Thaman Anirudh Collaboration: ప్రస్తుతం మన సౌత్ ఇండియా లో టాప్ మోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఎవరు అనే లిస్ట్ తీస్తే , మన అందరికీ గుర్తుకు వచ్చే పేరు తమన్ , అనిరుద్. ఒకరు సౌత్ మొత్తాన్ని ఏలుతుంటే , మరొకరు టాలీవుడ్ ని ఏలుతున్నారు. ఇద్దరికీ కూడా చేతినిండా సినిమాలు ఉన్నాయి, క్షణం కూడా తీరిక లేని పరిస్థితి. చాలా టైట్ షెడ్యూల్స్ మీద వీళ్ళు సాంగ్స్ కంపోజ్ చేస్తుంటారు. అలాంటి ఈ టాప్ డైరెక్టర్స్ కలిసి ఒకే సినిమాకు పనిచేస్తారని మనం కలలో అయినా ఊహించి ఉంటామా?, కానీ ఆ అరుదైన సంఘటనకు త్వరలోనే బాలీవుడ్ వేదిక కానుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే , సల్మాన్ ఖాన్ హీరో గా, వంశీ పైడిపల్లి దర్శకత్వం లో ఒక సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.
ఈ చిత్రానికి సంబంధించిన ప్రారంభోత్సవం రీసెంట్ గానే గ్రాండ్ గా జరిగింది. ఇందులో నయనతార హీరోయిన్ గా నటించబోతుంది. బాలీవుడ్ లో ఒక సినిమాకు అనేక సంగీత దర్శకులు పని చేస్తారని , మన సౌత్ లో లాగా ఒక సినిమాకు , ఒకే మ్యూజిక్ డైరెక్టర్ వంటివి వాళ్ళ దగ్గర ఉండదని మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగానే ఇప్పుడు సల్మాన్ ఖాన్ చిత్రానికి ఈ ఇద్దరు టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ పని చేయబోతున్నారు. ఇక మ్యూజిక్ ఏ రేంజ్ లో ఉండబోతుందో మీరే ఊహించుకోండి. తమన్ ఇప్పటికే బాలీవుడ్ లో కొన్ని చిత్రాలకు మ్యూజిక్ అందించాడు కానీ , అవి పెద్ద రేంజ్ లో క్లిక్ అవ్వలేదు. కానీ అనిరుద్ మాత్రం ‘జవాన్’ చిత్రంతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి , తొలిసినిమాతోనే సిక్సర్ కొట్టేశాడు. అయితే ప్రస్తుతం ఇద్దరు మంచి ఫార్మ్ లోనే ఉన్నారు , సల్మాన్ కి అదిరిపోయే రేంజ్ మ్యూజిక్ ఇస్తారు అనడంలో ఎలాంటి సందేహం లేదు.
ప్రస్తుతం సల్మాన్ ఖాన్ కి మంచి సినిమా అవసరం ఉంది. ఎందుకంటే కరోనా లాక్ డౌన్ తర్వాత ఆయన చేసిన ప్రతీ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్స్ గా మిగిలాయి. ఇప్పటి తరం యూత్ ఆడియన్స్ కి ఒక సినిమాపై ఆసక్తి కలగాలంటే, కచ్చితంగా పాటలు అద్భుతంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదే ఇప్పుడు సల్మాన్ ఖాన్ విషయం లో జరగబోతుంది . కాబట్టి ఈసారి సల్మాన్ ఖాన్ కుంభస్థలం బద్దలు కొట్టబోతున్నాడని , పైగా వంశీ పైడిపల్లి కూడా మినిమం గ్యారంటీ డైరెక్టర్ అని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.
















ట్రంప్ కుంపటి రాజేశాడు.. పాకిస్థాన్ అధ్యక్షుడిగా అసిమ్ మునీర్..
Donald Trump Pakistan Politics: అడుగులకు మడుగులొత్తినా.. మాటలకు తాళాలు తప్పెట్లు వాయించినా పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ పరిస్థితి ఏమాత్రం బాగోలేదు. ఇకపై బాగుంటుందనే నమ్మకం లేదు. అతడు ఎంత వంగి వంగి దండాలు పెట్టినా అమెరికా నమ్మడం లేదు. పైగా అతడి కుర్చీ లాగేసి.. అందులో మహా క్రూరుడు అసిమ్ మునీర్ ను కూర్చోపెట్టేందుకు ప్రణాళికలు రూపొందించింది. దీంతో షరీఫ్ పరిస్థితి దారుణంగా మారింది. ట్రంప్ ధోరణివల్ల అతడి పోస్ట్ ఉంటుందో.. ఊడుతుందో అర్థం కాని పరిస్థితి.
ఇటీవల ఇరాన్, అమెరికా మధ్య శాంతి చర్చలు నిర్వహించేందుకు పాకిస్థాన్ సిద్ధమైంది. ఒక దఫా మధ్యవర్తి పాత్ర కూడా పోషించింది. పాకిస్థాన్ ఎంతో ఖర్చు పెట్టుకుని ఆ పని చేసినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. ఇప్పుడు మలిదఫా కూడా శాంతి చర్చలకు తాము నాయకత్వం వహిస్తామని పాకిస్థాన్ చెబుతోంది. ఇది ఎక్కడి దాకా దారి తీస్తుందో తెలియదు. అయితే శాంతి నెలకొనే అవకాశం లేదని కొంతమంది.. పాకిస్థాన్ శాంతి చర్చలకు సారథ్యం వహించడం ఏంటని మరికొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు.
శాంతి చర్చలకు రంగం సిద్ధమవుతున్న వేళ.. ట్రంప్ ట్రూత్ సోషల్ లో చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అవి పాకిస్థాన్ రాజకీయాలలో ప్రకంపనలకు కారణమయ్యాయి. అరబ్ దేశాలు అబ్రహం అకార్డ్స్ లో చేరాలని పేర్కొన్న ట్రంప్..సౌదీ అరేబియా, ఖతార్ చేరతాయని, ఇరాన్ కూడా అందులో చోటు సంపాదించుకుంటుందనే నమ్మకం ఉందని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు.
ట్రూత్ సోషల్ లో అన్నిదేశాల అధ్యక్షుల పేర్లను ట్రంప్ ప్రస్తావించారు. పాకిస్థాన్ విషయంలోమాత్రం నాలుక మడతపెట్టారు. పాకిస్థాన్ ప్రధాన మంత్రి పేరును షహబాజ్ షరీఫ్ పేరును ఆయన మర్చిపోయారు. అతడి పేరు స్థానంలో సైన్యాధ్యక్షుడు అసిమ్ మునీర్ పేరును ప్రస్తావించారు.దీంతో అమెరికా తదుపరి పాకిస్థాన్ ప్రధానమంత్రిగా మునీర్ ను చేస్తుందని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ప్రజాస్వామ్యయుత విధానాలకు ట్రంప్ చరమగీతం పాడుతున్నారని ఓ వర్గం మీడియాలో వార్తలు ప్రసారమవుతున్నాయి. వెనిజులా అధ్యక్షుడిని ట్రంప్ ఇదేవిధంగా అపహరించారు. నేరగాడిగా జైల్లోపెట్టారు. ఇప్పుడు షరీఫ్ విషయంలో కూడాఇలానే చేస్తారేమోనని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.