Home Blog Page 182

పవన్ ఓ జి సినిమాతో మహిళకు ఆపరేషన్!

Woman Surgery While Watching OG
Woman Surgery While Watching OG

Woman Surgery While Watching OG: ఇటీవల వైద్యులు ఆపరేషన్లను వినూత్న పద్ధతుల్లో నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా మెదడుకు సంబంధించిన వ్యాధులకు ఆపరేషన్లు చేసే సమయంలో రోగులు మెలకువగా ఉండాలి. అందుకే తమకు ఇష్టమైన సినిమాలను ప్రదర్శించడం.. వాటిని చూపించి ఆపరేషన్ చేయడం వంటివి చేస్తున్నారు. తాజాగా గుంటూరులో కూడా ఇలానే ఓ మహిళకు ఆపరేషన్ చేశారు. తన అభిమాన నటుడు నటించిన సినిమాను ఆపరేషన్ థియేటర్లో ప్రదర్శించి చికిత్స చేశారు. ఆపరేషన్ విజయవంతం కావడంతో ఊపిరి పీల్చుకున్నారు.

* నిరుపేద మహిళ..
ప్రకాశం జిల్లా దర్శి ప్రాంతానికి చెందిన గనిపిశెట్టి రాఘవులు, కోటేశ్వరమ్మ దంపతులు గుంటూరు జిల్లా పొన్నూరులో నివాసం ఉంటున్నారు. వారికి కిచిడీ షాపు ఉంది. అయితే ఇటీవల కోటేశ్వరమ్మ అనారోగ్యానికి గురయ్యారు. మూర్ఛ వ్యాధితో అస్వస్థతకు గురయ్యారు. వెంటనే కుటుంబ సభ్యులు వడ్లమూడి లోని డివిసి ఆసుపత్రిలో చేర్చారు. వెంటనే అక్కడ వైద్యులు స్కాన్ చేసి ఆమె తలలో రక్తం గడ్డకట్టి ఉండడాన్ని గుర్తించారు. ఆపరేషన్ చేయాలని కూడా నిర్ణయించారు. కానీ ఎటువంటి మత్తుమందు ఇవ్వకుండా మెలకువగా ఉన్న సమయంలోనే ఆ ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. అందుకే అక్కడి డాక్టర్లు వినూత్న ఆలోచన చేశారు. కోటేశ్వరమ్మకు పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం. అందుకే ఆయన నటించిన ఓజి సినిమాను ప్రదర్శించి.. ఆమె చూస్తుండగానే ఈ ఆపరేషన్ పూర్తి చేయగలిగారు.

* ఇటీవల సర్వసాధారణం..
ఇటీవల నాడీ వ్యవస్థకు ముప్పు వాటిల్లకుండా.. రోగికి ఎటువంటి మత్తు మందు ఇవ్వకుండా.. ఆపరేషన్లు చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలోనే కోటేశ్వరమ్మకు ఈ ఆపరేషన్ చేశారు. అయితే కొంతమంది పాత సినిమాలకు ఇష్టపడతారు. మరికొందరు కొత్త సినిమాలను ఇష్టంగా చూస్తారు. అటువంటివారికి క్లిష్టమైన ఆపరేషన్లు చేసే సమయంలో తాము అభిమానించే నటుడు చిత్రాన్ని ప్రదర్శించి ఆపరేషన్లు చేస్తుంటారు. ఇప్పుడు కోటీశ్వరమ్మ సైతం ఓ జి సినిమా చూసి తన ఆపరేషన్ కు ఎంతగానో సహకరించింది.

డీఎస్సీ 2025.. వైసీపీ ప్రచారం ఎవరికి నష్టం?!

YSRCP DSC Campaign
YSRCP DSC Campaign

YSRCP DSC Campaign: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తక్షణం ప్రజామోదం అవసరం. ప్రజల పార్టీని గుర్తించాలి. కూటమిని తిరస్కరించాలి. అది జరగాలంటే కూటమి ప్రభుత్వంపై విషం చిమ్మాలి. ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పని కూడా అదే. అదేపనిగా డీఎస్సీ 2025 పై విషం చిమ్ముతోంది. వస్తే ఆరు లక్షల ఓట్లు.. పోతే 16 వేల ఓట్లు అన్నట్టు ఆ పార్టీ రాజకీయం నడుస్తోంది. అదేపనిగా డీఎస్సీ 2025 పై వ్యతిరేక ప్రచారం చేస్తోంది. కానీ ఎక్కడా ప్రభుత్వం ప్రతి విమర్శలు చేయకుండా చాలా జాగ్రత్తలు పడుతోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన ప్రతి అభ్యంతరంపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. దీంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది ఫేక్ ప్రచారం అని ప్రజల్లోకి బలంగా వెళ్తోంది.

* జగన్ ను కలిసిన అభ్యర్థులు
ఇటీవల కొంతమంది డీఎస్సీ అభ్యర్థులు జగన్మోహన్ రెడ్డిని కలిశారు.. తమకు మంచి ర్యాంకులు వచ్చిన ఉద్యోగాలు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే జగన్మోహన్ రెడ్డి దీనిని అవకతవకలతో పోల్చేసి కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేయడం ప్రారంభించారు. డీఎస్సీలో గోల్మాల్ జరిగిందని.. భారీగా అవకతవకలు చోటు చేసుకున్నాయంటూ లేనిపోని ప్రచారం మొదలుపెట్టారు. అయితే ఇక్కడే పాఠశాల విద్యాశాఖ చతురత చూపింది. ఎవరైతే జగన్మోహన్ రెడ్డిని కలిసి తమకు ఉత్తమ ర్యాంకులు వచ్చిన ఉద్యోగాలు రాలేదని చెప్పారో.. వారి విషయంలో జరిగిన పరిణామాలు గురించి వివరణ ఇచ్చారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్, హారిజంటల్ రిజర్వేషన్ ప్రకారం వారికి ఉద్యోగాలు దక్కలేదు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు చేసే క్రమంలో.. కటాఫ్ ను పరిగణలోకి తీసుకొని.. మధ్యలో వికలాంగుల కోటాలాంటివి.. స్పోర్ట్స్ కోటా లాంటివి అమలు చేసిన క్రమంలో వారికి ఉద్యోగాలు రాలేదు అని సావధానంగా చెప్పింది పాఠశాల విద్యాశాఖ. ఆధారాలతో సహా అధికారులు వివరించే ప్రయత్నం చేయడం ప్రజల్లోకి బలంగా వెళ్తోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉద్దేశపూర్వకంగానే ఈ ప్రచారం చేస్తోందని స్పష్టం అవుతుంది.

* పేకాట అంశం నవ్వుల పాలు..
మరోవైపు డీఎస్సీలో స్పోర్ట్స్ కోటా కింద పేకాట ఆడే వారికి అవకాశం కల్పించారని మాజీమంత్రి పేర్ని నాని అదే పనిగా ప్రచారం చేస్తున్నారు. బ్రిడ్జి అనే స్పోర్ట్స్ కోటా కింద అంటే పేకాటక వర్ణిస్తున్నారు. ఇది కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చే పరిణామమే. ఎందుకంటే అది భారత ప్రభుత్వం గుర్తించిన క్రీడ. క్రీడా కోటాలో ఉద్యోగాల ఎంపిక సమయంలో బ్రిడ్జి అనేది తప్పనిసరి చేసింది. అందుకే స్పోర్ట్స్ కోటాలో 40వ క్రీడగా దానిని పెట్టారు. కానీ ఆ కోటాలో ఒక్కరికి కూడా ఉద్యోగం ఇవ్వలేదు. ఇలా లేనిపోని ప్రచారం చేసి డీఎస్సీ 2025 పై గందరగోళం సృష్టించడమే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య ఉద్దేశం. దీనిని గమనించిన ప్రభుత్వం గొడవలకు వెళ్లకుండా.. ప్రత్యరోపణలకు వెళ్లకుండా.. ప్రతి అభ్యర్థి అనుమానాలను నివృత్తి చేస్తోంది.

కులాన్ని నమ్ముకుంటున్న వైసిపి!

YSRCP Caste Politics
YSRCP Caste Politics

YSRCP Caste Politics: జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ పేరును ఖరారు చేశారు. అయితే ఇప్పుడు కాపు సామాజిక వర్గం వారు, సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్నవారు దీనిని తప్పు పట్టవచ్చు. కానీ దీనిని ముందుగానే పసిగట్టారు పవన్ కళ్యాణ్. తన కష్టకాలంలో తన వెంట ఉన్న వారిని మాత్రమే గుర్తించుకుంటానని.. పార్టీపై ఒక కులం ముద్ర వేస్తే ఊరుకునేది లేదని.. 2019లో ఈ కుల నేతలంతా ఎక్కడికి వెళ్లిపోయారని ప్రశ్నించారు. మరోవైపు కులం కులం అంటూ కాపు కులాన్ని జనసేనకు ఆపాదిస్తూ వచ్చారు. అందుకే ఇప్పుడు లింగమనేని రమేష్ అభ్యర్థిత్వాన్ని ఎంపిక చేయడం ద్వారా వారికి షాక్ ఇచ్చారు పవన్.

