Home Blog Page 177

సుకుమార్ మూవీ తర్వాత రామ్ చరణ్ ఆ స్టార్ డైరెక్టర్ తో సినిమా చేయబోతున్నాడా..?

Ram Charan Next Movie
Ram Charan Next Movie

Ram Charan Next Movie: సినిమా ఇండస్ట్రీలో రాణించడం అనేది అంత ఆషామాషీ వ్యవహారం కాదు. ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. నటుడిగా తనను తాను ప్రూవ్ చేసుకోవాల్సిన సందర్భాలు చాలానే ఉంటాయి. ఒకరిని మించి మరొకరు సక్సెస్ లను సాధిస్తుంటే వాళ్లకంటే మనం కొత్తగా ఏం చేయాలి అని ఒక నటుడు విపరీతమైన ఆవేదన పడుతుంటాడు. వారసత్వపరంగా సినిమా ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళు ఎక్కువ కాలం పాటు సినిమా ఇండస్ట్రీలో వాళ్ల మనుగడను కొనసాగించలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్లకు వారసత్వంగా వచ్చిన వాళ్ళకంటూ ఒక టాలెంట్ లేకపోతే మాత్రం వాళ్ళు ఇండస్ట్రీకి రావడం చాలా కష్టమవుతుందనే చెప్పాలి. ఇక ఇలాంటి క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ సైతం చిరంజీవి కొడుకుగా వచ్చినప్పటికి ఆయన చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా మారాడు. మగధీర సినిమాతో ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేశాడు. ప్రస్తుతం బుచ్చిబాబు డైరెక్షన్ లో చేసిన పెద్ది సినిమాతో సైతం మరోసారి ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేసే దిశగా ముందుకు దూసుకెళ్తుండడం విశేషం…

అలాంటి రామ్ చరణ్ ఇప్పుడు సుకుమార్ తో మరో సినిమా చేస్తున్నాడు. ఇంతకు ముందే వీళ్ళ కాంబినేషన్లో ‘రంగస్థలం’ అనే సినిమా వచ్చింది. ఈ మూవీ సూపర్ సక్సెస్ ని సాధించడమే కాకుండా ఇండస్ట్రీలో ఉన్న పలు రికార్డులను సైతం బ్రేక్ చేసింది. అలాంటి కాంబినేషన్ లో తెరకెక్కబోయే నెక్స్ట్ సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందనేది మెగా అభిమానుల్లో చాలా రకాలుగా ఊహించుకుంటున్నారు.

ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ ఇంకెవరితో సినిమా చేయబోతున్నాడు అనే ధోరణిలో కూడా మరికొన్ని అభిప్రాయాలైతో వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఆయన ఒక స్టార్ డైరెక్టర్ తో తన నెక్స్ట్ సినిమాను చేయాలని చూస్తున్నాడట. టెక్నికల్గా స్ట్రాంగ్ గా ఉండే దర్శకులైతేనే అతనికి బెస్ట్ అని అనుకుంటున్నాడట. ఇక ఈ రకంగా చూసుకుంటే తర్వాత సినిమా లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో చేసే అవకాశాలైతే ఉన్నాయి.

ప్రస్తుతం లోకేష్ కనకరాజ్ అల్లు అర్జున్ తో సినిమా చేస్తున్నాడు. ఇంకా ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్లలేదు. ప్రస్తుతం అట్లీ డైరెక్షన్లో అల్లు అర్జున్ చేస్తున్న సినిమా పూర్తి అయిన తర్వాత లోకేష్ కనకరాజ్ సినిమాని సెట్స్ మీదకి తీసుకెళ్తాడట. ఆ సినిమా ముగిసిన తర్వాత రామ్ చరణ్ లోకేష్ కనకరాజ్ ప్రాజెక్టు పట్టలెక్కే అవకాశాలైతే ఉన్నాయి…

ప్రొడ్యూసర్ గా మారుతున్న జూనియర్ ఎన్టీఆర్... మొదటి మూవీ ఆ డైరెక్టర్ తోనేనా..?

Junior NTR Producer

Junior NTR Producer: తెలుగు సినిమా ఇండస్ట్రీ స్థాయిని పెంచిన వాళ్ళలో నందమూరి తారక రామారావు గారు మొదటి స్థానం లో ఉంటాడు. ఆయన తమిళ్ సినిమా ఇండస్ట్రీ నుంచి ఎదురయ్యే పోటీని తట్టుకొని మరి తెలుగు ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. ఇక నందమూరి వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని ముందుకు దూసుకెళుతున్న వారిలో బాలయ్య బాబు మొదటి స్థానంలో ఉన్నాడు. ఆయన తర్వాత ఆ ఫ్యామిలీ నుంచి వచ్చిన మూడోతరం హీరోగా జూనియర్ ఎన్టీఆర్ ముందుకు సాగుతున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ హీరో గానే కాకుండా ప్రొడ్యూసర్ గా కూడా తన సత్తా చాటుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు అతన్ని టాప్ లెవెల్లో నిల్చోబెట్టాయి. ఇక ఇప్పుడు ప్రొడ్యూసర్ గా మారి తన లక్కును పరీక్షించుకోవాలని చూస్తున్నాడు. ప్రస్తుతం చాలామంది హీరోలు పాన్ ఇండియాలో సినిమాలు చేస్తున్న విషయం మనకు తెలిసిందే.

ఇక తమిళ సినిమా ఇండస్ట్రీలో తన కెరియర్ ను స్టార్ట్ చేసి తెలుగులో కూడా సక్సెస్ఫుల్ హీరోగా కొనసాగుతున్న ప్రదీప్ రంగనాథన్ ను హీరోగా, దర్శకుడుగా పెట్టి ఎన్టీఆర్ ఒక సినిమా ప్రొడ్యూస్ చేయాలనే ప్రయత్నంలో ఉన్నాడు. దానికి సంబంధించిన కథ చర్చలను కూడా జరుపుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఏది ఏమైనా కూడా జూనియర్ ఎన్టీఆర్ చాలా మంచి డిసిజన్ తీసుకున్నాడు.

