Home Blog Page 216

కర్ణాటక పంచాయతీ సెటిల్.. రాహుల్ గాంధీ వద్దకు కాంగ్రెస్ నేతలు.. తెలంగాణలో ఏం జరుగుతోంది..

Rahul Gandhi Telangana Leaders Meeting
Rahul Gandhi Telangana Leaders Meeting

Rahul Gandhi Telangana Leaders Meeting: కాంగ్రెస్ పార్టీ ఇటీవల జరిగిన ఎన్నికలలో కేవలం కేరళ రాష్ట్రంలో మాత్రమే అధికారంలోకి వచ్చింది. తమిళనాడు రాష్ట్రంలో అధికార పక్షంలో ఒక భాగమైంది. కీలకమైన పశ్చిమ బెంగాల్లో.. అస్సాంలో.. చిన్న రాష్ట్రమైన పుదుచ్చేరిలో అధికారాన్ని దక్కించుకోలేకపోయింది. కనీసం చెప్పుకునే స్థాయిలో శాసనసభ స్థానాలను దక్కించుకోలేకపోయింది.

క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇలా ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఇప్పుడు వచ్చే వాళ్ళతో.. పోయే వాళ్లతో అత్యంత రద్దీగా ఉంది. రాహుల్ గాంధీ కూడా మల్లికార్జున కార్గే.. వేణుగోపాల్ రెడ్డి వంటి వారితో నిత్యం సమావేశాలు పెడుతున్నారు. ఏం జరిగి ఉంటుంది.. ఏం జరుగుతోంది అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నప్పుడే.. తెలంగాణ నేతలు అక్కడ కనిపిస్తున్నారు. కొద్దిరోజుల వరకు సాగిన కర్ణాటక పంచాయతీ డీకే శివకుమార్ ముఖ్యమంత్రి కావడంతో ముగిసింది. ఇప్పుడు మళ్లీ తెలంగాణ పంచాయతీ ప్రారంభమైంది. అలాగని తెలంగాణలో ముఖ్యమంత్రి మార్పు జరగడం లేదు. రేవంత్ రెడ్డి స్థానంలో కొత్త వ్యక్తిని ముఖ్యమంత్రిగా చేయాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అనుకోవడం లేదు.

కాకపోతే కొంతమంది మంత్రులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్టు.. తమ శాఖలలో పిచ్చిపిచ్చి పనులు చేస్తున్నట్టు అధిష్టానానికి నివేదిక అందింది. ఇటీవల మీనాక్షి నటరాజన్ రాహుల్ గాంధీకి ఈ విషయాన్ని చెప్పినట్టు తెలుస్తోంది. దీంతో అధిష్టానం కొన్ని శాఖలలో ప్రక్షాళన చేయాలని భావించినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ విషయం తెలిసిన కాంగ్రెస్ నాయకుడు వెంటనే ఢిల్లీ చేరుకున్నారు. మంత్రులుగా ప్రమోషన్ సాధించాలి అనుకునేవారు రాహుల్ గాంధీ ప్రాపకం కోసం పాకులాడుతున్నారు.

వారిలో ఇప్పటికే గడ్డం ప్రసాద్ తనకు మంత్రి పదవి కేటాయించాలని రాహుల్ గాంధీకి వినతిపత్రం అందించిన తెలుస్తోంది. పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి.. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి.. వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ వంటి వారు తమకు మంత్రి పదవులు ఇవ్వాలని రాహుల్ గాంధీకి విజ్ఞప్తి చేసినట్టు తెలుస్తోంది. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ కూడా తనకు మంత్రి పదవి ఇవ్వాలని రాహుల్ గాంధీని కోరినట్లు తెలుస్తోంది. కొంతకాలంగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తనకు మంత్రి పదవి ఇవ్వాలని అధిష్టానాన్ని కోరుతున్నారు. ముఖ్యమంత్రిపై నేరుగా తన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. కొన్ని సందర్భాలలో ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే విధంగా మాట్లాడుతున్నారు.

మంత్రివర్గ ప్రక్షాళన జరుగుతుందని వార్తలు వస్తున్నా నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి రాహుల్ గాంధీ నివాసంలో గాని.. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గాని కనిపించడం లేదు. ఇంతవరకు విజ్ఞప్తులు అందించినట్టు కూడా సమాచారం అందడం లేదు. అంటే మంత్రివర్గ విస్తరణ ఉంటుందా.. లేక మీడియాకు కాంగ్రెస్ పార్టీ లీకలు ఇస్తోందా.. అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై మరింత స్పష్టత రావాలంటే మరికొంత సమయం పడుతుందని పొలిటికల్ ఎక్స్పర్ట్స్ అంటున్నారు.

మోడీ సార్.. బంగారం మీదనే కాదు.. వాటిపై కూడా సుంకాన్ని పెంచాలి.. ఎందుకంటే..

Diamond Import Duty India
Diamond Import Duty India

Diamond Import Duty India: బంగారానికి భారతీయులకు విడదీయరాని బంధం ఉంటుంది. బంగారం మన దేశ అవసరాలకు సరిపడా ఉత్పత్తి కాదు. అందువల్లే విదేశాల నుంచి బంగారాన్ని దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం భారీగా విదేశీ మారక ద్రవ్యాన్ని ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో బంగారం కోసం ఆ స్థాయిలో మన దేశం విదేశీ మారక ద్రవ్యాన్ని ఖర్చుపెట్టే స్థాయి లేకపోవడంతో.. పొదుపు చర్యలకు శ్రీకారం చుట్టింది. బంగారం మీద సుంకాన్ని పెంచేసింది. దీంతో బంగారం ధరలు నేల చూపులు చూస్తున్నాయి.

బంగారం విషయంలో కేంద్రం తీసుకున్న నిర్ణయమే ఇప్పుడు డైమండ్స్ మీద తీసుకోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది.. ఎందుకంటే ప్రపంచంలోనే సెకండ్ లార్జెస్ట్ డైమండ్ కన్జ్యూమర్ కంట్రీగా ఇండియా నిలిచింది. ఇప్పటివరకు చైనా, జపాన్ దేశాల తర్వాత భారత్ ఉండేది. వజ్రాల వినియోగంలో అమెరికా మొదటి స్థానంలో ఉండేది. అయితే ఇటీవల డి బీర్స్ అనే సంస్థ వెల్లడించిన నివేదిక ప్రకారం భారత దేశంలో న్యాచురల్ డైమండ్ మార్కెట్ ఏకంగా 12 శాతం పెరిగిందని తెలుస్తోంది. జెన్ జడ్ యువత.. ఇండిపెండెంట్ ఉమెన్స్.. యువకులు ఎక్కువగా వజ్రాలను కొనుగోలు చేస్తున్నారు. వాటిని ధరించడాన్ని స్టేటస్ సింబల్ గా భావిస్తున్నారు. పైగా రకరకాల అయిన వజ్రాలను దిగుమతి చేసుకొని.. ఆభరణాలుగా రూపొందించుకుంటున్నారు.

వజ్రాల హారాలు.. వజ్రాలతో పొదిగిన ఉంగరాలు.. వజ్రాల తో రూపొందించిన లాకెట్లు ధరిస్తున్నారు.. వీటి కోసం భారీగానే ఖర్చు పెడుతున్నారు. అందువల్ల వజ్రాల వినియోగంలో భారత్ ఏకంగా చైనా, జపాన్ దేశాలను దాటేసింది. ఇప్పుడు నెంబర్ 2 స్థానంలోకి వచ్చేసింది. ఇదే స్థాయిలో దిగుమతులు కనుక కొనసాగితే భారత్ కచ్చితంగా అమెరికా దేశాన్ని దాటేస్తుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. పైగా మనదేశంలో వజ్రాలను సానపెట్టే ప్రక్రియ గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ నగరంలో ఎక్కువగా సాగుతూ ఉంటుంది. ఇక్కడ గతంలో సాన పెట్టిన వజ్రాలను ఇతర దేశాలకు విమర్శ చేసేవారు. కొంతకాలంగా మనదేశంలోనే ఎక్కువగా వినియోగం అవుతున్నాయి.

వజ్రాలను కూడా రకరకాలైన వాటిని భారతీయులు ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా పింక్.. గోల్డెన్.. వైట్ డైమండ్లకు మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉంది. హై ప్రొఫైల్ వ్యక్తులు ఎక్కువగా వజ్రాలను ధరిస్తున్నారు. ఇటీవల జరిగిన కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో.. మెట్ గాలా లో వజ్రాలతో రూపొందించిన ఆభరణాలను సెలబ్రిటీలు ధరించారు. అమెరికా సెలబ్రిటీలను మించి ఇండియన్ సెలబ్రిటీలు డైమండ్ జ్యువెలరీ ధరించారంటే.. పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. వజ్రాల డిమాండ్ ఇలాంటి కొనసాగితే బంగారం మాదిరిగానే వాటి మీద కూడా సుంకాన్ని భారత ప్రభుత్వం విధించే అవకాశం లేకపోలేదని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

18 ఏళ్ల ఐపీఎల్ చరిత్రను తిరగరాసిన వైభవ్ సూర్య వంశీ..