* టిడిపి,వైసిపిలపై వ్యతిరేక ప్రచారం..
తెలుగుదేశం పార్టీ కాపులకు ప్రాధాన్యం ఇస్తోందని ప్రచారం చేసేది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. అదిగో పవన్ కమ్మ సామాజిక వర్గానికి ప్రాధాన్యమిస్తున్నారని చెబుతోంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఇలా ఎలా చూసుకున్నా ఆ రెండు పార్టీలకు సొంత సామాజిక వర్గాల వారు దూరం కావాలి. అప్పుడే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలపడేది. ఆ పార్టీ ఆలోచన కూడా అదే. అయితే ఎన్నడు పవన్ కళ్యాణ్ కాపుల విషయంలో బాహటంగా ప్రకటనలు చేయలేదు. కాపులు మాత్రం పవన్ విషయంలో సానుకూలంగా ఉన్నారు. కానీ అదే కాపుల్లో చీలిక తేవాలన్న ఉద్దేశంతో.. నాదెండ్ల మనోహర్ పార్టీలో నెంబర్ 2 గా ఉన్నారు. ఇప్పుడు కొత్తగా రాజ్యసభ పదవి కమ్మ సామాజిక వర్గానికి చెందిన లింగమనేని రమేష్ కు అప్పగించారు. చూశారా ఈ వివక్ష అంటూ కాపుల్లో ఆగ్రహాన్ని రగిలించే ప్రయత్నంలో ఉంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ.

* పార్టీని నమ్ముకున్న వారికి..
మరోవైపు తెలుగుదేశం కాపులకు ప్రాధాన్యమిస్తోంది. పార్టీని నమ్ముకున్న కమ్మ సామాజిక వర్గాన్ని నిర్లక్ష్యం చేస్తోంది అంటూ ప్రచారం చేస్తున్నవారు ఉన్నారు. చాలామంది కమ్మ నేతలు పదవుల కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు వారందరినీ రెచ్చగొట్టే పనిలో ఉంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఏ పార్టీకైనా కులంతో పని ఉండదు. ఆ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా నిలిచే వారికి అధినాయకత్వం ప్రాధాన్యం ఇస్తుంది. ఇదే విషయాన్ని పవన్ కళ్యాణ్ కూడా గట్టిగానే చెప్పారు. 2019లో ఎందుకు కాపు నేతలు తనను గెలిపించలేదని ప్రశ్నించారు. ఆ ఎన్నికల్లో పోటీ చేసిన కాపు నేత జెడి లక్ష్మీనారాయణ ఎందుకు పార్టీలో కొనసాగలేకపోయారని ప్రశ్నించిన సందర్భం కూడా ఉంది. అయితే జేడీ లాంటి వ్యక్తులు పార్టీలో కొనసాగి ఉంటే ఇప్పుడు రాజ్యసభ ద్వారా ఎంపీలు అయి ఉండేవారు. మొన్నటి ఎన్నికల్లో లోక్సభ సభ్యులై ఉండేవారు. వారంతా పవన్ కళ్యాణ్ ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. మరి పార్టీని, అధినేత పవన్ ను నమ్ముకొని పార్టీకి అండదండగా నిలిచిన లింగమనేని రమేష్ లాంటి వ్యక్తులకు పదవులు ఇవ్వడం అంటే తప్పు కాదు కదా? కానీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఇవన్నీ అనవసరం. ఆ పార్టీకి కుల ప్రచారమే రాజకీయ అస్త్రం.

వైఎస్ఆర్ కాంగ్రెస్ సంచలన సర్వే!

YSR Congress Survey
YSR Congress Survey

YSR Congress Survey: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇటీవల ఒక సర్వే చేయించినట్లు తెలుస్తోంది. ఆయన వద్ద ఉంటున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి టీం ఒకవైపు సర్వే చేస్తే.. తాను సొంతంగా ఒక సర్వే చేయించుకున్నారట. కానీ అందులో సానుకూల అంశాలు ఉన్నట్లు ప్రచారం చేసుకుంటున్నారు కానీ.. ప్రతికూలతలు అధికంగా ఉన్నట్లు తేలిందట. ప్రధానంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్ల ఇంకా ప్రజల్లో భయం ఉందని ఆ సర్వేలో తేలడం సంచలనంగా మారింది. కానీ జగన్ మాత్రం సానుకూలంగానే దానిని తీసుకుంటున్నట్లు ప్రచారం నడుస్తోంది. వైసిపి దూకుడు కూడా ఆ పార్టీకి నష్టం చేకూరుస్తోందని ఆ సర్వేలో తేలడం విశేషం.

* అవే మైనస్ లు..
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఆందోళనలకు పిలుపునిస్తున్నారు. నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు సూచిస్తున్నారు. కానీ వాటిలో జగన్మోహన్ రెడ్డి మాత్రం పాల్గొనడం లేదు. పైగా ఆందోళన కార్యక్రమాలు ఏ అజెండాతో నిర్వహిస్తున్నారో.. కొంతకాలానికి వాటిని అలానే వదిలేస్తున్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ప్రైవేటీకరణ అంశాన్ని కూడా అలానే విడిచి పెట్టేసారు. ఇవన్నీ పార్టీకి మైనస్ అవుతున్నట్లు ఆ సర్వేలో తేలిందట. జగన్మోహన్ రెడ్డి స్థానికంగా అందుబాటులో ఉండకపోవడం.. పక్క రాష్ట్రం నుంచి రాకపోకలు సాగించడం కూడా ఆ పార్టీకి మైనస్. ఇవన్నీ ఆ సర్వేలో తేలినా.. పట్టించుకునే స్థితిలో లేరట జగన్మోహన్ రెడ్డి. అటువంటప్పుడు సర్వేలు చేయడం ఎందుకనేది ఒక ప్రశ్న. అయితే ఆయన చెబుతున్న సర్వరోగ నివారిణి పాదయాత్ర. తను వచ్చే ఏడాదిలో చేసే పాదయాత్ర వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ స్వరూపాన్ని మార్చేస్తుందని ఆయన నమ్మకంతో ఉన్నారట.

* ప్రజల్లోకి వచ్చేది ఎప్పుడు?
ప్రజల మధ్యకు వచ్చి ప్రజా సమస్యలపై పోరాటం చేయకపోవడం అనేది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రధాన మైనస్ అని ఆ సర్వేలో తేలింది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ప్రచారాన్ని నమ్ముకుంటున్నట్టు ఉంది ఆ పార్టీ. అందుకే నిత్యం వ్యతిరేక ప్రచారం చేస్తోంది. అది కూడా పెద్దగా వర్కౌట్ కావడం లేదని తెలుస్తోంది. అయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి టీం సర్వే చేసిందా? లేకుంటే జాతీయ సంస్థ చేసిందా? అన్నది తెలియడం లేదు. కానీ ఈ సర్వే పూర్తిగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మైనస్ గా వచ్చినట్లు తెలుస్తోంది. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం పెద్దగా పట్టించుకోవడం లేదట. అటువంటప్పుడు సర్వే చేయించడం ఎందుకు.. దానిని నిర్లక్ష్యం చేయడం ఎందుకు అని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయట!

మంచి నిద్ర కోసం బెడ్రూంలో ఈ రంగు లైట్ బెటర్.. వీటితో పాటు..

Sleep Light Color
Sleep Light Color

Sleep Light Color: నేటి జీవనశైలిలో రకరకాల కారణాల వల్ల చాలా మంది నిద్ర సమస్యలతో బాధపడుతున్నారు. అయితే మంచి నిద్ర కోసం కేవలం మెత్తని పరుపు లేదా నిశ్శబ్ద వాతావరణం మాత్రమే కాకుండా బెడ్రూమ్‌లో ఉండే లైట్ రంగు కూడా కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా రాత్రి సమయంలో ఉపయోగించే కాంతి శరీరంలోని జీవ గడియారం (బయోలాజికల్ క్లాక్)పై ప్రభావం చూపి నిద్ర నాణ్యతను ప్రభావితం చేస్తుంది. ఇలాంటి సమయంలో ఏ రంగుతో ఉన్న లైట్ ఉంచుకోవడం మంచిది?

నిపుణుల ప్రకారం.. ఎరుపు రంగు (Red Light) నిద్రకు అత్యంత అనుకూలమైన కాంతిగా భావిస్తారు. ఈ కాంతి మెదడును ప్రశాంతంగా ఉంచడంతో పాటు నిద్రకు సహాయపడే మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తిని ఎక్కువగా అడ్డుకోదు. ఫలితంగా శరీరం సహజంగా నిద్ర మోడ్‌లోకి వెళ్లేందుకు సహకరిస్తుంది. అందుకే రాత్రి పడుకునే ముందు బెడ్రూమ్‌లో మసక ఎరుపు కాంతిని ఉపయోగించడం మంచిదని సూచిస్తున్నారు.

నారింజ రంగు (Orange Light) కూడా నిద్రకు అనుకూలమైన కాంతిగా గుర్తించబడింది. ఇది సూర్యాస్తమయ సమయంలో కనిపించే సహజ కాంతిని పోలి ఉండటంతో శరీరానికి విశ్రాంతి సంకేతాలను పంపుతుంది. దీని వల్ల మానసిక ఒత్తిడి తగ్గి, క్రమంగా నిద్ర ముంచుకొస్తుంది. ముఖ్యంగా రాత్రి చదవడం లేదా ప్రశాంతంగా గడపాలనుకునే వారికి ఈ రంగు కాంతి ఉపయోగకరంగా ఉంటుంది.

పసుపు రంగు (Yellow Light) కంటికి తక్కువ ఒత్తిడిని కలిగించే కాంతిగా పరిగణిస్తారు. ఇది కళ్లపై తీవ్ర ప్రభావం చూపకుండా సౌకర్యవంతమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. అయితే చాలా ప్రకాశవంతంగా కాకుండా డిమ్ లైట్ రూపంలో ఉండటం ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. మసక పసుపు కాంతి గదిలో హాయిగా ఉండే వాతావరణాన్ని కల్పించి నిద్రకు సహాయపడుతుంది.