ఎందుకంటే ఆయన బ్యానర్ ద్వారా మరి కొంతమంది కొత్త దర్శకులకు కూడా అవకాశాలు వచ్చే ఛాన్స్ లైతే ఉన్నాయి. ఇక ఏది ఏమైనా కూడా హీరోగా రాణించిన జూనియర్ ఎన్టీఆర్ ప్రొడ్యూసర్ గా ఏ మేరకు రాణిస్తాడు. ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణ సంపాదించుకుంటాడా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…

ఇక ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సక్సెస్ ను సాధించినా కూడా జూనియర్ ఎన్టీఆర్ తన కెరియర్ ను స్టార్ట్ చేసిన చాలా తక్కువ సమయం టాప్ హీరోగా గుర్తింపును తెచ్చుకున్నాడు. కాబట్టి అటు హీరోగా తన ఇమేజ్ ను కాపాడుకుంటూనే ప్రొడ్యూసర్ గా కూడా రాణిస్తే బాగుంటుందని అతని అభిమానులు కోరుకుంటున్నారు…

అకౌంట్ లో ఊహించని నగదు.. ఈ ఆటో డ్రైవర్ ఏం చేశాడంటే

Mumbai auto driver honesty
Mumbai auto driver honesty

Mumbai auto driver honesty: నీతి అనేది లేదు. నిజాయితీ అనేది కనిపించడం లేదు. పాప భీతి మనుషుల్లో మచ్చుకైనా అగుపించడం లేదు. అందువల్లే రోజులు ఇలా మారిపోతున్నాయి. సాటి మనిషి మీద నమ్మకం కోల్పోయిన దుర్ధినాలు దాపురించాయి. ఇలాంటి రోజుల్లో కూడా నిజాయితీగా ఉండేవారు ఉన్నారు. కాకపోతే వారు అప్పుడప్పుడు కనిపిస్తున్నారు. ఈ కథనంలో మన చెప్పుకునే ఆ వ్యక్తి కూడా అటువంటి వాడే.

మనది కాని డబ్బు ఖాతాలో పడితే ఎలా ఉంటుంది.. మిగతా వాళ్ళకి ఏమో గాని ఇతడికి మాత్రం ఆ డబ్బు పాములాగా అనిపించింది. ఎందుకంటే పరుల సొమ్మును పాము లాగానే భావించాలని పెద్దలు చెప్పేవారు. ఇతడు కూడా అదే విధంగా అనుకున్నాడు. మరో మాటకు తావు లేకుండా అలా వచ్చిన సొమ్మును వెంటనే అలానే పంపించాడు. తన నిజాయితీ నిరూపించుకున్నాడు. ఇప్పుడు ఏకంగా దేశవ్యాప్తంగా చర్చకు కారణమయ్యాడు.

ఇటీవల మన దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరంలో శుభం అనే వ్యక్తి ఆటోలో ప్రయాణించాడు. దీనికిగాను అతడు 156 రూపాయలు చార్జి చెల్లించాల్సి ఉంది. అయితే 156 రూపాయలకు గాను 15,682 బదిలీ చేశాడు. ఆ తర్వాత శుభం తన దారిన తాను వెళ్లిపోయాడు. వెంటనే తను చేసిన తప్పును గుర్తించి శుభం ఎక్కడైతే దిగాడో అక్కడికి వచ్చాడు. అక్కడే డ్రైవర్ అల్తాఫ్ ఉన్నాడు. జరిగిన విషయాన్ని శుభం చెప్పాడు.

వెంటనే ఆల్తాఫ్ ఆ డబ్బును తిరిగి పంపించాడు. డ్రైవర్ నిజాయితీ తనను కదిలించిందని శుభం చెప్పాడు. అంతేకాదు ఆ డబ్బులు ఇచ్చినందుకు కృతజ్ఞతగా 500 ఇవ్వబోతే ఆటో డ్రైవర్ తీసుకోలేదని.. బలవంతంగా అతను జేబులో పెట్టి వచ్చారని శుభం పేర్కొన్నాడు. అతడు తనకు ఎదురైన ఈ అనుభవాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకున్నాడు. అది కాస్త ఇప్పుడు విపరీతమైన చర్చకు దారితీస్తోంది.

“నిజాయితీ అనేది మనుషుల్లో ఉంది. కాకపోతే తగ్గిపోయింది. ఈ ఆటో డ్రైవర్ తన నిజాయితీని నిరూపించుకున్నాడు. ఆ సొమ్ము తనది కాదని తెలిసిన వెంటనే తిరిగి పంపించాడు. చాలామంది ఇలా చేయరు. ఎందుకంటే ఒకసారి ఆయాచితంగా డబ్బులు ఖాతాలో పడితే ఎవరు కూడా ఇవ్వడానికి ఒప్పుకోరు. కానీ ఇతడు మనుషుల్లో ఉన్న మాణిక్యం అంటూ” సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి.

చండీగఢ్ టెస్ట్ అనుకున్నట్టుగానే.. తొలి రోజు టీమిండియా ఎంత కొట్టింది అంటే

Chandigarh Test Day 1 India score
Chandigarh Test Day 1 India score

Chandigarh Test Day 1 India score: అనుకున్నట్టుగానే చండీగఢ్ టెస్ట్ సాగుతోంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా దూసుకుపోతోంది. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉండడంతో టీమ్ ఇండియా ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో జరుగుతున్న ఈ టెస్ట్ లో భారీ విజయాన్ని సాధించాల్సి ఉంది. దానిని మనసులో పెట్టుకున్న భారత బ్యాటర్లు దూకుడుగా పరుగులు సాధిస్తున్నారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆఫ్ఘనిస్తాన్ జట్టు మీద సంపూర్ణమైన ఆధిపత్యాన్ని ప్రదర్శించారు.

ఓపెనర్ కేఎల్ రాహుల్ (100), సాయి సుదర్శన్ (81) కదం తొక్కితే.. కెప్టెన్ గిల్ (103*), రిషబ్ పంత్ (50*) సత్తా చూపించారు. ఫలితంగా తొలిరోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా మూడు వికెట్ల నష్టానికి 368 పరుగులు చేసింది. రెండో రోజు కూడా ఇదే జోరు కొనసాగించి ప్రత్యర్థి జట్టు మీద మరింత ఒత్తిడి పెంచాలని భావిస్తోంది. టీమిండియా ప్లేయర్లు తమకు లభించిన జీవధానాలను సద్వినియోగం చేసుకోవడంతో.. భారీ స్కోర్ సాధ్యమైంది.