Vaibhav Suryavanshi IPL Record
Vaibhav Suryavanshi IPL Record

Vaibhav Suryavanshi IPL Record: 1 అనుకున్నట్టుగానే ఈ సీజన్లో వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ మొత్తాన్ని దున్నేస్తున్నాడు. తిరుగులేని స్థాయిలో ఆడుతూ అదరగొడుతున్నాడు. ఇప్పటివరకు ఈ సీజన్లో అతడు ఒక సెంచరీ, నాలుగు హాఫ్ సెంచరీలు సాధించాడు. ప్రస్తుతం జరుగుతున్న మ్యాచ్లో గుజరాత్ జట్టు మీద హాఫ్ సెంచరీ చేశాడు. తద్వారా ఒక సెంచరీ, ఐదు హాఫ్ సెంచరీలను తన ఖాతాలో వేసుకున్నాడు.

ఈ సీజన్లో అన్ క్యాప్డ్ ఆటగాడిగా రంగంలోకి దిగిన వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ చరిత్రను మొత్తం తిరగ రాశాడు. పవర్ ప్లే లో 500 పరుగులు చేసిన ఆటగాడిగా సరికొత్త రికార్డు సృష్టించాడు. పొట్టి ఫార్మాట్లో గేల్.. హెడ్.. అభిషేక్ శర్మ.. వంటి మేటి ప్లేయర్లకు సాధ్యం కాని రికార్డులను అతడు సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో ఒకే ఒక్కడిగా మిగిలిపోయాడు. అతడు సాధించిన రికార్డును మరే ఆటగాడు కూడా బద్దలు కొట్టే అవకాశం లేదు. 15 సంవత్సరాల వయసులోనే అతడు ఈ స్థాయిలో రికార్డులు సృష్టిస్తున్నాడు అంటే మాటలు కాదు.

ఐపీఎల్ చరిత్రలో పవర్ ప్లే లో 500 పరుగులు పూర్తి చేసుకున్న ఆటగాడిగా వైభవ్ సూర్య వంశీ రికార్డు సృష్టించాడు. 2016లో వార్నర్ 467, 2024లో హెడ్ 402, సాయి సుదర్శన్ 2025లో 402, గిల్ క్రిస్ట్ 2009లో 382, బట్లర్ 2022లో 374, కోహ్లీ 2024లో 373 పరుగులు చేశారు. వైభవ్ సూర్య వంశీ తో పోల్చి చూస్తే మిగతా ప్లేయర్లు అత్యంత అనుభవం ఉన్నవారు. ఎక్కువ వయసు ఉన్నవారు. వారిలో ఎవరు కూడా 500 పరుగుల మార్కు అందుకోలేకపోయారు. కానీ సూర్య వంశీ తనకు మాత్రమే సాధ్యమైన బ్యాటింగ్ తో ఆకట్టుకుంటున్నాడు. అంతేకాదు 500 పరుగుల మైలు రాయి అందుకొని సరికొత్త చరిత్ర సృష్టించాడు.

ఇటీవల హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్లో సూర్య వంశీ 97 పరుగులు చేశాడు. మూడు పరుగుల తేడాతో సెంచరీ కోల్పోయాడు. ఒకవేళ అతడు గనక సెంచరీ చేస్తే ఐపీఎల్ చరిత్రలో రెండు సెంచరీలు చేసిన ఆన్ క్యాప్డ్ ఆటగాడిగా రికార్డు సృష్టించేవాడు.

అనసూయ చిలిపి అందాలు.. చూడతరమా?

Anasuya Bharadwaj Hot Photos
Anasuya Bharadwaj Hot Photos

తుర్కియే తాట తీసే స్కెచ్‌.. భారత్‌ నేసిన వ్యూహాత్మక వలయం!

India Turkey Strategic Rivalry
India Turkey Strategic Rivalry

India Turkey Strategic Rivalry: భారత్‌ ఇక రక్షణ దిగుమతిదారు మాత్రమే కాదు, ప్రపంచ వ్యాప్తంగా వ్యూహాత్మక సమతుల్యతను మార్చగల ఆయుధ ఎగుమతి శక్తిగా ఎదగుతోంది. ఆర్మేనియా సైనిక పరేడ్‌లో భారత్‌ తయారీ అత్యాధునిక వ్యవస్థల ప్రదర్శన, సైప్రస్‌ అధ్యక్షుడు నికోలస్‌ క్రిస్టోడౌలిడెస్‌ భారత్‌ సందర్శన, బ్రహ్మోస్‌ వంటి ఆయుధాల కొనుగోలు చర్చలు – ఇవన్నీ తుర్కియే, అజర్‌బైజాన్‌లలో ఆందోళన సృష్టిస్తున్నాయి. ఇది సాధారణ వ్యాపారం కాదు.. ప్రాంతీయ శక్తి సమీకరణాలను పునర్నిర్మించే ధైర్యవంతమైన దౌత్యం.

ఆర్మేనియా పరేడ్‌…
మే 28న ఆర్మేనియా జాతీయ దినోత్సవం సందర్భంగా జరిగిన సైనిక పరేడ్‌లో భారత్‌ అందించిన ఏటీఏజీ హౌవిట్జర్లు, పినాకా రాకెట్‌ లాంచర్లు, రాడార్లు, ఆకాశ్‌ ఎయిర్‌ డిఫెన్స్‌ సిస్టమ్స్‌ వంటి వ్యవస్థలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఇవి ఆర్మేనియా తన సంప్రదాయ సరఫరాదారులైన రష్యా నుంచి దూరమవుతూ, భారత్‌ వైపు మొగ్గు చూపుతున్నట్లు స్పష్టం చేస్తాయి. బ్రహ్మోస్‌ సూపర్‌సోనిక్‌ క్రూజ్‌ మిస్సైల్స్‌ కొనుగోలు చర్చలు కూడా జరుగుతున్నట్లు సమాచారం. అజర్‌బైజాన్‌తో సుదీర్ఘ సంఘర్షణ ఉన్న నేపథ్యంలో ఈ ఆయుధాలు ఆర్మేనియాకు కొత్త ఆత్మవిశ్వాసం ఇస్తాయి. తుర్కియే మద్దతుతో ఆర్మేనియా పై ఒత్తిడి తీసుకునే అజర్‌బైజాన్‌కు ఇది పెద్ద షాక్‌.

సైప్రస్‌ అధ్యక్షుడు భారత్‌∙సందర్శన..
తాజాగా మెడిటరేనియన్‌లో 20–23 మధ్య సైప్రస్‌ అధ్యక్షుడు నికోలస్‌ క్రిస్టోడౌలిడెస్‌ భారత్‌ను సందర్శించారు. 2026–2031 రక్షణ రోడ్‌మ్యాప్‌ను బలోపేతం చేశారు. బ్రహ్మోస్, నాగాస్త్ర (ఆంటి–డ్రోన్‌) వ్యవస్థలు, డ్రోన్లు, మారిటైమ్‌ సెక్యూరిటీ సహకారం ప్రధాన చర్చలు. ఇది తుర్కియే ఆక్రమణ, బ్లూ హోమ్‌ల్యాండ్‌ (మావి వతన్‌) సిద్ధాంతం కారణంగా భద్రతా సవాళ్లు ఎదుర్కొంటున్న సైప్రస్‌కు కీలకం. తుర్కియే 1974 నుంచి సైప్రస్‌ ఉత్తర భాగాన్ని ఆక్రమించి ఉంచడం, సముద్ర సంపదపై దావా వేయడం – ఈ విస్తరణవాదానికి భారత్‌ ఆయుధాలు బలమైన సవాల్‌ అవుతాయి. గ్రీస్‌తో కలిసి ఈ మూడు దేశాలు (ఆర్మేనియా–సైప్రస్‌–గ్రీస్‌) తుర్కియేను మూడు దిక్కుల నుంచి ఒత్తిడికి గురి చేస్తున్నాయి.