మరోవైపు బ్లూ లైట్ (Blue Light) నిద్రకు ప్రధాన శత్రువుగా భావిస్తారు. మొబైల్ ఫోన్లు, టీవీలు, ల్యాప్‌టాప్‌లు, LED స్క్రీన్ల నుంచి ఎక్కువగా వెలువడే ఈ కాంతి మెలటోనిన్ ఉత్పత్తిని అణిచివేస్తుంది. దీంతో మెదడు ఇంకా పగలే ఉన్నట్లుగా భావించి నిద్ర ఆలస్యమవుతుంది. అందువల్ల పడుకునే కనీసం ఒక గంట ముందు ఎలక్ట్రానిక్ పరికరాల వినియోగాన్ని తగ్గించాలని నిపుణులు సూచిస్తున్నారు.

గ్రీన్ లైట్, అత్యంత ప్రకాశవంతమైన తెల్లటి కాంతులు (Bright White Lights) కూడా కొందరిలో నిద్ర చక్రాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఇవి మెదడును అప్రమత్త స్థితిలో ఉంచి విశ్రాంతిని దూరం చేయవచ్చు. అందుకే రాత్రి సమయంలో బెడ్రూమ్‌లో అధిక ప్రకాశం ఉన్న లైట్లకు బదులుగా మసక కాంతిని ఎంచుకోవడం మంచిది.

మంచి నిద్ర కోసం లైట్ రంగుతో పాటు కొన్ని అలవాట్లు కూడా అవసరం. ప్రతిరోజూ ఒకే సమయానికి నిద్రపోవడం, పడుకునే ముందు కాఫీ లేదా టీ తాగకపోవడం, మొబైల్ వినియోగాన్ని తగ్గించడం, గదిలో ఉష్ణోగ్రతను సౌకర్యవంతంగా ఉంచడం వంటి చర్యలు గాఢమైన నిద్రకు సహాయపడతాయి. సరైన రంగు కాంతిని ఎంచుకోవడం ద్వారా నిద్ర నాణ్యత మెరుగుపడి, మరుసటి రోజు శరీరం, మనసు మరింత ఉత్సాహంగా ఉండే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

ప్రపంచాన్ని ఏలిన బ్రిటన్ ఇప్పుడు బిచ్చమెత్తుకుంటుందా.. ఎందుకు

Britain Economy Crisis
Britain Economy Crisis

Britain Economy Crisis: ఒకప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద సామ్రాజ్యంగా పేరొందిన బ్రిటన్ ప్రస్తుతం ఆర్థిక, సామాజిక సవాళ్లను ఎదుర్కొంటోంది.2024 లెక్కల ప్రకారం బ్రిటన్ అప్పులు దేశ ఆదాయానికి 99.5 శాతానికి చేరుకున్నాయి. 14.1 మిలియన్ల మంది (ఇందులో 3.8 మిలియన్ల మంది పిల్లలు కూడా ఉన్నారు) ఆహార అస్థిరతతో బాధపడుతున్నారు. 2 మిలియన్ల మంది కనీసం ఒక రోజైనా ఆహారం లేని పరిస్థితి ఉంది. ఈ పరిస్థితికి బ్రిటన్ యూరోపియన్ యూనియన్(EU) నుంచి బయటకు రావడమే అని కొందరు అంటున్నారు. అసలు ఈయూ నుంచి బ్రిటన్ ఎందుకు బయటకు వచ్చింది? తరువాత ఏం జరిగింది?

European Union అనేది యూరప్‌లోని అనేక దేశాల ఆర్థిక, రాజకీయ కూటమి. సభ్య దేశాల మధ్య వస్తువులు, సేవలు, పెట్టుబడులు, ప్రజల రాకపోకలు సులభంగా జరిగేలా ఈ వ్యవస్థ పనిచేస్తుంది. బ్రిటన్ 1973లో ఈ కూటమిలో చేరింది. దశాబ్దాల పాటు సభ్యదేశంగా కొనసాగింది. అయితే ఈయూలో ఉండడం వల్త తమకు తీవ్రంగా ఆర్థిక నష్టం చేకూరుతుందని.. యూరోపియన్ లో ఉన్న దేశాలు ఎక్కువగా బ్రిటన్ సేవలను పొందుతున్నారని భావించారు. అంతేకాకుండా ఈ యూనియన్ లో ఉండడం వల్ల కొన్ని దేశాల ప్రజలు ముఖ్యంగా యూనియన్ లో ఉన్న తూర్పు దేశాలు ఎక్కువగా బ్రిటన్ కు వలసలు రావడం ఎక్కువైంది. దీంతో స్థానికులకు ఉద్యోగాలు రావడం లేదని ఆందోళన చేయడం ప్రారంభించారు.

2016లో నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ (రెఫరెండం)లో స్వల్ప మెజారిటీ ప్రజలు EU నుంచి బయటకు రావాలని ఓటు వేశారు. దీనినే ‘బ్రెగ్జిట్’ (Brexit) అంటారు. Britain , Exit అనే పదాల కలయికతో ఈ పేరు వచ్చింది. వలసలను నియంత్రించుకోవడం, తమ చట్టాలపై పూర్తి నియంత్రణ పొందడం, EU నియమాల నుంచి విముక్తి పొందడం వంటి కారణాలతో చాలా మంది బ్రిటిష్ ఓటర్లు బ్రెగ్జిట్‌కు మద్దతిచ్చారు.దీంతో 2020లో బ్రిటన్ అధికారికంగా EU నుంచి వైదొలిగింది.

కానీ ఇక్కడే సమస్యలు మొదలయ్యాయి. అప్పటి వరకు యూరప్‌తో ఉన్న స్వేచ్ఛా వాణిజ్య వ్యవస్థలో మార్పులు వచ్చాయి. కొత్త కస్టమ్స్ నిబంధనలు, సరిహద్దు తనిఖీలు, అదనపు పత్రాలు వ్యాపార వ్యయాలను పెంచాయి. అలాగే వ్యవసాయం, ఆహార ఉత్పత్తి, రవాణా రంగాల్లో కార్మికుల కొరత ఏర్పడింది. దీనివల్ల కొన్ని వస్తువుల ధరలు పెరిగాయని అనేక అధ్యయనాలు సూచిస్తున్నాయి. వీటికి తోడు కరోనా సంక్షోభం కూడా రావడంతో ఈ దేశంలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది.

ప్రస్తుతం బ్రిటన్ ఇంకా ప్రపంచంలో ప్రముఖ ఆర్థిక శక్తిగానే ఉంది. United Kingdom కు బలమైన ఆర్థిక సేవల రంగం, ప్రముఖ విశ్వవిద్యాలయాలు, సాంకేతిక పరిశ్రమలు ఉన్నాయి. అయితే అప్పుల నియంత్రణ, గృహ నిర్మాణం, ఉత్పాదకత పెంపు, ఉపాధి అవకాశాల విస్తరణ వంటి అంశాలపై ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఈ సవాళ్లను అధిగమించగలిగితే బ్రిటన్ మళ్లీ వేగవంతమైన ఆర్థిక వృద్ధిని సాధించే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు.

స్విమ్మింగ్ లో కూడా ఈ వాచ్ పనిచేస్తుంది.. ధర ఎంతో తెలుసా..

Realme Smartwatch
Realme Smartwatch

Realme Smartwatch: మగవారు అందంగా కనిపించడానికి కొందరు చేతికి ప్రత్యేకంగా వాచ్ ధరిస్తూ ఉంటారు. అయితే స్టైలిష్ గా.. ప్రీమీయింతో కూడిన వాచ్ కావాలని అనుకునేవారికి Realme Watch S5 ఇప్పుడు భారత్‌లో అధికారికంగా అందుబాటులోకి వచ్చింది. ఈ వాచ్ ఎలా ఉందంటే?

Realme Watch S5 లో 1.43- అంగుళాల AMOLED గుండ్రని డిస్‌ప్లే ఉంది. 466×466 పిక్సెల్ రిజల్యూషన్ తో పనిచేస్తుంది. ఈ వాచ్‌లో Built-in GPS, 5 GNSS systems support ఉన్నాయి. అంటే రన్నింగ్, సైక్లింగ్ వంటి అవుట్‌డోర్ యాక్టివిటీలను ఫోన్ లేకుండా కూడా ట్రాక్ చేయవచ్చు. ఇందులో 20-days అల్ట్రా లాంగ్ లైఫ్ బ్యాటరీ సెట్ చేశారు. అయితే కొన్ని నివేదికల ప్రకారం.. 460 mAh battery అని అంటున్నారు. 5ATM వాటర్ రెసిస్టెన్స్ సపోర్ట్ ఉందని కంపెనీ చెబుతోంది. దీంతో స్విమ్మింగ్ వాటిలో కూడా దీనిని వాడుకోవచ్చు.

గుండ్రని డయల్ డిజైన్, అల్యూమినియం బాడీ, పండా గ్లాస్ ప్రొటెక్షన్, సిలికాన్ స్ట్రాప్ వంటి వాటితో ఇది కనిపిస్తుంది. ని ధర రూ.7,999గా నిర్ణయించారు. కంపెనీ ఈ మోడల్‌ను 22 May 2026న ప్రకటించగా, ఇప్పుడు Flipkart, realme.comతో పాటు ఎంపిక చేసిన రిటైల్ స్టోర్ల ద్వారా విక్రయాలు ప్రారంభమయ్యాయి. ప్రారంభ ఆఫర్లలో కొందరు కొనుగోలుదారులకు ₹7,499 తో కొనుగోలు చేశారు. ౌ

ఈ వాచ్ లో Bluetooth calling సపోర్ట్ ఉంది. Android, iOS రెండింటికీ అనుకూలంగా పనిచేస్తుంది. ఇది Wear OS కాదు; realme Link యాప్‌తో జతచేసే RTOS-based smartwatch అని అంటున్నారు. రూ.8,000 లోపు round-dial smartwatch కోసం ఎదురుచూసేవారికి ఇది బెస్ట్ ఎంపిక అని అంటున్నారు.

