Today 6 June 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారం ద్వాదశరాసులపై ధనిష్ట నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఈరోజు అద్భుతమైన లాభాలు ఉండనున్నాయి. మరి కొన్ని రాశుల వారు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.
మేష రాశి (అశ్విని, భరణి,1,2,): ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపారులకు కొందరు సపోర్టు ఇవ్వడంతో అధిక లాభాలు రానున్నాయి. ఉద్యోగులకు అధికారుల మద్దతు ఉంటుంది. దీంతో కొందరికి పదోన్నతి వచ్చే అవకాశం ఉంది. మరికొందరికి అదనపు ఆదాయం చేకూరుతుంది. విద్యార్థుల పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారు ఈరోజు పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. విద్యార్థులు కొత్త కోర్సుల్లో జాయిన్ అయ్యే అవకాశం ఉంది. ఆర్థికంగా మెరుగైన ఫలితాలు ఉంటాయి. దూర ప్రయాణాలు చేయాల్సివస్తే జాగ్రత్తగా ఉండాలి. కురుమ జీవితం సంతోషంగా ఉంటుంది. కష్టానికి తగిన ఫలితాన్ని పొందుతారు. డబ్బు ప్రవాహం పెరుగుతుంది.
మిథున రాశి( మృగశిర 3,4 ): ఈ రాశి వారికి ఈ రోజు అన్ని శుభ ఫలితాలే ఉంటాయి. లక్ష్మీదేవి ఆశీస్సులతో కొన్ని పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. పిల్లల కెరీర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. అనుకోకుండా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. స్నేహితుల సహకారంతో అప్పులను తీరుస్తారు.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారికి ఈరోజు అన్నీ కలిసి వస్తాయి. వ్యాపారులకు గతంలో కంటే ఇప్పుడు అధిక లాభాలు ఉంటాయి. కొందరు విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే కష్టంగా విజయం సాధించే అవకాశం ఉంటుంది. సన్నిహితుల నుంచి కీలకమైన సమాచారాన్ని అందుకుంటారు. విదేశాల్లో ఉండే వారితో వ్యాపారం చేసే వారికి అనుకూలమైన వాతావరణం ఉంటుంది.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారికి ఈ రోజు స్నేహితులు ధన సహాయం చేస్తారు. అయితే ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. రాజకీయాల్లో ఉండే వారికి ప్రజల నుంచి పదోన్నతులు ఉండే అవకాశం ఉంది. ప్రియమైన వారికి కావాల్సిన వస్తువులను కొనుగోలు చేస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారు ఈ రోజు జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. శని దేవుడు ఆశీస్సులు ఉండడంతో అన్ని శుభ ఫలితాలే ఉంటాయి. పెండింగు పనులను పూర్తి చేస్తారు. కొత్త విషయాలపై ఆసక్తిగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారు ఈ రోజు సమాజంలో గౌరవం పొందుతారు. ఖర్చులు గలనీయంగా పెరిగే అవకాశం ఉంది. పెద్దల ఆశీస్సులతో కొత్తగా పెట్టుబడును పెడతారు. కొన్ని దోషాల నుంచి విముక్తి పొందడంతో జీవితం సంతోషంగా సాగుతుంది. పెద్దల ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సివస్తుంది.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వ్యాపారులకు ఈరోజు మెరుగైన ఫలితాలు ఉంటాయి. గతంలో చేపట్టిన పనులన్నీ ఒకే సమయంలో పూర్తి చేస్తారు. కష్టానికి తగిన ఫలితం ఉంటుంది. సన్నిహితుల నుంచి కీలకమైన సమాచారం అందుతుంది. విద్యార్థులు గురువుల మద్దతుతో పోటీ పరీక్షలో పాల్గొనడానికి సిద్ధమవుతారు. పెద్దల అండదండలతో వ్యాపారులకు లాభాలు ఉంటాయి.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వ్యాపారులకు ఈరోజు అన్ని విజయాలే ఉంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనుకోకుండా ఖర్చులు పెరిగే అవకాశం ఉంటే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక కార్యకలాపాలపై ఆసక్తి పెరుగుతుంది. స్నేహితులతో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. శని దేవుడి అండదండలతో కొన్ని పనులు పూర్తి అవుతాయి.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారు ఈ రోజు మెరుగైన ఫలితాలు సాధిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. తోటి ఉద్యోగుల సహకారంతో ముఖ్యమైన ప్రాజెక్టులను పూర్తి చేస్తారు. దూర ప్రయాణాలు చేసే వారు జాగ్రత్తగా ఉండాలి. పెట్టుబడుల విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉండకూడదు.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కొన్ని ముఖ్యమైన పనులను పూర్తి చేయడానికి స్నేహితుల సహకారం తీసుకుంటారు. ప్రియమైన వారితో కలిసి ఉంటారు. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కొత్త వస్తువులు కొనుగోలు చేసే విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. కొందరు పక్కనే ఉండి మోసం చేసే అవకాశం ఉంటుంది.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారి ఆరోగ్య విషయంలో ఈరోజు మెరుగైన ఫలితాలు ఉంటాయి. ప్రియమైన వారికోసం కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. పెండింగ్ పల్లెలు పూర్తి చేస్తారు. ఎవరికైనా డబ్బు ఇచ్చే విషయంలో ఆలోచించాలి. వ్యాపారులకు గతంలో కంటే ఇప్పుడు లాభాలు ఎక్కువగా ఉంటాయి.
: కాళేశ్వరమే కాదు.. ఈ పథకం కూడా కేసీఆర్ మీద కాసులు కురిపించిందట.. రేవంత్ చెప్పిన నిజం..
Revanth Reddy Allegations: రేవంత్ రెడ్డి మరో బాంబు పేల్చారు. ముఖ్యమంత్రి హోదాలో తన సొంత జిల్లాలో పర్యటించిన ఆయన ఈసారి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను లక్ష్యంగా చేసుకున్నారు. కెసిఆర్ చేసిన దోపిడి గురించి.. వెనకేసుకున్న పైసల గురించి.. ఉమ్మడి పాలమూరు జిల్లాకు చేసిన అన్యాయం గురించి స్పష్టంగా చెప్పారు.
తెలంగాణ రాష్ట్రంలోనే కరువు జిల్లాగా పేరుపొందింది ఉమ్మడి పాలమూరు. ముఖ్యమంత్రి సొంత జిల్లా కూడా ఇదే. ఈ జిల్లా నుంచి తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు కేసీఆర్ పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఆయన ఎంపీగా ఉన్నప్పుడు పాలమూరు జిల్లాను పట్టించుకోలేదని రేవంత్ రెడ్డి పదేపదే ఆరోపిస్తూ ఉంటారు. ఇప్పుడు ఒక అడుగు ముందుకేసి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పాలమూరు జిల్లాకు కేసిఆర్ ఏమి చేయలేదని.. పాలమూరు జిల్లాలో మరింత వెనక్కి నెట్టారని రేవంత్ ఆరోపిస్తున్నారు.
ముఖ్యమంత్రి హోదాలో ఉమ్మడి పాలమూరు జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులను పరిశీలిస్తున్నారు రేవంత్ రెడ్డి. రెండవ రోజు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం పనులను ఆయన దగ్గరుండి పరిశీలించారు. కరివేన రిజర్వాయర్ వద్ద నిర్వహించిన మీడియా సమావేశంలో రేవంత్ కీలక విషయాలను బయటపెట్టారు.
“ఉమ్మడి పాలమూరు వెనుకబడిపోయింది. ముఖ్యంగా ఈ జిల్లాలో గత ప్రభుత్వం ఏ ప్రాజెక్టును కూడా పట్టించుకోలేదు. జూరాల మినహా మిగతా అన్ని ప్రాజెక్టులు వెనుకబడి ఉన్నాయి. కనీసం భూసేకరణ కూడా చేయలేదు.. పంపులు, లిఫ్ట్ పనుల్లో విపరీతమైన అవినీతి చోటు చేసుకుంది. ఈ అవినీతి వ్యతిరేకంగా అప్పట్లో నాగార్జున రెడ్డి సంవత్సరాల తరబడి పోరాటం చేశారు.. నేను నా జిల్లాను బాగు చేసుకోవాలని పరితపిస్తున్నాను. వారేమో నన్ను ఇబ్బంది పెడుతున్నారు.. పనులు ఎలా పూర్తి చేయాలో నాకు తెలుసు అని” రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పాలమూరు రంగారెడ్డి పథకాన్ని పట్టించుకోలేదని రేవంత్ ఆరోపించారు. ఒకవేళ ఈ పథకం గనుక పూర్తయితే 26 లక్షల ఎకరాలకు నీరు వచ్చేది. 27 వేల కోట్లు ఖర్చు చేసి పంపులు, లిఫ్ట్ పనులు పూర్తి చేశారు. ఈ పనుల వల్ల కేసీఆర్ దండిగా తన ఖజానా మొత్తాన్ని నింపుకున్నారు. కమిషనర్ల పేరుతో వేల కోట్లు మళ్లించుకున్నారు. ఒక ఎకరానికి కూడా నీరు ఇవ్వలేదు. ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ కూడా పూర్తి చేయలేదు.. ప్రాజెక్టులు పూర్తయినట్టు కేసీఆర్ మాత్రం చెబుతున్నారని రేవంత్ ఆరోపించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 22 వేల కోట్లు ఖర్చు చేసింది. ఇందులో ఉమ్మడి పాలమూరు జిల్లాకు 8 వేల కోట్లు ఇచ్చింది. ఈ ప్రాజెక్టులు పూర్తి కావాలంటే ఇంకా 4000 ఎకరాల భూమి అవసరం. భూసేకరణ జరపకుండా రిజర్వాయర్లలో నీళ్ళు నింపడం దాదాపు అసాధ్యం. పైగా ఇప్పుడు ప్రాజెక్టు నిర్మాణానికి కొత్తగా అప్పుడు కూడా పుట్టడం లేదు. పాలమూరు రంగారెడ్డి పథకానికి 55 వేల కోట్లు అవసరమవుతాయని అంచనా. అయితే ఇప్పటివరకు 27 వేల కోట్లు మాత్రమే ఖర్చయింది. 50% నిధులు కూడా ఖర్చు చేయకుండా, 90% పనులు పూర్తి చేయడం సాధ్యం కాదు.. పైగా తనపై కోపంతో మక్తల్ నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం ను కెసిఆర్ పక్కన పెట్టారని రేవంత్ ఆరోపించారు.