తుర్కియే ఆందోళన…
తుర్కియేకు ఈ అభివృద్ధి పెద్ద ఎదురుదెబ్బ. భారత్‌ వ్యతిరేక వైఖరి – కాశ్మీర్‌ విషయంలో పాకిస్తాన్‌కు మద్దతు, ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో పాక్‌కు టర్కిష్‌ డ్రోన్లు అందించడం – ఇవి భారత్‌ను తుర్కియే వైపు వ్యూహాత్మకంగా చర్య తీసుకోవడానికి ప్రేరేపించాయి. ఆపరేషన్‌ సిందూర్‌లో భారత్‌ ఎదుర్కొన్న టర్కిష్‌ డ్రోన్లను ఇప్పుడు దాని ప్రత్యర్థులకు అందించడం చారిత్రక ప్రతీకారంగా కనిపిస్తోంది. బ్లూ హోమ్‌ల్యాండ్‌ సిద్ధాంతం ద్వారా తుర్కియే ఈజియన్, మెడిటరేనియన్‌ సముద్రాల్లో విస్తృత దావాలు వేస్తోంది. గ్రీస్‌ దీవులు, సైప్రస్‌ ఈఈజెడ్, ఆర్మేనియా సరిహద్దులపై ఒత్తిడి – ఇవన్నీ ఇప్పుడు భారత్‌ సాయంతో ఎదుర్కొనే సామర్థ్యం పొందుతున్నాయి. టర్కిష్‌ మీడియా, విశ్లేషకులు ఇప్పటికే ‘‘నైట్‌మేర్‌’’ అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

భారత్‌కు ఇది ఏమిటి?
ఇది కేవలం ఆయుధ వ్యాపారం కాదు. ఆత్మనిర్భర్‌ భారత్‌ లక్ష్యాన్ని సాకారం చేస్తూ, చైనా–పాకిస్తాన్‌–తుర్కియే అక్షానికి బలమైన ప్రత్యామ్నాయం సృష్టిస్తోంది. ఇండో–పసిఫిక్‌ నుంచి మెడిటరేనియన్‌ వరకు భారత్‌ ప్రభావం విస్తరిస్తోంది. ఇది భారత్‌ రక్షణ ఎగుమతులను పెంచడంతోపాటు, బహుముఖ భాగస్వామ్యాల ద్వారా జాతీయ భద్రతను బలపరుస్తుంది. అయితే, ఈ వ్యూహం సవాళ్లు కూడా తెచ్చిపెడుతుంది. నాటో సభ్యుల మధ్య సంఘర్షణలు, కొత్త ఉద్రిక్తతలు ఏర్పడవచ్చు. దీర్ఘకాలికంగా స్థిరత్వం కావాలంటే ఆయుధ దౌత్యంతోపాటు సమర్థవంతమైన డిప్లమసీ అవసరం.

భారత్‌ ఇప్పుడు ప్రపంచ వేదికపై తన శక్తిని నిరూపిస్తోంది. ఆయుధాల ద్వారా స్నేహితులకు భద్రత, ప్రత్యర్థులకు సందేశం ఇదే ఆధునిక భారత్‌ భాష. తుర్కియేకు ఇది హెచ్చరికగా మారాలి. ప్రాంతీయ విస్తరణవాదానికి ఎదురు ఎలా ఉంటుందో భారత్‌ చూపిస్తోంది. ఇది కేవలం ఆరంభం మాత్రమే.

బియ్యం.. పప్పులు.. ఏడు మట్టి పాత్రలు.. ఈ దేవుడి ప్రసాదం విశిష్టతను సైన్స్ కూడా ఛేదించలేకపోయింది

Jagannath Temple Mahaprasad Mystery
Jagannath Temple Mahaprasad Mystery

Jagannath Temple Mahaprasad Mystery: భగభగ మండే కట్టెల పొయ్యి.. ఒకదానిమీద ఒకటి అన్నట్టుగా ఏడు మట్టి కుండలు.. ప్రతి కుండ అంచులకు పచ్చి మట్టి పూస్తారు. చివరి పాత్రను అలానే వదిలేస్తారు. ఇలా కట్టెలు మండుతుండగా మొదటి పాత్రలో కాకుండా.. చివరి పాత్రలో ఆహారం ఉడుకుతుంది. ఇది ఎలా సాధ్యమవుతుందో ఇప్పటికీ ఎవరికి తెలియదు. ఇదంతా కూడా ఒడిశా పూరి జగన్నాథ స్వామి ఆలయం మహిమాన్విత చరిత్ర.

బియ్యం పప్పులతో..

ఇక్కడ స్వామివారికి సంబంధించి బియ్యం.. పప్పులతో ప్రసాదాన్ని తయారుచేస్తారు. ఇందులో ఎట్టి పరిస్థితుల్లో ఉల్లిపాయలు.. వెల్లుల్లి.. కృత్రిమ రసాయనాలను ఉపయోగించరు. కేవలం కట్టెల పొయ్యి మీద మాత్రమే వండుతారు. ప్రసాదాన్ని వండుతున్నప్పుడు ఎటువంటి వాసన రాదు. ప్రసాదం తయారైన తర్వాత స్వామివారికి నివేదించే క్రమంలో అద్భుతమైన వాసన వస్తూ ఉంటుంది. ఇది ఎలా సాధ్యమో ఇప్పటికి తెలియదు. స్వామివారి ప్రసాదం తయారీకి అత్యంత పవిత్రమైన గంగ, యమునా అనే భావుల నుంచి సేకరించిన నీటిని మాత్రమే వాడుతారు. పొరపాటున కూడా ప్రసాదం తయారీకి గ్యాస్ సిలిండర్లను ఉపయోగించరు. కేవలం కట్టెల పోయి మీద మాత్రమే ఇది చేస్తారు.

ఎకరం విస్తీర్ణంలో..

పూరి జగన్నాథ స్వామి ఆలయంలో అన్నప్రసాదం తయారీ కేంద్రాన్ని రోసా ఘరా అని పిలుస్తుంటారు. ఈ వంటగది దాదాపు ఒక ఎకరం విస్తీర్ణంలో.. 37 గదులతో ఉంటుంది.. ఇక్కడ మహా ప్రసాదం తయారు చేయడానికి 752 మట్టి పొయ్యిలు ఉంటాయి. వీటిని చుల్తాలు అని పిలుస్తుంటారు.. మహా ప్రసాదం తయారీలో సువారాలు.. మహా సువారాలు అనే వంశంపారంపర్య వంటవారు మాత్రమే నిమగ్నమై ఉంటారు. ప్రతిరోజు వందలమంది వంటవాళ్లు ప్రసాదాన్ని తయారు చేస్తారు. ప్రసాదాన్ని తయారు చేయడానికి కొత్త మట్టి కుండలు ఉపయోగిస్తారు. ఒకసారి ప్రసాదం తయారు చేసిన తర్వాత ఆ మట్టి కుండలను మళ్లీ ఉపయోగించరు. వాటిని పగలగొట్టి.. మళ్లీ కుండలని తయారుచేస్తారు.

800 ఏళ్ల క్రితమే స్టీమ్ కన్వెన్షన్

కుండలను ఒకదానిమీద మరొకటి ఇలా ఏడింటిని పేర్చుతుంటారు. మొదటి ఆరుకుండల మీద చివరి అంచుల్లో పచ్చి మట్టిని పూతగా పూస్తారు. అయితే మండుతున్న మంటకు కింది కుండలో ముందుగా ఆహారం ఉడకాలి. కానీ ఇక్కడ కిందికి ఉండదు కాకుండా పైకుండలో ఆహారం ఉడుకుతూ ఉంటుంది. దీనికి ప్రధాన కారణం ధర్మం డైనమిక్స్.. ఇక్కడ 800 సంవత్సరాలుగా ఇదే తీరుగా స్వామివారికి ప్రసాదాన్ని తయారు చేస్తున్నారు. వంటగదిలో 800 ఏళ్ల క్రితమే స్టీమ్ కన్వెన్షన్ ఏర్పాటు చేశారంటే ఎంతటి అద్భుతమైన ముందుచూపు ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఎర్మిటిక్ సీలింగ్ విధానంలో..

ప్రతి మట్టి కుండను పచ్చిమటితో అంచుల వద్ద పూయడం వల్ల ఎర్మెటిక్ సీలింగ్ ప్రక్రియ ద్వారా పైన ఉన్న కుండలో ఆహారం ఉడుకుతుంది. ఇది వర్టికల్ ప్రెజర్ కుక్కర్ సిస్టం లాగా పనిచేస్తూ ఉంటుంది. కింద ఉన్న నిప్పు వల్ల వచ్చే వేడిని అది అత్యంత శక్తివంతమైన ఆవిరిగా మార్చేస్తూ ఉంటుంది. ఆవిరి సాంద్రత తక్కువ ఉండడంతో అది దశలవారీగా పై కుండలలోకి వెళ్లిపోతుంది. పార్ట్ అండ్ హీట్ ట్రాపింగ్ విధానం ద్వారా ఆవిరి సాంద్రత గరిష్ట ఉష్ణోగ్రతను చేరుకుంటుంది. దానివల్ల పైకుండలో ఆహారం త్వరగా ఉడుకుతూ ఉంటుంది.

లీనియర్ స్కేలింగ్ ద్వారా..

మోడ్రన్ పాత్రలు త్వరగా వేడిని బయటికి పంపిస్తాయి. మట్టికుండలు మాత్రం అలా వేడిని బయటికి పంపించవు. యూనిట్రీ మ్యాథమెటికల్ మెథడ్ లో లక్ష మందికి లీనియర్ స్కేలింగ్ విధానంలో ఇక్కడ ఆహారం వండుతారు. 17వేల కుండల్లో ఒకేసారి ఆహారం వండి భక్తులకు పంపిణీ చేస్తారు. ఇప్పుడు ప్రపంచం మొత్తం గ్రీన్ విధానం వైపు వెళ్ళిపోతుంది. పర్యావరణానికి హితమైన పనులు చేస్తోంది. కానీ కొన్ని వేల సంవత్సరాల క్రితమే పూరి జగన్నాథ స్వామి ఆలయంలో గ్లోబల్ గ్రీన్ స్టాండర్డ్ విధానం మొదలైంది.