ఇయర్ బడ్స్ ఇలా వాడుతున్నారా..

Danger
Danger

Danger: స్మార్ట్‌ఫోన్లు, మ్యూజిక్ స్ట్రీమింగ్ యాప్‌లు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇయర్‌బడ్స్, హెడ్‌ఫోన్ల వినియోగం విపరీతంగా పెరిగింది. ప్రయాణంలో, వ్యాయామం చేస్తున్నప్పుడు, చదువుకునేటప్పుడు, పని చేసేటప్పుడు చాలా మంది గంటల తరబడి ఇయర్‌బడ్స్‌ను ఉపయోగిస్తున్నారు. అయితే ఈ అలవాటు వినికిడి ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా అధిక శబ్దంతో, ఎక్కువసేపు వినడం వల్ల చెవిలోని సున్నితమైన కణాలు దెబ్బతినే ప్రమాదం ఉందని చెబుతున్నారు. అయితే ఈ నియమం పాటిస్తే ఇయర్ బడ్స్ తో ఎలాంటి సమస్యలు ఉండవని అంటున్నారు.. అవేంటంటే?

ఇయర్‌బడ్స్ నేరుగా చెవి కాలువలో అమరిపోతాయి. దీంతో శబ్ద తరంగాలు కర్ణభేరి (Eardrum)కి చాలా దగ్గర నుంచి చేరుతాయి. సాధారణ స్పీకర్లతో పోలిస్తే ఈ శబ్ద ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అధిక వాల్యూమ్‌లో సంగీతం లేదా వీడియోలు వినడం వల్ల చెవిలోని సున్నితమైన హెయిర్ సెల్స్‌పై ఒత్తిడి పెరుగుతుంది. ఇవే శబ్దాలను మెదడుకు చేరవేసే కీలక కణాలు. మన శరీరంలోని కొన్ని కణాలు దెబ్బతింటే తిరిగి ఏర్పడతాయి. కానీ చెవి లోపలి భాగంలో ఉండే హెయిర్ సెల్స్ మాత్రం ఒకసారి దెబ్బతింటే తిరిగి పెరగవు. అందుకే శబ్ద కాలుష్యం వల్ల కలిగే వినికిడి నష్టం చాలా సందర్భాల్లో శాశ్వతంగా మారుతుంది. మొదట్లో స్వల్పంగా వినికిడి తగ్గినట్లు అనిపించినా, కాలక్రమేణా అది మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంటుంది.

ఎక్కువసేపు ఇయర్‌బడ్స్ ఉపయోగించిన తర్వాత కొందరికి చెవిలో ‘గుయ్..గుయ్..’ లేదా ‘టింగ్..టింగ్..’ అనే మోగుతున్న శబ్దం వినిపిస్తుంది. దీనిని వైద్య భాషలో టిన్నిటస్ (Tinnitus) అంటారు. ఇది చెవి అధిక శబ్దానికి గురైందనే సంకేతంగా పరిగణిస్తారు. ఇలాంటి లక్షణాలు తరచుగా కనిపిస్తే వెంటనే వాల్యూమ్ తగ్గించి వైద్యుడిని సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు.

60-60 నియమాన్ని పాటించండి
వినికిడి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి వైద్యులు ‘60-60 రూల్’ను సూచిస్తున్నారు. అంటే ఇయర్‌బడ్స్ వాడేటప్పుడు గరిష్ఠ వాల్యూమ్‌లో 60 శాతం కంటే ఎక్కువ పెట్టకూడదు. అలాగే నిరంతరంగా 60 నిమిషాలకు మించి వినకూడదు. గంట పూర్తయిన తర్వాత కనీసం కొంత సమయం చెవులకు విశ్రాంతి ఇవ్వడం మంచిది. ఈ నియమం పాటిస్తే వినికిడి నష్టం ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించవచ్చు.

ప్రస్తుతం చిన్న వయసు నుంచే పిల్లలు మొబైల్ ఫోన్లు, ట్యాబ్లెట్ల ద్వారా ఇయర్‌బడ్స్ ఉపయోగిస్తున్నారు. యువతలో అయితే సంగీతం, గేమింగ్, వీడియోల కోసం గంటల తరబడి వినడం సాధారణంగా మారింది. దీని వల్ల చిన్న వయసులోనే వినికిడి సమస్యలు వచ్చే ప్రమాదం పెరుగుతోందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా శబ్దభరిత ప్రాంతాల్లో వాల్యూమ్‌ను మరింత పెంచడం సమస్యను తీవ్రతరం చేస్తుంది.

వినికిడి నష్టం మాత్రమే కాదు, ఎక్కువసేపు ఇయర్‌బడ్స్ ధరించడం వల్ల చెవిలో వేడి పెరగడం, చెమట పేరుకుపోవడం, ఇన్ఫెక్షన్లు రావడం వంటి సమస్యలు కూడా తలెత్తవచ్చు. ఇతరులు ఉపయోగించిన ఇయర్‌బడ్స్ వాడితే బ్యాక్టీరియా, ఫంగల్ ఇన్ఫెక్షన్ల ప్రమాదం కూడా ఉంటుంది. అందుకే ఇయర్‌బడ్స్‌ను క్రమం తప్పకుండా శుభ్రం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

టిడిపి రాజ్యసభ మూడో పదవికి అనూహ్య ఎంపిక!

TDP Rajya Sabha Seat
TDP Rajya Sabha Seat

TDP Rajya Sabha Seat: ఏపీలో రాజ్యసభ ఎన్నికల సందడి ప్రారంభం అయింది. ఈనెల 8 తో నామినేషన్ల గడువు ముగియనుంది. మరో రెండు రోజులపాటు మాత్రమే గడువు ఉంది. దీంతో కూటమి తమ అభ్యర్థులను ప్రకటించే పనిలో పడింది. అయితే ఈసారి బిజెపికి అవకాశం లేదు. తెలుగుదేశం పార్టీ నుంచి ముగ్గురు, జనసేన నుంచి ఒకరికి రాజ్యసభ పదవి దక్కుతుంది. అయితే ఇప్పుడు అభ్యర్థుల ఎంపిక అనేది కత్తి మీద సాములా మారింది. ఇద్దరు అభ్యర్థుల ఎంపికలో స్పష్టత వచ్చింది. మరోసారి టిడిపి నుంచి సానా సతీష్ కు ఛాన్స్ ఖాయం. జనసేన నుంచి లింగమనేని రమేష్ పేరు ప్రకటించేశారు.

* రెండు పదవులు కొలిక్కి..
తెలుగుదేశం పార్టీ రెండు పదవులకు సంబంధించి కసరత్తు ప్రారంభించింది. అందులో విద్యావేత్త భాష్యం రామకృష్ణ పేరు దాదాపు ఖరారు చేసినట్లు పొలిటికల్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. పార్టీ గెలుపోటములతో సంబంధం లేకుండా భాష్యం రామకృష్ణ సేవలందిస్తూ వచ్చారు. అందుకే ఆయనకు ఛాన్స్ ఇవ్వాలని హై కమాండ్ ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. చివరి నిమిషంలో చేర్పులు మార్పులు తప్పిస్తే ఆయనకు రాజ్యసభ పదవి ఖరారు చేస్తారని తెలుస్తోంది. లోకేష్ కు అత్యంత విధేయుడుగా ఉంటూ వచ్చారు భాష్యం రామకృష్ణ. అందుకే ఈసారి ఆయన వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.

* సామాజిక సమీకరణలు..
మరోవైపు టిడిపి కి లభించే మూడో రాజ్యసభ పదవిపై బలమైన చర్చ నడుస్తోంది. అనూహ్య అభ్యర్థిని ప్రకటిస్తారని ప్రచారం జరుగుతోంది. బీసీ మహిళకు ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది. ఇంకోవైపు బీసీ పురుషుల కోటాలో చింతకాయల విజయ్ పేరు వినిపిస్తోంది. ఇక ఎస్సీలకు ఇవ్వదలచుకుంటే వర్ల రామయ్యకు ఖరారు చేయనున్నారు. ప్రతిసారి వర్ల రామయ్యకు మొండి చేయి చూస్తూ వచ్చారు. సీనియారిటీతోపాటు సిన్సియారిటీని దృష్టిలో పెట్టుకొని రామయ్యను ఫైనల్ చేస్తారని టిడిపి వర్గాల్లో ప్రచారం సాగుతోంది. విజయ్ కు భవిష్యత్తులో మంచి పదవి కల్పిస్తామని హామీ ఇచ్చే అవకాశం ఉంది. అయితే అనూహ్యంగా బీసీ మహిళను తెరపై తెచ్చే ఛాన్స్ కూడా ఉందంటున్నాయి టిడిపి వర్గాలు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

ఆ సీనియర్ రాజకీయ జీవితంలో అదో లోటు!

