Home Blog Page 202

పవన్ కళ్యాణ్ అంతరంగిక సమావేశానికి అడ్డంకులా?

Pawan Kalyan

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ తెలంగాణలో జనసేన నవ నిర్మాణ సమావేశం చేసుకోవడానికి సిద్దమయ్యారు. కానీ నిన్న రాత్రి అనుమతి ఇవ్వలేదు. ఇది బహిరంగ సభ. ఆంతరంగిక సమావేశం. వాళ్ల పార్టీ కార్యకర్తలతో జరుపుకునే సమావేశం. ఆయన సెలబ్రెటీ కావడంతో ట్రాఫిక్ కంట్రోల్ చేయలేమని పోలీసులు అనుమతి నిరాకరించారు.

పబ్లిక్ మీటింగ్ ఇది కాదు. కేవలం నేతలు, కార్యకర్తలతో క్లోజ్ డోర్ మీటింగ్. జనసేన నేతలకు మాత్రమే ఎంట్రీ ఉంటుంది. ఇది ఎమర్జెన్సీ అని చెప్పొచ్చు. తెలంగాణలో భారత రాజ్యాంగం కాకుండా ప్రత్యేక రాజ్యాంగం నడుస్తోందా..? ఇప్పుడు వస్తున్న మార్పులు ఏంటంటే.. హైకోర్టులో అత్యవసర పిటీషన్ మూవ్ చేస్తే రిజిస్ట్రార్ దగ్గరే నిరాకరించారు. హైకోర్టు జడ్జీల బెంచ్ వద్దకు వెళ్లలేదు.

ఇవన్నీ చూస్తుంటే.. అధికార దుర్వినియోగం ఏ స్థాయిలో తెలంగాణలో జరుగుతుందో తెలుస్తోంది. జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ సారథ్యంలోని తెలంగాణ ప్రభుత్వం దీన్ని అడ్డుకుంది. రాజ్యాంగం ఇచ్చిన హక్కును దుర్వినియోగం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. మంత్రి పొన్నం ప్రభాకర్ అయితే ’ ఉన్మాదిగా మాట్లాడారు.

పవన్ కళ్యాణ్ అంతరంగిక సమావేశానికి అడ్డంకులా? దీనిపై ’రామ్‘ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

జపనీస్ వాకింగ్.. ఇలా చేస్తే ఎన్ని ప్రయోజనాలో తెలుసా

Japanese walking method benefits
Japanese walking method benefits

Japanese walking method benefits: మనలో చాలామందికి ఉదయం పూట వాకింగ్ చేసే అలవాటు ఉంటుంది. సిటీలో ఉన్నవాళ్లు గ్రౌండ్లలో.. మారుమూల గ్రామాలలో ఉన్నవారు పంట పొలాలు లేదా.. ఇతర ప్రాంతాలలో వాకింగ్ చేస్తూ ఉంటారు. వాకింగ్ చేయడం వల్ల శారీరక సామర్థ్యం పెరుగుతూ ఉంటుంది. అంతేకాదు చెమట రూపంలో చెడు పదార్థాలు బయటికి వెళ్లిపోతుంటాయి. శరీరం స్లిమ్ అవుతూ ఉంటుంది. పైగా నడక వల్ల వృద్ధాప్య ఛాయలు రావు. శరీరంలో ఉన్న అనవసరమైన కొవ్వులు కూడా కరిగిపోతాయి. అవయవాల పనితీరు మెరుగవుతుంది.

వాకింగ్ చేసేటప్పుడు చాలామంది ఒక రకమైన విధానాన్ని పాటిస్తూ ఉంటారు. అయితే వాకింగ్ లు కూడా రకరకాల పద్ధతులు అమల్లోకి వచ్చాయి. అయితే ఇప్పటి కాలంలో జపనీస్ వాకింగ్ స్టైల్ ప్రపంచ వ్యాప్తంగా చర్చకు దారి తీస్తోంది. జపాన్ ప్రజలు పొదుపు.. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉంటారు.

జపాన్ ప్రజలు ప్రతిరోజు పదివేల అడుగుల వరకు నడుస్తూ ఉంటారు. దీనివల్ల శారీరక శ్రమ ఏర్పడుతూ ఉంటుంది. ఇది అత్యంత సులువైన శారీరక శ్రమకు బెంచ్ మార్క్ గా ఉంటుంది.. ఫిట్నెస్ ట్రాకర్స్ .. స్మార్ట్ ఫోన్ల సహాయంతో జపాన్ ప్రజలు ప్రతిరోజు 10,000 అడుగులు నడుస్తుంటారు.

ఇలా వాకింగ్ చేయడం వల్ల డిమెన్షియా నుంచి శరీరానికి రక్షణ కలుగుతుందని జపాన్ ప్రజలు నమ్ముతుంటారు. అయితే ఆరోగ్యంగా ఉన్న వారికి పదివేల అడుగుల దూరం నడవడం పెద్ద కష్టం కాకపోవచ్చు కానీ.. మోకాళ్ల నొప్పులు.. కీళ్ల నొప్పులు ఉన్నవారికి ఇబ్బంది తప్పకపోవచ్చు.. నడక వల్ల అనారోగ్య సమస్యలు దూరమవుతాయని జపాన్ ప్రజలు నమ్ముతుంటారు.. కొద్దిసేపు వేగంగా నడిచి.. ఆ తర్వాత నెమ్మదిగా నడవడం వల్ల శ్వాస మెరుగ్గా ఉంటుంది. అవయవాల పనితీరును మెరుగుపరుస్తుంది. రక్తప్రసరణ వ్యవస్థని కూడా సక్రమంగా చేస్తోంది. జపాన్ ప్రజలు టెక్నాలజీని ఎక్కువగా వాడుతూ ఉంటారు. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద నెమ్మదిగా నడుస్తుంటారు. ఆఫీస్ కు వెళ్తున్నప్పుడు వేగంగా అడుగులు వేస్తుంటారు.

ఉదయం బ్రేక్ ఫాస్ట్ తీసుకున్న తర్వాత కూడా జపాన్ ప్రజలు నడుస్తుంటారు. దీనివల్ల శరీరంలో జీర్ణక్రియ మెరుగవుతుందని.. సరైన స్థాయిలో పోషకాలు అన్ని శరీర అవయవాలకు లభిస్తాయని జపాన్ ప్రజలు నమ్ముతుంటారు. జపాన్ ప్రజలు ఉదయం పూట 30 నిమిషాల పాటు వాకింగ్ చేస్తుంటారు. ఒకవేళ ఆరోగ్యం మెరుగ్గా ఉన్నవారు అంతకంటే ఎక్కువగానే చేస్తుంటారు. ఇందులో మొదటి మూడు నిమిషాలు వేగంగా నడుస్తుంటారు. ఆ తర్వాత మూడు నిమిషాలు నెమ్మదిగా నడుస్తుంటారు. ఇలా ఐదుసార్లు వేగంగా.. ఐదుసార్లు నెమ్మదిగా నడిచి.. ఆరోగ్యానికి కాపాడుకుంటారు. అయితే ఇలా నడిచే మందు జపాన్ ప్రజలు వార్మప్ చేస్తుంటారు.

ఈ విధానం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుందని హార్వర్డ్ వైద్య నిపుణులు తమ పరిశోధన ద్వారా బయటపెట్టారు. రక్త ప్రసరణ వేగం దీనిద్వారా సమర్థవంతంగా జరుగుతుందని.. గుండెపోటు వచ్చే అవకాశం ఉండదని.. రోగ నిరోధక శక్తి పెరుగుతుందని.. రాత్రి సమయంలో నిద్ర మెరుగ్గా పడుతుందని హార్వర్డ్ వైద్యులు చెబుతున్నారు.

పెద్ది అక్కడి ప్రేక్షకులను అలరిస్తుందా..? బుచ్చిబాబు కెరియర్ సెట్ అయినట్టేనా..?