కొంతకాలంగా తెలుపు రంగు బంతిలో మాత్రమే భారత ఆటగాళ్లు మ్యాచులు ఆడుతున్నారు. ఈ నేపథ్యంలో రెడ్ బాల్ ఫార్మాట్ లో సెట్ అవ్వడానికి టైం తీసుకుంటారని అభిమానులు అనుకున్నారు. కానీ అలాంటిదేమీ లేకుండా టీమిండియా బ్యాటర్లు స్వేచ్ఛగానే బ్యాటింగ్ చేశారు. ఆఫ్ఘనిస్తాన్ బౌలింగ్ లోపాలను సద్వినియోగం చేసుకొని పరుగులు రాబట్టారు. జైస్వాల్ (24) మినహా మిగతా బ్యాటర్లు మాత్రం దుమ్మురేపారు. ఫలితంగా భారత్ భారీ స్కోర్ చేయగలిగింది.

ఈ పిచ్ స్పిన్ బౌలర్లకు అనుకూలంగా ఉంటుందని వార్తలు వచ్చాయి. పైగా ఐపీఎల్ సాగుతున్నప్పుడు బ్యాటర్లకు స్వర్గధామంగా ఈ మైదానం ఉంది. అయితే భారత బ్యాటర్లు మాత్రం ఆఫ్గనిస్తాన్ బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. ఆఫ్ఘనిస్తాన్ లో రషీద్ ఖాన్ లేకపోవడంతో.. ఆ లోటు స్పష్టంగా కనిపించింది. బౌలర్లు ఖచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్ స్థాయిలో బంతులు వేయలేకపోవడంతో.. భారత బ్యాటర్లు పండగ చేసుకున్నారు. కొన్ని సందర్భాలలో భారత బ్యాటర్లను అవుట్ చేసే అవకాశాలు వచ్చినప్పటికీ.. ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్లు ఉపయోగించుకోలేకపోయారు. దీంతో భారత్ భారీ స్కోర్ చేసింది.

రెడ్ బాల్ ఫార్మాట్లో ఈ కాలపు రాహుల్ ద్రావిడ్ లాగా పేరు తెచ్చుకున్నాడు కేఎల్ రాహుల్. మరోసారి తాను ఎందుకు అంత స్పెషలో నిరూపించుకున్నాడు. క్లాసిక్ షాట్లు ఆడుతూ అదరగొట్టాడు. కెప్టెన్ గిల్ కూడా అదే స్థాయిలో బ్యాటింగ్ చేశాడు. పిచ్చి బంతులను బౌండరీలకు తరలించిన అతడు.. ఇబ్బంది పెట్టే బంతులకు రెస్పెక్ట్ ఇచ్చాడు. రిషబ్ పంత్ ఐపీఎల్ విఫలమైనప్పటికీ.. రెడ్ బాల్ ఫార్మాట్లో మాత్రం అదరగొట్టాడు. ఇప్పటికైతే 70 బంతుల్లో 50 పరుగులు చేసిన అతడు.. రెండవ రోజు ఇదే దూకుడు కొనసాగిస్తే సెంచరీ పూర్తి చేసుకుంటాడు.

'పెద్ది' 2 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ఆంధ్ర లో అదుర్స్.. ఓవర్సీస్ లో డిజాస్టర్..

Peddi 2 days worldwide collections
Peddi 2 days worldwide collections

Peddi 2 days worldwide collections: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘పెద్ది ‘ రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని తెచ్చుకొని , బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతాలను నెలకొల్పుతూ ముందుకు దూసుకుపోతుంది. మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 116 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం , రెండవ రోజు 36 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టిందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుండి ఈ చిత్రానికి రిటర్న్ జీఎస్టీ తో కలిపి 16 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చినట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు కేవలం 5 సినిమాలు మాత్రమే తెలుగు రాష్ట్రాల్లో 16 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు రెండవ రోజున దాటాయి , ఇప్పుడు ఆరవ చిత్రంగా ‘పెద్ది’ చిత్రం నిల్చింది.

ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్ , సీడెడ్ ప్రాంతాల్లో ఈ చిత్రం దంచిన దంచుడు మామూలు రేంజ్ కాదనే చెప్పాలి. కానీ నైజాం ప్రాంతం లో రెండవ రోజు యావరేజ్ పెర్ఫార్మన్స్ ని సొంతం చేసుకోగా, ఓవర్సీస్ లో డిజాస్టర్ రేంజ్ రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. రేటింగ్స్, టాక్ అన్నీ బాగున్నప్పటికీ కూడా ఓవర్సీస్ లో ఎందుకు ఇంత తక్కువ వసూళ్లు నమోదు అవుతున్నాయో, విశ్లేషకులకు కూడా అంతు చిక్కని ప్రశ్న. ఇక రెండవ రోజున ప్రాంతాల వారీగా ఎంత వసూళ్లు వచ్చాయి , రెండు రోజులకు కలిపి ఎంత షేర్ , ఎంత గ్రాస్ వచ్చింది , ఇంకా ఎంత వసూళ్లను రాబట్టాలి అనేది వివరంగా ఇప్పుడు చూద్దాం. ముందుగా నైజాం ప్రాంతం విషయానికి వస్తే 2 వ రోజున ఈ చిత్రానికి ఇక్కడ రిటర్న్ జీఎస్టీ తో కలిపి 6 కోట్ల 50 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి .

ఓవరాల్ గా 2 రోజులకు కలిపి నైజాం ప్రాంతం నుండి 24 కోట్ల 80 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చింది. అదే విధంగా సీడెడ్ నుండి 2 వ రోజున 2 కోట్ల 16 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు రాగా, రెండు రోజులకు కలిపి 9 కోట్ల 84 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. అదే విధంగా ఉత్తరాంధ్ర ప్రాంతం నుండి 2 రోజుల్లో 9 కోట్ల 50 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రానికి , తూర్పు గోదావరి జిల్లా నుండి 6 కోట్ల 51 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లా నుండి 4 కోట్ల 70 లక్షలు , గుంటూరు జిల్లా నుండి 7 కోట్ల 57 లక్షలు, కృష్ణా జిల్లా నుండి 4 కోట్ల 89 లక్షలు , నెల్లూరు జిల్లా నుండి 2 కోట్ల 82 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.

మొత్తం మీద రెండు రోజుల్లో ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల నుండి 70 కోట్ల 61 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు , 99 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అదే విధంగా కర్ణాటక ప్రాంతం నుండి 6 కోట్ల 55 లక్షలు , తమిళనాడు + కేరళ నుండి 95 లక్షలు , హిందీ + రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 3 కోట్ల 80 లక్షలు , ఓవర్సీస్ నుండి 15 కోట్ల 65 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. ఓవరాల్ గా ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 97 కోట్ల 56 లక్షలు, 155 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవడానికి ఈ చిత్రానికి ఇంకా 122 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు రావాల్సి ఉంది. 10 రోజుల్లో ఈ మార్కుని అందుకుంటుందని అంటున్నారు ఫ్యాన్స్.