అత్యంత అద్భతమైనవి..

స్వామివారి ప్రసాదం ముందుగా వాసన ఎందుకు ఉండదు.. ఆ తర్వాత ఎందుకు ఆ స్థాయిలో రుచి వస్తూ ఉంటుంది.. కట్టెల పొయ్యి మీద వండితే కిందికుండలో కాకుండా పైకుండలో ఆహారం ఎలా ఉడుకుతుంది.. ఇవన్నీ కూడా ఇక్కడ అద్భుతాలే. ఇంతవరకు ఏ సైన్స్ కూడా దీనిని చేదించలేదు. ఈ ఆధునిక ప్రపంచానికి వివరించలేదు. మన పురాణాలు గొప్పవి. మన శాస్త్రాలు అద్భుతమైనవి. మన ధర్మాలు అనితరసాధ్యమైనవి. వాటి వెనుక ఉన్న నిజాలు అత్యంత అద్భుతమైనవి.

అల్లు అర్జున్ లోకేష్ తరువాత ఆ కన్నడ డైరెక్టర్ తో సినిమా చేయబోతున్నాడా..?

Allu Arjun Lokesh Kanagaraj Movie
Allu Arjun Lokesh Kanagaraj Movie

Allu Arjun Lokesh Kanagaraj Film: తెలుగు సినిమా ఇండస్ట్రీని కొత్త పుంతలు తొక్కిస్తున్న వారిలో అల్లు అర్జున్ కూడా ఒకరు సినిమాతో ఫ్యాన్ ఇండియాలో పోయిన సంచలనాన్ని క్రియేట్ చేసిన ఆయన ఒక్కసారిగా తెలుగు సినిమా స్థాయిని అమాంతం పెంచేశాడు… ప్రస్తుతం ఆయన అట్లీ డైరెక్షన్ లో రాకా అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో పాన్ వరల్డ్ లోకి ఎంట్రీ ఇవ్వాలనే ప్రయత్నంలో ఉన్నాడు. ఈ సినిమా తర్వాత ఆయన లోకేష్ కనకరాజు డైరెక్షన్ లో ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత ఆయన కన్నడ దర్శకుడు ఆయన రిషబ్ శెట్టి దర్శకత్వంలో ఒక భారీ బడ్జెట్ సినిమాని చేయడానికి ఆసక్తి చూపిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. కాబట్టి ఇక మీదట కూడా ఆచితూచి మరి ముందుకు అడుగులు వేయాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

ఇక ఇదిలా ఉంటే రిషబ్ శెట్టి రీసెంట్ గా ‘కాంతార చాప్టర్ వన్’ సినిమాతో 800 కోట్ల కలెక్షన్స్ కొల్ల గొట్టాడు. కాబట్టి ఇప్పుడు చేయబోతున్న సినిమా విషయంలో కూడా ఆయన చాలా క్లారిటి ని మెయింటైన్ చేస్తూ ముందుకు సాగాలనే ప్రయత్నంలో ఉన్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే రిషబ్ శెట్టి సైతం తెలుగు హీరోలతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడు.

ఇంతకుముందు ఎన్టీఆర్ కి కథను వినిపించాడనే వార్తలైతే వచ్చాయి. అయితే ఎన్టీఆర్ తో సెట్ అవ్వకపోవడంతో ఆయన అల్లు అర్జున్ కి కథ వినిపించినట్టుగా తెలుస్తుంది. అల్లు అర్జున్ ఈ సినిమాతో భారీ సక్సెస్ ను సాధించాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక రిషబ్ శెట్టి మాత్రం అటు హీరోగా పెను సంచాన్లను క్రియేట్ చేస్తూనే దర్శకుడిగా కూడా తన సత్తా చాటుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు…

పాన్ ఇండియా నటుడిగా దర్శకుడిగా పెను సంచలనాలను క్రియేట్ చేస్తూ ముందుకు దూసుకెళుతున్నాడు. ఫ్యూచర్లో ఇంకెన్ని సక్సెస్ లను సాధిస్తాడు. తద్వారా ఆయనకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ చేసుకోగలుగుతాడా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…

భూమి అమ్మి భార్యను చదివించాడు.. ప్రభుత్వ ఉద్యోగం రాగానే భార్య చేసిన దారుణం ఇదీ

Husband Sold Land For Wife Education
Husband Sold Land For Wife Education

Husband Sold Land For Wife Education: సమాజం ఎటు పోతుందో అర్థం కావడం లేదు. మంచితనానికి నేటి కాలంలో రోజులు లేవు. పైగా మంచి చేసిన వారి మీదనే నిందలు పడుతున్నాయి. ఇటువంటి సంఘటనలు ఇటీవల కాలంలో పెరిగిపోతున్నాయి.. దీంతో మంచితనానికి.. మంచి మనుషులకు సమాజంలో గౌరవమే లేకుండా పోతుంది.

అది బీహార్ రాష్ట్రం.. ఆ మహిళకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. ప్రభుత్వ టీచర్ గా ఎంపికైన ఆమె ట్రైనింగ్ కూడా పూర్తి చేసుకుంది. ఆ సమయంలో తన కాలేజీ ఫ్రెండ్ తో ఆమె ఎఫైర్ పెట్టుకుంది. అంతేకాదు అతనితో వెళ్లిపోయింది. భర్తను వదిలేసింది. కొడుకుని కూడా పట్టించుకోవడం మానేసింది. ఈ సంఘటన బీహార్ రాష్ట్రంలో ని హాజీపూర్ ప్రాంతంలో వెలుగులోకి వచ్చింది.

హాజీపూర్ ప్రాంతానికి చెందిన అమన్ అనే వ్యక్తికి ఒక మహిళతో పెళ్లయింది. ఆమె ఇంటర్ వరకు చదువుకుంది. భార్యను పై చదువులు చదివించి.. ప్రభుత్వ ఉద్యోగస్తురాలిని చేయాలని ఆ భర్త సంకల్పించాడు. ఈ క్రమంలో ఆమెను ఉన్నత చదువులు చదివించేందుకు తన భూమిని కూడా అమ్మాడు. ఉన్నత చదువులు చదివిన ఆమె.. భర్త ఆశయాలకు తగ్గట్టుగానే ప్రభుత్వ ఉద్యోగాన్ని సంపాదించింది. భార్య ఉద్యోగం చేస్తోంది కాబట్టి.. తమ జీవితం బాగుపడుతుందని.. గొప్పగా తమ సంసారం వెలిగిపోతుందని అమన్ భావించాడు. కానీ అతని అంచనాలను భార్య తలకిందులు చేసింది.

ప్రభుత్వ టీచర్ ఉద్యోగం రాగానే ఆమె వ్యవహార శైలి పూర్తిగా మారిపోయింది. వేరొక వ్యక్తితో రిలేషన్ పెట్టుకుంది. అంతేకాదు అతనితో ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. ప్రస్తుతం ఆ వ్యక్తితో కాపురం చేస్తోంది. భర్తను వదిలేసింది. కుమారుడిని కూడా పట్టించుకోవడం మానివేసింది. అదే కాదు భర్త మీద తప్పుడు కేసులు పెట్టింది. దీనిపై పోలీసులు విచారణ సాగిస్తున్నారు. కాగా, అమన్ కుమారుడు తన తల్లి నిర్వాకాన్ని పోలీసులతో చెప్పాడు. అతడు చెప్పిన వివరాల ప్రకారం పోలీసులు అనేక ఆధారాలు సేకరించారు. అయితే తన ఇష్టపూర్తిగానే బయటికి వెళ్లిపోయానని.. తన భర్త ఇబ్బందులు పెడుతున్నాడని.. వరకట్నం కోసం వేధిస్తున్నాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడం ఇక్కడ విశేషం.

సూర్యవంశీని మొదట్లోనే పంపించాలి.. లేకుంటే సన్ రైజర్స్ గతే గుజరాత్ కు..

Gujarat Vs Rajasthan
Gujarat Vs Rajasthan

Gujarat Vs Rajasthan: ఐపీఎల్ లో కీలకమైన ఎలిమినేటర్ మ్యాచ్ ఈరోజు జరుగుతోంది. గుజరాత్, రాజస్థాన్ జట్ల మధ్య ఈ మ్యాచ్ జరుగుతుంది. గుజరాత్ జట్టు ఇటీవల బెంగళూరు చేతిలో ఓడిపోయి ఒత్తిడిలో ఉండగా.. హైదరాబాద్ జట్టు మీద గెలిచి రాజస్థాన్ విపరీతమైన ఉత్సాహంతో ఉంది. రాజస్థాన్ జట్టు ఆ స్థాయిలో ఉత్సాహంతో ఉండడానికి ప్రధాన కారణం 15 సంవత్సరాల వైభవ్ సూర్య వంశీ. ఈ చిచ్చర పిడుగు ఐపీఎల్లో సంచలనాల మీద సంచలనాలు సృష్టిస్తున్నాడు. వేరే లెవెల్ బ్యాటింగ్ తో అదరగొడుతున్నాడు.

