YSRCP: వైయస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి డీఎస్సీ- 2025 పై అనుమానాలు వ్యక్తం చేశారు. దానిని ఒక దగా డిఎస్సి గా పేర్కొన్నారు. డీఎస్సీ నియామక ప్రక్రియలో అవకతవకలు చోటు చూసుకున్నాయని ఆరోపించారు. గత ఏడాది కూటమి ప్రభుత్వం 16,400 ఉపాధ్యాయ పోస్టులతో డీఎస్సీ నియామక ప్రక్రియను పూర్తి చేసిన సంగతి తెలిసిందే. గత ఏడాది నియామకం జరిగి ఒక విద్యా సంవత్సరంలో విద్యాబోధన కూడా పూర్తి చేశారు సదరు ఉపాధ్యాయులు. ఇప్పుడు అదే డీఎస్సీ నియామక ప్రక్రియ పై ఆరోపణలు చేస్తున్నారు జగన్ మోహన్ రెడ్డి. దీంతో ఆ 16 వేల మందికి పైగా ఉపాధ్యాయులు తీవ్ర ఆందోళనతో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి తీరును తప్పు పడుతున్నారు. ఆయన స్థాయికి తగిన ఆరోపణలు కావని తేల్చి చెబుతున్నారు.
* ఎన్నికల ముందు హడావిడిగా..
2024 ఎన్నికల కు ముందు రోజుల వ్యవధిలో 6000 ఉపాధ్యాయ పోస్టులతో నోటిఫికేషన్ ఇచ్చింది జగన్ ప్రభుత్వం. కానీ దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభం కాలేదు. ఇంతలోనే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. దీంతో డీఎస్సీ నోటిఫికేషన్ రద్దయింది. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ 6000 ఉపాధ్యాయ పోస్టులకు తోడు.. మరో 10,000 కలిపి 16 వేల పోస్టులతో మెగా డీఎస్సీని ప్రకటించింది చంద్రబాబు సర్కార్. దానికి కూడా అడ్డు తగిలింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. లేనిపోని కేసులు కూడా మోపింది. లీగల్ పరంగా ఎటువంటి అడ్డంకులు ఎదురైనా నివృత్తి చేసుకొని ముందుకు సాగారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. అనుకున్న వ్యవధిలోనే 16 వేల ఉపాధ్యాయ పోస్టుల నియామకాలను పూర్తి చేశారు. అయితే ఇప్పుడు ఆ నియామకాలు అక్రమ పద్ధతిలో జరిపారని జగన్మోహన్ రెడ్డి ఆరోపిస్తున్నారు. దీంతో ఉపాధ్యాయులుగా ఎంపికైన 16000 మంది తీవ్ర ఆందోళనతో ఉన్నారు.
* నిరాశలో నిరుద్యోగులు…
2019 ఎన్నికలకు ముందు ఏటా డీఎస్సీ ప్రకటించి ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తానని జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క పోస్టు కూడా భర్తీ చేయలేదు. ఉపాధ్యాయ పోస్ట్పై ఆశలు పెట్టుకున్న చాలామంది నిరుద్యోగులు బీఈడీతో పాటు డీఎడ్ పూర్తి చేశారు. కానీ ఎటువంటి భర్తీ లేకపోవడంతో నిరాశ చెందారు. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 16 వేల పోస్టులు భర్తీ చేయడంతో చాలామంది ఉద్యోగాలు పొందారు. కానీ జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియాలో ఓ వార్తను పట్టుకొని.. డీఎస్సీలో అవకతవకలు జరిగాయి అంటూ ఆరోపణలు చేస్తున్నారు. అయితే ఏపీ విద్యాశాఖ ఫ్యాక్ట్ చెక్ లో భాగంగా ఆ ఆరోపణల్లో నిజం లేదని తెలిపింది. దీంతో ఈ ఉపాధ్యాయులంతా ఊపిరి పీల్చుకున్నారు. కానీ తన రాజకీయాల కోసం తమ జీవితాలను పణంగా పెట్టడాన్ని మాత్రం సహించుకోలేకపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి తీరును అసహ్యించుకుంటున్నారు. 16 వేల కుటుంబాలు నేరుగా వైసీపీకి దూరమైనట్టే. అయితే దాని ప్రభావం ఇంకా రెట్టింపు ఉంటుంది. అనవసరంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మూల్యం చెల్లించుకోబోతోంది.





















తనలో బాధను బయటపెట్టిన పవన్!
Pawan Kalyan Emotional Comments: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మనసు తెరిచి మాట్లాడారు. రాజమండ్రి పర్యటనలో ఉన్న ఆయన పార్టీ శ్రేణులతో మమేకమై అనేక రకాల వ్యాఖ్యానాలు చేశారు. ముఖ్యంగా కాపుల పరంగా తనపై జరుగుతున్న రాజకీయ దాడిని ప్రస్తావించారు. సీఎం చంద్రబాబుకు, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై లేని ఈ కుల బాధ తన విషయంలో ఎందుకు అని ఆయన ప్రశ్నించారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నేను ఒక కులం కోసమే పార్టీ ఏర్పాటు చేయలేదని.. అన్ని కులాల కోసం పనిచేసే గుణం తనది అని చెప్పుకున్నారు. మరి ఎందుకు ఒక్క కాపు కులం లోనే తనను టార్గెట్ చేస్తున్నారు అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గత 12 సంవత్సరాలుగా ఈ బాధ అనుభవిస్తున్నానని కూడా చెప్పుకొచ్చారు. అందుకే ఇప్పుడు బయట పెడుతున్నట్లు తెలిపారు. ఇతర కులాల్లో నాయకులు ఉన్నారని.. మరి ఎందుకు ఒక కులంలో కులం పేరు చెప్పి రాజకీయాలు చేస్తున్నారని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ ఆసక్తికర విషయాలను బయటపెట్టారు.
* వారికి లేనిది తనకే..
కులం పేరుతో జగన్మోహన్ రెడ్డిని ఎవరైనా రెడ్డి సామాజిక వర్గం వారు ప్రశ్నించారా అంటూ నిలదీశారు పవన్ కళ్యాణ్. ఒక్క రెడ్డి సామాజిక వర్గం నేతైనా తన పేరు మార్చుకున్నారా? అంటూ పరోక్షంగా ముద్రగడ పద్మనాభం ప్రస్తావన తీసుకొచ్చారు. పవన్ కళ్యాణ్ గెలిస్తే పేరు మార్చుకున్న విషయాన్ని కూడా మరోసారి గుర్తు చేశారు. పోనీ చంద్రబాబును సొంత కులం వారు ఓడించాలని చూశారా? కనీసం ఆ సామాజిక వర్గం నేతలు కుల ప్రస్తావన తీసుకొస్తున్నారా? చంద్రబాబు ఓడిపోతే పేరు మార్చుకుంటామని ఎవరైనా చెప్పారా అంటూ.. ఆలోచనకర రీతిలో మాట్లాడారు పవన్ కళ్యాణ్. కేవలం తనను ఒక కుల నాయకుడిగా ముద్ర వేసి ఇతర కులాలను దూరం చేయాలన్న ఎత్తుగడ మంచిది కాదు అని బాధపడ్డారు పవన్.
* కులం పేరుతో రాజకీయం..
పవన్ కళ్యాణ్ కోసం కులమంతా బాధ పడుతుందని.. ఆయన సీఎం కావాలని కులం కోరుకుంటే ఆయన మాత్రం కావడం లేదని కొందరు కాపు నేతలు చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. పవన్ కళ్యాణ్ తీరుతో కాపులు చాలా మోసపోతున్నారని అంబటి లాంటివారు బాధపడుతుంటారని.. వారి బాధ కాపుల కోసమా.. లేకుంటే వారి కోసమా అని ప్రశ్నించారు. వంగవీటి మోహన్ రంగా బతికి ఉన్నప్పుడు కనీసం పలకరించేవారు కాదని.. ఆయన చనిపోయిన తరువాత తమ వాడంటే తమ వాడు అని.. ఆయనను హత్య చేసింది ఒక సామాజిక వర్గం వారు అని ఆరోపణలు చేస్తున్న విషయాన్ని ప్రస్తావించారు. కానీ రంగా గారి భార్య, పిల్లల వైవాహిక జీవితంలో కుల ప్రస్తావన లేదు అని గుర్తు చేశారు. మొత్తానికి అయితే పవన్ తన 12 సంవత్సరాల కుల బాధను బయటపెట్టారు. ప్రస్తుతం అదే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
.