వారణాసి మూవీ కొత్త సెట్ కి అయ్యే ఖర్చు తో 10 సినిమాలు తీయొచ్చా?

Varanasi movie set cost
Varanasi movie set cost

Varanasi movie set cost: రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా చేస్తున్న ‘వారణాసి’ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. 1500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా పెను సంచలనాలను క్రియేట్ చేస్తుందని అందరు నమ్ముతున్నారు. నిజానికి ఈ సినిమా నుంచి వచ్చిన గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా అలరించింది. మహేష్ బాబు ఈ సినిమాలో ఐదు గెటప్ ల్లో నటిస్తున్నాడు అంటూ రాజమౌళి హింట్ అయితే ఇచ్చాడు. ఇక దానికి తోడుగా ఈ సినిమాలో పురాణాలను బేస్ చేసుకుని టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో ఈ సినిమా అయితే ఉండబోతుందట. మొత్తానికైతే ఈ సినిమాతో రాజమౌళి ప్రపంచ స్థాయి ప్రేక్షకులను మెప్పించాలనే ప్రయత్నంలో ఉన్నాడు…అయితే ఈ సినిమా కోసం కొత్తగా ఒక సెట్ అయితే వేశారట.

హైదరాబాద్ శివార్లలో వేసిన ఈ సెట్టు కోసం దాదాపు 50 కోట్ల వరకు ఖర్చు చేసినట్టుగా తెలుస్తుంది. అంత పెద్ద మొత్తంలో సెట్ ఎందుకు వేస్తున్నారంటే కీలకమైన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. అయితే ఇంత భారీ బడ్జెట్ తో సెట్ చేయడం అనేది మామూలు విషయం కాదు.

ఇదంతా చూసిన కొంతమంది ప్రేక్షకులు సైతం ‘వారణాసి’ సినిమాకి ఒక్క సెట్ కి అయ్యే ఖర్చు తో 10 చిన్న సినిమాలను తీయొచ్చు అంటూ వాళ్లు కామెంట్లు చేస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా రాజమౌళి సినిమా అంటే ఆ మాత్రం బిజినెస్ లేకపోతే ఆ గ్రాండియర్ అనేది కనిపించదు. కాబట్టి ఇప్పటికి డబ్బులను ఖర్చుపెట్టి మరి ఆ సినిమాకు భారీ వసూళ్లను రాబట్టే ప్రయత్నం చేస్తుంటాడు…

ఇక అందులో భాగంగానే ఈ సినిమా కోసం భారీ సెట్ వేసినట్టుగా తెలుస్తుంది… మొత్తానికైతే రాజమౌళి ఎవ్వరు ఊహించని రేంజ్ లో వారణాసి సినిమాను తెరకెక్కిస్తుండటం విశేషం… భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తీసి అంతకు మించిన వసూళ్లను రాబట్టాలనే ప్రయత్నంలో ఉన్నారు. ఇక ఏది ఏమైనా కూడా రాజమౌళి ఈ సినిమాతో ప్రపంచస్థాయి ప్రేక్షకులను మెప్పిస్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది…

పెద్ది మూవీని అక్కడికే ఆపేసుంటే బాగుండేదేమో.. అనవసరంగా అది ఇరికించారా..?

Peddi movie criticism
Peddi movie criticism

Peddi movie criticism: రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో తనకెక్కిన ‘పెద్ది’ సినిమా రీసెంట్ గా రిలీజ్ అయింది. మొదటి చోటును సంపాదించుకున్న ఈ మూవీ ప్రస్తుతం సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. ఈ వీకెండ్ మొత్తం పెద్ది సినిమా హవా నే కొనసాగుతుంది. ప్రేక్షకులందరు ఈ సినిమా చూడడానికి విపరీతంగా ఆసక్తిని చూపిస్తున్నారు. అయితే ఒకసారి సినిమా చూసిన తర్వాత మరోసారి రిపీటెడ్ గా ఈ సినిమాను చూసే జనాల సంఖ్య తగ్గిపోయింది.

కారణం ఏంటంటే రిపీటెడ్ గా సినిమాను చూసే అంత గొప్ప కంటెంట్ అయితే ఈ సినిమాలో ఏమీ లేదని చాలామంది చెబుతున్నారు. నిజానికి కొన్ని సందర్భాల్లో బోరు కూడా కొట్టిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. అలాంటి పెద్ది సినిమా విషయంలో చాలామంది చెబుతున్న అభిప్రాయాన్ని బట్టి చూస్తే అది కరెక్టే అనిపిస్తుంది. ఇంతకీ ఏం చెబుతున్నారు అంటే రామ్ చరణ్ క్రికెటర్ గా రాణిస్తాడు. ఆ తర్వాత కుస్తీ ఫైట్ లో కూడా తన సత్తా ఏంటో చూపిస్తాడు.

ఈ సినిమాని కుస్తీ ఫైట్ లక్ష్యంగా పెట్టుకొని చేసే ఉంటే బాగుండేది. అది కాదని సినిమాని ఇంకా లాగుతూ రన్నర్ గా చూపించే ప్రయత్నం చేశారు. మొత్తానికైతే ఈ ప్రయత్నాలన్నీ బాగున్నప్పటికి చూసే ప్రేక్షకుడికి మాత్రం చివరి వరకు సినిమాను చూసేంత ఓపిక లేకుండా పోయిందనే చెప్పాలి. కాబట్టి కుస్తీ ఫైట్ తోనే ఈ సినిమాకి ఒక ముగింపు పలికుంటే సినిమా లాగ్ అయ్యేది కాదు.

అలాగే సినిమా చాలా క్రిస్పీగా వచ్చేది. స్క్రీన్ ప్లే ప్రకారం కూడా సినిమా చాలా ఎఫెక్టివ్ గా ఉండేదని పలువురు సినిమా మేధావులు చెబుతున్నారు. ఇక రన్నింగ్ రేస్ అనేది అనవసరంగా సినిమాలో ఇరికించినట్టు అనిపిస్తుంది తప్ప అది సినిమా ఫ్లోకి ఏమాత్రం పెద్దగా కనెక్ట్ కావడం లేదని సినిమా చూస్తున్న ప్రేక్షకులను సైతం అది ఎమోషనల్ గా టచ్ చేయడం లేదని మరి కొంతమంది భావిస్తున్నారు…

చిరంజీవి విషయంలో తప్పుగా ఆలోచించిన దర్శకుడు..