సూర్య వంశీ ఇప్పటివరకు 15 మ్యాచ్లలో 15 ఇన్నింగ్స్ లలో బ్యాటింగ్ చేశాడు సూర్య వంశీ. ఏకంగా 680 పరుగులు చేశాడు. ఆరెంజ్ క్యాప్ హోల్డర్ గా కొనసాగుతున్నాడు. మొన్నటివరకు సాయి సుదర్శన్ 652 పరుగులతో ఆరెంజ్ క్యాప్ హోల్డర్ గా ఉండగా.. అతడిని బీట్ చేశాడు సూర్య వంశీ. ఇతడు యావరేజ్ 45.33, స్ట్రైక్ రేటు 242.86, ఇతడి ఖాతాలో 55 బౌండరీలు, 65 సిక్సర్లు ఉన్నాయి. దీనినిబట్టి అతని బ్యాటింగ్ విధ్వంసం ఎలా సాగుతుందో అర్థం చేసుకోవచ్చు. సూర్య వంశీ ఖాతాలో ఇప్పటివరకు ఒక సెంచరీ, నాలుగు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

ఇటీవల హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్లో సూర్య వంశీ 97 పరుగులు చేశాడు. అది కూడా అత్యంత తక్కువ బంతుల్లో.. మెరుపు వేగంతో బ్యాటింగ్ చేయడంతో రాజస్థాన్ జట్టు స్కోర్ రాకెట్ స్పీడ్ తో దూసుకుపోయింది. తద్వారా కొండంత లక్ష్యం హైదరాబాద్ జట్టు ముందు నిర్దేశితమైంది. దీనిని చేదించే క్రమంలో హైదరాబాద్ జట్టు ఒత్తిడికి గురై.. చేతులెత్తేసింది. అయితే సూర్య వంశీని అవుట్ చేయడానికి హైదరాబాద్ జట్టు కెప్టెన్ అనేక రకాలుగా ప్రణాళికలు రూపొందించామని మ్యాచ్ కు ముందు చెప్పాడు. కానీ అతడే దారాళంగా పరుగులు ఇచ్చాడు. అతడి బౌలింగ్లో సూర్య వంశీ వేటాడి పరుగులు తీశాడు. తనకు బౌలింగ్ వేయాలంటేనే చుచ్చు పోసుకునేలా చేశాడు.

ఇప్పుడు గుజరాత్ జట్టు కూడా అదే పరిస్థితి వస్తుందని అభిమానులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా స్పోర్ట్స్ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం సూర్య వంశీ రాజస్థాన్ జట్టుకు బలమైన ఆయుధం. అతడిని ప్రారంభంలోనే వెనక్కి పంపించాలి. లేకపోతే మ్యాచ్ మీద ఆశలు వదిలేసుకోవాలి. రబాడ, సిరాజ్, ప్రసిద్ లాంటివారు ఉన్నప్పటికీ.. సూర్యవంశీ ఒక్కసారి నిలబడితే వారి బౌలింగ్ విన్యాసాలు సాగవు. పైగా అతడు బంతిని అత్యంత బలంగా కొడతాడు కాబట్టి పరుగులు వచ్చేస్తూనే ఉంటాయి. గత సీజన్లో గుజరాత్ జట్టు మీదనే సూర్య వంశీ కేవలం 35 బంతుల్లోనే సెంచరీ చేయడం విశేషం. ఈ నేపథ్యంలో సూర్యవంశీని అడ్డుకోవడానికి గుజరాత్ బౌలర్లు ఎలాంటి విన్యాసాలు చేస్తారో చూడాల్సి ఉంది.

అక్రమ వలస దారులపై ఉక్కుపాదంతో విరుచుకు పడబోతున్న మోడీ ప్రభుత్వం

Modi government illegal immigrants

Modi government illegal immigrants : జనాభా స్వరూపం మారుతోందట.. డెమోగ్రఫీ అంటారు. 15 ఆగస్టు 2025న మోడీ ఎర్రకోట నుంచి దీని మీద దర్యాప్తు, సెప్టెంబర్ లో కేబినెట్ లో ఆమోదం.. తర్వాత అత్యున్నత కమిటీని ఏర్పాటు చేశారు. ఇది బీజేపీ తీసుకున్న స్టాండ్ కాదు.. కమ్యూనిస్టులు, కాంగ్రెస్, మమతా బెనర్జీలు మాట్లాడారు. జ్యోతిబసు సీఎంగా ఉన్నప్పుడు బంగ్లాదేశ్ నుంచి వలసలు వస్తే ‘దీవి‘లో బంధిస్తే చనిపోయారు.

తూర్పు సరిహద్దుల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంది. పశ్చిమ సరిహద్దుల్లో ఈ సమస్య తీవ్రంగా ఉంది.ఈశాన్య రాష్ట్రాల్లోకి బంగ్లాదేశ్ నుంచి పెద్ద ఎత్తున వలసలు వస్తున్నాయి. అక్రమ వలసలు బంగ్లాదేశ్ నుంచి పెరుగుతూనే ఉన్నాయి.

బంగ్లాదేశ్ నుంచి హిందువులు, సిక్కులు, జైనులు, బౌద్దులు లాంటి మైనార్టీలు ఇండియాకు వస్తే పౌరసత్వం ఇస్తామని కేంద్రప్రభుత్వం చెప్పింది. అదే ముస్లింలు వస్తే ఒప్పుకోమని చెప్పింది.

అక్రమ వలస దారులపై ఉక్కుపాదంతో విరుచుకు పడబోతున్న మోడీ ప్రభుత్వం.. దీనిపై ’రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

గోయెంకా ధాటికి రెండో కెప్టెన్ బలి.. లక్నోకు 27 కోట్ల పంత్ గుడ్ బై.. చివరికి ఇలా ముగిసింది

Rishabh Pant Captaincy Exit
Rishabh Pant Captaincy Exit

Rishabh Pant Captaincy Exit: ఐపీఎల్ అనేది కాసుల క్రీడ. కార్పొరేట్ కంపెనీలు ఆడే క్రీడ. కార్పొరేట్ కంపెనీలు ఐపీఎల్లో భారీగా పెట్టుబడులు పెడుతుంటాయి. పెట్టిన పెట్టుబడికి ఎలాగూ రాబట్టుకుంటాయి. కానీ కార్పొరేట్ కంపెనీలు ఆలోచించే విధానం వేరే విధంగా ఉంటుంది. పెట్టిన పెట్టుబడికి రాబడి తో పాటు లాభాలు కూడా ఆశిస్తాయి. మార్కెట్ వ్యాల్యూ పెంచుకోవడానికి తాపత్రయపడుతుంటాయి. అందువల్లే కదా ఆటగాళ్ల మీద కార్పొరేట్ కంపెనీలు కోట్లు కుమ్మరిస్తుంటాయి. పది కోట్లు , 20 కోట్లు ఆటగాళ్లకు కంపెనీలు ఎందుకు చెల్లిస్తున్నాయంటే ఇదిగో ఇందుకే.

ఆటగాళ్లు యాజమాన్యాల అంచనాలను మించి రాణించలేక పోతే.. కోట్లు పొంది సరిగా ఆడ లేకపోతే ఆటగాళ్ల మీద ఒక రకమైన నెగిటివ్ ప్రచారం మొదలవుతుంది. యాజమాన్యాలు పదేపదే ఆ ప్లేయర్లపై ఏదో ఒక విధంగా ఒత్తిడి తీసుకొస్తూ ఉంటాయి. అలాంటప్పుడు ఆ ఆటగాళ్లు తమ ఆట తీరు మార్చుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మార్చుకోకపోతే పక్కకు తప్పుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇలా పక్కకు తప్పుకొని సంచలనంగా మారాడు లక్నో జట్టు సారథి రిషబ్ పంత్.

2024 మెగా వేలంలో లక్నో జట్టు యాజమాన్యం రిషబ్ పంత్ ను 27 కోట్లకు సొంతం చేసుకుంది. నాటి నుంచి లక్నో జట్టుకు అతడు సారధిగా ఉంటున్నాడు. అయితే అతని నాయకత్వంలో లక్నో జట్టు రెండు సీజన్లలో కలిపి కేవలం 10 మ్యాచ్లలో మాత్రమే గెలిచింది. గత సీజన్లో ఆరు విజయాలు సాధించినప్పటికీ ప్లే ఆఫ్ దాకా వెళ్లలేకపోయింది. బ్యాటింగ్ పరంగా కూడా రిషబ్ పంత్ దారుణమైన ఆట తీరు కొనసాగించాడు. ఈ సీజన్లో అయితే అతడు 14 మ్యాచ్లు ఆడి కేవలం 269 పరుగులు మాత్రమే చేశాడు. ఈ ఏడాది మొత్తంగా అతడు కేవలం 312 పరుగులు మాత్రమే చేయగలిగాడు.

