Pawan Kalyan: ఇప్పుడంటే జగన్ గులాబీ పార్టీకి దగ్గర మిత్రుడు అయిపోయాడు. 2024లో జరిగే ఎన్నికల్లో ఏపీలో జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తారని కెసిఆర్ కూడా చెప్పారు. అక్కడిదాకా ఎందుకు జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తుంటే ఆ కార్యక్రమానికి కేసీఆర్ కూడా వెళ్లారు. ఆయనను ప్రగతి భవన్ కు ఆహ్వానించారు. అప్పట్లో కాలేశ్వరం ఎత్తిపోతల పథకం ప్రారంభానికి జగన్ ను కెసిఆర్ ఆహ్వానించారు.
జగన్ మీడియాలో కేసీఆర్ గురించి.. కెసిఆర్ మీడియాలో జగన్ గురించి ఒక్క నెగిటివ్ వార్త కూడా రాదు. పైగా ఆ మధ్య బెంగళూరులో కేటీఆర్.. జగన్ ఓ ప్రైవేట్ కార్యక్రమంలో కలుసుకున్నారు. ఇద్దరు చాలాసేపు మాట్లాడుకున్నారు. సోషల్ మీడియాలో కూడా గులాబీ పార్టీకి వైసిపి.. వైసీపీకి గులాబీ పార్టీ సోషల్ మీడియా హ్యాండిల్స్ సహకరిస్తుంటాయి. పైగా ఒకరి ఫీడ్ మరొకరు షేర్ చేసుకుంటారు. సయామి కవలల మాదిరిగా సాగిపోతున్న గులాబీ పార్టీ, వైసిపి బంధానికి పవన్ కళ్యాణ్ తెలంగాణ గడ్డ మీద నుంచి గట్టి షాక్ ఇచ్చారు.
పవన్ కళ్యాణ్ ను ఆంధ్ర నేత అంటూ నమస్తే తెలంగాణ ఒక కథనాన్ని మంగళవారం పబ్లిష్ చేసింది. ఈ నేపథ్యంలో కొంతమంది ఔత్సాహికులు పవన్ కళ్యాణ్.. కేటీఆర్ గతంలో దిగిన ఫోటోలను.. వారిద్దరూ మాట్లాడుకుంటున్న వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో గులాబీ పార్టీ మీడియా అసలు రంగు బయటపడింది. ఇక పవన్ కళ్యాణ్ తన ఇంటి వద్ద నుంచి జరిగిన విలేకరుల సమావేశంలో ఆవేశంగా మాట్లాడారు. ముఖ్యంగా తెలంగాణ విషయంలో వైఎస్ఆర్ పోషించిన పాత్ర గురించి స్పష్టంగా చెప్పేశారు. ఈ మధ్య కాలంలో వైఎస్ఆర్ గురించి గులాబీ మీడియా.. గులాబీ పార్టీ నాయకులు సానుకూలంగా మాట్లాడుతున్నారు. అంతకుముందు కేసీఆర్ కూడా వైఎస్ఆర్ గురించి గొప్పగానే మాట్లాడారు. తెలంగాణకు బద్ధ శత్రువు వైఎస్ఆర్ అన్నట్టుగా పవన్ కళ్యాణ్ మాట్లాడారు.
వైయస్ బతికున్నప్పుడు చాలామంది తెలంగాణవాదులు నోరు మెదపలేదని.. నాడు తెలంగాణని వ్యతిరేకించిన వాళ్లంతా ఇప్పుడు పదవుల్లో ఉన్నారని.. వైయస్సార్ బతికి ఉన్నప్పుడు వారంతా తెలంగాణ నినాదాన్ని కూడా సహించేవారు కాదని పవన్ కళ్యాణ్ చెప్పారు. దీంతో పవన్ కళ్యాణ్ మీద విష ప్రచారం చేస్తున్న వైసీపీకి.. వైసిపి మీడియాకు జనసేన అధినేత షాకిచ్చారు. తెలంగాణ ఉద్యమం సాగుతున్నప్పుడు వైయస్సార్ ఎలా వ్యవహరించారు.. ఎలా ఉద్యమాన్ని తొక్కిపెట్టారు అనే విషయాన్ని కూడా పవన్ కళ్యాణ్ గట్టిగానే ఉదహరించారు.. దీంతో వైసీపీ నేతలకు షాక్ తగిలింది. అంతేకాదు ఇటీవల ఓ వైసీపీ ఎమ్మెల్యే చేసిన భూ కుంభకోణం కూడా వెలుగులోకి వచ్చింది. దీంతో ఏదో హంగామా చేద్దామని అనుకున్న వైసీపీ మీడియాకు.. వైసిపి నాయకులకు ఆదిలోనే బ్రేక్ వేశారు పవన్ కళ్యాణ్. అదే కాదు తెలంగాణ సెంటిమెంట్ రగిలించే ప్రయత్నం చేస్తున్న నమస్తే తెలంగాణకు కూడా దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు పవన్ కళ్యాణ్.
















నాకు ఆంధ్రా లోనే దిక్కులేదు.. తెలంగాణకు ముఖ్యమంత్రి అవుతానా..
Pawan Kalyan Telangana Politics: రాజకీయ నాయకులకు కొన్ని విషయాలు చెప్పాలంటే ధైర్యం ఉండాలి. అలాంటి ధైర్యం రాజకీయ నాయకులు నేటి కాలంలో పెద్దగా కనిపించడం లేదు. కానీ ఈ జాబితాలో పవన్ కళ్యాణ్ మాత్రం పూర్తి విభిన్నం. ఎందుకంటే ఆయన రాజకీయ నాయకుడిగా కంటే కూడా.. సామాజిక బాధ్యత ఉన్న పౌరుడిగా కనిపిస్తుంటారు. అందువల్లే ఆయన మొహమాటం లేకుండా మాట్లాడుతుంటారు. ముక్కుసూటిగా వ్యవహరిస్తూ ఉంటారు. తాజాగా తెలంగాణలో తన ఇంట్లో జరిగిన విలేకరుల సమావేశంలో పవన్ కళ్యాణ్ చాలా ఆవేశంగా మాట్లాడారు. తెలంగాణ పునర్ నిర్మాణ సభకు కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడం.. హైకోర్టులో కూడా సానుకూల తీర్పు రాకపోవడంతో పవన్ కళ్యాణ్ నేరుగా తన ఇంటి నుంచి విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
పవన్ కళ్యాణ్ అంటేనే ఆవేశం ఉంటుంది. దాని వెనక ఆలోచన కూడా ఉంటుంది. ఈసారి ఆవేశాన్ని, ఆలోచనను ఏకకాలంలో మిలితం చేసి ఆయన మాట్లాడారు. తన మీద వస్తున్న ఆరోపణలకు.. విమర్శలకు సమర్థవంతంగా సమాధానం చెప్పారు. అంతేకాదు, తెలంగాణలో జనసేన పోటీ ఎందుకు చేయాలి.. ఎందుకు ప్రశ్నించాలి.. సమర్థవంతమైన ప్రభుత్వాన్ని ఎందుకు ఎన్నుకోవాలి అనే విషయాలు మీద పవన్ కళ్యాణ్ చాలా క్లారిటీ ఇచ్చారు. విలేకరులు అడిగిన ప్రతి ప్రశ్నకు ఆయన సావధానంగా సమాధానం చెప్పారు. అంతేకాదు నేషనల్ మీడియా కూడా కొన్ని ప్రశ్నలు అడిగితే.. వాటికి కూడా సాలిడ్ ఆన్సర్ ఇచ్చేశారు.
ముఖ్యమంత్రి ఎందుకు అవుతాను
తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ప్రవేశించడానికి కేవలం అధికారం కోసం మాత్రమే కాదని.. ప్రజల సమస్యలు పరిష్కరించడానికి జనసేన తెలంగాణలో పోటీ చేస్తుందని పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చారు. కెసిఆర్ ఆంధ్రప్రదేశ్లో భారత రాష్ట్ర సమితి కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తే తాము స్వాగతించామని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. “అందరూ మహారాష్ట్ర వెళ్లొచ్చు. పంజాబ్ కూడా వెళ్ళవచ్చు. కానీ జనసేన తెలంగాణలో ఎందుకు అడుగు పెట్టకూడదు.. తెలంగాణ ఏమైనా మీ అయ్యా జాగిర.. తెలంగాణ ఏమైనా నిషిద్ధ ప్రాంతమా.. తెలంగాణలో ఏం కోరుకుంటాం.. నేను ఇక్కడ ముఖ్యమంత్రి ఎందుకు అవుతాను.. నాకు ఆంధ్రాలోనే దిక్కులేదు.. ఇక్కడ నేను ముఖ్యమంత్రి ఎందుకు అవుతాను. తెలంగాణ ప్రజలను చైతన్యవంతులను చేస్తామని ఇక్కడి వారి బయపడుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీకి లక్ష మంది కూడా లేరు. రెండువేల మందితో సభ పెట్టుకుంటే అనుమతి ఎందుకు ఇవ్వరు అంటూ” పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు.
పవన్ కళ్యాణ్ ప్రశ్నించిన ప్రతి మాటలోనూ క్లారిటీ ఉంది.. కేవలం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అనవసరమైన రాద్ధాంతం చేసింది.. కాంగ్రెస్ ఒక జాతీయ పార్టీ. అని రాష్ట్రాలలో ఆ పార్టీ రాజకీయాలు చేస్తోంది. అలాంటప్పుడు తెలంగాణలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అడుగుపెడితే ఆ పార్టీకి వచ్చిన ఇబ్బంది ఏంటి.. త్వరలో జరిగే జిహెచ్ఎంసి ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తే తమకు ఇబ్బంది అవుతుందని కాంగ్రెస్ నేతలు భయపడుతున్నారా.. అందువల్లే ఇలా జనసేన పార్టీ సభకు అడ్డంకులు సృష్టిస్తున్నారా.. అని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు పొన్నం ప్రభాకర్.. దానం నాగేందర్.. కల్వకుంట్ల కవిత.. పాశం యాదగిరి లాంటి వారంతా కూడా విమర్శలు చేయడం ఇక్కడ విశేషం. వారందరికీ కూడా పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా క్లారిటీ ఇచ్చారు. మొత్తానికి తెలంగాణ ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందని పవన్ కళ్యాణ్ విలేకరుల సమావేశం వేదికగా చెప్పేశారు.