Director misjudged Chiranjeevi
Director misjudged Chiranjeevi

Director misjudged Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి హీరోగా చేసిన చాలా సినిమాలు ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణను సంపాదించుకున్నాయి. ఇక అలాంటి సినిమాలు యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో చాలా అరుదుగా వస్తాయనే చెప్పాలి. చిరంజీవి చేసిన సినిమాలన్నింటిలో కొన్ని గొప్ప సినిమాలుగా నిలిస్తే మరికొన్ని ప్లాపులుగా కూడా మిగిలాయి. అయితే ఒక దర్శకుడు చిరంజీవి తనతో సినిమా చేయడనే ఒక అపోహతో ఉండేవారట. కానీ అదిరిపోయే కథ చెబితే చిరంజీవి ఎవరితోనైనా సరే సినిమా చేస్తారని తన సన్నిహితులు చెప్పడంతో ఒక మంచి కథను తీసుకెళ్లి చిరంజీవికి వినిపించాడు. ఇక దాంతో చిరంజీవి అతనికి అవకాశం అయితే ఇచ్చాడు. ఇంతకీ ఆ దర్శకుడు ఎవరు అంటే గుణశేఖర్ కావడం విశేషం…

గుణ శేఖర్ అంతకుముందే లాఠీ, సొగసు చూడతరమా, బాల రామాయణం లాంటి సినిమాలు చేశాడు. అయితే అతని దగ్గర ఒక మంచి కథ ఉంది. అది చిరంజీవి రేంజ్ కి సరిపోతుంది కానీ చిరంజీవి నాతో సినిమా చేయడు కదా అని తన సన్నిహితులు దగ్గర చెబితే వాళ్లు చిరంజీవి కి నచ్చితే ఆయన ఎవరితో నైనా సినిమాలు చేస్తాడు అని తనకు సలహాలు ఇచ్చి చిరంజీవి దాకా ఆ కథను చేరవేసే ప్రయత్నం చేయమని చెప్పారట.

దాంతో అశ్విని దత్ కి కథను వినిపించి ఆ తర్వాత అతని సహాయంతో చిరంజీవికి చెప్పాడట. చిరంజీవికి ఆ కథ నచ్చడంతో ఆ సినిమా వర్కౌట్ అయింది. ‘చూడాలని ఉంది’ పేరుతో తెరకెక్కిన ఈ సినిమా 100 రోజులకు పైన ఆడి భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. ఆ తర్వాత వీళ్ళిద్దరి కాంబినేషన్లో ‘మృగరాజు’ అనే సినిమా వచ్చింది.

అయితే ఆ సినిమా డిజాస్టర్ కావడంతో మరోసారి చిరంజీవి గుణశేఖర్ తో సినిమా అయితే చేసే ప్రయత్నం చేయలేదు…మొత్తానికైతే అప్పటి నుంచి ఇప్పటి వరకు వీళ్ళిద్దరి మధ్య చాలా మంచి సన్నిహిత సంబంధాలైతే ఉన్నాయి…ప్రస్తుతం గుణ శేఖర్ ఒక పెద్ద ప్రాజెక్ట్ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు…

ప్రేక్షకులకు క్షమాపణలు చెప్పిన 'పెద్ది' దర్శకుడు బుచ్చి బాబు.. వైరల్ అవుతున్న ట్వీట్..

Peddi movie director Buchi Babu apology
Peddi movie director Buchi Babu apology

Peddi movie director Buchi Babu apology: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ చిత్రం రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డు స్థాయి వసూళ్లను రాబడుతూ ముందుకు దూసుకుపోతుంది. ఈ సినిమాకు వస్తున్న కలెక్షన్స్ ని చూస్తుంటే , భవిష్యత్తులో కచ్చితంగా ఈ చిత్రం 400 కోట్ల గ్రాస్ మార్కుని అందుకుంటుందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఇదంతా పక్కన పెడితే ఈ చిత్రానికి మంచి పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ కూడా, కొన్ని సన్నివేశాలకు ప్రేక్షకుల నుండి , క్రిటిక్స్ నుండి తీవ్రమైన విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా జాన్వీ కపూర్ సన్నివేశాలపై ప్రేక్షకులు మండిపడుతున్నారు. ఒక అమ్మాయిని ఇంత నీచంగా చూపిస్తారా ?, పెద్ది టీం కి స్త్రీల మీద ఉన్న గౌరవం ఇదేనా అంటూ సోషల్ మీడియా లో డైరెక్టర్ బుచ్చి బాబు పై విరుచుకుపడ్డారు. అయితే సోషల్ మీడియా నుండి వస్తున్న ఈ విమర్శలపై బుచ్చి బాబు ట్విట్టర్ ద్వారా రెస్పాన్స్ ఇచ్చాడు.

ఆయన మాట్లాడుతూ ‘ఒక ఫిలిం మేకర్ గా ప్రేక్షకులను ఎంటర్టైన్ చెయ్యాలి, వాళ్ళని సినిమా తో ఉత్తేజపరచాలి అని బలంగా నమ్మేవారిలో ఒకరిని నేను. కానీ వినోదాన్ని పంచే క్రమం లో ఎవరినీ కూడా అసౌకర్యానికి గురి చెయ్యకూడదు. పెద్ది చిత్రం లోని కొన్ని సన్నివేశాలకు ఆడియన్స్ నుండి వచ్చిన ఫీడ్ బ్యాక్ ని మేము తీసుకున్నాము. ఈ సందర్భంగా మీకు నేను చెప్పాలని అనుకున్నది ఏమిటంటే , మహిళలపట్ల నాకు ఎల్లప్పుడూ అపారమైన గౌరవం ఉంటుంది, ఏ స్త్రీ పాత్రని కూడా ఒక వస్తువుగా చూపించడం కానీ , వాళ్ళని అగౌరవపరచడం కానీ నా ఉద్దేశ్యం కాదు.కానీ కొన్ని సన్నివేశాలు మిమ్మల్ని బాగా ఇబ్బందికి గురి చేశాయని తెలుస్తోంది, నా వల్ల బాధపడినందుకు మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్తున్నాను’.