ఈ సీజన్లో రిషబ్ పంత్ నాయకత్వంలో లక్నో జట్టు 14 మ్యాచ్లు ఆడింది. కేవలం నాలుగు మాత్రమే గెలిచింది. పాయింట్లు పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. దీంతో రిషబ్ పంత్ మీద విపరీతమైన ఒత్తిడి పెరిగిపోయింది. మేనేజ్మెంట్ అతని మీద ఒత్తిడి తీసుకొచ్చిందా.. పంత్ కావాలని తప్పుకున్నాడా అనే విషయాల మీద క్లారిటీ లేకపోయినప్పటికీ.. తన కెప్టెన్సీ బాధ్యతలనుంచి తప్పించాలని కోరినట్టు లక్నో యాజమాన్యం ట్విట్టర్ వేదికగా పేర్కొంది. కెప్టెన్సీ బాధ్యతల నుంచి తనను తప్పించాలని పంత్ కోరాడని.. దానికి మేనేజ్మెంట్ ఒప్పుకుందని.. అదే కాదు ఈ మార్పు వెంటనే అమలులోకి వస్తుందని లక్నో యాజమాన్యం ప్రకటించింది. సారధిగా లక్నో జట్టుకు పంత్ అద్భుతమైన సేవలు అందించాలని.. ఇప్పుడున్న పరిస్థితుల్లో జట్టును గొప్పగా నిర్మించడం మీద దృష్టి పెట్టామని లక్నో యాజమాన్యం ప్రకటించింది.

27 కోట్లతో పంత్ ను కొనుగోలు చేసిన తర్వాత లక్నో యాజమాన్యం అతని మీద భారీ అంచనాల పెట్టుకుంది. అయితే వాటిని అందుకోవడంలో అతడు ప్రతిసారి విఫలమవుతూనే ఉన్నాడు. ఈ సీజన్లో కూడా అతడు విఫలం కావడంతో లక్నో యాజమాన్యం తీవ్ర నిరాశలో కూరుకుపోయింది. ఈ నేపథ్యంలో అతడిని తప్పిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. చివరికి అవే నిజమయ్యాయి. ఇప్పుడు అతడి స్థానంలో ఎవరు నాయకుడు అవుతాడు.. ఎవరు గోయంకా జట్టును ముందుండి నడిపిస్తారు అనే ప్రశ్నలకు కాలమే సమాధానం చెబుతుందని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు.

కేరళలో మాజీ ముఖ్యమంత్రి ఇంట్లో సోదాలు.. అధికారులపై దాడి

Kerala former CM raids

Kerala former CM raids : కమ్యూనిస్టు పార్టీలు తరచూ తమను తాము అవినీతి రహిత రాజకీయాలకు ప్రతీకలుగా ప్రదర్శించుకుంటాయి. అయితే కేరళలో జరిగిన తాజా పరిణామాలు ఈ వాదనలపై మరోసారి చర్చకు దారితీశాయి. మాజీ ముఖ్యమంత్రి, సీపీఎం సీనియర్ నేత పినరయి విజయన్‌కు సంబంధించిన కుటుంబ సభ్యులపై విచారణ జరిపేందుకు అధికారులు వెళ్లిన సమయంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

సోదాల కోసం వచ్చిన అధికారులను సీపీఎం కార్యకర్తలు అడ్డుకున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా అధికారులపై దాడి చేయడంతో పాటు అక్కడ పార్క్ చేసిన కొన్ని వాహనాలను ధ్వంసం చేసిన ఘటన వివాదాస్పదంగా మారింది. చట్టపరమైన ప్రక్రియను అడ్డుకోవడం, ప్రభుత్వ అధికారులపై దాడికి దిగడం వంటి అంశాలపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి.

“కమ్యూనిస్టులు అవినీతి చేయరు.. వారి కుటుంబాలపై దర్యాప్తు చేయడానికి ఎవరికీ హక్కు లేదు” అన్నట్టుగా వ్యవహరించడం ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రమాదకరమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆరోపణలు ఎదురైనప్పుడు చట్టపరమైన విచారణకు సహకరించాల్సింది పోయి, దర్యాప్తు బృందాలపై దాడులు జరగడం ఆందోళనకరమని పేర్కొంటున్నారు.

ఈ ఘటన కేరళ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపింది. అవినీతి ఆరోపణలు ఎవరి మీద వచ్చినా చట్టం తన పని తాను చేసుకోవాల్సిందేనని, రాజకీయ పార్టీలు లేదా నాయకులు చట్టానికి అతీతులు కాదని ప్రతిపక్ష నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.

కేరళలో మాజీ ముఖ్యమంత్రి ఇంటి సోదాలు, అధికారులపై దాడి ఘటనపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో వీక్షించవచ్చు.

సన్ రైజర్స్ ఓటమి.. కావ్య మారన్ తండ్రి, ఇషాన్ కిషన్ మధ్య పెద్ద వాగ్వాదం.. బ్యాన్ తప్పదా

Kavya Maran father and Ishan Kishan argument
Kavya Maran father and Ishan Kishan argument

Kavya Maran father and Ishan Kishan argument: ప్లే ఆఫ్ మ్యాచ్లో రాజస్థాన్ జట్టుతో హైదరాబాద్ తలపడుతున్నప్పుడు.. 240 మించిన పరుగులను ఛేదించాల్సి వచ్చినప్పుడు.. అభిషేక్ శర్మ 0 పరుగులకే అవుట్ అయ్యాడు. ఆ సమయంలో హైదరాబాద్ అభిమానులకు పెద్దగా ఇబ్బంది లేదు. ఎందుకంటే క్రీజులో ఇషాన్ కిషన్ ఉన్నాడు కాబట్టి చాలామందికి జట్టు గెలుస్తుందని నమ్మకం ఉంది. పైగా కిషన్ కూడా జోప్రా ఆర్చర్ బౌలింగ్ లో వరుసగా రెండు సిక్సర్లు కొట్టాడు. ఆ తర్వాత ఒక ఫోర్ కూడా కొట్టాడు. ఆ తదుపరి బంతికి క్యాచ్ అవుట్ అయ్యాడు.

కిషన్ అలా అవుట్ కావడంతో మైదానంలో ఉన్న అభిమానులు మొత్తం ఆవేదనకు గురయ్యారు. హైదరాబాద్ జట్టు ఓనర్ కావ్య మారన్ అయితే దాదాపు ఏడ్చినంత పనిచేసింది. ఎందుకంటే కిషన్ అవుట్ కావడంతో మ్యాచ్ స్వరూపం పూర్తిగా మారిపోయింది. అప్పటిదాకా రాజస్థాన్ జట్టుకు మించి స్కోర్ చేసిన హైదరాబాద్.. ఆ తర్వాత ఒత్తిడిలో కూరుకుపోవడం మొదలైంది. కిషన్ అవుట్ అయిన తర్వాత హెడ్ కూడా పెవిలియన్ దారిపట్టాడు. క్లాసెన్ కూడా అవుట్ అయ్యాడు. దీంతో హైదరాబాద్ జట్టు ఓటమిపాలైంది.

హైదరాబాద్ జట్టు ఓటమి పాలు కావడానికి అభిమానులు మాత్రమే కాదు.. జట్టు ఓనర్ కావ్య మారన్ తండ్రి కళానిధి మారన్ కూడా జీర్ణించుకోలేకపోతున్నాడు. మైదానంలో మ్యాచ్ జరుగుతున్నప్పుడు తీవ్ర ఆవేదనలో కనిపించిన అతడు.. మ్యాచ్ ముగిసిన తర్వాత ఆవేశంలో మైదానంలోకి వచ్చాడు. ఇషాన్ కిషన్ తో మ్యాచ్ గురించి చర్చించాడు..

ఈ సందర్భంగా ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగినట్టు తెలుస్తోంది. కిషన్ ఆట తీరు పట్ల కళానిధి మారన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. కిషన్ అవుట్ కావడం వల్ల మ్యాచ్ స్వరూపం మారిపోయిందని.. హైదరాబాద్ జట్టు గెలవాల్సిన మ్యాచ్లో ఓడిపోయిందని కళానిధి మారన్ ఆవేదన వ్యక్తం చేసినట్టు మీడియాలో వార్తలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో కూడా ఆ ఫోటోలు కనిపిస్తున్నాయి. అయితే దీనిపై ఇంతవరకు అధికారికంగా కిషన్ స్పందించలేదు. సన్రైజర్స్ యాజమాన్యం కూడా ఎటువంటి ప్రకటన చేయలేదు. అయితే ఇది ఏదైనా దుష్ప్రచారమా.. మరొకటా అనేది తేలాల్సి ఉంది. ఏఐ ఫోటోలు ద్వారా కూడా ఇటువంటి ప్రచారం ఇటువంటి ఇటీవలి కాలంలో పెరిగిపోయిందని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. అలాంటప్పుడు అధికారిక సమాచారాన్ని మాత్రమే నమ్మాలని చెబుతున్నారు.

ఈ విషయం బీసీసీఐ కి తెలిసినట్టు సమాచారం. దీంతో సన్రైజర్స్ యాజమాన్యానికి జరిమానా విధించే అవకాశం ఉంది. అంతేకాదు కిషన్ ఒక మ్యాచ్ ఆడకుండా నిషేధం విధిస్తారని తెలుస్తోంది. అయితే దీనిపై పూర్తి వివరాలు మరికొద్ది రోజుల్లో తెలుస్తాయి.

యోగ నరసింహుడికి నారా లోకేష్ పూజలు.. ఈ ఆలయానికి ఎంతటి చరిత్ర ఉందో తెలుసా..

Lokesh Yoga Narasimha Swamy temple visit
Lokesh Yoga Narasimha Swamy temple visit

Lokesh Yoga Narasimha Swamy temple visit: ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ శుక్రవారం తమిళనాడు రాష్ట్రంలోని షోలింగూర్ ప్రాంతంలో ప్రసిద్ధి చెందిన యోగ నరసింహస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు.. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. స్వామివారి చిత్రపటాన్ని బహుకరించారు. ఈ సందర్భంగా ఆలయ విశిష్టతలను నారా లోకేష్ తెలుసుకున్నారు. అనంతరం రోప్ వే లో ప్రయాణించి.. ఆలయం చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలను నారా లోకేష్ పరిశీలించారు

యోగ నరసింహస్వామి ఆలయానికి విశేషమైన చరిత్ర ఉంది. ఇది తమిళనాడు రాష్ట్రంలోని షోలింగూర్ బస్ స్టేషన్ నుంచి 3.5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది శ్రీ వైష్ణవుల 108 దివ్య క్షేత్రాలలో ఒకటి. స్వామివారి ఆలయం పెరియమలై అనే కొండ మీద ఉంటుంది. ఇక్కడ నరసింహస్వామి వారు యోగ భంగిమలో ఉంటారు. ఈ కొండ వెయ్యి అడుగుల ఎత్తులో ఉంటుంది. స్వామివారి ఆలయాన్ని చేరుకోవాలంటే దాదాపు 1305 మెట్లు ఎక్కాలి.

ఇక్కడ కొలువై ఉన్న అమ్మవారిని అమృతవల్లి తాయారు అని పిలుస్తుంటారు. ఈ ఆలయంలో స్వామివారు యోగాసనంలో కనిపిస్తూనే సాలగ్రామ హార, చతుర్భుజ ఆకారంలో కూర్చొని ఉంటారు. స్వామివారి చేతుల్లో శంఖం.. చక్రాలు ఉంటాయి. మిగతా రెండు చేతులు ధ్యాన భంగిమను ప్రదర్శిస్తాయి.

చారిత్రాత్మకమైన ఆధారాల ప్రకారం నరసింహస్వామి విష్ణుమూర్తి నాలుగవ అవతారం. హిరణ్య కశ్యపుడు అనే రాక్షసుడిని సంహరించిన తర్వాత.. ఈ కొండ మీదికి చేరుకుంటాడు. అక్కడ ఘోరమైన తపస్సు చేస్తాడు. ఆ తర్వాత యోగ భంగిమలో ఇక్కడ కొలువై ఉన్నాడు.. ఈ ఆలయంలో స్వామివారిని పూజిస్తే భక్తుల కోరిన కోరికలు నెరవేరుతాయి అనే నమ్మకం ఉంటుంది. మానసిక వ్యాధులు.. అనారోగ్య సమస్యల నుంచి బాధపడేవారు ఈ స్వామివారిని దర్శించుకుంటే ఉపశమనం లభిస్తుంది. ఇన్ని మెట్లు ఎక్కలేని వారికి డోలి సదుపాయం అందుబాటులో ఉంటుంది.

ఇక్కడ ఉన్న ఒక చిన్న కొండ మీద శ్రీ యోగాంజనేయుడు కొలువై ఉంటాడు. ఇది కూడా 350 అడుగుల ఎత్తులో ఉంటుంది. 400 మెట్లు ఎక్కితే స్వామివారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ నరసింహ జయంతి.. చైత్ర బ్రహ్మోత్సవం.. పంగుని తిరుకల్యాణం ఘనంగా జరుపుతుంటారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఈ ఆలయాన్ని తెరిచి ఉంచుతారు. నారా లోకేష్ స్వామివారిని దర్శించుకున్న నేపథ్యంలో.. ఈ క్షేత్రాన్ని సందర్శించుకోవడానికి తెలుగు రాష్ట్రాలకు చెందిన భారీగా భక్తులు వచ్చే అవకాశం ఉంటుందని ఆలయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ప్రభుత్వ టీచర్లకు గడ్డి సేకరించాలి.. యూపీ విద్యాశాఖ వింత ఆదేశాలు!

UP education department strange orders
UP education department strange orders

UP education department strange orders: ప్రభుత్వ టీచర్‌ అంటేనే ప్రస్తుతం ఓ చులకన భావన ఉంది. చదువు సరిగా చెప్పరనే అపవాదు ఉంది. ఉత్తరప్రదేశ్, బిహార్‌ లాంటి రాష్ట్రాల్లో అయితే టీచర్ల చదువులపై సోషల్‌ మీడియాలో వీడియోలు వైరల్‌ అయ్యాయి. ఇక కాపీలు కొట్టి కొలువులు తెచ్చుకున్నారన్న అప్పవాదులు ఉన్నాయి. ఇలాంటి వ్యతిరేక భావన ఉన్న నేపథ్యంలో తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని బరేలియా ప్రభుత్వ టీచర్లకు విద్యాశాఖ జారీ చేసిన విచిత్రమైన ఆదేశాలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. వీధి పశువులు (ఆవులు) కోసం ప్రతీ బ్లాక్‌ నుంచి కనీసం 100 క్వింటాళ్ల పశుగ్రాసం సేకరించాలని, లేకపోతే చర్యలు తప్పవని హెచ్చరించడం టీచర్లను తీవ్రంగా కలచివేసింది. తీవ్ర విమర్శలు, వ్యతిరేకత వచ్చిన తర్వాత అధికారులు ‘‘ఇది తప్పనిసరి కాదు’’ అంటూ వెనక్కి తగ్గారు. అయినా ఈ ఘటన రాజకీయాలు, పాలన, విద్యారంగంపై చాలా ప్రశ్నలు లేవనెత్తింది.

ఏమిటి ఆ ఆదేశం?
బరేలీ జిల్లా ప్రాథమిక విద్యా శాఖ (బేసిక్‌ ఎడ్యుకేషన్‌ డిపార్ట్‌మెంట్‌) ద్వారా జారీ చేయబడిన ఉత్తర్వుల ప్రకారం ప్రతీ ప్రాథమిక పాఠశాల నుంచి సుమారు 46 కిలోల గడ్డి సేకరించాలి. ప్రతి బ్లాక్‌ నుంచి కనీసం 100 క్వింటాళ్లు (మొత్తం జిల్లాలో సుమారు 1,500 క్వింటాళ్లు) సేకరించి గోశాలలకు అందించాలి. జనగణన డ్యూటీతో పాటు ఈ బాధ్యత కూడా నిర్వర్తించాలి అని, ఆదేశాలు పాటించకపోతే చర్యలు ఉంటాయని స్పష్టమైన హెచ్చరిక జారీ చేసింది.

సోషల్‌ మీడియాలో వైరల్‌..
ఈ ఆదేశం సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో టీచర్ల సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ‘‘ఇక మరి గోబర్‌ కూడా పని చేయాలా?’’ అని ప్రశ్నించారు. తీవ్ర విమర్శలు, మీడియా దృష్టి పడడంతో అధికారులు త్వరగా వెనక్కి తగ్గారు. ‘‘ఇది స్వచ్ఛంద దానం మాత్రమే, తప్పనిసరి కాదు’’ అని స్పష్టం చేశారు. అయితే, మొదట ఆదేశంలో ‘‘చర్యలు తప్పవు’’ అని హెచ్చరించడం ఎందుకు అనే ప్రశ్న తెలెత్తుతోంది.

సమస్య ఎక్కడ ఉంది?
ప్రభుత్వ టీచర్లు ఇప్పటికే ఎన్నికల డ్యూటీ, జనగణన, సర్వేలు, వ్యాక్సినేషన్, రేషన్‌ కార్డు పనులు వంటి అనవసర బాధ్యతలతో మునిగిపోతున్నారు. ఫలితంగా పాఠశాలల్లో నాణ్యమైన బోధన, విద్యార్థుల అభివృద్ధి వెనుకబడుతోంది. ఇప్పుడు గడ్డి సేకరణ కూడా జోడించడం అనవసరం. వీధి పశువుల సమస్య నిజమే. కానీ దానికి పరిష్కారం టీచర్ల భుజాల మీద మోపడం కాదు. గోశాలల నిర్వహణ, ఫండింగ్, స్థానిక స్వయం సహాయక సంఘాలు, పశు సంవర్ధన శాఖ – ఇవి బాధ్యత వహించాలి. టీచర్లను ఉపయోగించడం సులభమైన మార్గంగా కనిపిస్తోంది.