Yanamala Ramakrishnudu
Yanamala Ramakrishnudu

Yanamala Ramakrishnudu: తెలుగుదేశం పార్టీలో అత్యంత సీనియర్ నేతల్లో ఒకరు యనమల రామకృష్ణుడు. టిడిపి ఆవిర్భావం నుంచి పనిచేస్తున్నారు. రాష్ట్రంలో ఆయన చేయని పదవి అంటూ లేదు. ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, మంత్రిగా, పీఏసీ చైర్మన్ గా ఇలా చాలా పదవులు చేపట్టారు. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిగా ఎక్కువసార్లు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. అయితే ఆయన జీవితంలో ఒక లోటు ఉంది. అదే కేంద్ర రాజకీయాల్లోకి వెళ్లడం. ఎంపీగా పెద్దల సభకు వెళ్లాలన్నది ఆయన ఆలోచన. కానీ అది కార్యరూపం దాల్చడం లేదు. తాజా రాజ్యసభ పదవుల్లో సైతం ఆయనకు ఛాన్స్ లేదని ప్రచారం నడుస్తోంది. దీంతో ఈ సీనియర్ నేత కాస్త ఆవేదనతో ఉన్నట్లు పొలిటికల్ వర్గాల్లో ప్రచారం ఉంది.

* పార్టీ ఆవిర్భావం నుంచి..
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్నారు యనమల రామకృష్ణుడు. 1983 నుంచి 1999 వరకు తుని అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుస్తూ వచ్చారు. మధ్యలో ఎన్నో రాజకీయ పార్టీలు వచ్చినా.. ఎన్ని రకాల ఇబ్బందులు ఎదురైనా టిడిపిలో కొనసాగారే తప్ప.. మరో పార్టీ వైపు చూడలేదు. టిడిపి అధికారంలోకి వచ్చిన ప్రతిసారి ఆయనకు మంత్రి పదవి దక్కుతూ వచ్చింది. 1983లో తొలిసారిగా గెలిచేసరికి ఎన్టీఆర్ తన క్యాబినెట్లోకి తీసుకున్నారు. 1989లో టిడిపి అధికారంలోకి రాలేదు. 1994లో టిడిపి అధికారంలోకి రాగా యనమల రామకృష్ణుడు కు స్పీకర్ పదవి ఇచ్చారు నందమూరి తారక రామారావు. కానీ 1995 టీడీపీ సంక్షోభ సమయంలో యనమల రామకృష్ణుడు స్థితప్రజ్ఞత ప్రదర్శించారు. చంద్రబాబుకు అవకాశం ఇచ్చారు సభలో. తన బలాన్ని నిరూపించుకున్నారు చంద్రబాబు. తన పొలిటికల్ లైఫ్ లో అదో టర్నింగ్ పాయింట్ గా నిలిచింది. నాడు స్పీకర్ అయ్యన్న పాత్రుడు అవకాశం ఇవ్వకుంటే.. చంద్రబాబుకు ఈ తరహా గౌరవం ఉండేది కాదు. అందుకే యనమల రామకృష్ణుడు విషయంలో చాలా గౌరవభావంతో ఉంటారు చంద్రబాబు. 1999లో గెలిచేసరికి ఆర్థిక శాఖ కట్టబెట్టారు. 2004లో పార్టీ ఓడిపోయింది కానీ యనమలకు ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తూ వచ్చారు. 2014లో ఎమ్మెల్సీగా ఉన్న యనమలను మంత్రివర్గంలోకి తీసుకొని తన ప్రత్యేకత చాటుకున్నారు. కానీ 2024 లో మాత్రం ఎమ్మెల్సీగా ఉన్న యనమల ను రెన్యువల్ చేయలేదు. మంత్రివర్గంలోకి తీసుకోలేదు.

* పెద్దల సభ ఆశ..
యనమల రామకృష్ణుడు పెద్దల సభకు వెళ్లాలన్న ఆశతో ఉన్నారు. ఒకసారి రాజ్యసభకు ఎంపికై గౌరవంగా రాజకీయాల నుంచి తప్పుకోవాలని చూస్తున్నారు. తన మనసులో ఉన్న మాటను చంద్రబాబు చెవిలో వేశారు. కానీ ఇప్పుడు నాలుగు రాజ్యసభ పదవుల ఎంపికలో యనమల రామకృష్ణుడు పేరును ప్రతిపాదనలోకి తీసుకోలేదని తెలుస్తోంది. అయితే మరో మూడేళ్లలో రాజ్యసభ పదవులు ఖాళీ కానున్నాయి. అప్పుడు ఛాన్స్ ఇస్తామని యనమలకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే యనమల కుమార్తె ఎమ్మెల్యే గా ఉండగా.. అల్లుడు లోక్సభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. బహుశా ఈ కారణాల వల్లే ఈసారి యనమలకు అవకాశం లేనట్లు తెలుస్తోంది. అయితే పెద్దల సభకు వెళ్లాలన్న యనమల కోరిక తీరకపోవడం ఆయనకు పెద్ద లోటు.

'ధురంధర్' దెబ్బ.. దావూద్ ఇబ్రహీం ముఠాలో ప్రకంపనలు.. పరారీ లో నాయకుడు..

Dhurandhar Japan Box Office
Dhurandhar Japan Box Office

Dhurandhar 2: ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద ‘ధురంధర్’ సిరీస్ సృష్టించిన ప్రభంజనం ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ సిరీస్ తో దర్శకత్వ ప్రతిభ కి చిరునామా అంటే ఏంటో అర్థం అయ్యేలా చేశాడు డైరెక్టర్ ఆదిత్య డర్. స్టోరీ , స్క్రీన్ ప్లే , నటీనటుల అద్భుతమైన నటన , ఇవన్నీ టాప్ రేంజ్ లో ఉండడం వల్లే, ఈ సినిమా ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ గా నిల్చింది. ఇదంతా పక్కన పెడితే ‘ధురంధర్ 2’ లో డైరెక్టర్ ఆదిత్య డర్ అండర్ వరల్డ్ డాన్ దావుద్ ఇబ్రహీం ని ఎంత బలహీనంగా చూపిస్తాడో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కాటికి కాళ్ళు చాపుకొని కూర్చున్నవాడిగా అతన్ని చూపిస్తారు. అలా చూపించడం దావుద్ ఇబ్రహీం కి తీవ్రమైన ఆగ్రహాన్ని రప్పించాయని లేటెస్ట్ గా అందుతున్న వార్త. బాలీవుడ్ ని దావుద్ స్థాపించిన డీ కంపెనీ దశాబ్దాల నుండి ఏలుతూ వస్తోంది.

బాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ , సూపర్ స్టార్స్ , నిర్మాతలు ఇలా అందరూ కూడా దావూద్ క్రింద పని చేస్తుంటారు. బాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు కూడా దావూద్ ఫండింగ్ చేసాడు. ఆయన ఏమి చెప్తే అది చేసేవాళ్ళు బాలీవుడ్. అలాంటి బాలీవుడ్ నుండి తనకు వ్యతిరేకంగా ఒక సినిమా రావడం పై డీ కంపెనీ తీవ్రమైన ఆగ్రహం తో ఉన్నట్లు తెలుస్తోంది. పాకిస్థాన్ లో ఉంటూ దావూద్ ఇబ్రహీం ముంబై లో ఈ డీ కంపెనీ ని నడుపుతున్నాడు. అయితే ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యాక, దావూద్ ఇబ్రహీం ముంబై లో తన ముఠా కి సంబంధించిన నెట్వర్క్ మొత్తాన్ని యాక్టీవ్ చేసినట్టు తెలుస్తోంది. అంతే కాదు ముంబై లో కొన్ని ఉగ్రదాడులు కూడా దావూద్ స్కెచ్ వేశాడట. ఈ ఉగ్ర కుట్రలో కొత్త సభ్యులను నియమించినట్టు తెలుస్తోంది. ఈ నియామక ప్రక్రియ నీవు షకీల్ ముఠాకి అప్పగించినట్టు తెలుస్తోంది.

వీళ్లకు పాకిస్థాన్ ISI శిక్షణ ఇవ్వడం, ఆయుధాలు ఇవ్వడం వంటివి చేయనుందట. అంతే కాకుండా ఈ ఉగ్ర ప్రణాళిక ను అమలు చేసే బాధ్యతను షూటర్ మున్నా జింగాడా కు అప్పటించినట్టు సమాచారం. అయితే ఈ ఆపరేషన్ వెనుక అసలు కారణాలు మాత్రం చెప్పలేదని విస్వసనీయ వర్గాల సమాచారం. ముంబైలో దావూద్ ఇబ్రహీం అంటే భయం పోయింది , తన మీద వ్యక్తిరేకంగా సినిమాలు చేసే స్థాయికి వెళ్లిపోయారు, వారిలో పోయిన భయాన్ని తిరిగి రప్పించాలంటే కచ్చితంగా మరోసారి ఉగ్ర దాడులు చెయ్యాలి, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు అంచనా వేస్తున్నారు విశ్లేషకులు. అయితే ఇటీవలే ముంబై పోలీసులు ఈ ఉగ్ర ప్రణాళిక ని భగ్నం చేశారు , అదుపులోకి తీసుకున్న కీలక సభ్యుల నుండి ఈ సమాచారం మొత్తాన్ని బయటకు లాగారు. ఈ కుట్ర ప్రణాళిక లో కొంతమంది పరారీలో ఉన్నారు , వాళ్ళ కోసం పోలీసులు గాలిస్తున్నట్టు సమాచారం.

షర్మిలకు మరో షాక్ తప్పదా?

Sharmila
Sharmila

Sharmila: కాంగ్రెస్ హై కమాండ్ షర్మిలకు షాక్ ఇచ్చింది. రాజ్యసభ పదవి విషయంలో మొండి చేయి చూపింది. కర్ణాటకలో ఖాళీ అయిన మూడు రాజ్యసభ పదవుల్లో ఒకటి షర్మిల కు ఖాయమని పెద్ద ఎత్తున ప్రచారం నడిచింది. కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ఢిల్లీకి పిలిచి మరి ఈ విషయాన్ని చెప్పారు. కానీ కర్ణాటకలో రాజకీయ పరిణామాలు తో స్థానికులకే ఆ పదవులు కేటాయించాల్సి వచ్చింది. హై కమాండ్ కోటాలో కాంగ్రెస్ పార్టీ మీడియా కన్వీనర్ పవన్ ఖేరాకు సర్దుబాటు చేయాల్సి వచ్చింది. దీంతో షర్మిలకు షాక్ తగిలినట్లు అయింది. అయితే కాంగ్రెస్ హై కమాండ్ షర్మిలకు మరో షాక్ ఇచ్చేందుకు సైతం సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది.

* అప్పట్లోనే హామీ
తెలంగాణలో పార్టీ ఏర్పాటు చేసిన షర్మిల అనుకున్న స్థాయిలో రాణించకపోయేసరికి పునరాలోచనలో పడ్డారు. తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని భావించారు. కానీ కాంగ్రెస్ అధినాయకత్వం ఆమెకు ఏపీ పగ్గాలు అప్పగించింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తే రాజ్యసభ పదవి ఇస్తామని ఆఫర్ చేసింది. అందుకు తగ్గట్టుగానే షర్మిల అడుగులు వేశారు. కానీ ఇప్పుడు కర్ణాటక ద్వారా రాజ్యసభ పదవి భర్తీ చేశారు కానీ.. షర్మిలకు అవకాశం ఇవ్వలేదు. ఇస్తున్నట్టు చెప్పి మరి తప్పించారు. దీంతో షర్మిల తీవ్ర నిరాశకు గురయ్యారు. ఆమె అనుచరులు సైతం తీవ్ర ఆవేదనతో ఉన్నారు.

* పిసిసి చీఫ్ మార్పు..
మరోవైపు పీసీసీ చీఫ్ పదవి నుంచి సైతం షర్మిలను తప్పిస్తారన్న ప్రచారం నడుస్తోంది. ఆమె స్థానంలో కేంద్ర మాజీ మంత్రి, బీసీ మహిళ కిల్లి కృపారాణి నియమిస్తారని టాక్ నడుస్తోంది. కృపారాణి సీనియర్ నాయకురాలు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి తిరిగి కాంగ్రెస్ లోకి వచ్చేసారు. ఆమెకు పిసిసి అధ్యక్ష పదవి ఇస్తే బాగుంటుందన్న అభిప్రాయం ఉంది. ఎందుకంటే ఆమెకు అనుభవం కూడా ఉంది. ఆపై కాంగ్రెస్ దేశంలో పుంజుకుంటుందన్న అభిప్రాయం ఉంది. షర్మిలను జాతీయ కాంగ్రెస్ లోకి తీసుకుంటారని.. ఏఐసీసీ ద్వారా సేవలు వినియోగించుకుంటారని తెలుస్తోంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.

జనసేన రాజ్యసభ సభ్యుడిగా లింగమనేని రమేష్.. మండిపడుతున్న జన సైనికులు..

Lingamaneni Ramesh
Lingamaneni Ramesh

Lingamaneni Ramesh: రాజ్య సభలో ఖాళీ అయినా స్థానాలకు కూటమి పార్టీ నుండి ఎవరెవరు అభ్యర్థులుగా ఢిల్లీ కి వెళ్లాలో నిర్ణయం తీసుకున్నారు సీఎం చంద్రబాబు నాయుడు , డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. తెలుగు దేశం పార్టీ నుండి ముగ్గురుని రాజ్య సభకు పంపుతుండగా, జనసేన పార్టీ నుండి ఒకరిని పంపుతున్నారు. రాబోయే మూడేళ్ళలో జనసేన పార్టీ కి మరో మూడు రాజ్యసభ స్థానాలు దక్కనున్నాయి. అయితే జనసేన పార్టీ తరుపున ఎవరు రాజ్యసభ కి వెళ్తున్నారు అనే దానిపై అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. బాలినేని శ్రీనివాస్ లేదా లింగమనేని రమేష్ , వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు రాజ్యసభ కి వెళ్లొచ్చు అని అంతా అనుకున్నారు. కట్ చేస్తే అదే జరిగింది , లింగమనేని రమేష్ ని రాజ్యసభ కి పంపుతున్నట్టు జనసేన పార్టీ నిన్న అధికారిక ప్రకటన చేసింది.

అయితే లింగమనేని రమేష్ పేరు ని ప్రకటించడం పై కొంతమంది జనసైనికుల్లో తీవ్రమైన అసంతృప్తి నెలకొంది. ఎందుకంటే పార్టీ కోసం మొదటి నుండి ఎంతో కష్టపడి పనిచేసిన వారిలో ఎవరికో ఒకరికి ఇవ్వకుండా, అసలు పార్టీ తో సంబంధం ఉందో , లేదో తెలియని తెలుగు దేశం పార్టీ కి సంబంధించిన లింగమనేని రమేష్ ని రాజ్యసభ కు పంపడం ఏంటి?, ఇది సరైన నిర్ణయం కాదు అంటూ పవన్ కళ్యాణ్ ని కొంతమంది జనసైనికులు తప్పుబట్టారు. అయితే లింగమనేని రమేష్ తెలుగు దేశం పార్టీ కి సంబంధించిన వ్యక్తి కాదు. 2014 లో పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టినప్పటి నుండి ఆయనకు తోడుగా ఉంటూ వచ్చిన అతి తక్కువమంది లో ఒకరు లింగమనేని రమేష్. జనసేన పార్టీ కి అన్ని రకాల అవసరాలను తీర్చిన వ్యక్తి ఆయన. అంతే కాదు ఆ పార్టీ కి ఆర్థికంగా లింగమనేని రమేష్ చేసిన సేవలు కూడా వర్ణనాతీతం.

అందుకే పవన్ కళ్యాణ్ అతని పేరు ని ప్రకటించడాన్ని అంటున్నారు. ఇకపోతే తనని రాజ్యసభకు ఎంపిక చేసినందుకు గానూ , పవన్ కళ్యాణ్ కి కృతఙ్ఞతలు తెలియజేస్తూ లింగమనేని రమేష్ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఆయన మాట్లాడుతూ ‘జనసేన పార్టీ తరుపున రాజ్యసభకు నన్ను ఎంపిక చేసినందుకు మా పార్టీ అధ్యక్షులు , ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి కృతఙ్ఞతలు తెలియజేస్తున్నాను. కూటమి తరుపున నా అభ్యర్థిత్వానికి మద్దతు తెలిపిన ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం చంద్రబాబు నాయుడు గార్లకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇది నాకు ఒక బలమైన బాధ్యత. సాధారణ పౌరుడి గొంతు ని వినిపించడమే లక్ష్యంగా నేను పని చేస్తాను’ అంటూ చెప్పుకొచ్చాడు రమేష్.

ఆఫ్గనిస్తానే కదా అని నిర్లక్ష్యం వద్దు.. టీమిండియా వీటి మీద దృష్టి పెట్టాల్సిందే..

India vs Afghanistan Test
India vs Afghanistan Test

India vs Afghanistan Test: దాదాపు 7 నెలల విరామం తర్వాత టీమిండియా ప్లేయర్లు తెలుపు రంగు దుస్తులు వేసుకోబోతున్నారు. స్వదేశం వేదికగా ఆఫ్గనిస్తాన్ జట్టుతో ఏకైక టెస్ట్ ఆడబోతున్నారు. టెస్ట్ క్రికెట్లో ఆఫ్ఘనిస్తాన్ పసికూన. అలాగని ఆ జట్టులో భయంకరమైన ప్లేయర్లు ఉన్నారు. ఏదైనా జరగరనిది జరిగితే భారత్ కు ఇబ్బంది తప్పదు. అసలే డబ్ల్యూటీసి పాయింట్లలో భారత్ ఆరవ స్థానంలో ఉంది. అలాంటప్పుడు ఆఫ్గనిస్తాన్ జట్టుతో జరిగే ఏకైక మ్యాచ్ భారత జట్టుకు అత్యంత ముఖ్యం. ఈ మ్యాచ్లో కనుక భారత్ భారీ తేడాతో గెలిస్తే.. డబ్ల్యూటీసి పాయింట్లలో తన స్థానాలను మెరుగుపరుచుకుంటుంది.

చండీగఢ్ కొత్త స్టేడియంలో శనివారం నుంచి ఈ టెస్ట్ జరుగుతుంది.. ఇటీవల ఈ మైదానంలో ఐపీఎల్ మ్యాచ్లు జరిగాయి. ఆఫ్ఘనిస్తాన్ జట్టులో రషీద్ ఖాన్ లేడు. అలాగని ఆ జట్టు అంత సులభంగా కనిపించడం లేదు. టి20 ఫార్మాట్.. వన్డే ఫార్మేట్ లో పెద్ద పెద్ద జట్లకు షాక్ ఇచ్చిన ఆఫ్ఘనిస్తాన్.. టెస్ట్ క్రికెట్లో కూడా అదే స్థాయిలో ఆడితే మాత్రం భారత జట్టుకు ఇబ్బందులు తప్పవు.

టెస్ట్ క్రికెట్లో స్వదేశంలో టీం ఇండియాకు గతంలో తిరుగు లేని రికార్డు ఉండేది. దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ జట్ల చేతిలో దారుణమైన పరాభవాలు ఎదురు కావడం టీమిండియా ఆట తీరును ప్రశ్నార్థకం చేస్తున్నాయి. రోహిత్, కోహ్లీ, అశ్విన్ వీడ్కోలు పలికిన తర్వాత టెస్ట్ జట్టు కాస్త కళ తప్పింది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ విభాగంలో టీమిండియా ఆరో స్థానంలో ఉండడంతో ఈ మ్యాచ్ గెలవడం అత్యంత అవసరం.. ఈ మ్యాచ్లో జడేజా కూడా లేడు. అశ్విన్ రిటర్మెంట్ తీసుకోవడం.. జడేజా లేకపోవడం ఒకరకంగా టీమ్ ఇండియాకు ఇబ్బంది. భారత స్పిన్ విభాగాన్ని కులదీప్ యాదవ్ ముందుండి నడిపించాల్సిన అవసరం ఉంది. వాషింగ్టన్ సుందర్ కూడా అతడికి సహకారం అందిస్తాడు. ఇక హర్ష్ దూబే, మానవ సుతార్ ఎవరో ఒకరు జట్టులోకి వస్తారు. సిరాజ్ పేస్ బౌలింగ్ దళానికి నాయకత్వం ఇస్తాడు. ప్రసిద్ధి కృష్ణ అతడితోపాటు బంతి పంచుకుంటాడు. బుమ్రా కు విశ్రాంతి ఇచ్చారు.. ఓపెనర్లుగా జైస్వాల్, కేఎల్ రాహుల్ బరిలోకి దిగుతారు.. సాయి సుదర్శన్ మూడో స్థానం..గిల్, పంత్, జురెల్, సుందర్ తర్వాత స్థానాలలో బ్యాట్ అందుకుంటారు.. భారత్ ఒకవేళ ముందుగా బ్యాటింగ్ చేస్తే రెండవ ఇన్నింగ్స్ ఆడకుండానే.. భారీగా పరుగు చేస్తున్న అవసరం ఉందని అభిమానులు భావిస్తున్నారు.

2018లో ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో భారత్ బెంగళూరు వేదికగా ఒక టెస్ట్ ఆడింది. ఇన్నింగ్స్ 262 పరుగుల తేడాతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఈ మైదానం లో నల్లటి మట్టితో కూడిన పిచ్ రూపొందించారు. బ్యాటింగ్ కు అనుకూలంగా ఉంటుంది. వర్షం ముప్పు లేదు. కాకపోతే ప్రారంభంలో పేస్ బౌలర్లకు.. ఆ తర్వాత స్పిన్ బౌలర్లకు మైదానం అనుకూలిస్తుంది.

మూడు వారాల్లో.. మూడు దేశాల అధినేతలు.. మోడీ స్కెచ్ ఇలా కూడా ఉంటుందా..

India Foreign Policy
India Foreign Policy

India Foreign Policy: ప్రపంచ వ్యాప్తంగా మందగమన పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఆర్థికంగా ఒత్తిడి వాతావరణం.. దేశాల మధ్య యుద్ధాలు ఆందోళన కలిగిస్తున్నాయి. దీనికి తోడు ఇండియన్ కరెన్సీ మీద డాలర్ ఒత్తిడి పెరిగిపోతోంది. ఇదంతా కూడా ఇండియన్ ఎకానమీని తీవ్రంగా ఇబ్బంది పడుతోంది. ఈ క్రమంలో వాణిజ్యం.. భద్రత.. ఇంకా రకరకాల సమస్యలను పరిష్కరించుకోవడానికి భారత ప్రధాని నరేంద్ర మోడీ కీలక అడుగులు వేశారు. కేవలం మూడు వారాల్లోనే మూడు దేశాల అధినేతలు భారత్ లో సందర్శించే విధంగా చేశారు. ట్రేడ్ ఒప్పందాలు.. ఇంకా అనేక రకాల వ్యవహారాలు ఇక్కడ కుదిరాయి.

సైప్రస్ దేశాధినేత నికోస్ క్రిస్టో డో లైడ్స్ ఇటీవల భారత దేశంలో పర్యటించారు. మధ్యదరా సముద్ర తీర ప్రాంతంలో వ్యూహాత్మక దేశంగా సైప్రస్ ఉంది. యూరోపియన్ యూనియన్ లో కూడా ఈ దేశం అత్యంత కీలకం. యూరోపియన్ యూనియన్ తో భారత్ ఫ్రీ ట్రేడ్ ఎగుమతి ఒప్పందాలు కుదుర్చుకున్న తర్వాత.. సైప్రస్ దేశాధినేత ఇండియా రావడం ప్రాధాన్యం సంతరించుకుంది.. సైప్రస్ కు టర్కీ దగ్గర ఉంటుంది. టర్కీ మొదటి నుంచి కూడా మనకు వ్యతిరేక ధోరణి ప్రదర్శిస్తోంది. అందువల్లే టర్కీ కి చెక్ పెట్టాలంటే సైప్రస్ దగ్గర కావడమే భారత్ ముందున్న ఏకైక మార్గం. పైగా మిడిల్ ఈస్ట్ కారిడార్ లో ట్రేడ్ ఒప్పందాలు.. వ్యవహారాలకు సైప్రస్ అత్యంత కీలకం.

మే 30 నుంచి జూన్ 3 వరకు మయన్మార్ దేశాధినేత మిన్ ఆంగ్ రాంగ్ మనదేశంలో పర్యటించారు. ఈ దేశం మీద అమెరికా నుంచి ఇతర దేశాల వరకు ఆంక్షలు కొనసాగిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం మిన్ బలవంతంగా అధికారాన్ని సొంతం చేసుకోవడం.. ఈ దేశానికి చైనా మాత్రమే సహకారం అందిస్తోంది. ఇక్కడ అత్యంత క్రిటికల్ మినరల్స్ ఉన్నాయి. పైగా మన దేశానికి సంబంధించి అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం, వంటి రాష్ట్రాలలో 1600 కిలోమీటర్ల సరిహద్దు ఈ దేశం పక్కనే ఉంది. ఈ దేశం పైన ఉన్న కొండ ప్రాంతాలలో క్రైస్తవులు అధికంగా ఉన్నారు. వారంతా కూడా ఆదివాసి తెగలకు చెందినవారు. వీరు ఇటీవల కాలంలో మనదేశంలోని ఈశాన్య రాష్ట్రాలలో ఉగ్రవాదాన్ని ప్రేరేపించే విధంగా కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. ఆ దృశ్యాలను భారత సైనిక బృందాలు డ్రోన్ల ద్వారా గుర్తించాయి. పైగా కొంతమంది మాదకద్రవ్యాలను కూడా తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. అందువల్లే సరిహద్దుల్లో భద్రత.. ఈశాన్య రాష్ట్రాలలో శాంతి స్థాపన.. ఈ అంశాలు మయన్మార్ మీద ఆధారపడి ఉన్నాయి. అందువల్లే మయన్మార్ అధ్యక్షుడు భారత్లో పర్యటించారు. ఆయనకు భారత ప్రభుత్వం రెడ్ కార్పెట్ స్వాగతం పలికింది.. చైనాతో ఉద్రిక్తతలు ఎప్పుడు కొనసాగుతాయో తెలియదు. అందువల్లే మయన్మార్ కు భారత్ అత్యంత దగ్గరయింది.

వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సి రోడ్రిగ్జ్ ప్రస్తుతం ఇండియాలో ప్రకటిస్తున్నారు. మధురో ను అమెరికా అపహరించిన తర్వాత డెల్సి తాత్కాలిక అధ్యక్షురాలుగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం భారత్ వెనిజులా నుంచి ప్రతిరోజు 4,27,000 బ్యారెళ్ల ముడిచమురును భారత్ కొనుగోలు చేస్తోంది. హర్ముజ్ జల సంధిలో చమురు రవాణా సాఫీగా సాగకపోవడం.. అనేక రకాల ఇబ్బందుల నేపథ్యంలో వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలు భారత్ లో పర్యటించడం.. అనేక రకాల ఒప్పందాలను భారత్ కుదుర్చుకోవడం ఇక్కడ విశేషం. అయితే భవిష్యత్తు కాలంలో ఇరాన్ నుంచి పూర్తిస్థాయిలో క్రూడ్ ఆయిల్ రాకపోతే.. వెనిజులా నుంచి తీసుకోవాలని భారత్ నిర్ణయించింది. దానిని అమల్లో కూడా పెట్టింది.

మూడు వారాలు.. మూడు దేశాల అధినేతలు.. కీలకమైన ఒప్పందాలు.. ఇవన్నీ కూడా మన దేశానికి ఎంతో మేలు చేసేవి. ఇప్పుడున్న పరిస్థితుల్లో దౌత్యపరంగా భారత్ కీలకమైన ముందడుగు వేయకపోతే భవిష్యత్తు కాలంలో చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. అందువల్లే మోదీ తన మార్క్ తెలివిని ఇక్కడ ప్రదర్శించారు. అందువల్లే భవిష్యత్తు కాలంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నారు.

ఈ రాశి వారి ఇంట్లో ఈరోజు ధన పండుగ.. పట్టిందల్లా బంగారమే..

Today 6 June 2026 Horoscope
Today 6 June 2026 Horoscope

Today 6 June 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారం ద్వాదశరాసులపై ధనిష్ట నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఈరోజు అద్భుతమైన లాభాలు ఉండనున్నాయి. మరి కొన్ని రాశుల వారు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

మేష రాశి (అశ్విని, భరణి,1,2,): ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపారులకు కొందరు సపోర్టు ఇవ్వడంతో అధిక లాభాలు రానున్నాయి. ఉద్యోగులకు అధికారుల మద్దతు ఉంటుంది. దీంతో కొందరికి పదోన్నతి వచ్చే అవకాశం ఉంది. మరికొందరికి అదనపు ఆదాయం చేకూరుతుంది. విద్యార్థుల పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు.

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారు ఈరోజు పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. విద్యార్థులు కొత్త కోర్సుల్లో జాయిన్ అయ్యే అవకాశం ఉంది. ఆర్థికంగా మెరుగైన ఫలితాలు ఉంటాయి. దూర ప్రయాణాలు చేయాల్సివస్తే జాగ్రత్తగా ఉండాలి. కురుమ జీవితం సంతోషంగా ఉంటుంది. కష్టానికి తగిన ఫలితాన్ని పొందుతారు. డబ్బు ప్రవాహం పెరుగుతుంది.

మిథున రాశి( మృగశిర 3,4 ): ఈ రాశి వారికి ఈ రోజు అన్ని శుభ ఫలితాలే ఉంటాయి. లక్ష్మీదేవి ఆశీస్సులతో కొన్ని పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. పిల్లల కెరీర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. అనుకోకుండా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. స్నేహితుల సహకారంతో అప్పులను తీరుస్తారు.

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారికి ఈరోజు అన్నీ కలిసి వస్తాయి. వ్యాపారులకు గతంలో కంటే ఇప్పుడు అధిక లాభాలు ఉంటాయి. కొందరు విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే కష్టంగా విజయం సాధించే అవకాశం ఉంటుంది. సన్నిహితుల నుంచి కీలకమైన సమాచారాన్ని అందుకుంటారు. విదేశాల్లో ఉండే వారితో వ్యాపారం చేసే వారికి అనుకూలమైన వాతావరణం ఉంటుంది.

సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారికి ఈ రోజు స్నేహితులు ధన సహాయం చేస్తారు. అయితే ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. రాజకీయాల్లో ఉండే వారికి ప్రజల నుంచి పదోన్నతులు ఉండే అవకాశం ఉంది. ప్రియమైన వారికి కావాల్సిన వస్తువులను కొనుగోలు చేస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు.

కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారు ఈ రోజు జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. శని దేవుడు ఆశీస్సులు ఉండడంతో అన్ని శుభ ఫలితాలే ఉంటాయి. పెండింగు పనులను పూర్తి చేస్తారు. కొత్త విషయాలపై ఆసక్తిగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారు ఈ రోజు సమాజంలో గౌరవం పొందుతారు. ఖర్చులు గలనీయంగా పెరిగే అవకాశం ఉంది. పెద్దల ఆశీస్సులతో కొత్తగా పెట్టుబడును పెడతారు. కొన్ని దోషాల నుంచి విముక్తి పొందడంతో జీవితం సంతోషంగా సాగుతుంది. పెద్దల ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సివస్తుంది.

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వ్యాపారులకు ఈరోజు మెరుగైన ఫలితాలు ఉంటాయి. గతంలో చేపట్టిన పనులన్నీ ఒకే సమయంలో పూర్తి చేస్తారు. కష్టానికి తగిన ఫలితం ఉంటుంది. సన్నిహితుల నుంచి కీలకమైన సమాచారం అందుతుంది. విద్యార్థులు గురువుల మద్దతుతో పోటీ పరీక్షలో పాల్గొనడానికి సిద్ధమవుతారు. పెద్దల అండదండలతో వ్యాపారులకు లాభాలు ఉంటాయి.

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వ్యాపారులకు ఈరోజు అన్ని విజయాలే ఉంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనుకోకుండా ఖర్చులు పెరిగే అవకాశం ఉంటే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక కార్యకలాపాలపై ఆసక్తి పెరుగుతుంది. స్నేహితులతో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. శని దేవుడి అండదండలతో కొన్ని పనులు పూర్తి అవుతాయి.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారు ఈ రోజు మెరుగైన ఫలితాలు సాధిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. తోటి ఉద్యోగుల సహకారంతో ముఖ్యమైన ప్రాజెక్టులను పూర్తి చేస్తారు. దూర ప్రయాణాలు చేసే వారు జాగ్రత్తగా ఉండాలి. పెట్టుబడుల విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉండకూడదు.

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కొన్ని ముఖ్యమైన పనులను పూర్తి చేయడానికి స్నేహితుల సహకారం తీసుకుంటారు. ప్రియమైన వారితో కలిసి ఉంటారు. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కొత్త వస్తువులు కొనుగోలు చేసే విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. కొందరు పక్కనే ఉండి మోసం చేసే అవకాశం ఉంటుంది.

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారి ఆరోగ్య విషయంలో ఈరోజు మెరుగైన ఫలితాలు ఉంటాయి. ప్రియమైన వారికోసం కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. పెండింగ్ పల్లెలు పూర్తి చేస్తారు. ఎవరికైనా డబ్బు ఇచ్చే విషయంలో ఆలోచించాలి. వ్యాపారులకు గతంలో కంటే ఇప్పుడు లాభాలు ఎక్కువగా ఉంటాయి.

ఈ ఫోన్ లో రెండు చిప్‌సెట్‌లు.. భారత్ లో ఎలా ఉంటుంది..

Samsung Galaxy Z Flip 8
Samsung Galaxy Z Flip 8

Samsung Galaxy Z Flip 8: స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ఫోల్డబుల్ ఫోన్లకు పెరుగుతున్న ఆదరణ నేపథ్యంలో Samsung తన తదుపరి క్లామ్‌షెల్ ఫోల్డబుల్ ఫోన్ Galaxy Z Flip 8ను జూలైలో జరిగే Galaxy Unpacked ఈవెంట్‌లో ఆవిష్కరించే అవకాశం ఉన్నట్లు లీకులు చెబుతున్నాయి. ఈసారి ఫోన్‌లో అత్యంత ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. ఒకే మోడల్‌ను రెండు వేర్వేరు ప్రాసెసర్లు కనిపిస్తాయి. అలాగే ఇందులో ఆకట్టుకునే ఫీచర్లు ఉన్నాయి. ఈ ప్రాసెసర్లు.. ఫోన్ గురించి పూర్తి వివరాల్లోకి వెళితె..

Samsung Galaxy Z Flip 8 కొన్ని మార్కెట్లలో శాంసంగ్ సొంత Exynos 2600 చిప్‌తో, మరికొన్ని దేశాల్లో Snapdragon 8 Elite Gen 5 for Galaxy ప్రాసెసర్‌తో అందుబాటులోకి రావచ్చు. గత ఏడాది వచ్చిన Galaxy Z Flip 7 పూర్తిగా Exynos 2500 చిప్‌తోనే విడుదల కాగా.. ఈసారి కంపెనీ మళ్లీ రెండు చిప్‌సెట్ వ్యూహాన్ని అనుసరించే అవకాశాలు కనిపిస్తున్నాయి.కొన్ని నివేదికల ప్రకారం Exynos 2600 తయారీ వ్యయం ఎక్కువగా ఉండటం.. మరోవైపు Qualcomm తన ఫ్లాగ్‌షిప్ చిప్‌కు అనుకూల ధరలు ఆఫర్ చేయడం వల్ల శాంసంగ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో కొన్ని ప్రాంతాల్లో Snapdragon, మరికొన్ని ప్రాంతాల్లో Exynos వేరియంట్లను విక్రయించే అవకాశం ఉంది.

భారత్, యూరప్, దక్షిణ కొరియా వంటి మార్కెట్లలో Exynos 2600 వేరియంట్ వచ్చే అవకాశం ఉందని టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అమెరికా, కెనడా, చైనా, జపాన్ వంటి దేశాల్లో Snapdragon వేరియంట్ అందుబాటులోకి రావచ్చని సమాచారం. అయితే దీనిపై శాంసంగ్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.

Exynos 2600 ప్రపంచంలోనే తొలి 2 నానోమీటర్ (2nm) ప్రాసెస్ టెక్నాలజీతో తయారైన మొబైల్ చిప్‌లలో ఒకటిగా గుర్తింపు పొందింది. ఇందులో 10 కోర్ CPU, మెరుగైన AI సామర్థ్యాలు, అధునాతన GPU, మెరుగైన పవర్ ఎఫిషియెన్సీ వంటి ఫీచర్లు ఉంటాయని శాంసంగ్ చెబుతోంది. గేమింగ్, మల్టీటాస్కింగ్, AI ఆధారిత పనితీరులో ఇది గణనీయమైన మెరుగుదల అందించగలదని భావిస్తున్నారు.

Galaxy Z Flip 8 డిజైన్ పరంగా Flip 7ను పోలి ఉండే అవకాశం ఉంది. అయితే కొత్త హింజ్ డిజైన్, తక్కువగా కనిపించే స్క్రీన్ క్రీజ్, మరింత సన్నగా ఉండే బాడీ, తక్కువ బరువు వంటి చిన్నచిన్న మెరుగుదలలు ఉండొచ్చని లీకులు సూచిస్తున్నాయి. ఫోల్డబుల్ ఫోన్లలో క్రీజ్ సమస్యను తగ్గించడంపై శాంసంగ్ ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.

ఈ Galaxy Z Flip 8లో 6.9 అంగుళాల AMOLED డిస్‌ప్లే ఉండొచ్చని అంటున్నారు. సుమారు 4.1 అంగుళాల కవర్ స్క్రీన్ ఉండొచ్చు. కెమెరా విభాగంలో 50MP ప్రధాన సెన్సార్, 12MP అల్ట్రా వైడ్ కెమెరా, 10MP సెల్ఫీ కెమెరా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ ఫోన్‌లో 4,300mAh బ్యాటరీ ఉండగా.. 25W ఫాస్ట్ ఛార్జింగ్, 15W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండొచ్చని సమాచారం. Android 16 ఆధారిత One UIతో పాటు Galaxy AI ఫీచర్లు కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. దీర్ఘకాలిక సాఫ్ట్‌వేర్ అప్‌డేట్లను కూడా శాంసంగ్ అందించవచ్చని నివేదికలు సూచిస్తున్నాయి.