‘సోషల్ మీడియా లో వచ్చిన ఈ ఫీడ్ బ్యాక్ ని తీసుకున్న మేము , ఆ సన్నివేశాలను ట్రిమ్ చెయ్యాలని నిర్ణయించుకున్నాం. ఇకపై ఇలాంటివి రిపీట్ అవ్వకుండా చూసుకుంటాను’ అంటూ చెప్పుకొచ్చాడు బుచ్చి బాబు. పెద్ది మూవీ ఫస్ట్ హాఫ్ లో హీరో రామ్ చరణ్ హీరోయిన్ జాన్వీ కపూర్ అనుమతి లేకుండా ముద్దు పెట్టుకోవడం , ఆ తర్వాత సెకండ్ హాఫ్ లో అందుకు హీరో హీరోయిన్ కి వివరణ ఇవ్వడం చూసి ఆడియన్స్ ఛీ కొట్టారు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ తిట్టే తిట్లకు చెవులు మూసుకోవాల్సిందే. ఒక మంచి సినిమాలో ఇలాంటి సన్నివేశాలు పెట్టడం దృఅదృష్టకరం , ఆ సన్నివేశాల వల్ల, గొప్ప సందేశాక చిత్రం పొల్యూట్ అయ్యిందని , ఇప్పుడు వాటిని తొలగించడం వల్ల ఫ్యామిలీ ఆడియన్స్ నుండి ఇంకా మంచి రెస్పాన్స్ వస్తుందని అంటున్నారు విశ్లేషకులు.

అప్పుడూ ఇప్పుడూ కేటీఆర్ మాదిరిగానే.. కవిత మాటలో ఇంత అర్థం ఉందా..

Kavitha statement on KTR
Kavitha statement on KTR

Kavitha statement on KTR: టిఆర్ఎస్ పార్టీ అధినేత్రి కల్వకుంట్ల కవిత తెలంగాణ రాజకీయాలలో తనదైన ముద్ర వేసుకోవడానికి ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఈక్రమంలోనే ఆమె సంచలన విషయాలను బయటపెడుతున్నారు. తాజాగా కూడా ఆమె కొన్ని వాస్తవాలను వెలుగులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. ఇది కాస్త తెలంగాణ పాలిటిక్స్ లో మరోసారి సంచలనంగా మారాయి.

తెలంగాణలో 10 సంవత్సరాలపాటు భారత రాష్ట్ర సమితి పరిపాలన సాగించింది. ఈ క్రమంలో నాడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాలను కల్వకుంట్ల కవిత బయట పెట్టుకుంటూ వస్తున్నారు. తాజాగా కూడా తన తండ్రి పరిపాలన కాలంలో చోటుచేసుకున్న విషయాలను ఆమె మొహమాటం లేకుండా చెప్పేశారు. తెలంగాణ రాష్ట్రంలో అప్పుడు కేటీఆర్ పరిపాలన సాగేదని చెప్పారు. కే అంటే కెసిఆర్.. టి అంటే తన్నీరు హరీష్ రావు.. ఆర్ అంటే కల్వకుంట్ల తారకరామారావు.. అని ఆ పేరుకు సంక్షిప్త నామం చెప్పారు కవిత. ఇప్పుడు కూడా తెలంగాణలో కేటీఆర్ పరిపాలన సాగుతోందని కవిత ఆరోపించారు. కే అంటే కొండల్ రెడ్డి.. టి అంటే తిరుపతిరెడ్డి.. ఆర్ అంటే రేవంత్ రెడ్డి అంటూ కవిత వ్యాఖ్యానించారు. ఆంధ్రా విష కోరల నుంచి రాష్ట్రాన్ని సాధించుకున్నామని కవిత స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఎప్పటికీ తమ జాగీర్ అని పేర్కొన్నారు. భారతీయ జనతా పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో నాయకుడు లేక పవన్ కళ్యాణ్ తో రెండు ఓట్లు తెచ్చుకుందామని అనుకుంటుందని.. అందువల్ల ఇలాంటి రాజకీయాలకు పాల్పడుతుందని కవిత ఆరోపించారు.

కవిత భారత రాష్ట్ర సమితి నుంచి బయటికి వచ్చిన తర్వాత తనకంటూ సొంత రాజకీయ ప్రయాణాన్ని సాగిస్తున్నారు. సొంతంగా రాజకీయ పార్టీని ఏర్పాటు చేసుకున్నారు. అంతకుముందు జాగృతి ద్వారా కార్యకలాపాలు సాగించారు. ఇటీవల టిఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేశారు. పార్టీ ప్రారంభ సభలోనే కేసీఆర్ ను లక్ష్యంగా చేసుకొని విమర్శలు సాగించారు. ఇప్పుడు కేటీఆర్ పరిపాలన సాగుతోంది అన్నట్టుగా ఆరోపించారు. కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేటీఆర్ మోడల్ లోనే పరిపాలన సాగిందని మండిపడ్డారు.

కవిత వ్యాఖ్యలను లోతుగా గమనిస్తే తన తండ్రి పరిపాలన కాలంలో తెలంగాణ రాష్ట్రంలో దోపిడీ ఇష్టానుసారంగా సాగిందని.. అవినీతి వ్యవహారాలు అడ్డులేకుండా జరిగాయని కవిత చెబుతున్నట్టుగా ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. టిఆర్ఎస్ ప్రారంభ సభలో తన తండ్రిని మర మనిషి అని కవిత ఆరోపించారు. ఇప్పుడు ఏకంగా రేవంత్ పరిపాలనకు, కెసిఆర్ పరిపాలనకు పెద్దగా తేడా లేదని.. ఏకంగా ఇద్దరి పరిపాలనకు సంబంధించి కేటీఆర్ అనే సంక్షిప్త నామాన్ని కవిత జత చేశారు. అయితే విలేకరులతో నిర్వహించిన ప్రతి సమావేశంలోనూ కవిత ఏదో ఒక సంచలనాన్ని బయటపెడుతూనే ఉన్నారు. వచ్చే రోజుల్లో ఆమె ఇంకా ఎన్ని విషయాలు వెలుగులోకి తెస్తారు.. ఎన్ని సంచలనాలకు కారణమవుతారో చూడాల్సి ఉంది.. ఏది ఏమైనప్పటికీ కవిత ద్వారా గులాబీ పార్టీ తలదించుకునే పరిస్థితి ఏర్పడుతోంది. సోషల్ మీడియాలో అయితే కవిత వ్యాఖ్యలను అనుకూలంగా మార్చుకొని కాంగ్రెస్ నాయకులు చేస్తున్న ట్రోలింగ్ మామూలుగా లేదు.

'ఓజీ' సినిమాని చూపిస్తూ పేషంట్ కి వైద్యం చేసిన వైద్యులు.. చరిత్రలో ఇది రెండోసారి..

Doctors Screen OG Movie for Patient
Doctors Screen OG Movie for Patient

Doctors Screen OG Movie for Patient: పేషెంట్స్ కి వైద్యం చేసేటప్పుడు అప్పుడప్పుడు డాక్టర్లు కొన్ని పద్ధతులు అనుసరిస్తుంటారు. ముఖ్యంగా మెదడుకి సంబంధించిన వైద్యం చేసేటప్పుడు , పేషెంట్ స్పృహలోనే ఉండాల్సి ఉంటుంది. ఆ సమయం లో వైద్యం చేయడం చాలా కష్టం. అందుకే పేషెంట్ దృష్టిని మరలించడానికి వాళ్లకు ఇష్టమైన సినిమాలను చూపించడమో , లేదా వాళ్ళని మాటల్లో పెట్టడమో చేస్తుంటారు. గతం లో ఒక పేషెంట్ కి ఇలాంటి ఆపరేషన్ చేయాల్సి వస్తే , ఆ పేషెంట్ కి ఇష్టమైన హీరో ఎన్టీఆర్ అదుర్స్ సినిమాని చూపిస్తూ ఆపరేషన్ చేశారు . సరిగ్గా అలాంటి సంఘటనే ఇప్పుడు పునరావృత్తం అయ్యింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే ప్రకాశం జిల్లాలోని దర్శి ప్రాంతానికి చెందిన కోటేశ్వరమ్మ అనే మహిళా గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఉంది. రీసెంట్ గానే ఆమెకు మూర్ఛ రావడం తో కిందపడిపోయారు.

ఆమెని హాస్పిటల్ కి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించగా, ఆమెకు బ్రెయిన్ ట్యూమర్ ఉన్నట్టుగా MRI స్కాన్ ద్వారా గుర్తించారు వైద్యులు. దీంతో ఆమెకు అత్యవసర శస్త్రచికిత్స చేసి ట్యూమర్ ని తొలగించాలి. కానీ ఆమె స్పృహ లో ఉన్నప్పుడే ఈ వైద్యం చెయ్యాలని డాక్టర్లు నిర్ణయం తీసుకున్నారు. ఈ సమయంలో ఆమెకు మానసికంగా ఎలాంటి భయం కలగకూడదని, ఆమె దృష్టిని మరలించి వైద్యం చేయడానికి , ఆమెకు ఎంతో ఇష్టమైన నటుడు పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ చిత్రం ఓజీ చిత్రాన్ని చూపిస్తూ ఈ సర్జరీ నిర్వహించారు. ఈ టెక్నీక్ వల్ల రోగి మెదడు పనితీరుని సర్జరీ సమయంలోనే మానిటర్ చేసే అవకాశం డాక్టర్లకు దక్కింది. దీంతో చాలా తేలికగా, తలలోని కీలక భాగాలకు హాని కలగకుండా , ట్యూమర్ ని తొలగించారు. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. పవన్ కళ్యాణ్ ఓజీ చిత్రం ఒక మహిళా ప్రాణాలను కాపాడిందని పవన్ అభిమానులు సోషల్ మీడియా లో పోస్టులు వేస్తూ సంబరాలు చేసుకుంటున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Fukkard (@fukkard)

భార్య నుంచి ఫోన్.. సునీల్ గవాస్కర్ లో భయాన్ని చూడాలి.. మామూలు వీడియో కాదు ఇది

Sunil Gavaskar wife phone call video
Sunil Gavaskar wife phone call video

Sunil Gavaskar wife phone call video: క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆటగాడిగా, సారధిగా, వ్యాఖ్యాతగా, విశ్లేషకుడిగా ఇలా అనేక రకాల పాత్రలు పోషించాడు అతను. 70 సంవత్సరాలు దాటిన వయసులో కూడా ఇప్పటికి ఆయన క్రికెట్ తో తన ప్రయాణాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. జట్టు బాగా ఆడితే అభినందిస్తారు. సరిగ్గా ఆడకపోతే ముఖం మీద తిడతారు. ఎలాంటి ప్రణాళికల రూపొందించుకోవాలి.. ప్రత్యర్థి జట్లను ఎలా ఓడించాలి.. అనే అంశాల మీద ఆయన తనదైన శైలిలో విశ్లేషణ చేస్తూ ఉంటారు. యంగ్ ప్లేయర్లకు మార్గ నిర్దేశం చేస్తూనే ఉంటారు.

సునీల్ గవాస్కర్ మొహమాటం లేకుండా మాట్లాడుతారు. ఆ మధ్య ఆస్ట్రేలియాలో నితీష్ కుమార్ రెడ్డి సెంచరీ చేసినప్పుడు స్టాండింగ్ ఓవియేషన్ ఇచ్చారు. అతని దగ్గరికి వెళ్లి కరచాలనం తీసుకున్నారు. ఇటీవల ఐపీఎల్లో సూర్య వంశీ అదరగొడుతుంటే.. లగే రహో బేటా అంటూ దీవెనలు అందించారు. ఇలా తను గొప్ప క్రికెటర్ మాత్రమే కాదు.. అంతకంటే గొప్ప భావాలున్న మనిషిగా ఆయన పేరు తెచ్చుకున్నారు.

గవాస్కర్ సీరియస్ గా కామెంట్రీ చెప్తారు. అదే సమయంలో జోకులు కూడా వేస్తారు. ఆయనకు హాస్య స్ఫూరకమైన వ్యక్తిత్వం అధికంగా ఉంటుందని అనేకమంది దిగ్గజ ప్లేయర్లు చెప్పారు. దానిని అనేక సందర్భాలలో నిరూపించుకున్నాడు సునీల్ గవాస్కర్. అయితే అతడిలో భయాన్ని మాత్రం ఇంతవరకు ఎవరు చూడలేదు. తొలిసారి దానిని చూసే అవకాశం ఇటీవల లభించింది. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.

సునీల్ గవాస్కర్ సేవా కార్యక్రమాలలో కూడా పాల్గొంటాడు. ఇటీవల అతడు ముంబైలో రోటరీ క్లబ్ లో నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా అతను మాట్లాడుతుండగా.. ఫోన్ కాల్ వచ్చింది. ఫోన్ చూడకుండానే అతడు తన భార్య అయి ఉంటుందని భావించి.. లిఫ్ట్ చేసాడు. షార్ట్ స్పీచ్ అని పెట్టేశాడు.. ఎక్కువగా మాట్లాడకూడదని చెప్పడానికే నా భార్య ఇలా కాల్ చేసి ఉంటుందని గవాస్కర్ అనడంతో.. అక్కడున్నవారు మొత్తం గట్టిగా నవ్వేశారు.” నా భార్య నన్ను అనేక సందర్భాలలో హెచ్చరిస్తూనే ఉంటుంది. ఎక్కువ మాట్లాడకూడదు అని చెబుతూనే ఉంటుంది. అందువల్ల నేను షార్ట్ స్పీచ్ అని చెప్పాను” అని గవాస్కర్ పేర్కొన్నాడు.