విద్యారంగంపై ప్రభావం..
గోవు సంరక్షణ రాజకీయ అజెండాలో భాగం. కానీ అది అమలు చేసేటప్పుడు విద్యారంగాన్ని బలి ఇవ్వడం సమంజసం కాదు. ఉత్తరప్రదేశ్‌లో గతంలో కూడా టీచర్లను గోశాలలకు ఫండ్‌ ఇవ్వమని ఆదేశాలు వచ్చాయి. ఇది ఆ సిలసిలాలో భాగమే. టీచర్ల మనోస్థైతి మరింత దిగజారుతుంది. పాఠశాలల్లో బోధన నాణ్యత క్షీణిస్తుంది.

బరేలీ ఘటన ఒక హాస్యాస్పద సంఘటనగా కనిపించినా, ఇది లోతైన సమస్యను బయటపెడుతోంది. ప్రభుత్వాలు టీచర్లను ‘‘మల్టీపర్పస్‌ వర్కర్స్‌’’గా చూడడం మానాలి. వారి ప్రధాన బాధ్యత విద్యాబోధన మాత్రమే కావాలి. గోవు సంరక్షణ మంచి ఉద్దేశమే కానీ, దాని భారం విద్యారంగం మీద పడకూడదు. సమస్యలకు సరైన సంస్థల ద్వారా, సరైన వనరులతో పరిష్కారాలు వెతకాలి. లేకపోతే ఇలాంటి ‘‘గడ్డి సేకరణ’’ ఆదేశాలు రాజకీయ, పాలనా వ్యవస్థలను మరింత హాస్యాస్పదం చేస్తాయి.

ఎన్టీఆర్ వల్ల ప్రశాంత్ నీల్ తిట్లు తింటున్నాడా..?

Prashanth Neel Dragon Movie
Prashanth Neel Dragon Movie

NTR and Prashanth Neel controversy: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న డ్రాగన్ సినిమా పెను సంచలనాలను క్రియేట్ చేసే విధంగా కనిపిస్తుంది. రీసెంట్ గా జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా నుంచి టైటిల్ గ్లింప్స్ ని రిలీజ్ చేశారు…దాంతో పాటుగా ఈ గ్లింప్స్ లో ఏ మూవీ వరల్డ్ మొత్తాన్ని పరిచయం చేశారు. సినిమా ఎలా ఉండబోతుంది హీరో దేనికోసం ఫైట్ చేయబోతున్నాడనే విషయాన్ని కూడా చాలా స్పష్టంగా తెలియజేశారు. మొత్తానికైతే ప్రశాంత్ నీల్ మరోసారి ఒక డిఫరెంట్ కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పటివరకు ప్రశాంత్ నీల్ చేసిన ప్రతి సినిమా ప్రేక్షకుడిని విశేషంగా అలరించింది. ముఖ్యంగా ఆయనలోని దర్శకుడిని పూర్తిస్థాయిలో ఎలివేట్ చేస్తూ ఒక హీరో నుంచి ఏం కావాలో దానిని పూర్తిస్థాయిలో రాబట్టుకుంటారు. అందుకే అతని సినిమాల్లో క్వాలిటీ ఉంటుంది. హీరో క్యారెక్టర్ లో ఒక నిజాయితీ ఉంటుంది. ఇక ఎలివేషన్స్ ఎమోషన్స్ ను సైతం ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తూ ఉంటాయి. ఇప్పటివరకు ఏ హీరో అతనితో సినిమా చేసిన కూడా వాళ్ళకంటూ ఒక సపరేట్ క్రేజ్ ను అందించాడు. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ ను సైతం డిఫరెంట్ గా ప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు.

ఎన్టీఆర్ లుక్కు కోసం తన బాడీ ని బిల్డ్ చేయమని చెప్తే ఎన్టీఆర్ బాగా సన్నబడి పోయాడు. ఈ విషయంలో ఎన్టీఆర్ భార్యతో పాటు అతని అభిమానులు కూడా నన్ను తిట్టుకున్నారు అంటూ ప్రశాంత్ నీల్ చెప్పారు. ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ ని అంతలా సన్నబడమని చెప్పలేదట.

కేవలం బాడీ పెంచాలి అని చెప్పాడట. కానీ ఆయన తన డెడికేషన్ తో సన్నబడి మరి బాడీని బిల్డ్ చేసుకున్నాడు… సినిమా అంటే అతనికి చాలా పిచ్చని, నటన మీద అతనికి చాలా పట్టు ఉందని ఎలాంటి పాత్రనైనా సరే పోషించగలిగే కెపాసిటి ఎన్టీఆర్ కి ఉందని ప్రశాంత్ నీల్ అతని గురించి చాలా గొప్పగా చెప్పాడు.

ఇక ఏది ఏమైనా కూడా ప్రశాంత్ నీల్ ను ఎన్టీఆర్ అభిమానులు తారక్ రూపం మార్చేశాడని తిట్టడం కాదు సినిమా రిలీజ్ లేట్ అవుతుందని కూడా తిడుతున్నారట. బెస్ట్ క్వాలిటీ తో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ఆయన చాలావరకు సమయాన్ని కేటాయించి మరి ఎన్టీఆర్ కి ఒక బిగ్గెస్ట్ సక్సెస్ ఇవ్వాలనే ప్రయత్నం చేస్తున్నారట…

ప్రభాస్ మంచితనానికి ఫిదా అయిపోయిన బాలీవుడ్ స్టార్ హీరో..

Prabhas kindness praised by Bollywood star
Prabhas kindness praised by Bollywood star

Prabhas kindness praised by Bollywood star: సినిమా ఇండస్ట్రీలో ప్రతి ఒక్క హీరో తనను తాను స్టార్ హీరోగా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తుంటాడు. ఒక సక్సెస్ వస్తే చాలు అనుకునే సమయం నుంచి మనమే నెంబర్ వన్ హీరోగా మారాలి అనే రేంజ్ కొంతమంది మాత్రమే వెళ్తారు. అందులో ప్రభాస్ మొదటి స్థానంలో ఉన్నాడు. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు అతనికి భారీ సక్సెసులను అందించాయి. బాహుబలి లాంటి సినిమాలు అతన్ని పాన్ ఇండియా హీరోగా నిలబెడితే, ఇప్పుడు చేయబోతున్న సినిమాలు ఇండియాలో నెంబర్ వన్ పొజిషన్ కి దగ్గర చేయబోతున్నాయి. ఇక ఇలాంటి క్రమంలోనే ఇంతకుముందు ఆయన వైవిద్యభరితమైన కథాంశాలతో సినిమాలు చేయకపోయిన కూడా కమర్షియల్ గా మాస్ ఎలిమెంట్స్ ని ఉండేలా చూసుకొని తన అభిమానులకు మంచి కిక్ ఇచ్చే సినిమాలైతే చేశాడు… ఇక ప్రస్తుతం ఆయన సందీప్ రెడ్డివంగ దర్శకత్వంలో చేస్తున్న ‘స్పిరిట్’ సినిమా మీదనే పూర్తి ఫోకస్ పెట్టాడు.

ఈ సినిమాలో విలన్ గా బాలీవుడ్ స్టార్ హీరో అయిన వివేక్ ఒబెరాయ్ నటిస్తున్నాడు. ఆయన ఈ మధ్యకాలంలో చేసిన సినిమాలతో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు… రీసెంట్ గా ప్రభాస్ వివేక్ ఒబెరాయ్ మధ్య కొన్ని యాక్షన్స్ సన్నివేశాలను చిత్రీకరించినట్టుగా తెలుస్తుంది.

ఇక ప్రభాస్ వివేక్ ఒబెరాయ్ హైదరాబాద్ వచ్చిన ప్రతిసారి తన దగ్గరికి రావాలని చెబుతున్నాడట. ప్రభాస్ మంచితనానికి ఫిదా అయిపోయినా వివేక్ రియాల్ హీరో అంటే ప్రభాస్ మాత్రమే అని తన సన్నిహితుల దగ్గర చెబుతున్నాడట. ఆయన సినిమాల్లో యాక్టింగ్ చేయడం విషయం పక్కనపెడితే హ్యుమానిటీ విషయంలో గానీ, ఒక మనిషికి రెస్పెక్ట్ ఇవ్వడంలో గాని ప్రభాస్ తర్వాతే ఎవరైనా అంటూ ఆయన కామెంట్లు చేస్తుండటం విశేషం…

ప్రభాస్ లాంటి మంచి మనసున్న హీరోను నేను బాలీవుడ్ లో చూడలేదు అంటూ ఆయన కామెంట్స్ చేస్తుండటం విశేషం…ఇక ఏది ఏమైనా కూడా ప్రభాస్ స్టార్ హీరోగా అవతరించిన కూడా తన ఫ్రెండ్స్ దగ్గర గాని రిలేటివ్స్ దగ్గర గాని చాలా హంబుల్ గా ఉంటాడనే విషయాన్ని చాలా మంది సెలబ్రిటీలు పలు సందర్భాల్లో తెలియజేశారు. మరోసారి బాలీవుడ్ హీరో అయిన వివేక్ ఒబెరాయ్ ఈ విషయాన్ని చెబుతూ ఉండడం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది…