుపు పాటించాలని ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపుతో.. మహానాడు పండుగను హైబ్రిడ్ విధానంలోకి మార్చారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పరిమిత ప్రతినిధులతో భౌతిక మహానాడు జరగనుంది. దానిని అనుసంధానిస్తూ జిల్లా కేంద్రాలతో పాటు నియోజకవర్గ, మండల కేంద్రాల్లో, క్లస్టర్లలో మహానాడు ను నిర్వహిస్తున్నారు.

* ఈసారి ప్రత్యేకత అదే..
ఈ మహానాడుకు ప్రత్యేకత ఉంది. తెలుగుదేశం పార్టీ నాయకత్వ బదలాయింపు జరిగింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ నియమితులయ్యారు. ఆ పదవి అంటే దాదాపు పార్టీ ఆయన చేతికి వచ్చినట్టే. ఈ పదవి చేపట్టిన తర్వాత తొలిసారి మహానాడు కావడంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అధినేత చంద్రబాబుతో పాటు లోకేష్ పార్టీ శ్రేణులతో నేరుగా మాట్లాడతారు. సాధారణంగా మహానాడు అంటేనే పార్టీ అభివృద్ధి, చాలా రకాల తీర్మానాలు ఉంటాయి. ఒక విధంగా చెప్పాలి అంటే పార్టీకి ఒక నిర్దేశం అన్నమాట. టిడిపి ప్రారంభంలో నందమూరి తారకరామారావు.. తర్వాత నారా చంద్రబాబు.. ఇప్పుడు నారా లోకేష్ మార్గదర్శకంలో మహానాడు జరగనుంది.

* అంతటా ఆసక్తి..
ఈ హైబ్రిడ్ మహానాడు పై తెలుగుదేశం పార్టీ కంటే ఇతర రాజకీయ పార్టీలకు ఆసక్తి ఉంది. టిడిపి అంటేనే టెక్నాలజీకి ప్రాధాన్యం ఇస్తుందన్న పేరు ఉంది. అయితే ఇప్పుడు అదే టెక్నాలజీని వినియోగించుకొని.. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది టిడిపి శ్రేణులతో హైబ్రిడ్ మహానాడు నిర్వహిస్తున్నారు. దీనికి కర్త, కర్మ, క్రియ నారా లోకేష్. మరోవైపు టిడిపి శ్రేణుల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ సమర్థ నాయకత్వం వైపు అడుగులు వేశారు లోకేష్. దానిని మరింత పటిష్టం చేసుకొనున్నారు. తొలిసారి మహానాడు నిర్వహణ బాధ్యత లోకేష్ తీసుకుంటున్నారు. అయితే డిజిటల్ రూపంలో హైబ్రిడ్ విధానంలో మహానాడు ఆలోచన లోకేష్ దేనని తెలుస్తోంది. పార్టీ బాధ్యతలు తీసుకున్న తొలి ఏడాది.. ఇప్పటివరకు జరుగుతున్న దానికంటే భిన్నంగా మహానాడు నిర్వహిస్తుండడం మాత్రం ప్రత్యేకమే. ఈ విధానం సక్సెస్ అయితే మాత్రం జాతీయస్థాయిలో సైతం లోకేష్ పేరు మార్మోగడం ఖాయం.

20 తీర్మానాలు.. 65 మంది వక్తలు.. మహానాడు విశేషాలు ఇవే!

TDP Mahanadu 2026
TDP Mahanadu 2026

TDP Mahanadu 2026: టిడిపి హైబ్రిడ్ మహానాడు మరికొద్ది సమయంలో ప్రారంభం కానుంది. ఈసారి మహానాడు ఎన్నో రకాల ప్రత్యేకతలను సంతరించుకుంది. సంప్రదాయ విధానానికి భిన్నంగా హైబ్రిడ్ విధానంలో నిర్వహిస్తున్నారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీలో యువ రక్తం ఎక్కించారు. మరోవైపు మహిళా నాయకత్వానికి ప్రోత్సాహం అందిస్తున్నారు. స్త్రీ శక్తిని ప్రధాన ఇతివృత్తంగా ఎంచుకోవడం విశేషం. స్త్రీ శక్తి థీమ్ తో జరుపుతామని ఇప్పటికే నాయకత్వం ప్రకటించింది. అందుకు తగ్గట్టుగానే మహానాడు వేదికపై మహిళలతోపాటు యువతకు ప్రాధాన్యం కల్పించింది. వక్తల ఎంపికలో యువతతో పాటు మహిళలకు ప్రాధాన్యం ఇవ్వడం విశేషం.
* అత్యంత కీలకమైన రాజకీయ తీర్మానం ప్రవేశపెట్టే బాధ్యతను కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనితకు అప్పగించారు.
* పార్టీ కోసం అంకితభావంతో పనిచేసిన నలుగురు మహిళా నేతలు వసుంధర, మాధవి, శిరీష, కళావతి లను సత్కరిస్తారు.
* కొత్తగా పొలిట్ బ్యూరోలో స్థానం సంపాదించిన ద్వితీయ శ్రేణి నాయకురాలు గంటెడ శ్రీదేవి.. సామాజిక సమతూకంలో భాగంగా ట్రాన్స్ జండర్ ప్రతినిధి నీరజ రానిలను సన్మానించనున్నారు.
* మారుతున్న కాలానికి అనుగుణంగా యువ ఓటర్లు, క్యాడర్ను ఆకట్టుకునే విధంగా సీఎం చంద్రబాబు జెన్ జి యువతతో ప్రత్యేకంగా ఇంటరాక్షన్ నిర్వహించనున్నారు. యువత ఆలోచనలను తెలుసుకునే ప్రయత్నం చేయనున్నారు.
* మొత్తం 20 తీర్మానాలు, 65 మంది వక్తలతో సమయపాలన పాటిస్తూ.. సరికొత్త డిజిటల్ విధానంలో సాగనున్న ఈ మహానాడు టిడిపి శ్రేణుల్లో జోష్ నింపుతుందని నాయకత్వం బలంగా నమ్ముతోంది.

ఈ రాశి వ్యాపారులకు ఈరోజు స్పెషల్.. ఆర్థికంగా ఊహించని లాభాలు..

Today 6 June 2026 Horoscope
Today 6 June 2026 Horoscope

Today 27 May 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధవారం ద్వాదశ రాశులపై హస్త నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొందరు వ్యాపారులు ఈరోజు సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు. మరికొందరు కోపాన్ని తగ్గించుకోవడమే మంచిది. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

మేష రాశి (అశ్విని, భరణి,1,2,): ఈ రాశి ఉద్యోగులు ఈరోజు శుభవార్తలు వింటారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. వ్యాపారులకు గణనీయమైన లాభాలు ఉంటాయి. ఆగిపోయిన డబ్బు వసూలు అవుతుంది. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోయి సంతోషంగా గడుపుతారు. స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు.

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారు ఈ రోజు ప్రతి పనిని పెద్దతో చేస్తారు. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఇప్పుడు లాభాలు పొందుతారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. జీవిత భాగస్వామి కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు తొలగిపోవడంతో వ్యాపారులకు సపోర్టుగా ఉంటారు. అనువైన వాతావరణం ఉండడంతో వ్యాపారులు కొత్త పెట్టుబడులు పెడతారు.

మిథున రాశి( మృగశిర 3,4 ): ఈ రాశి వారికి ఈ రోజు కొన్ని సమస్యలు ఎదురవుతాయి. అయినా కూడా వాటిని అధిగమిస్తూ అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారులు ప్రత్యర్థుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొత్త ఆస్తిని కొనుగోలు చేసేటప్పుడు పెద్దలను సంప్రదించడం మంచిది. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని కీలక నిర్ణయం తీసుకుంటారు.

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారు ఈరోజు మిత్రులతో సంతోషంగా ఉంటారు. కొన్ని పనులు పూర్తి చేయడానికి కష్టపడాల్సి వస్తుంది. అనవసరపు వివాదాల్లోకి తలదూర్చకుండా ఉండాలి. కోపం పెరిగే అవకాశం ఉంటుంది. దానిని నియంత్రణలో ఉంచుతేనే పనులు పూర్తవుతాయి. కుటుంబ సభ్యుల మధ్య భావోద్వేగాలు కనిపిస్తాయి.

సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారికి కష్టానికి తగిన ఫలితాలు ఉంటాయి. కుటుంబ సభ్యుల మద్దతుతో ఉద్యోగులు తమ ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేస్తారు. పిల్లల కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు. వ్యాపారుల ఆర్థిక పరిస్థితి గతంలో కంటే ఇప్పుడు మెరుగ్గా ఉంటుంది. ప్రియమైన వారితో సంతోషంగా గడుపుతారు. కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి ఇదే మంచి సమయం.

కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : కన్య రాశి వారికి కుటుంబ సభ్యుల మద్దతు ఉండడంతో వ్యాపారులు అధిక లాభాలు పొందుతారు. పిల్లల కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు. గ్రహాల అనుకూలతతో కొన్ని పనులు విజయవంతంగా పూర్తవుతాయి. ఉద్యోగులకు అనుకోకుండా అదృష్టం ఏర్పడుతుంది. దీంతో కొందరు పదోన్నతి పొందే అవకాశం ఉంటుంది.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారికి ఈ రోజు అవసరమైన డబ్బు సకాలంలో అందుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పిల్లల కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు. ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన రహస్యాలను ఇతరులతో చెప్పకూడదు. ముఖ్యమైన పనులను వాయిదా వేయడమే మంచిది.

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారికి ఈ రోజు అన్ని పనులు ఒకే సమయానికి పూర్తవుతాయి. దీంతో సంతృప్తిగా ఉండగలుగుతారు. కొన్ని పనులు పూర్తికావడానికి కష్టపడాల్సి వస్తుంది. దూర ప్రయాణాలు చేసేటప్పుడు సొంత వాహనాలకు దూరంగా ఉండటమే మంచిది. కుటుంబ సంక్షేమం కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు.

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారు నిరుద్యోగులు అయితే వీరికి శుభవార్తలు అందుతాయి. ఇప్పటికే ఉద్యోగాలు చేసే వారికి పదోన్నతులు వచ్చే అవకాశం ఉంటుంది. వ్యాపారులకు గతంలో కంటే ఇప్పుడు లాభాలు అధికంగా ఉంటాయి. అనుకోకుండా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారికి ఈ రోజు అనుకున్న ఫలితాలు ఉంటాయి. ఇతరుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని గుడ్డిగా నమ్మి డబ్బులు ఇవ్వకూడదు. అలాగే కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు ఏర్పడితే సంయమనం పాటించాలి. మాటల మాధుర్యంతో ఎదుటివారిని ఆకట్టుకుంటారు. సమాజంలో గౌరవం లభిస్తుంది.

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారికి గతంలో కంటే ఇప్పుడు ఆరోగ్యం మెరుగుపడుతుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. వ్యాపారులకు ఆశించిన లాభాలు రావడంతో సంతృప్తిగా ఉంటారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. ఉద్యోగులకు పదోన్నతులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు.

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి ఉద్యోగులకు ఈరోజు తోటి వారి సహకారం ఉండడంతో ముఖ్యమైన ప్రాజెక్టులను పూర్తి చేస్తారు. వ్యాపారులకు కుటుంబ సభ్యుల అండదండలు ఉండడంతో కొత్తగా పెట్టుబడులు పెడతారు. గతంలో మొదలుపెట్టిన పనులను ఈరోజు పూర్తి చేస్తారు. పిల్లల కెరీర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.

పారిపోవాల్సిందే..లేకుంటే వెంటపడి తరముతాం.. మమత వారసులకు సువేందు అధికారి హెచ్చరిక

Suvendu Adhikari
Suvendu Adhikari

Suvendu Adhikari Warning: అనుకున్నట్టే జరుగుతోంది. పశ్చిమ బెంగాల్ అక్రమ వలసదారుల నుంచి పూర్తిగా విముక్తమవుతోంది. ఇప్పటికే చికెన్ నెక్ కారిడార్ విషయంలో కేంద్రానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చి ఈశాన్యరాష్ట్రాలకు విముక్తిని ప్రసాదించిన బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి.. ఇప్పుడు మరో అడుగు ముందుకు వేశారు. మమతాబెనర్జీ 15 ఏళ్ల పరిపాలనా కాలంలో చేసిన తప్పులను ప్రక్షాళన చేస్తున్నారు.

15 సంవత్సరాల పాటు తన ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మమతాబెనర్జీ బెంగాల్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది. చికెన్ నెక్ రహదారిని కేంద్రానికి ఇవ్వకుండా నిర్లక్ష్యాన్ని ప్రదర్శించింది. అంతేకాదు బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వారికి అక్రమంగా పౌరసత్వం హక్కులు కూడా ప్రసాదించింది. ఓటు, ఆధార్, నివాసం.. ఇలా ఒక్కటమేమిటీ అన్ని ఇచ్చేసింది. బెంగాల్ తన వారసత్వ ఆస్తి లాగా, ఈ దేశ ప్రజలకు దక్కాల్సిన ఫలాలను బంగ్లాదేశ్ వాసులకు పప్పూబెల్లాల్లాగా ఇచ్చేసింది.

సువేందు అధికారి ముఖ్యమంత్రి అయిన తర్వాత మమత దుర్మార్గాలను, అవినీతి వ్యవహాలను తవ్వుతున్నాడు. మమత పాపాల చిట్టాను బయటపెడుతున్నాడు. ముఖ్యంగా బంగ్లాదేశ్ వాసులను తరిమితరిమి కొడుతున్నాడు. ఈక్రమంలో వారికి సువేందు అధికారి కీలక హెచ్చరికలు జారీ చేశాడు. ‘బెంగాల్ లో మీకేం పని..గుర్తించి తరిమి తరిమి కొట్టే దాకా తెచ్చుకోకండి’ అంటూ తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు.

ప్రస్తుతం భారతదేశంలో ఉన్న విదేశీయులు చట్టానికి లోబడి తాము వ్యవహరిస్తామని సువేందు అధికారి స్పష్టం చేశారు. తమ దేశం నుంచి పౌరులను స్వీకరిస్తామని బంగ్లాదేశ్ చెప్పిందని, ఆ నిర్ణయాన్ని అమలు చేయాల్సిన బాధ్యత బంగ్లాదేశ్ మీదు ఉందని సువేందు అధికారి గుర్తు చేశారు. అక్రమ చొరబాటుదారులను అరెస్ట్ చేయకూడదని సువేందు అధికారి పోలీసులకు సూచించారు. వారిని అరెస్ట్ చేస్తే భోజనం, సదుపాయం కల్పించాలని, అలా చేయడానికి వారు మన బంధువులు కాదని సువేందు అధికారి పేర్కొన్నారు.

మరోవైపు బెంగాల్ ప్రభుత్వం ఇప్పటికే అక్రమంగా ఉంటున్న వారిని బయటికి పంపించడానికి అనేక విధానాలను అమలు చేస్తోంది. గుర్తించి.. తొలగించి.. బయటికి పంపించండి అనే విధానాలను అమలు చేస్తూ విదేశీయులను దేశం నుంచి పంపించేందుకు చర్యలు తీసుకుంటున్నది. అక్రమంగా దేశంలోకి ప్రవేశించిన వారిని.. వారి వద్ద ఎటువంటి అధికారిక పత్రాలు లేని వారిని.. గుర్తించి తాత్కాలిక ఆశ్రయం కల్పించేందుకు నిర్బంద కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఆ తర్వాత అక్కడ నుంచి వారిని సొంతదేశాలకు పంపిస్తోంది. గత మంగళవారం ఉత్తర 24 పరగణాల జిల్లాలో హకీంపూర్ ప్రాంతంలో దాదాపు వందలమంది బంగ్లాదేశ్ వాసులు గుమి గూడారు. ఆ తర్వాత వారు బంగ్లాదేశ్ వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. మరోవైపు సర్ ప్రక్రియ అమల్లోకి వచ్చిన తర్వాత కూడా ఇలానే బంగ్లాదేశ్ వాసులు వారి సొంత దేశానికి వెళ్లిపోయారు.

ఉద్యోగులు ఇంటి దగ్గరి నుంచే పనిచేయాలి.. విదేశాలకు వెళ్లొద్దు

Work From Home Policy India
Work From Home Policy India

Work From Home Policy India: కరోనా సమయంలో వర్క్ ఫ్రం హోమ్ అనే విధానం అమల్లోకి వచ్చింది. ఆ తర్వాత పరిస్థితులు మారిపోయాయి. కాలం మారుతున్నా కొద్దీ పరిస్థితులు క్రమేపీ చక్కపడ్డాయి. మళ్లీ ఇప్పుడు కరోనా ను మించి పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఇరాన్, అమెరికా యుద్ధం వల్ల చమురు ధరలు పెరిగిపోతున్నాయి. చమురు సరఫరా కూడా దారుణంగా ఉంటున్నది. హర్మూజ్ జలసంధిలో ఆంక్షల వల్ల చమురు సరఫరాలో తీవ్రమైన ఒత్తిడి ఎదురవుతోంది. ఫలితంగా అంతర్జాతీయంగా ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి.

చమురు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ స్పందించారు. దేశవ్యాప్తంగా ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. పొదుపు చర్యలు పాటించాలని హితవు పలికారు. బంగారం కొనుగోలు చేయకూడదని, అంతర్జాతీయంగా ప్రయాణాలు సాగించొద్దని.. సూచించారు. ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా పెను ప్రకంపనలు కలిగించాయి. బంగారం వినియోగాన్ని తగ్గించేందుకు, చమురు వాడకాన్ని నియంత్రించేందుకు కేంద్రం సుంకాలు, ధరలు పెంచడం మొదలుపెట్టింది. చమురు మీద నాలుగు సార్లు ధరలు పెంచింది. ఇంకా ధరలు పెంచే అవకాశం ఉందని తెలుస్తోంది. బంగారం మీద సుంకం పెంచిన నేపథ్యంలో ధరలు ఆకాశమార్గంలో విహరిస్తున్నాయి.

నరేంద్రమోడీ సూచనల నేపథ్యంలో దేశీయంగా అనేక సంస్థలు విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. మనదేశంలో ఆటోమోబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ కంపెనీ తన ఉద్యోగుల విషయంలో కీలక ప్రకటన చేసింది.ఆన్ ఫీల్డ్ లో పని చేయాల్సిన అవసరం లేదని మారుతీ సుజుకీ కంపెనీ యాజమాన్యం స్పష్టం చేసింది. ఉద్యోగులు వర్క్ ఫ్రం హోమ్ చేయాలని సూచించింది. విదేశీ పర్యటనలు చేసే ఉద్యోగులు కేవలం కంపెనీ అవసరాల కోసం మాత్రమే చేయాలని ఆదేశాలు జారీ చేసింది. విదేశాలు మాత్రమే కాదు, దేశీయంగా కూడా ప్రయాణాలను తగ్గించుకోవాలని ఉద్యోగులకు స్పష్టం చేసింది. కేవలం ఆన్ లైన్ విధానంలో సమావేశాలకు మాత్రమే హాజరు కావాలని సూచించింది.

‘పరిస్థితులు ఏమాత్రం బాగోలేవు. చక్కబడేవరకు జాగ్రత్తగా ఉండాలని మా ఉద్యోగులకు చెబుతున్నాం. పెట్రోలియం వాడకం తగ్గించాలి. అవసరం ఉంటేనే ప్రయాణాలు చేయాలి. ఉద్యోగులు ఇంటివద్ద నుంచి పని చేసే సదుపాయాన్ని ఉపయోగించుకోవాలి. అందువల్లే ఈ నిర్ణయాలను తీసుకున్నామని’ మారుతీ సుజుకీ నిర్వాహకులు ప్రకటించారు.

బి*కి*నీలో అందాల ‘శోభిత’

Shobhita Rana bikini
Shobhita Rana bikini

ఇజ్రాయిల్ మొస్సాద్ ను పడుకోబెట్టాడు.. చావును వెంట్రుకతో తీసిపడేశాడు.. జేమ్స్ బాండ్ లాంటి స్టోరీ ఇది

Saddam Hussein
Saddam Hussein

Saddam Hussein: సీక్రెట్ ఆపరేషన్ ల గురించి చర్చ మొదలైతే.. అమెరికా డీప్ స్టేట్ కంటే.. రష్యా సీక్రెట్ వింగ్ కంటే.. అత్యంత పటిష్టమైనది ఇజ్రాయిల్ దేశానికి చెందిన మొస్సాద్ అని అందరూ చెబుతుంటారు. ప్రపంచ దేశాల సైతం దీనిని అంగీకరిస్తుంటాయి. కానీ కొంతమంది విదేశీ నిపుణులు.. ముఖ్యంగా సీక్రెట్ ఆపరేషన్లలో తల పండినవారు దీనిని ఒప్పుకోరు. ముఖ్యంగా 90వ దశకం నాటి పరిస్థితులను దగ్గర నుండి చూసినవారు ఏమాత్రం మొస్సాద్ తోపు అని అంగీకరించరు. ఎందుకంటే దీని వెనుక పెద్ద స్టోరీ ఉంది. అది జేమ్స్ బాండ్ సినిమాను మించి ఉంటుంది. ప్రతి సన్నివేశం కూడా రోమాలను నిక్క బొడిచే విధంగా ఉంటుంది.

ప్రస్తుతం మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి . ఇప్పటి మాదిరిగానే ఇజ్రాయిల్.. ఇరాన్ మీద సంఘర్షణలు తీవ్ర స్థాయిలో ఉన్నాయి. ఇరాన్ న్యూక్లియర్ స్థావరాల మీద ఇజ్రాయిల్ పదేపదే దాడులు చేసింది. ఇరాన్ సుప్రీమ్ లీడర్ తో పాటు కీలకమైన నాయకులను చంపేసింది. దీంతో ఇజ్రాయిల్ సీక్రెట్ ఏజెన్సీ సంస్థ మొస్సాద్ మీద రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఈ సంస్థ అమెరికా డీప్ స్టేట్ కంటే స్ట్రాంగ్ అని పలువురు చెబుతున్నారు. వాస్తవానికి ఇజ్రాయిల్ సీక్రెట్ ఆపరేషన్లు చేపట్టడంలో తోపు. కాకపోతే అందరూ చెబుతున్నంత తోపైతే కాదు. ఎందుకంటే ఆ సంస్థను వెంట్రుకముక్క కంటే హీనంగా తీసి పక్కన పడేసాడు ఓ వ్యక్తి. చివరికి చావును కూడా జయించి ఇజ్రాయిల్ దేశానికి షాక్ ఇచ్చాడు.

అది 1991.. గల్ఫ్ యుద్ధం జరిగింది. ప్రపంచం ఆ ప్రభావాన్ని ప్రత్యక్షంగా.. పరోక్షంగా చవిచూసింది. ముఖ్యంగా గల్ఫ్ దేశాల నీడ అంటేనే గిట్టని ఇజ్రాయిల్.. నాడు ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ ను ప్రపంచ ముప్పుగా అభివర్ణించింది. చివరికి అతడిని అంతం చేయడానికి కూడా ప్రయత్నించింది. అనేక రకాల ప్రయత్నాలు కూడా చేసింది.. అయితే అవి విఫలమయ్యాయి. చివరికి “ఆపరేషన్ బ్రాంబుల్ బుష్” ను మొదలుపెట్టింది. నాడు ఇజ్రాయిల్ దళాలలో అత్యున్నతమైన కమాండో నయో రెట్ మత్కల్ ఈ పథకాన్ని అమలులో పెట్టాలని రంగం సిద్ధం చేసింది. ఈ క్రమంలోనే నాడు సద్దాం హుస్సేన్ తన స్వస్థలమైన తిత్రిక్ ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ తన అనుచరుల అంత్యక్రియలలో పాల్గొనేందుకు అతడు బయలుదేరాడు. ఇజ్రాయిల్ కమాండోలు అరబ్బుల వేషంలో కనిపించారు. సద్దాం కాన్వాయ్ మీద కాల్పులు జరపాలని ప్రణాళిక రూపొందించారు. సీక్రెట్ ఏజెన్సీ కూడా పటిష్టమైన సమాచారం ఇవ్వడంతో ఇజ్రాయిల్ మిల్ట్రీ ఈ ఆపరేషన్లో పాలుపంచుకునేందుకు ముందుకు వచ్చింది.

1992 నవంబర్ ఐదున మత్కల్ టీం సద్దాం హుస్సేన్ ను చంపడానికి రంగం సిద్ధం చేసింది. దానికంటే ముందు ప్రాక్టీస్ కూడా చేసింది. ఆ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మిస్సైల్ సిమ్యులేషన్ సమయంలో సొంత టీం మీద పడింది. దీంతో అత్యంత కీలకమైన ఐదుగురు కమాండోలు చనిపోయారు. మిగతా ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో సద్దాం హుస్సేన్ ను చంపాలనలనే ప్రణాళిక ఆగిపోయింది. దీంతో సద్దాం హుస్సేన్ చావును జయించాడు. ఇజ్రాయిల్ దేశానికి చుక్కలు చూపించాడు.. దీనిని విదేశీ నిపుణులు తీలిమ్ బెట్ విపత్తు అని పిలుస్తుంటారు.. కమాండోలు మరణాలను చాలా సంవత్సరాల పాటు ఇజ్రాయిల్ ప్రపంచానికి తెలియకుండా దాచింది. దీనికంటే ముందు బ్రాంబుల్ బుష్ ఆపరేషన్ ను ఇజ్రాయిల్ శాశ్వతంగా రద్దు చేసింది.

రైతన్నలకు ‘తానా’ చేయూత.. గుడివాడలో రూ.25 లక్షల సాయం

TANA Support For Farmers
TANA Support For Farmers

TANA Support For Farmers: ఎమ్మెల్యే వెనిగండ్ల రాము సహకారంతో 700 టార్పలిన్లు, 100 చార్జింగ్ స్ప్రేయర్ల పంపిణీ

గుడివాడ రైతులకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) అండగా నిలిచింది. “రైతు కోసం” కార్యక్రమంలో భాగంగా తానా ట్రెజరర్ కసుకుర్తి రాజా సౌజన్యంతో, గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము సహకారంతో రైతులకు రూ.25 లక్షల విలువైన వ్యవసాయ పరికరాలను పంపిణీ చేశారు.

TANA Support For Farmers
TANA Support For Farmers

సోమవారం గుడివాడ మార్కెట్ యార్డ్‌లో జరిగిన కార్యక్రమంలో 700 టార్పలిన్లు, 100 చార్జింగ్ స్ప్రేయర్లను రైతులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో తానా అధ్యక్షుడు నరేన్ కొడాలి, ఈవీపీ శ్రీనివాస్ లావు నాయకత్వం వహించారు.

TANA Support For Farmers
TANA Support For Farmers

కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే వెనిగండ్ల రాము రైతులతో కలిసి స్ప్రేయర్లు, టార్పలిన్లను పరిశీలించి వారికి పంపిణీ చేశారు. అనంతరం జరిగిన సభలో మాట్లాడుతూ, దేశం పట్ల ప్రేమతో ప్రవాసాంధ్రులు చేపడుతున్న సేవా కార్యక్రమాలకు తానా నిదర్శనమని కొనియాడారు. రైతు కుటుంబంలో పుట్టి వేలాది మంది రైతులకు సహాయం చేస్తున్న కసుకుర్తి రాజా దాతృత్వాన్ని ప్రశంసించారు.

TANA Support For Farmers
TANA Support For Farmers

రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. వరదల సమయంలో రైతులకు అండగా నిలిచామని, కాలువల అభివృద్ధి, డ్రైనేజీలలో సిల్ట్ తొలగింపు పనులతో సుదీర్ఘకాల సమస్యలను పరిష్కరిస్తున్నామని చెప్పారు. రైతన్నల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.

TANA Support For Farmers
TANA Support For Farmers

తానా మాజీ అధ్యక్షుడు అంజయ్య చౌదరి మాట్లాడుతూ, “రైతు కోసం” కాన్సెప్ట్‌లో భాగంగా ఇప్పటివరకు మూడు నియోజకవర్గాల్లో రూ.1.03 కోట్లతో సహాయ కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. ఎమ్మెల్యే రాము కృషితో గుడివాడలో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించామని చెప్పారు.

TANA Support For Farmers
TANA Support For Farmers

ప్రభుత్వం సబ్సిడీపై అందించే టార్పలిన్లు, ఖరీదైన చార్జింగ్ స్ప్రేయర్లను ఉచితంగా అందించడంపై రైతులు ఆనందం వ్యక్తం చేశారు. రైతులకు అండగా నిలిచిన ఎమ్మెల్యే రాము, తానా ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో గుడివాడ, గుడ్లవల్లేరు మార్కెట్ యార్డ్ చైర్మన్లు, టీడీపీ, జనసేన నాయకులు, వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు, వ్యవసాయ శాఖ అధికారులు, పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.

దట్టమైన అడవిలో.. శ్వేత వర్ణంలో జంతువు.. ఇది అత్యంత అరుదు..

Albino Hog Deer In Kaziranga National Par
Albino Hog Deer In Kaziranga National Par

Albino Hog Deer In Kaziranga National Par: అది దట్టమైన అడవి.. మండు వేసవిలో కూడా పచ్చగా కనిపిస్తోంది. అటువంటి అడవిలో ఒక శ్వేత వర్ణంలో ఉన్న జంతువు కనిపించింది. ఆ జంతువు కాస్త అడవిలో స్వేచ్ఛగా తిరగడం మొదలుపెట్టింది. పచ్చని గడ్డిని ఆరగించడం ప్రారంభించింది. ఆ జంతువు గెంతుతూ సందడి చేస్తున్న దృశ్యాలు అడవిలో ఏర్పాటుచేసిన సీక్రెట్ కెమెరాలలో రికార్డు అయ్యాయి. దీంతో ఒక్కసారిగా చర్చ మొదలైంది.

మనదేశంలోని ఈశాన్య రాష్ట్రాలలో ప్రముఖమైనది అస్సాం. ఇక్కడ కజరంగ నేషనల్ పార్క్ ప్రపంచ ప్రఖ్యాతి పొందింది. ఈ పార్కులో ఖడ్గమృగాలనుంచి మొదలు పెడితే పులుల వరకు ఉంటాయి.. విస్తారంగా అడిగి ఉండడంతో జీవ వైవిధ్యం కూడా మెరుగ్గా ఉంటుంది. పైగా ఇక్కడ జంతువులకు ఆహారం సమృద్ధిగా లభిస్తూ ఉంటుంది. ఇప్పటివరకు ఈ ప్రాంతంలో అరుదైన జంతువులను అనేకం కనుగొన్నారు. కానీ ఇంతవరకు శాస్త్రవేత్తలకు.. పర్యావరణవేత్తలకు కనిపించని ఒక జంతువు.. సీసీ కెమెరాలలో రికార్డు అయింది. ఆ జంతువు పేరే ఆల్ బినో హాగ్ డీర్.

దీనిని శ్వేత వర్ణ జింక అని పిలుస్తుంటారు. మనదేశంలో కనిపించే జింకలు గాడమైన రంగులో ఉంటాయి. పైగా అవి దేహం పై మచ్చలను కలిగి ఉంటాయి. కానీ ఈ జింక మాత్రం పూర్తిగా శ్వేత వర్ణంలో కనిపిస్తోంది. పైగా దాని నేత్రాలు అత్యంత విశాలంగా ఉన్నాయి. కొమ్ములు కూడా నిటారుగా ఉన్నాయి. దాని చూపు అత్యంత పారదర్శకంగా ఉంది. అది వేగంగా పరుగులు పెడుతూ ఉంది. మిగతా జింకలతో పోల్చి చూస్తే అది అత్యంత బలిష్టంగా ఉంది. శ్వేత వర్ణంలో ఉన్న జింకను చూడటం ఇదే తొలిసారి అని కజిరంగా నేషనల్ పార్క్ సిబ్బంది చెబుతున్నారు.

అస్సాం ముఖ్యమంత్రి హిమంత ఈ వీడియోను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. శ్వేత వర్ణంలో జింక కనిపించడం అస్సాం రాష్ట్రం ఘనతకు గర్వకారణమని పేర్కొన్నారు. కజిరంగా నేషనల్ పార్కులో ఇటువంటి అద్భుతాలు ప్రతి రోజు కనిపిస్తాయని ఆయన చెప్పుకొచ్చారు. ఇవన్నీ కూడా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల ఫలితం అని ఆయన వెల్లడించారు. ఇటువంటి అరుదైన జంతువులను కాపాడేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన వెల్లడించారు. అయితే ఈ శ్వేత వర్ణంలో ఉన్న జింక ఇక్కడికి ఎలా వచ్చింది.. జింకలలో ఏవైనా జన్యుపరమైన మార్పులు చోటు చేసుకుంటే పుట్టిందా.. లేదా ఏదైనా అద్భుతం జరిగిందా.. అనే కోణాలలో శాస్త్రవేత్తలు పరిశీలన జరుపుతున్నారు.

శ్వేత వర్ణంలో కనిపించే జింకలు అత్యంత అరుదైనవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇవి విదేశాలలో మాత్రమే ఉంటాయని.. మన దేశ భౌగోళిక వాతావరణానికి ఇవి తట్టుకోలేవని చెబుతున్నారు. అయితే ఈ శ్వేత వర్ణంలో ఉన్న జింక మాత్రం అత్యంత ఆరోగ్యంగా ఉంది. అడవిలో స్వేచ్ఛగా విహరిస్తోంది. ఒకవేళ దీనిని గనుక సంరక్షిస్తే.. శ్వేత వర్ణంలో ఉన్న జింకల సంఖ్య పెరుగుతుందని పర్యావరణవేత్తలు చెబుతున్నారు.

'పెద్ది' చిత్రానికి డబ్బింగ్ చెప్పడం కోసం జగపతి బాబు కష్టాలు చూడండి.. వైరల్ అవుతున్న వీడియో..

Peddi Movie Jagapathi Babu Dubbing
Peddi Movie Jagapathi Babu Dubbing

Peddi Movie Jagapathi Babu Dubbing: ఎక్కడ చూసిన ఇప్పుడు మనకి కనిపిస్తున్న , వినిపిస్తున్న పేరు ‘పెద్ది’. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరో గా నటించిన ఈ చిత్రం పై టీజర్ విడుదల సమయం నుండే అంచనాలు తారా స్థాయిలో ఏర్పడ్డాయి. ఇక ఆ తర్వాత విడుదలైన ‘చికిరి చికిరి’ సాంగ్ సెన్సేషనల్ హిట్ అవ్వడం తో , సినిమా పై అంచనాలు ఎవ్వరూ ఊహించని రేంజ్ కి చేరుకున్నాయి. రెండవ సాంగ్ ‘రయ్ రయ్ రారా’ పాటకు , అదే విధంగా రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన పహిల్వాన్ గ్లింప్స్ వీడియో కి కూడా ఆడియన్స్ నుండి అదే రేంజ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా తో రామ్ చరణ్ బాక్స్ ఆఫీస్ కుంభస్థలం బద్దలు కొట్టబోతున్నాడని అందరూ బలంగా ఫిక్స్ అయిపోయారు. ఇప్పుడు ఈ సినిమా విడుదలకు పట్టుమని 8 రోజుల సమయం మాత్రమే ఉంది.

ఇప్పటికే ‘పెద్ది’ మేనియా తారా స్థాయికి చేరుకుంది, మేకర్స్ ఆ మేనియా ని రెట్టింపు చేసేవిధంగా , అభిమానుల్లో ఉత్సాహం రేకెత్తించేలా ప్రతీ రోజు ఎదో ఒక కంటెంట్ ని విడుదల చేస్తూనే ఉన్నారు. నిన్నటితో రామ్ చరణ్ తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్ ని పూర్తి చేసాడని డైరెక్టర్ బుచ్చి బాబు చెప్పుకొచ్చాడు. ఇక నేడు ఈ చిత్రం లో కీలక పాత్ర పోషించిన జగపతి బాబు కూడా డబ్బింగ్ పూర్తి చేశాడు. అందుకు సంబంధించిన వీడియో ని స్వయంగా జగపతి బాబు తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా విడుదల చేయగా, అది బాగా వైరల్ అయ్యింది. ఈ వీడియో లో ఆయన డబ్బింగ్ చెప్తున్న విధానం ని చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం వేయక తప్పదు. గతం లో ఆయన ‘అరవింద సమేత’ చిత్రానికి డబ్బింగ్ చెప్తున్నప్పుడు , ఆయన నోటి నుండి రక్తం కారింది.

ఎందుకంటే ఫక్తు రాయలసీమ యాసతో మాట్లాడాలి కాబట్టి. ఇక ‘పెద్ది’ చిత్రం లో ఉత్తరాంధ్ర యాస మాట్లాడాల్సి ఉంటుంది. దీని కోసం కూడా డబ్బింగ్ చాలా కస్టపడి చెప్పాలి , అందుకే జగపతి బాబు తన వైపు నుండి బెస్ట్ డబ్బింగ్ ఇచ్చేందుకు ప్రయత్నం చేశాడు. ఇక ఈ వీడియో ని చూస్తుంటే , ఈ చిత్రం లో జగపతి బాబు నటించలేదు , జీవించాడు అని అనిపిస్తోంది. ఆయన పాత్ర కచ్చితంగా ఆడియన్స్ చేత కంటతడి పెట్టించేలాగానే ఉండబోతుందని అర్థం అవుతోంది. ఆ డైలాగ్స్ ని వింటుంటే అలాగే ఉంది. డైరెక్టర్ బుచ్చి బాబు కూడా, ఈ చిత్రం లో రామ్ చరణ్ పాత్రతో పాటు, జగపతి బాబు పాత్రని కూడా ఆడియన్స్ జీవితాంతం గుర్తించుకుంటారని చెప్పడం, ఆయన మేకోవర్ కూడా చాలా అద్భుతంగా ఉండడంతో , ఆడియన్స్ లో ఈ పాత్ర పై అంచనాలు భారీగానే ఉన్నాయి చూడాలి మరి ఆ అంచనాలను ఈ పాత్ర అందుకోగలదా లేదా అనేది.