రుతురాజ్ కాదు.. ఆప్ఘనిస్థాన్ సిరీస్ లో విరాట్ స్థానంలో ఆడేది అతడే..

Virat Kohli
Virat Kohli

Virat Kohli replacement: ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో ఈనెల 13 నుంచి వన్డే సిరీస్ జరుగుతుంది. ఈ సిరీస్ కోసం మేనేజ్మెంట్ జట్టును ప్రకటించింది.. 2027 వన్డే వరల్డ్ కప్ ను లక్ష్యంగా పెట్టుకొని మేనేజ్మెంట్ ఈ నిర్ణయం తీసుకునట్టు కనిపిస్తోంది. అయితే ఈ సిరీస్లో టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ ఆడే అవకాశం కనిపించడం లేదు. అతడికి గాయం కావడంతో ఇబ్బంది పడుతున్నాడు.

ఇటీవల ఐపీఎల్లో బెంగళూరు జట్టు తరుపున ఆడిన విరాట్ కోహ్లీ వేగంగానే పరుగులు చేశాడు. అయితే అతడికి గాయం కావడంతో విశ్రాంతి అవసరమని వైద్యులు చెప్పారు. దీనికి తోడు 2027 వన్డే వరల్డ్ కప్ ను లక్ష్యంగా పెట్టుకొని మేనేజ్మెంట్ అతడికి విశ్రాంతి ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే నిన్నటి వరకు మీడియాలో విరాట్ కోహ్లీ స్థానంలో ఐపీఎల్లో చెన్నై జట్టు కెప్టెన్ గైక్వాడ్ కు అవకాశం ఇస్తారని వార్తలు వచ్చాయి. దీనిపై అధికారికంగా మేనేజ్మెంట్ క్లారిటీ ఇవ్వలేదు. కాకపోతే నిప్పు లేనిదే పొగ రాదు కాబట్టి ఇదంతా నిజమేనని అందరు అనుకున్నారు. కానీ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ మీడియాలో జరుగుతున్న ఈ ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టారు.

విరాట్ కోహ్లీ స్థానంలో గైక్వాడ్ కాకుండా జైస్వాల్ ఆడతాడని అగార్కర్ స్పష్టం చేశాడు. “విరాట్ కు గాయం కావడంతో ఈ సిరీస్ లో ఆడటం లేదు. అతడి స్థానంలో జైస్వాల్ ఆడుతాడు. సూర్యకుమార్ యాదవ్ సరైన ఫామ్ లో లేకపోవడంతో టి20 జట్టుకు అతని ఎంపిక చేయలేదు. వైభవ్ ఆట తీరు చూసిన తర్వాత ఎంపిక చేయక తప్పలేదు.. కొన్ని సంవత్సరాలుగా అయ్యర్ అన్ని ఫార్మాట్లలో అదరగొడుతున్నాడు. అందువల్లే సారధిగా అతడిని ఎంపిక చేసామని” అగార్కర్ స్పష్టం చేశాడు. మరోవైపు గైక్వాడ్ ఇటీవల సౌతాఫ్రికా తో జరిగిన సిరీస్లో అదరగొట్టాడు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్నాడు. అయితే జైస్వాల్ సూపర్ ఫామ్ లో ఉన్న నేపథ్యంలో.. అతడికి అవకాశం ఇచ్చినట్టు తీరుస్తోంది. ఒకవేళ జైస్వాల్ గనక విఫలమైతే అప్పుడు గైక్వాడ్ కు చోటు లభించే అవకాశం ఉంది.

ఐపీఎల్ లో గైక్వాడ్ చెన్నై జట్టును ఆశించిన స్థాయిలో ముందుకు నడిపించలేకపోయాడు. ఆటగాడిగా కొన్ని సందర్భాలలో విఫలమయ్యాడు. నాయకుడిగా కూడా సమర్థవంతమైన నిర్ణయాలు తీసుకోవడంలో విఫలమయ్యాడు. అందువల్లే అతడికి ఆఫ్ఘనిస్తాన్ సిరీస్ లో అవకాశం లభించలేదని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే గైక్వాడ్ కు త్వరలోనే జాతీయ జట్టులో చోటు లభిస్తుందని అతడి అభిమానులు భావిస్తున్నారు.

బెంగళూరు ప్లేయర్ల మీద గౌతమ్ గంభీర్ కు ఎందుకింత కక్ష..

Gautam Gambhir vs Bengaluru players
Gautam Gambhir vs Bengaluru players

Gautam Gambhir vs Bengaluru players: ఐర్లాండ్, ఇంగ్లాండ్, ఏషియన్ గేమ్స్ లో భారత టి20 జట్టును మేనేజ్మెంట్ ప్రకటించింది. అయ్యర్ భారత జట్టుకు నాయకత్వం వహించబోతున్నాడు. తిలక్ వర్మ ఉపసారధిగా ఎంపిక అయ్యాడు. ఇంకా కొంతమంది ప్లేయర్లు జట్టులో చోటు సంపాదించుకున్నారు. హార్దిక్ పాండ్యా, సూర్య కుమార్ యాదవ్, రింకూ సింగ్ ఉద్వాసనకు గురయ్యారు. అయితే జట్టు ఎంపిక విషయంలో సానుకూల వార్తలు వినిపిస్తున్నప్పటికీ.. ఒక విషయంలో మాత్రం గౌతమ్ గంభీర్ మీద తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

గౌతమ్ గంభీర్ t20 జట్టులో రకరకాల మార్పులు తీసుకొచ్చారు. భవిష్యత్తు లక్ష్యాలను దృష్టిలో పెట్టుకొని ఈ పని చేశామని గౌతమ్ గంభీర్ చెప్పుకొచ్చారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ ఇంగ్లాండ్.. ఐర్లాండ్ సిరీస్లలో కొంతమంది ప్లేయర్లను ఎంపిక చేయకపోవడం పట్ల విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.. గౌతమ్ గంభీర్ ