Homeవింతలు-విశేషాలుAlbino Hog Deer In Kaziranga National Par: దట్టమైన అడవిలో.. శ్వేత వర్ణంలో జంతువు.....

Albino Hog Deer In Kaziranga National Par: దట్టమైన అడవిలో.. శ్వేత వర్ణంలో జంతువు.. ఇది అత్యంత అరుదు..

Albino Hog Deer In Kaziranga National Par: అది దట్టమైన అడవి.. మండు వేసవిలో కూడా పచ్చగా కనిపిస్తోంది. అటువంటి అడవిలో ఒక శ్వేత వర్ణంలో ఉన్న జంతువు కనిపించింది. ఆ జంతువు కాస్త అడవిలో స్వేచ్ఛగా తిరగడం మొదలుపెట్టింది. పచ్చని గడ్డిని ఆరగించడం ప్రారంభించింది. ఆ జంతువు గెంతుతూ సందడి చేస్తున్న దృశ్యాలు అడవిలో ఏర్పాటుచేసిన సీక్రెట్ కెమెరాలలో రికార్డు అయ్యాయి. దీంతో ఒక్కసారిగా చర్చ మొదలైంది.

మనదేశంలోని ఈశాన్య రాష్ట్రాలలో ప్రముఖమైనది అస్సాం. ఇక్కడ కజరంగ నేషనల్ పార్క్ ప్రపంచ ప్రఖ్యాతి పొందింది. ఈ పార్కులో ఖడ్గమృగాలనుంచి మొదలు పెడితే పులుల వరకు ఉంటాయి.. విస్తారంగా అడిగి ఉండడంతో జీవ వైవిధ్యం కూడా మెరుగ్గా ఉంటుంది. పైగా ఇక్కడ జంతువులకు ఆహారం సమృద్ధిగా లభిస్తూ ఉంటుంది. ఇప్పటివరకు ఈ ప్రాంతంలో అరుదైన జంతువులను అనేకం కనుగొన్నారు. కానీ ఇంతవరకు శాస్త్రవేత్తలకు.. పర్యావరణవేత్తలకు కనిపించని ఒక జంతువు.. సీసీ కెమెరాలలో రికార్డు అయింది. ఆ జంతువు పేరే ఆల్ బినో హాగ్ డీర్.

దీనిని శ్వేత వర్ణ జింక అని పిలుస్తుంటారు. మనదేశంలో కనిపించే జింకలు గాడమైన రంగులో ఉంటాయి. పైగా అవి దేహం పై మచ్చలను కలిగి ఉంటాయి. కానీ ఈ జింక మాత్రం పూర్తిగా శ్వేత వర్ణంలో కనిపిస్తోంది. పైగా దాని నేత్రాలు అత్యంత విశాలంగా ఉన్నాయి. కొమ్ములు కూడా నిటారుగా ఉన్నాయి. దాని చూపు అత్యంత పారదర్శకంగా ఉంది. అది వేగంగా పరుగులు పెడుతూ ఉంది. మిగతా జింకలతో పోల్చి చూస్తే అది అత్యంత బలిష్టంగా ఉంది. శ్వేత వర్ణంలో ఉన్న జింకను చూడటం ఇదే తొలిసారి అని కజిరంగా నేషనల్ పార్క్ సిబ్బంది చెబుతున్నారు.

అస్సాం ముఖ్యమంత్రి హిమంత ఈ వీడియోను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. శ్వేత వర్ణంలో జింక కనిపించడం అస్సాం రాష్ట్రం ఘనతకు గర్వకారణమని పేర్కొన్నారు. కజిరంగా నేషనల్ పార్కులో ఇటువంటి అద్భుతాలు ప్రతి రోజు కనిపిస్తాయని ఆయన చెప్పుకొచ్చారు. ఇవన్నీ కూడా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల ఫలితం అని ఆయన వెల్లడించారు. ఇటువంటి అరుదైన జంతువులను కాపాడేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన వెల్లడించారు. అయితే ఈ శ్వేత వర్ణంలో ఉన్న జింక ఇక్కడికి ఎలా వచ్చింది.. జింకలలో ఏవైనా జన్యుపరమైన మార్పులు చోటు చేసుకుంటే పుట్టిందా.. లేదా ఏదైనా అద్భుతం జరిగిందా.. అనే కోణాలలో శాస్త్రవేత్తలు పరిశీలన జరుపుతున్నారు.

శ్వేత వర్ణంలో కనిపించే జింకలు అత్యంత అరుదైనవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇవి విదేశాలలో మాత్రమే ఉంటాయని.. మన దేశ భౌగోళిక వాతావరణానికి ఇవి తట్టుకోలేవని చెబుతున్నారు. అయితే ఈ శ్వేత వర్ణంలో ఉన్న జింక మాత్రం అత్యంత ఆరోగ్యంగా ఉంది. అడవిలో స్వేచ్ఛగా విహరిస్తోంది. ఒకవేళ దీనిని గనుక సంరక్షిస్తే.. శ్వేత వర్ణంలో ఉన్న జింకల సంఖ్య పెరుగుతుందని పర్యావరణవేత్తలు చెబుతున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Samsung Galaxy S25

Samsung Galaxy S25: ఈ ఫోన్ పై రూ.18,000 తగ్గింపు.. బ్యాంక్ ఆఫర్స్ కూడా వర్తింపు..

Samsung Galaxy S25: ప్రముఖ మొబైల్ కంపెనీ దిగ్గజం Samsung నుంచి కొత్త ఫోన్లు అంటే చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. కాస్త ధర ఎక్కువైనా అద్భుతమైన ఫీచర్లు, అనుకూలమైన సాఫ్ట్...
Festivals this year

Festivals this year: ఈ ఏడాదిలో ముఖ్యమైన పండుగలు ఏ తేదీల్లో ఉన్నాయంటే..

Festivals this year: తెలుగు పంచాంగం ప్రకారం.. ఆషాడ మాసం లో వచ్చే తొలి ఏకాదశి తో పండుగల సీజన్ ప్రారంభమైనట్లు గా భావిస్తారు. ఆషాడ మాసం పూర్తికాగానే వరుసగా పండుగలు వస్తుంటాయి....
Peddi Sudarshan Reddy

Peddi Sudarshan Reddy: పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత: కడవరకు తెలంగాణ వాదిగానే.. తెలంగాణ వచ్చినంకనే పెండ్లి..

Peddi Sudarshan Reddy: ఆయనకు తెలంగాణ అంటే ఇష్టం. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఉండడం మరింత ఇష్టం.. అందువల్లే ఉద్యమాన్ని భుజాలకు ఎత్తుకున్నారు. పోరాటాల గడ్డ వరంగల్ జిల్లాలో గులాబీ జెండాను నెత్తిన...
YCP Leaders

YCP Leaders: కుమారులతో వైసిపి నేతలకు తలవంపులు!

YCP Leaders: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వింత పరిస్థితి కనిపిస్తోంది. ఆ పార్టీలో దూకుడు కలిగిన నేతలు చుట్టూ ఇప్పుడు కేసులు అలుముకుంటున్నాయి. అయితే అవి కూటమి ప్రభుత్వం పెట్టిన కేసులు కాదు....
rain forecast for AP

Rain forecast for AP: హమ్మయ్య.. ఏపీకి వర్ష సూచన!

Rain forecast for AP: ఏపీకి చల్లటి కబురు వచ్చింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడింది. వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. అది అల్పపీడనంగా మారి బలపడుతోంది. ఈరోజు ఉత్తరాంధ్రలో పిడుగులతో...
Oktelugu Epaper