Today 7 June 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆదివారం ద్వాదశ రాశులపై శతభిషా నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఈ రోజు అనుకోకుండా అదృష్టం వరించనుంది. మరికొన్ని రాశుల వారు ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
మేష రాశి (అశ్విని, భరణి,1,2,): ఈ రాశి వ్యాపారులకు ఈరోజు అపారమైన అవకాశాలు వస్తాయి. కొత్తగా పెట్టుబడును పెట్టడానికి ఇదే మంచి సమయం. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో అన్యంగా ఉంటారు. గతంలో అనుకున్న కోరికల్లో ఒకటి నెరవేరుతుంది. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. తల్లిదండ్రుల అండదండలు ఉండడంతో వ్యాపారులు కొత్తగా పెట్టుబడును పెడతారు. జీవిత భాగస్వామితో విహారయాత్రలకు వెళ్తారు. పిల్లలతో కలిసి ఉత్సాహంగా ఉంటారు. కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేయడం వల్ల సమాజంలో గౌరవం లభిస్తుంది. ఆరోగ్య విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టాలి.
మిథున రాశి( మృగశిర 3,4 ): ఈ రాశి వారికి ఈ రోజు ఆర్థికంగా మెరుగైన ఫలితాలు ఉంటాయి. స్నేహితుల సహకారంతో అప్పులను తీరుస్తారు. కొన్ని ముఖ్యమైన పనులను కుటుంబ సభ్యుల అండదండలతో పూర్తి చేస్తారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. కొత్త విషయాలు నేర్చుకోవడంతో ఉత్సాహంగా ఉంటారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారికి ఈ రోజు కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అయితే వ్యాపారులకు మాత్రం ఆర్థిక లాభాలు ఉంటాయి. ఉద్యోగులకు అధికారుల నుంచి మద్దతు ఉంటుంది. ఇదే సమయంలో ప్రాజెక్టులు పూర్తి చేయడానికి కొంత ఆలస్యం అయ్యే అవకాశం ఉంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షలో రాణించడానికి కష్టపడాల్సి వస్తుంది. ప్రయాణాల్లో అసౌకర్యాలు ఎదురవుతాయి.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారికి ఈరోజు అనుకున్న కోరికలు నెరవేరుతాయి. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. కుటుంబ సభ్యులతో వివాదం ఉంటే వెంటనే పరిష్కరించుకోవడం మంచిది. జీవిత భాగస్వామితో విభేదాలు ఉంటాయి. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న వారికి ఈరోజు ముఖ్యమైన సమాచారం అందుతుంది. లక్ష్మీదేవి అండదండలతో ఆర్థికంగా స్థిరత్వం ఉంటుంది.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారికి ఈ రోజు అంచనాలకు మించి లాభాలు ఉంటాయి. కుటుంబ సభ్యుల మద్దతు ఉండడంతో సంతోషంగా గడుపుతారు. జీవిత భాగస్వామి కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు. కొత్తగా పెట్టుబడులు పెట్టేవారు పెద్దలను సంప్రదించడం మంచిది. విద్యార్థులకు గురువుల అండదండలు ఉండడంతో పోటీ పరీక్షల్లో రాణిస్తారు.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారికి ఈ రోజు ప్రయాణాలు అనుకూలిస్తాయి. పిల్లల కెరీర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. పూర్వీకుల ఆస్తికి సంబంధించిన శుభవార్తను వింటారు. కుటుంబ జీవితం సంతోషంగా సాగుతుంది. కొత్తగా ఆస్తి కొనాలని అనుకునే వారికి ఇదే మంచి సమయం. గతంలో కంటే ఇప్పుడు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారి కుటుంబ జీవితం ఈరోజు సాఫీగా సాగుతుంది. బంధువుల నుంచి శుభవార్తను వింటారు. ప్రియమైన వారితో దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. పెద్దల సలహాతో కొత్తగా పెట్టుబడులు పెడతారు.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారికి ఈ రోజు కొత్త పనులు చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. గతంలో కంటే ఇప్పుడు ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు. అనుకోకుండా ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. సమాజంలో గౌరవం లభిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తారు.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వ్యాపారులకు ఈరోజు ఊహించిన దానికంటే ఎక్కువగా లాభాలు ఉంటాయి. కొత్తగా ఒప్పందాలు చేసుకుంటారు. త్వరలో చేసే విహారయాత్రల కోసం ప్లాన్ చేసుకుంటారు. ఉద్యోగులు అధికారుల అండదండలతో అనుకున్న పనులను సమయానికి పూర్తి చేస్తారు. విద్యార్థులు తమ నైపుణ్య ప్రదర్శన ద్వారా అనుకున్నది సాధిస్తారు.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారికి ఈ రోజు ఆదాయం గణనీయంగా ఉంటుంది. నాణ్యమైన సమయాన్ని పిల్లలతో గడుపుతారు నిరుద్యోగులు కొత్త విషయాలను నేర్చుకుంటారు. గతంలో కంటే ఇప్పుడు ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు. పెండింగ్లో ఉన్న డబ్బు వసూలు అవుతుంది. ఎవరికైనా డబ్బు ఇచ్చేటప్పుడు ఆలోచించాలి.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారు ఈ రోజు ఇంట్లో శుభకార్యాన్ని నిర్వహించే అవకాశం ఉంటుంది దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. సమాజంలో గౌరవం లభిస్తుంది. ఆగిపోయిన పనులను ఈరోజు పూర్తి చేస్తారు. పుణ్యక్షేత్రానికి విహారయాత్రలకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
















ఆర్కే కొత్త పలుకు: టిడిపి, జనసేన తెలంగాణకు దూరంగా ఉండటమే మంచిది
RK Kotha Paluku: చాలాకాలం తర్వాత ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ తనదైన విశ్లేషణ చేశారు. తనలో ఉన్న జర్నలిస్టును బయటకు తీసుకొచ్చారు. మార్మికంగా ఉన్న విషయాలను కుండబద్దలు కొట్టే విధంగా రాశారు. ఫలితంగా ఈ ఆదివారం కొత్త పలుకు చాలామందికి గడ్డి పెట్టే విధంగా ఉంది. కొందరికి అయితే కర్రు కాల్చి వాతపెట్టినట్టుగా ఉంది.
కొద్దిరోజులుగా రెండు రాష్ట్రాలలో మళ్ళీ ప్రాంతీయవాదం కనిపిస్తోంది. ఓ రాజకీయ విశ్లేషకుడి మాటలు.. అవి కాస్త వివాదాస్పదమైన తీరు.. దానికి తెలంగాణ సెంటిమెంట్ పూయడం.. ఇంకా రకరకాల విషయాలు తెరపైకి వచ్చాయి. వాస్తవానికి ఆ విశ్లేషకుడి మాటలకు కొంతమంది కావాలని తెలంగాణ వాదాన్ని పూశారు. జనసేన అధినేత పవన్ సరిగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు తెలంగాణలో సమావేశం పెట్టడం.. దానికి తెలంగాణ ప్రభుత్వం అడ్డు చెప్పడం.. కొంతమంది మంత్రులు స్థాయి దాటి పవన్ మీద విమర్శలు చేయడం వంటి పరిణామాలు జరిగిపోయాయి.
ఈ లోగానే కొంతమంది యూట్యూబర్లు అత్యుత్సాహంతో పవన్ కళ్యాణ్ కోడి చెరువును ఆక్రమించారని తెరపైకి వచ్చారు. వారి తర్వాత కల్వకుంట్ల కవిత కూడా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి పవన్ కళ్యాణ్ కొనుగోలు చేసిన చెరువు శిఖాన్ని ప్రభుత్వానికి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇవన్నీ ఇలా వరుసగా జరిగిపోతూనే ఉన్నాయి. కాకపోతే కొంతమంది ఔత్సాహికులు మరింత రెచ్చిపోతున్నారు. తెలంగాణ సెటిల్మెంట్ విషయంలో మరింత అగ్గి రాజేస్తున్నారు. వారందరికీ రాధాకృష్ణ గట్టిగానే గడ్డి పెట్టారు. కాంగ్రెస్ నుంచి మొదలుపెడితే గులాబీ పార్టీ నాయకుల వరకు అందరికీ కర్రు కాల్చి వాతపెట్టారు. ఇటీవల కాలంలో రాధాకృష్ణ ఈ స్థాయిలో రాసిన సంపాదకీయం లేదు.
తెలంగాణ ఏర్పాటును సిపిఎం వ్యతిరేకించింది. ఆ పార్టీకి నాగేశ్వర్ సానుభూతిపరుడు. అటువంటి నాగేశ్వర్ తెలంగాణ వాదుల సహకారం తీసుకోవడం నిజంగా ఆశ్చర్యకరం.
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తెలంగాణలో ఉన్న వనరులను దోచుకోలేదు.. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల భూములను కబ్జా చేశారు. నాడు ఉద్యమ నాయకుడిగా ఉన్న కేసీఆర్ పదేపదే ఈ స్థాయిలో విమర్శలు చేశారు.. కానీ ఈ నాటికి కూడా రాజశేఖర్ రెడ్డి, ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి తెలంగాణ వాదులకు టార్గెట్ గా లేరు.
కాంగ్రెస్ నేతలు పవన్ కళ్యాణ్ మీద రెచ్చిపోతే అది గులాబీ పార్టీకి అనుకూలంగా మారుతుంది. ఎందుకంటే తెలంగాణ సెంటిమెంట్ ఏ రూపంలో ఉన్నప్పటికీ అది బీఆర్ ఎస్ కు ప్రయోజనం కలిగిస్తుంది. కాంగ్రెస్ నేతలు తెలంగాణ సెంటిమెంట్ రగిలించే ప్రయత్నం చేశారంటే.. దానివల్ల రేవంత్ రెడ్డి నష్టపోవడం గ్యారంటీ.
తెలంగాణ రాజకీయాలలో తెలుగుదేశం, జనసేన ప్రవేశిస్తే ప్రతిఘటన ఉంటుందని అర్థమవుతుంది. అలాంటప్పుడు ఆ రెండు పార్టీలతో బిజెపి పొత్తు పెట్టుకోకపోవడమే మంచిది. అయితే ఇది కూడా గులాబీ పార్టీకి అనుకూలంగా ఉంటుంది.
ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి చెందిన వారి సంస్థలకు తెలంగాణలో కాంట్రాక్టర్లు ఇవ్వమని మంత్రి కోమటిరెడ్డి చెప్పారు. అలాంటప్పుడు ఆ కంపెనీలు వెళ్లిపోతే పనులు ఎవరు చేస్తారు
విదేశీ కంపెనీలకు భారీగా రాయితీలిచ్చి.. అన్ని రకాల వసతులు కల్పిస్తున్న తెలంగాణ ప్రభుత్వం.. ఆంధ్ర కంపెనీల మీద ద్వేషాన్ని ప్రదర్శించడం ఏంటి.. ఇక్కడ ఆంధ్ర కంపెనీలు పన్నులు చెల్లిస్తున్నాయి కదా
భారత రాష్ట్ర సమితి తమ తొమ్మిదిన్నర సంవత్సరాల పరిపాలన కాలంలో ఎంతమంది తెలంగాణ కాంట్రాక్టర్లను.. పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించింది.. తెలంగాణ వాదులు దీనికోసం పోరాటం చేయాలి.. అనవసరంగా ఆంధ్ర వాళ్ళ మీద ద్వేషాన్ని పెంచుకోకూడదు. దీనివల్ల లాభం కూడా ఉండదు
ఇదిగో ఇలా సాగిపోయింది రాధాకృష్ణ కొత్త పలుకు సంపాదకీయ పరంపర. వాస్తవానికి ఈ స్థాయిలో ఏ పాత్రికేయుడు కూడా విశ్లేషణ చేయలేదు. న్యూట్రల్ గా రాసుకుంటూ రాలేదు. అందువల్లే రాధాకృష్ణ కొత్త పలుకు ఈ వారం మిస్సైల్ లాగా పేలింది.