Peddi movie audience response
Peddi movie audience response

Peddi movie audience response: కొన్ని సినిమాలు కొంతమంది ప్రేక్షకులను విశేషంగా అలరిస్తాయి. మరికొన్ని సినిమాలు కొన్ని ప్రాంతాల్లో పెద్దగా ఆకట్టుకోకపోవచ్చు. కానీ ఇలాంటి క్రమంలోనే తెలుగు సినిమా ఇండస్ట్రీలో రొటీన్ కథలకు కాలం చెల్లిపోయిందని చెబుతున్నారు. కానీ ఈ క్రమంలోనే ‘పెద్ది’ సినిమా రొటీన్ స్టోరీ తోనే వస్తుందనేది మాత్రం మనకు ట్రైలర్ ను చూస్తూనే అర్థమైపోతుంది. ఇక అలాంటి కథను తెలుగు ప్రేక్షకులు ఎలా స్వీకరిస్తారు అనే విషయం పక్కన పెడితే బాలీవుడ్ వాళ్ళు ఆ సినిమాని ఎలా తీసుకుంటారు. అక్కడి ప్రేక్షకుల్లో చాలా మంది త్రిబుల్ ఆర్ సినిమాతో రామ్ చరణ్ కి వీరాభిమానులుగా మారిపోయారు. రామ్ చరణ్ ను ఒక రొటీన్ స్టోరీలో ఎలా చూడగలుగుతారు అనేదే ఇప్పుడు చర్చనియంశంగా మారింది. మొత్తానికైతే రామ్ చరణ్ ఈ సినిమాలో చాలా కష్టపడి వర్క్ చేసినప్పటికి ఆయన కష్టం అనేది మనకు స్క్రీన్ మీద కనిపిస్తుంది.

ఇక ట్రైలర్ ని బట్టి చూస్తే ఈ సినిమాలో రామ్ చరణ్ మూడు డిఫరెంట్ వేరియేషన్స్లో కనిపించబోతున్నాడు. ఒకటి క్రికెటర్ గా, రెండు కుస్తీ ఫైటర్ గా, మూడు రన్నర్ గా మెప్పించడానికి సిద్ధమయ్యాడు. ఇక ఈ క్రమంలోనే రామ్ చరణ్ నుంచి ఇలాంటి ఒక మూవీ వస్తుందనేది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు.

ఇక ఇప్పుడు ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ సక్సెస్ ని సాధించాలంటే మాత్రం దర్శకుడు ఏదో ఒక మ్యాజిక్ ను చేయాలి. లేకపోతే మాత్రం ఈ సినిమా అనుకున్న రేంజ్ లో సక్సెస్ సాధించకపోవచ్చు… ఇక ఇప్పటివరకు రామ్ చరణ్ చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇప్పుడు చేయబోతున్న సినిమాలతో మరింత ముందుకు దూసుకెళ్లాలనే ప్రయత్నంలో ఉన్నాడు.

ఈ మూవీతో బాలీవుడ్ ప్రేక్షకులను తను ఎలా మెప్పిస్తాడు అక్కడ ఈ సినిమా భారీ కలెక్షన్స్ ని కొల్లగొడితే బాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసిన దర్శకుడిగా బూచి బాబు దిగ్గజ దర్శకుల పక్కన నిలబడతాడు. లేకపోతే మాత్రం ఆయన చాలా వరకు డీలా పడిపోయే ప్రమాదం ఉంది. ఒక రకంగా తన మార్కెట్ కూడా భారీగా కోల్పోయే ప్రమాదమైతే ఉంది…

జూనియర్ ఎన్టీఆర్ విషయంలో బాలకృష్ణ మొండిగా ఉన్నాడా..? కారణం ఏంటి..?

Balakrishna
Balakrishna

Jr NTR Balakrishna controversy: తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు దూసుకెళ్తుంది. ఇక ఈ మధ్యకాలంలో తెలుగు నుంచి వచ్చిన సినిమాలన్నీ పాన్ ఇండియాలో సూపర్ సక్సెస్ లను సాధిస్తున్న క్రమంలో చాలామంది హీరోలు సైతం సినిమాల మీదనే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు.. మన హీరోలతో ఇతర భాషల దర్శకులు సైతం సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తంత నీల్ సైతం మన జూనియర్ ఎన్టీఆర్ తో డ్రాగన్ అనే సినిమాను చేస్తున్నాడు. ఇక ఎన్టీఆర్ సైతం ఈ మూవీతో సక్సెస్ ను సాధించాల్సిన అవసరమైతే ఉంది. ఇంతకుముందు ఆయన హృతిక్ రోషన్ కలిసి చేసిన ‘వార్ 2’ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించకపోవడంతో ఆయన మీద ప్రెషర్ అయితే పెరిగింది. ఇప్పుడు ఈ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధిస్తే అతను స్టార్ హీరోల లిస్టులో ముందుకు వెళతాడు. లేకపోతే మాత్రం ఆయన చాలా వరకు తన మార్కెట్ ను కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు… ఇక జూనియర్ ఎన్టీఆర్ బయట ఎన్ని సక్సెస్ లను సాధించినా కూడా తన ఫ్యామిలీ మెంబర్స్ తో మాత్రం కలిసిపోలేకపోతున్నాడు.

ముఖ్యంగా బాలకృష్ణకి జూనియర్ ఎన్టీఆర్ కి మధ్య కొన్ని రోజుల నుంచి విభేదాలు ఉన్నాయనే విషయం మనందరికి తెలిసిందే. మరి ఎందుకని వీళ్ళ మధ్య మనస్పర్ధలు వచ్చాయనే విషయంలో క్లారిటీ లేదు. కానీ ఇప్పటికైనా కలిసిపోతే చూడాలని ప్రతి ఒక్క ప్రేక్షకుడు కోరుకుంటున్నాడు.

నిజానికి బాలయ్య ఈ విషయంలో మొండిగా వ్యవహరిస్తున్నాడని కూడా చాలా మంది చెబుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్, బాలయ్య బాబు తో కలిసి పోవాలనే ప్రయత్నంలో ఉన్నప్పటికి బాలయ్య మాత్రం ఎన్టీఆర్ ను తనతో కలుపుకోవడానికి సిద్ధంగా లేనట్టుగా తెలుస్తుంది.

ఇక ఏది ఏమైనా కూడా ఎలక్షన్స్ టైమ్ లో జూనియర్ ఎన్టీఆర్ ప్రచారంలో పాల్గొనకపోవడం చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు అసలు ఎన్టీఆర్ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో బాలయ్య అలాంటి ఒక డిసిషన్ తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అందుకే జూనియర్ ఎన్టీఆర్ ను కలువడానికి కానీ అతనితో మాట్లాడడానికి కానీ బాలయ్య ఇష్టపడటం లేదట…

చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ లో తప్పు ఎక్కడ జరుగుతుంది...

Chiranjeevi
Chiranjeevi

Chiranjeevi second innings: మెగాస్టార్ చిరంజీవి ఇప్పటివరకు చేసిన సినిమాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. ఇకమీదట చేయబోతున్న సినిమాల విషయంలో కూడా ఆయన పలు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు దూసుకెళ్తుండటం విశేషం…ఇక చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ లో చేస్తున్న సినిమాల విషయంలో అసలు ఏమాత్రం సత్తా చాటుకోలేకపోతున్నాడు. మన శంకర్ వరప్రసాద్ సినిమాతో ఈ సంక్రాంతి హీరోగా నిలిచినప్పటికి ఆయన రేంజ్ సినిమా అయితే అది కాదని ఆయన నుంచి ప్రేక్షకులు ఇంకా వేరే ఏదో కోరుకుంటున్నారు అంటూ చాలామంది కామెంట్లు చేస్తున్నారు. నిజానికి చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అయిన తర్వాత ఆయన ఏ మాత్రం తన సత్తా చాటుకోలేకపోతున్నాడు గతంలో ఆయన చేసిన సినిమాలు అతన్ని స్టాప్ లెవెల్లో నిల్చోబెట్టాయి … అలాంటి చిరంజీవి ఈ మధ్యకాలంలో చేస్తున్న సినిమాల విషయంలో ఏమాత్రం తన సత్తా చూపించలేకపోతున్నాడు. మరి 70 సంవత్సరాలు పైబడిన వయసులో కూడా ఆయన సినిమాలు చేస్తున్నాడు అంటే నిజంగా చాలా గొప్పవిషయమే అయినప్పటికి తన ఇమేజ్ కి తగ్గట్టుగా తన క్యారెక్టర్ డిజైన్ చేసుకొని సినిమాని ప్రేక్షకులకు చేరువయ్యేల చేస్తే బాగుంటుంది.

కానీ చిరంజీవి మాత్రం అంత పవర్ఫుల్ క్యారెక్టర్స్ ను పోషించడం లేదు. సెకండ్ ఇన్నింగ్స్ లో ఆయన కమర్షియల్ సినిమాల వైపు ఎక్కువగా అడుగులు వేస్తున్నాడు. ఇక ఏది ఏమైనా కూడా సినిమాలలు అతన్ని టాప్ లెవల్లో నిలిపితే బాగుంటుంది. లేకపోతే మాత్రం ఆయన మరింత డిలా పడిపోయే ప్రమాదమైతే ఉంది. ఇక ఇప్పుడు బాబీ డైరెక్షన్లో చేస్తున్న సినిమా కూడా కమర్షియల్ సినిమానే కావడం విశేషం…

ఇక మీదట చేయబోయే సినిమాల విషయంలో చిరంజీవి ఇంకాస్త జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరమైతే ఉంది… ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో అతనికి సరైన సక్సెస్ లు రాకపోవడానికి గల కారణం ఏంటంటే తను ఎంచుకుంటున్న కధలే అంటూ మరికొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.

ఎందుకంటే చిరంజీవి 70 సంవత్సరాల పైబడిన వయసులో కూడా హీరోయిన్ తో రొమాన్స్ చేయడం, డ్యూయెట్ సాంగులు వేయడం, ఫైట్లు చేయడం లాంటివే చూపిస్తున్నారు. తప్ప కొత్తగా ఏమి చూపించడం లేదు. దానివల్ల అతను చాలా వరకు ఇతర హీరోల కంటే కూడా వెనుకబడి పోతున్నాడు. మొత్తానికైతే ఆయన డిఫరెంట్ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తే వాటిని అందరు ఆదరిస్తారు…

శక్తివంతమైన కిరిన్ 9010S ప్రాసెసర్ తో మార్కెట్లోకి కొత్త ఫోన్లు..

Huawei Nova 16 Pro specifications
Huawei Nova 16 Pro specifications

Huawei Nova 16 Pro specifications: ఇప్పుడున్న వారు కొత్తగా ఫోన్ కొనాలంటే డిస్ ప్లే విషయంలో చాలా కేర్ తీసుకుంటున్నారు. ఇలాంటి వారి కోసం కొన్ని కంపెనీలు ప్రత్యేకంగా అద్భుతమైన డిస్ ప్లేను అందించడానికి కొత్త డివైజ్ లను మార్కెట్లోకి తీసుకువస్తున్నాయి. ఇందులో భాగంగా హువావే (Huawei) కంపెనీ స్మార్ట్‌ఫోన్ సిరీస్ ‘నోవా 16’ని చైనా మార్కెట్లో విడుదల చేసింది. ఇందులో భాగంగా ‘నోవా 16 ప్రో’, ‘నోవా 16 అల్ట్రా’ మోడల్స్ అత్యంత శక్తివంతమైన ఫీచర్లతో టెక్ ప్రపంచంలో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. వీటి గురించి పూర్తి వివరాల్లోకి వెళితె..

Nova 16 Pro, Nova 16 Ultra అనే రెండు ఫోన్లు 6.84 అంగుళాల భారీ LTPO OLED డిస్‌ప్లేతో వస్తున్నాయి. ఇవి 120Hz వరకు అడాప్టివ్ రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉండటమే కాకుండా.. 2856 x 1320 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో అద్భుతమైన విజువల్ అనుభవాన్ని అందిస్తాయి. స్క్రీన్ రక్షణ కోసం ఇందులో ‘కున్లున్ గ్లాస్’ను వాడారు. అల్ట్రా మోడల్ మరింత మన్నికైన నిర్మాణంతో వస్తోంది. ప్రో మోడల్ IP65 రేటింగ్‌ తో ఉండడంతో పాటు అల్ట్రా మోడల్ అత్యున్నతమైన IP68 రేటింగ్ ను కలిగి ఉంటుంది. దీంతో ఇవి రెండు కూడా వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ కలిగి ఉన్నాయి.

ఈ రెండు స్మార్ట్‌ఫోన్లు హువావేకి చెందిన శక్తివంతమైన ‘కిరిన్ 9010S’ ప్రాసెసర్‌తో పనిచేస్తాయి. ఇవి హువావే స్వంత ఆపరేటింగ్ సిస్టమ్ ‘హార్మొనీ OS 6.1’ పై రన్ అవుతాయి. మల్టీ టాస్కింగ్ తో పాటు గేమింగ్ కోసం ఇందులో మెరుగైన థర్మల్ మేనేజ్‌మెంట్ మరియు ఏఐ ఫీచర్లను జోడించారు. ఇవి 256GB, 512GB మరియు 1TB స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులో ఉన్నాయి.

కెమెరా విభాగంలో ఈ ఫోన్లు అద్భుతమైన పనితీరును ప్రదర్శిస్తాయి. రెండు మోడళ్లలోనూ 200 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా తో పాటు 50 మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్, 50 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ మాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీల కోసం 50 మెగాపిక్సెల్ సెన్సార్‌ను అమర్చారు. వీటికి అదనంగా ఫోటోలను మెరుగుపరిచేందుకు ‘రెడ్ మ్యాపుల్’ కలర్ సెన్సార్లను కూడా హువావే పొందుపరిచింది.

ఈ సిరీస్ ప్రత్యేకత 7,000mAh సామర్థ్యం గల భారీ బ్యాటరీ. ఇవి 100W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తాయి. ముఖ్యంగా అల్ట్రా మోడల్‌లో 50W వైర్‌లెస్ ఛార్జింగ్, 7.5W రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్ సౌకర్యం కూడా ఉంది. కనెక్టివిటీ విషయానికి వస్తే.. రెండు ఫోన్లు వై-ఫై 7, బ్లూటూత్ 6.0 సపోర్ట్ చేస్తాయి. అల్ట్రా మోడల్‌లో శాటిలైట్ కాలింగ్ ఫీచర్ ఉండగా, ప్రో మోడల్ టూ-వే బీడౌ శాటిలైట్ మెసేజింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.

మడిచిపెట్టి తీసుకెళ్లొచ్చు.. ఇరుకు దారుల్లో వాడుకోవచ్చు.. ఈ స్కూటర్ గురించి తెలుసా..

Toyota Land Hopper electric scooter
Toyota Land Hopper electric scooter

Toyota Land Hopper electric scooter: ప్రపంచ ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ Toyota తాజాగా ల్యాండ్ హాపర్ (Land Hopper) పేరుతో ఓ వినూత్న ఎలక్ట్రిక్ మూడు చక్రాల స్కూటర్‌ను ఆవిష్కరించింది. సాధారణ స్కూటర్లకు భిన్నంగా, ఇది ప్రత్యేకంగా ఆఫ్-రోడ్ ప్రయాణాల కోసం రూపొందించబడింది. అడవులు, కొండ ప్రాంతాలు, మట్టి దారులు వంటి కఠినమైన మార్గాల్లో కూడా సులభంగా ప్రయాణించేందుకు దీనిని డిజైన్ చేశారు. దీనిని ఎలా ఉపయోగిస్తారు?

ల్యాండ్ క్రూయిజర్‌కు తోడుగా..
ఈ స్కూటర్‌ను ముఖ్యంగా Toyota Land Cruiser SUV యజమానులను దృష్టిలో పెట్టుకుని రూపొందించారు. ఈ వాహనంతో చేరలేని ఇరుకు మార్గాలు, అడవి దారులు లేదా కొండ ప్రాంతాలను సందర్శించేందుకు ల్యాండ్ హాపర్ ఉపయోగపడుతుంది. ల్యాండ్ క్రూయిజర్‌లో ప్రయాణించి, ఆ తర్వాత స్కూటర్‌ను బయటకు తీసి మరింత లోతైన ప్రాంతాలకు వెళ్లేలా దీనిని రూపొందించారు.

మూడు చక్రాలతో అధిక స్థిరత్వం
సాధారణ ఎలక్ట్రిక్ స్కూటర్లలో రెండు చక్రాలు మాత్రమే ఉంటాయి. కానీ ల్యాండ్ హాపర్‌లో ముందు భాగంలో రెండు చక్రాలు, వెనుక ఒక చక్రం ఉంటుంది. ఈ డిజైన్ వల్ల ఎత్తుపల్లాలు, రాళ్లతో కూడిన దారులు, అసమాన ఉపరితలాలపై కూడా మంచి స్థిరత్వం లభిస్తుంది. ముందున్న రెండు చక్రాలు స్వతంత్రంగా కదలగలగడం వల్ల ప్రయాణం మరింత సురక్షితంగా ఉంటుంది.

ఫోల్డబుల్ డిజైన్ ప్రత్యేకత
ల్యాండ్ హాపర్‌లో అత్యంత ఆకర్షణీయమైన అంశం దీని ఫోల్డబుల్ డిజైన్. అవసరం లేనప్పుడు దీనిని మడిచి చిన్న పరిమాణంలోకి మార్చుకోవచ్చు. హ్యాండిల్‌బార్ ముడుచుకుపోతుంది, వెనుక చక్రం ముందున్న రెండు చక్రాల మధ్యకు సర్దుకుపోతుంది. దీంతో ఇది SUV బూట్ స్పేస్‌లో సులభంగా సరిపోతుంది.

ఆఫ్-రోడ్ ప్రయాణాలకు ప్రత్యేకంగా
ఈ వాహనంలో ఆఫ్-రోడ్ టైర్లు, మెరుగైన సస్పెన్షన్ వ్యవస్థను అమర్చారు. దీంతో కొండ ప్రాంతాలు, అడవి మార్గాలు, మట్టి రోడ్లపై సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చు. టయోటా ప్రకారం, ఇది రోజువారీ ప్రయాణాలకే కాకుండా పర్యాటక ప్రాంతాల్లో సాహస యాత్రలకు కూడా అనువుగా ఉంటుంది.

ఎప్పుడు మార్కెట్లోకి?
టయోటా ఈ ల్యాండ్ హాపర్‌ను వాణిజ్యపరంగా విక్రయించాలని ఇప్పటికే ప్రకటించింది. అయితే ధర, బ్యాటరీ సామర్థ్యం, రేంజ్, ఛార్జింగ్ సమయం వంటి పూర్తి సాంకేతిక వివరాలను ఇంకా వెల్లడించలేదు. కొన్ని నివేదికల ప్రకారం ఇది 2027లో మొదటగా జపాన్ మార్కెట్లో విడుదలయ్యే అవకాశం ఉంది.

పెరుగుతున్న ఎలక్ట్రిక్ మొబిలిటీ అవసరాలను దృష్టిలో పెట్టుకుని టయోటా రూపొందించిన ల్యాండ్ హాపర్ భవిష్యత్ రవాణా వ్యవస్థలకు కొత్త దిశ చూపిస్తోంది. కార్, స్కూటర్, ఆఫ్-రోడ్ వాహనం లక్షణాలను కలిపి రూపొందించిన ఈ వినూత్న వాహనం అడ్వెంచర్ ప్రేమికులకు ప్రత్యేక ఆకర్షణగా మారే అవకాశం ఉందని ఆటో నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

స్లిమ్ డిజైన్.. లాంగ్ బ్యాటరీ బ్యాకప్.. వీరి కోసం బెస్ట్ ల్యాప్ టాప్..

Acer Swift Air 14 laptop
Acer Swift Air 14 laptop

Acer Swift Air 14 laptop: కొత్తగా ల్యాప్ టాప్ కొనాలని అనుకునేవారికి Acer సర్ ఫ్రైజ్ న్యూస్ తెలిపింది. ఈ కంపెనీ నుంచి కొత్తగా Swift Air 14 ల్యాప్‌టాప్‌ మార్కెట్లోకి వచ్చింది. ఇది తేలికైన, స్లిమ్ డిజైన్‌తో ఉండి… రోజువారీ పనులు, చదువు, స్ట్రీమింగ్, వెబ్ బ్రౌజింగ్, వీడియో కాల్స్ వంటి అవసరాలకు బాగా ఉపయోపడేవిధంగా రూపొందించారు. ఇందులో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయో చూద్దాం..

ఈ ల్యాప్‌టాప్‌లో ఇంటెల్ కోర్ సిరీస్ 3 ప్రాసెసర్ వాడారు. అలాగే AI పనుల కోసం built-in NPU కూడా ఇచ్చారు. అంటే సాధారణ పనులతో పాటు AI-ఆధారిత ఫీచర్స్ ను కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. డిజైన్ పరంగా చూస్తే.. ఇందులో Swift Air 14 చాలా లైట్ వెయిట్ గా, ఆల్ మెటల్ బిల్డ్ తో నిర్మీతమైంది. ఈ ల్యాప్ టాప్ ను ప్రయాణాల్లో తీసుకెళ్లడానికి, క్లాస్‌రూమ్ లేదా ఆఫీస్ వర్క్‌కు సులభంగా తీసుకెళ్లడానికి ఉపయోగపడుతుంది. ఇందులో 14 అంగుళాల డిస్ ప్లే కనిపిస్తుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్ తో పనిచేస్తుంది. దీంతో విజువల్స్ మరింత స్మూత్ గా ఉంటుంది. ఆడియో భాగంలో DTS:X అల్ట్రా ఆడియో ఇచ్చారు. దీనివల్ల వీడియోలు చూడటం, సినిమాలు, ఆన్‌లైన్ మీటింగ్స్, మ్యూజిక్ వినేవారికి సౌకర్యవంతంగా ఉంటుంది.

బ్యాటరీ విషయంలో కూడా ఈ మోడల్ ఆకర్షణీయంగా ఉంది. కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం.. ఇది 19గంటల పాటు నాన్ స్టాప్ గా రన్ అవుతుంది. అలాగే 16 గంటల పాటు బ్రౌజింగ్ బ్యాకప్ ఇవ్వగలదు, అలాగే 30 నిమిషాల్లో 50 శాతం ఛార్జింగ్ అవుతుంది. ఇందులో స్టోరేజ్, మెమరీ వివరాల్లో చూస్తే ఇది 16GB వరకు RAM, 512GB SSD తో వస్తోంది. అలాగే ఇందులో డ్యూయెల్ థండర్ బోల్ట్, 4 టైప్ సీ పోర్ట్, వైఫై 6 ఈ వంటి మోడ్రన్ ఆప్షన్స్ ఇచ్చారు. అలాగే ముఖ గుర్తింపు ద్వారా లాగిన్ అయ్యే అవకాశం ఉంది. Acer Swift Air 14 అనేది పోర్టబుల్, ఏఐ సపోర్ట్ తో వచ్చిన లాంగ్ బ్యాటరీ బ్యాకప్ డివైజ్. ప్రొఫెషనల్ గా యూజ్ చేసేవారికి ఇది బెస్ట్ ఆప్షన్.

'గొడ్డలి' ముద్ర వైసిపి కొంప ముంచుతుందా?!

YSRCP Caste Politics
YSRCP Caste Politics

YSRCP political image issue: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది. ఆ పార్టీ ఎంత ఉవ్వెత్తున ఎగసిందో.. అదే స్థాయిలో వ్యతిరేక ప్రచారానికి బాధిత వర్గంగా మారింది. ముఖ్యంగా వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి ఆ పార్టీ సానుకూలత పొందింది. 2019 ఎన్నికల్లో సానుభూతి పనిచేసే ఆ పార్టీ విజయం సాధించింది. కానీ 2024 ఎన్నికలకు వచ్చేసరికి అదే ప్రతికూలతగా మారింది. వ్యతిరేక ప్రచారంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి దారుణ ఓటమి ఎదురయింది. అయితే ఇప్పుడు అదే అంశం 2029 ఎన్నికల వరకు సజీవంగా ఉంటే పార్టీకి నష్టం అని.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది.

ప్రజల్లోకి బలంగా..
ప్రధానంగా గొడ్డలి పార్టీ అనే మాట.. ఆ పార్టీ శ్రేణులను కలవరపాటుకు గురిచేస్తోంది. ప్రారంభంలో పెద్దగా సీరియస్ గా తీసుకోలేదు ఆ పార్టీ. కానీ క్రమేపి అది ప్రజల్లోకి వెళ్ళింది. జగన్మోహన్ రెడ్డి దీనిపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఎవరిదయ్యా గొడ్డలి పార్టీ అంటూ ప్రశ్నించారు. గన్ కల్చర్ అంటూ టిడిపి పై ఆరోపణ చేశారు. అదే విషయాన్ని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు శృతి పంచుకున్నారు. గన్ కల్చర్ అంటూ ఆరోపణలు చేశారు. కానీ వైసీపీకి గొడ్డలి పార్టీ అనే ముద్ర చాలా వేగంగా వెళ్ళిపోయింది. కానీ టిడిపికి గన్ కల్చర్ అనే పేరు పెద్దగా వర్కౌట్ కాలేదు. కచ్చితంగా ఇది ప్రభావం చూపుతోందన్న భయం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉంది. అందుకే గొడ్డలి పార్టీ అనే కామెంట్స్ ను సహించుకోలేకపోతున్నారు. సోషల్ మీడియాలో ఎవరైనా కామెంట్స్ చేస్తే తట్టుకోలేకపోతున్నారు.

అప్పట్లో రాజశేఖర్ రెడ్డి..
ఇప్పటికే గొడ్డలి పార్టీ అనే పేరు ప్రజల్లోకి బలంగా వెళ్ళిపోయింది. అంతలా ప్రత్యర్థి పార్టీకి చెందిన మీడియా సోషల్ మీడియా దీనిని బలంగా తీసుకెళ్లగలిగింది. వాస్తవానికి 2004 కంటే ముందే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వైయస్ రాజశేఖర్ రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టాలి. కానీ ఫ్యాక్షన్ ముద్ర రాజశేఖరరెడ్డిని ముఖ్యమంత్రి కాకుండా చేసింది. ఆ కుటుంబం పై అంతలా ప్రచారం అప్పట్లో నడిచింది. వైయస్ రాజారెడ్డి యాక్షన్ ముద్ర రాజశేఖర్ రెడ్డి హయాంలో కూడా ప్రభావం చూపింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఫ్యాక్షన్ ప్రచారం పతాక స్థాయికి చేరింది. అది కూడా జగన్ మోహన్ రెడ్డి స్వయంకృతాపమే. ఎందుకంటే ప్రెస్మీట్లో తన తాతను చంపిన వారిని సైతం తాను ఏం చేయలేదని చెప్పి ఆ తేనె తుట్టను కదిపారు. అయితే ఇప్పుడు గొడ్డలి పార్టీ అంటేనే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విలవిలలాడిపోతుంది.

తెల్ల మచ్చలు ఎలా ఏర్పడుతాయి.. ఈ సమస్య ఉన్నవారు ఏం చేయాలి..

vitiligo symptoms and treatment
vitiligo symptoms and treatment

Vitiligo Symptoms and Treatment: కొన్ని ఆహారపు అలవాట్లతో చర్మ సమస్యలు వస్తాయని చెబుతూ ఉంటారు. ముఖ్యంగా చేపలు తిన్న తరువాత పాలు తాగితే చర్మం తెల్ల మచ్చలు ఏర్పడుతాయని చెబుతారు. అయితే ఇవి కేవలం అలాంటి ఆహారం మాత్రమే తీసుకుంటే రాదు.శరీరంలోని మార్పులు, వాతావరణ పరిస్థితుల ఆధారంగా ఏర్పడుతూ ఉంటాయి. అయితే వీటిని Vitiligo అని అంటారు. ఇది ఒక దీర్ఘకాలిక చర్మ వ్యాధి. మన చర్మానికి రంగును ఇచ్చే మెలనిన్ అనే వర్ణ ద్రవ్యాన్ని ఉత్పత్తి చేసే మెలనోసైట్ కణాలు దెబ్బతినడం లేదా నాశనం కావడం వల్ల ఈ సమస్య వస్తుంది. దీంతో చర్మంలోని కొన్ని ప్రాంతాలు తమ సహజ రంగును కోల్పోయి తెల్లగా కనిపించడం ప్రారంభమవుతుంది. ఇది రావడానికి అసలు కారణాలు ఏవి?

విటిలిగో రావడానికి ఖచ్చితమైన ఒకే కారణం లేదని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఇది ప్రధానంగా ఆటో ఇమ్యూన్ సమస్యగా పరిగణించబడుతోంది. అంటే శరీర రోగనిరోధక వ్యవస్థ పొరపాటున మెలనిన్ ఉత్పత్తి చేసే కణాలపై దాడి చేస్తుంది. కుటుంబంలో ఎవరికైనా ఈ సమస్య ఉంటే జన్యుపరంగా కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా తీవ్రమైన మానసిక ఒత్తిడి, కొన్ని రసాయనాల ప్రభావం, చర్మ గాయాలు లేదా ఇతర ఆటో ఇమ్యూన్ వ్యాధులు కూడా దీనికి కారణమవుతాయని పరిశోధనలు సూచిస్తున్నాయి.

ఈ వ్యాధి ప్రారంభ దశలో చిన్న తెల్లటి మచ్చలు కనిపిస్తాయి. ఇవి క్రమంగా పెద్దవిగా మారవచ్చు లేదా శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపించవచ్చు. ముఖ్యంగా ముఖం, చేతులు, కాళ్లు, పెదవుల చుట్టూ, కళ్ల చుట్టూ, వేళ్ల వద్ద ఎక్కువగా కనిపిస్తాయి. కొందరిలో తల వెంట్రుకలు, కనుబొమ్మలు లేదా గడ్డం వెంట్రుకలు కూడా తెల్లబడవచ్చు.

ఇది అంటు వ్యాధేనా?
విటిలిగో గురించి సమాజంలో అనేక అపోహలు ఉన్నాయి. ముఖ్యంగా ఇది అంటువ్యాధి అని కొందరు భావిస్తుంటారు. కానీ అది పూర్తిగా తప్పు. విటిలిగో ఒక అంటువ్యాధి కాదు. ఒక వ్యక్తి నుంచి మరొకరికి స్పర్శ ద్వారా, కలిసి భోజనం చేయడం ద్వారా లేదా ఇతర మార్గాల్లో ఇది వ్యాపించదు. కాబట్టి విటిలిగో ఉన్నవారిని దూరంగా ఉంచాల్సిన అవసరం లేదు.

పూర్తిగా నివారించగలమా?
విటిలిగోను పూర్తిగా నివారించే నిర్దిష్ట మార్గం ప్రస్తుతం లేదు. ఎందుకంటే దీనికి సంబంధించిన ఖచ్చితమైన కారణాలు ఇంకా పూర్తిగా తెలియలేదు. అయితే ఆరోగ్యకరమైన జీవనశైలి, ఒత్తిడిని తగ్గించడం, చర్మాన్ని గాయాల నుంచి కాపాడుకోవడం, హానికర రసాయనాల నుంచి దూరంగా ఉండటం వంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ప్రమాదాన్ని కొంతవరకు తగ్గించవచ్చు.

సూర్యరశ్మి నుంచి రక్షణ అవసరం
విటిలిగో ఉన్న ప్రాంతాల్లో మెలనిన్ తక్కువగా ఉండటం వల్ల చర్మం సూర్యరశ్మికి ఎక్కువగా సున్నితంగా మారుతుంది. అందుకే బయటకు వెళ్లేటప్పుడు సన్‌స్క్రీన్ వాడటం, టోపీ లేదా పూర్తి చేతుల దుస్తులు ధరించడం మంచిది. ఇది చర్మాన్ని రక్షించడమే కాకుండా మచ్చలు మరింత స్పష్టంగా కనిపించకుండా కూడా సహాయపడుతుంది.

ఎలాంటి సమయంలో డెర్మటాలజిస్ట్‌ను సంప్రదించాలి?
చర్మంపై అకస్మాత్తుగా తెల్లటి మచ్చలు కనిపించడం ప్రారంభమైతే వెంటనే చర్మవ్యాధి నిపుణుడు (డెర్మటాలజిస్ట్)ను సంప్రదించాలి. మచ్చలు వేగంగా వ్యాపిస్తున్నా, వెంట్రుకలు తెల్లబడుతున్నా లేదా శరీరంలోని అనేక ప్రాంతాల్లో మార్పులు కనిపిస్తున్నా వైద్య సలహా అవసరం. ప్రారంభ దశలో చికిత్స ప్రారంభిస్తే వ్యాధి వ్యాప్తిని నియంత్రించే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

ఎక్కువగా ప్రయాణాలు చేసేవారికి సూపర్ ఫోన్.. ధర రూ.2 వేల లోపే..

Itel Aqua phone price in India
Itel Aqua phone price in India

Itel Aqua phone price in India: ప్రస్తుతానికి స్మార్ట్ ఫోన్ ల హవా సాగుతోంది. ఇలాంటి సమయంలో కీ ప్యాడ్ ఫోన్ గురించి చాలా తక్కువే. కానీ Itel కంపెనీ తాజాగా Aqua పేరుతో ఒక కొత్త కీ ప్యాడ్ ఫోన్ ను భారత్‌లో విడుదల చేసింది. దీనిని చూస్తే సాధారణ బడ్జెట్ ఫోన్ లాగే అనిపిస్తుంది. కానీ ఇది IP67 రేటింగ్ ను కలిగి ఉండడంతో Water and Dust Resistance తో వచ్చిన ప్రత్యేకమైన మోడల్‌గా కంపెనీ ప్రచారం చేస్తోంది. అయితే ఈ ఫోన్ ఎలా ఉంటుందో చూద్దాం..

బయట పని చేసే వారు, ప్రయాణాల్లో ఎక్కువగా ఫోన్ వాడేవారు, అలాగే రగ్గడ్‌గా ఉండే డివైస్ కోరుకునే వినియోగదారుల కోసం Aqua ఫోన్ను రూపొందించినట్లు తెలుస్తోంది. IP67 రేటింగ్ కారణంగా కొన్ని నివేదికల ప్రకారం.. 30 నిమిషాల వరకూ నీటిలో మునిగినా తట్టుకునేలా డిజైన్ చేశారు. Itel Aqua లో 2.4 అంగుళాల డిస్ ప్లే ఉంది, అలాగే 1,200mAh బ్యాటరీని కూడా అందించారు. దీనికి టైప్ C ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉండటం ఈ సెగ్మెంట్‌లో మంచి అదనపు ఫీచర్‌గా చెప్పొచ్చు.

ఇది కేవలం కాల్స్, మెసేజ్‌లకే పరిమితం కాదు. ఇందులో బ్లూటూత్ కనెక్టివిటీ, వైర్ లెస్ ఎఫ్ఎం రెడియో, ఆటో కాల్ రికార్డింగ్ వంటి సౌకర్యాలు ఉన్నాయి. అలాగే 32GB వరకు స్టోర్ చేసుకునే ఆప్షన్ ఉంది. ఇందులో ప్రత్యేకంగా AI Environmental Noise Cancellation (ENC) ఫీచర్‌ను కూడా ఇచ్చింది. దీని వల్ల మార్కెట్లు, బస్ స్టాండ్లు, రద్దీ ప్రదేశాల్లో మాట్లాడే సమయంలో బ్యాక్‌గ్రౌండ్ శబ్దం తగ్గి, కాల్ క్లారిటీ మెరుగుపడుతుంది. భాషా సపోర్ట్ పరంగా కూడా ఈ ఫోన్ ఆకర్షణీయమే, ఎందుకంటే ఇది 10 regional languages ను సపోర్ట్ చేస్తుంది. దీంతో విభిన్న భాషలు మాట్లాడే వినియోగదారులకు ఇది మరింత సులభంగా ఉపయోగించుకునేలా ఉంటుంది.

Blue, Red, Black రంగుల్లో ఈ ఫోన్‌ అందుబాటులో ఉంది. ధర విషయానికి వస్తే.. ఈ ఫోన్‌ను కంపెనీ భారత్‌లో రూ. 1,799 ధరకు విడుదల చేసింది. ప్రస్తుతం ఇది దేశవ్యాప్తంగా రిటైల్ స్టోర్ లో లభిస్తోంది.

పెళ్లికి ముందు.. అమ్మాయిలు అలా మారతారు.. ఇక్కడ ఇదో వింత

Mauritania marriage traditions
Mauritania marriage traditions

Mauritania marriage traditions: పెళ్లిని ఒక వేడుకలాగా మన ప్రాంతంలో జరుపుకుంటారు. భారీగా ఖర్చు పెడతారు. ముఖ్యంగా అమ్మాయిలు నాజుకుగా మారిపోతారు. అబ్బాయిలు కూడా అందంగా రెడీ అవుతారు. శరీర ఆకృతి సరిగా లేకపోతే.. జిమ్ లో రకరకాల కసరత్తులు చేస్తుంటారు. పూర్తిగా సౌష్టవాన్ని పొందుతుంటారు.. మనదేశంలో కాబోయే దంపతులు ఇలా మారిపోతే.. మౌరి టానియా దేశంలో మాత్రం పరిస్థితి ఇందుకు విరుద్ధంగా ఉంటుంది.

మౌరి టానియా దేశం ఆఫ్రికా ఖండంలో ఉంటుంది. ఇక్కడ పెళ్ళికి ముందు అమ్మాయిలు ఫ్యాట్ ఫార్మ్స్ కు వెళ్తుంటారు. దీని వెనక ఒక కారణం ఉంది. అమ్మాయిలకు పెళ్లి కావాలంటే ఖచ్చితంగా వారు లావు అవ్వాలి. అలా ఉంటేనే ఆ అమ్మాయి కుటుంబం సంపన్నంగా ఉందని అక్కడివారు భావిస్తుంటారు. అమ్మాయిలు బక్కగా ఉంటే.. లావు అవడానికి రకరకాల విధానాలు పాటిస్తారు. వారిని ఫ్యాట్ ఫార్మ్స్ కు పంపిస్తారు. అక్కడ అమ్మాయిలకు బలవంతమైన ఆహారం పెడతారు.. ఒంటె పాలు తాగిస్తారు. లావు అయిన తర్వాత వివాహం జరిపిస్తారు.

మౌరి టానియా దేశంలో లేబ్లే ఆచారంలో భాగంగా ఇక్కడి యువతులకు ఈ విధంగా చేస్తారు. తరతరాల నుంచి ఈ ఆచారం కొనసాగుతూ ఉంది. దీనివల్ల అమ్మాయిల శరీర సౌష్టవం పెరగడంతో పాటు.. వారి ఆరోగ్యం మెరుగుపడుతుందని ఇక్కడి పూర్వికులు చెబుతుంటారు. ఆడపిల్లలు తమ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి కల్పించిన గొప్ప అవకాశం అని అక్కడి వారు చెబుతుంటారు. ఆరోగ్యం మెరుగుపడితే ఆ ఇల్లు బాగుంటుందని.. ఆ అమ్మాయిలు జన్మనిచ్చే సంతానం ఆరోగ్యంగా ఉంటుందని అక్కడివారు నమ్ముతుంటారు. అందువల్లే ఆడపిల్లలకు ఒంటె పాలు.. డ్రై ఫ్రూట్స్.. ఇతర పదార్థాలు పెడుతుంటారు.

రక్తహీనత.. ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడే అమ్మాయిలకు ఫ్యాట్ ఫార్మ్స్ ఎంతగానో ఉపయోగపడతాయని ఇక్కడి వారు చెబుతుంటారు. శారీరక సౌష్టవాన్ని కలిగి ఉండడం ద్వారా ఆడపిల్లలు ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుంటారని.. తద్వారా వ్యాధులకు దూరంగా ఉంటారని ఇక్కడివారు చెబుతుంటారు.

భారత్‌కు గుడ్‌ న్యూస్‌.. ఇక చమురు, గ్యాస్‌ కష్టాలు తీరినట్టే!

India-Oman Trade Deal
India-Oman Trade Deal
India-Oman Trade Deal: అమెరికా–ఇరాన్‌ యుద్ధం, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, హార్ముజ్‌ జలసంధి మూసివేత కారణంగా భారత్‌ ఇంధన రంగం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. పెట్రోల్, డీజిల్, ఎల్‌పీజీ ధరలు భారీగా పెరిగి, సరఫరా కొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమయంలో కేంద్ర ప్రభుత్వానికి ఊరట లభించింది.

హార్ముజ్‌కు ప్రత్యామ్నాయం…
హార్ముజ్‌ జలసంధి ద్వారా ప్రపంచంలోని అత్యధిక చమురు, గ్యాస్‌ రవాణా జరుగుతుంది. ప్రస్తుత యుద్ధ పరిస్థితుల వల్ల నౌకల రవాణాలో అంతరాయం ఏర్పడటంతో భారత్‌కు ఇంధన సరఫరా దెబ్బతిన్నది. దీని ప్రభావంతో పెట్రోల్, ఎల్‌పీజీ ధరలు పెరిగాయి. సరఫరా కొరత ఏర్పడింది. పానిక్‌ బయింగ్‌ పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో భారత్‌కు ప్రత్యామ్నాయ మార్గం అవసరమైంది.

ఒమన్‌తో కీలక ఒప్పందం..
భారత్‌–ఒమన్‌ మధ్య కుదిరిన కాంప్రెహెన్సివ్‌ ఎకనామిక్‌ పార్టనర్‌షిప్‌ అగ్రిమెంట్‌ (సీఈపీఏ) 2025, జూన్‌ నుంచి అమలులోకి వచ్చింది. ఈ ఒప్పందం ద్వారా ఒమన్‌లోని ప్రధాన పోర్టులు (సలాలా, దుక్మ్‌ వంటివి) ద్వారా భారత్‌కు చమురు, ఎల్‌ఎన్‌జీ, ఇతర ఇంధన ఉత్పత్తులు ఎలాంటి అంతరాయం లేకుండా సరఫరా అవుతాయి. ఒమన్‌ తీర ప్రాంతం హార్ముజ్‌ జలసంధికి వెలుపల ఉండటం ఈ ఒప్పందాన్ని వ్యూహాత్మకంగా చాలా ముఖ్యమైనదిగా మార్చింది. ఇది భారత్‌కు సురక్షితమైన, నమ్మదగిన ఇంధన సరఫరా మార్గాన్ని అందిస్తోంది.

భారత్‌కు చాలా కీలకం..
ఒమన్‌తో ఒప్పందం కారణంగా హార్ముజ్‌పై అత్యధిక ఆధారపడటం తగ్గుతుంది. పెట్రోల్, ఎల్‌పీజీ, డీజిల్‌ సరఫరా స్థిరంగా ఉంటుంది. ధరల పెరుగుదల నియంత్రణలో ఉంటుంది. ప్రజల ఆందోళన తగ్గి, సాధారణ సరఫరా పరిస్థితి ఏర్పడుతుంది.ఈ ఒప్పందం కేవలం తాత్కాలిక పరిష్కారం కాదు. దీర్ఘకాలికంగా భారత్‌ ఇంధన దిగుమతులను వైవిధ్యపరచడంలో, సప్లై చైన్‌ను బలోపేతం చేయడంలో మైలురాయిగా నిలుస్తుంది.

ప్రస్తుత భూరాజకీయ పరిస్థితులు ఏ సమయంలోనైనా హార్ముజ్‌ జలసంధిని ప్రభావితం చేసే అవకాశం ఉంది. అలాంటి సమయంలో ఒమన్‌ లాంటి స్నేహపూర్వక దేశంతో బలమైన వాణిజ్య – ఇంధన భాగస్వామ్యం ఏర్పాటు చేసుకోవడం భారత్‌ దూరదృష్టి, వ్యూహాత్మక విజ్ఞతను చూపిస్తోంది. ఇది భారత్‌ ఇంధన భద్రతలో కొత్త అధ్యాయం.

నేను చనిపోయేవరకు ఆ పని చేస్తూనే ఉంటా అంటూ రామ్ చరణ్ ఎమోషనల్ కామెంట్స్..

Ram Charan emotional comments
Ram Charan emotional comments

Ram Charan emotional comments: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరో గా నటంచిన ‘పెద్ది’ చిత్రం ఎట్టకేలకు మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీంతో కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, నార్త్ ఇండియా లో కూడా ప్రస్తుతం ‘పెద్ది’ మేనియా నే కనిపిస్తుంది. ముఖ్యంగా సోషల్ మీడియా ని రామ్ చరణ్ ఫ్యాన్స్ కబ్జా చేసేసారు. ఈ సందర్భంగా ఈ సినిమా హైప్ కి మరింత బూస్టింగ్ ఇస్తూ , నిన్న విజయవాడ లో ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరిగింది. ఈ ఈవెంట్ కి అభిమానులు వేలాదిగా తరళి వచ్చి విజయవంతం చేశారు. ఒక్క మాట లో చెప్పాలంటే విజయవాడ ని షేక్ చేసి వదిలిపెట్టారు. ఈ ఈవెంట్ లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన కెరీర్ లోనే ది బెస్ట్ స్పీచ్ ఇవ్వగా, అది ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.

ఆయన మాట్లాడుతూ ‘చాలా మంది పెద్ది సినిమా కోసం నేను చాలా కష్టపడ్డాను అని అంటున్నారు. ఇలాంటి కథలు వచ్చినప్పుడు కష్టపడకపోతే , ఇంకెప్పుడు కష్టపడుతాం చెప్పండి. బుచ్చి బాబు ఈ సినిమా స్టోరీ మొత్తాన్ని నాకు వినిపించినప్పుడు నాకు గూస్ బంప్స్ వచ్చాయి. ఎందుకంటే ఇలాంటి కథతో ఇప్పుడు వరకు సినిమాలే రాలేదు. నా కెరీర్ లోనే ఇది ది బెస్ట్ సినిమా అవుతుంది. మీ అందరికీ మరో ముఖ్యమైన విషయం చెప్తున్నాను , రాసి పెట్టుకోండి, ఈ సినిమా తర్వాత డైరెక్టర్ బుచ్చి బాబు టాప్ 3 ఇండియన్ డైరెక్టర్స్ లో ఒకరిగా నిలిచిపోతారు , ఆ స్థాయి కెపాసిటీ ని నేను అతనిలో గమనించాను’ అంటూ చెప్పుకొచ్చాడు రామ్ చరణ్. ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గానే నార్త్ ఇండియా లోని భోపాల్ ఈవెంట్ లో రామ్ చరణ్ స్పీచ్ పై ఏ రేంజ్ లో ట్రోల్స్ వచ్చాయో మనమంతా చూశాము .

క్రికెటర్ బుమ్రా ని పట్టుకొని ఫుట్ బాల్ ప్లేయర్ అనడం పెద్ద సెన్సేషనల్ టాపిక్ గా నిల్చింది. అయితే ఈ ఈవెంట్ మీద వచ్చిన ట్రోల్స్ ని రామ్ చరణ్ బాగా గమనించినట్టు ఉన్నాడు. అందుకే ‘ఈసారి నేను ఎవరి పేరు మర్చిపోలేదు కదా’ అంటూ ఫన్నీ సెటైర్లు విసిరాడు. అంతే కాకుండా ఆయన చివర్లో మాట్లాడిన మాటలు అభిమానులను చాలా ఎమోషనల్ కి గురి చేసింది. ఆయన మాట్లాడుతూ ‘నాన్న గారు , బాబాయ్ కళ్యాణ్ గారు ఈ ఇండస్ట్రీ లో ఉన్నందుకు నేను సినిమా కోసమే బ్రతుకుతాను. నాకు సినిమా తప్ప మరొకటి తెలీదు. సినిమా , సినిమా , మిమ్మల్ని నేను చనిపోయే వరకు ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాను ‘ అంటూ రామ్ చరణ్ మాట్లాడిన ఈ మాటలు అభిమానుల చేత కంటతడి పెట్టించేలా చేశాయి.

విజయ్ దేవరకొండ, నాని ఇద్దరిలో రజినీకాంత్ ఎవరితో పోటీ పడుతున్నాడు..

Vijay Deverakonda and Nani
Vijay Deverakonda and Nani

Vijay Deverakonda and Nani: రజినీకాంత్ హీరోగా నెల్సన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘జైలర్ 2’ సినిమా ప్రేక్షకుల్లో మంచి అంచనాలను మూటగట్టుకుంది. ఇక వీళ్లిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘జైలర్’ మొదటి పార్ట్ భారీ విజయాన్ని సాధించడంతో రెండో పార్ట్ మీద అంచనాలు తారా స్థాయికి వెళ్లిపోయాయి. ఇక ఈ సినిమా అనుకున్న టైమ్ కి ప్రేక్షకుల ముందుకు వస్తుందా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. అయితే ఆగస్టులో ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తుందని గతంలో దర్శకనిర్మాతలైతే క్లారిటీ ఇచ్చారు. కానీ ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ కాస్త బ్యాలెన్స్ ఉందని అది పూర్తయిన తర్వాత రెండు నెలల పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా చేయాల్సి ఉంటుందనే ఉద్దేశ్యంతోనే వాళ్లయితే వాళ్ల సమాధానాన్ని చెబుతున్నారు.

ఇక ఈ మధ్యకాలంలోనే ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో అంచనాలు కొద్దికొద్దిగా తగ్గిపోతున్నాయి. కారణం ఏంటి అంటే ఈ సినిమా నుంచి ఇప్పటివరకు ఒక టీజర్ ని కూడా రిలీజ్ చేయలేదు. దాంతో అసలు ఈ సినిమా ఉందా లేదా అనే సందిగ్ధ పరిస్థితిలో కూడా ప్రేక్షకులైతే ఉన్నారు. ఇక వీలైనంత తొందరగా ఈ సినిమా మీద ప్రమోషన్స్ చేయ అవసరమైతే ఉంది.

ఇక ఆగస్టు నెలలో ఇప్పటికే ‘ప్యారడైజ్’ సినిమా రిలీజ్ అవ్వనున్న నేపథ్యంలో ‘జైలర్ 2’ సినిమా కూడా అదే నెలలో వస్తుందా లేదంటే పోస్ట్ పోన్ చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అనే ధోరణిలో కూడా కొన్ని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక సినిమా యూనిట్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా సెప్టెంబర్ నెలలో రిలీజ్ కి రెడీ అవ్వబోతుందనే వార్తలు కూడా వస్తున్నాయి.

ఇక సెప్టెంబర్ లో విజయ్ దేవరకొండ చేస్తున్న ‘రణబాలి’ అనే సినిమా కూడా రిలీజ్ కి రెడీ అవుతుంది. కాబట్టి ఈ రెండింటి మధ్య తీవ్రమైన పోటీ ఉండబోతుంది… ఇక వీటిలో ఏ సినిమా పై చేయి సాధిస్తుంది అనేది కూడా తెలియాల్సి ఉంది…

తెలంగాణ నిరుద్యోగ యువతకు గుడ్‌ న్యూస్‌.. ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు!

Telangana Jobs Notification 2026
Telangana Jobs Notification 2026

Telangana Jobs Notification 2026: తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి 12 ఏళ్లు పూర్తయింది. జూన్‌ 2న ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణ యువత, ముఖ్యంగా నిరుద్యోగులైన ఇంజినీర్లు, గ్రాడ్యుయేట్లు, విద్యా, పర్యావరణ, అటవీ శాఖల్లో ఉద్యోగాలు భర్తీ చేయాలని ప్రబుత్వం నిర్ణయించింది.

ఆవిర్భావ వేడుకల్లో కీలక ప్రకటన..
సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ రెడ్డి ప్రసంగించారు. రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు గుడ్‌ న్యూస్‌ చెప్పారు. తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీజీపీఎస్‌సీ) ద్వారా ఈ నెలలోనే ఇంజినీరింగ్, పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు, టౌన్‌ ప్లానింగ్, అటవీశాఖ, విద్యాశాఖల్లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

నోటిఫికేషన్లు నిరంతరం జారీ..
సీఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ, ‘‘నోటిఫికేషన్ల జారీ ప్రక్రియ నిరంతరం జరుగుతుంది’’ అని స్పష్టం చేశారు. ఒకేసారి ఒక్క నోటిఫికేషన్‌కు పరిమితం కాకుండా, వివిధ శాఖల్లో ఖాళీలు గుర్తించి వరుసగా నోటిఫికేషన్లు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోందని తెలిపారు. ఇది యువతకు స్థిరమైన ఉపాధి అవకాశాలను సృష్టించడంలో ముఖ్యమైన అడుగు.

ఏ శాఖల్లో ఎలాంటి అవకాశాలు?
ఇంజినీరింగ్‌ శాఖలో సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్‌ వంటి విభాగాల్లో టెక్నికల్‌ పోస్టులు ఉన్నాయి. తెలంగాణ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డులో పర్యావరణ రక్షణ, కాలుష్య నియంత్రణకు సంబంధించిన సైంటిఫిక్, టెక్నికల్‌ పోస్టులు ఉన్నాయి. టౌన్‌ ప్లానింగ్‌లో నగరాభివృద్ధి, అర్బన్‌ ప్లానింగ్‌ పోస్టులు ఉన్నాయి. ఇక అటవీశాఖలో అటవీ సంరక్షణ, వన్యప్రాణి సంరక్షణ, ఇకో–టూరిజం సంబంధిత పోస్టులు ఖాళీగా ఉన్నాయి. విద్యాశాఖలో ఉపాధ్యాయులు, లెక్చరర్లు వంటి విద్యా రంగ పోస్టులు భర్తీ చేసే అవకాశం ఉంది.

తెలంగాణలో నిరుద్యోగం యువతను వేధిస్తున్న ప్రధాన సమస్య. డిగ్రీ, ఇంజినీరింగ్‌ పూర్తి చేసిన లక్షలాది మంది ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్‌ ప్రకటనతో నిరుద్యోగుల్లో ఆశలు చిగురింపజేసింది. ఉద్యోగాల భర్తీ ద్వారా యువతలో ఆత్మవిశ్వాసం పెరిగి, రాష్ట్ర అభివృద్ధిలో వారి భాగస్వామ్యం పెరుగుతుంది.

అవంతిక.. నీలుక్స్ కేక..

Avantika Vandanapu Instagram
Avantika Vandanapu Instagram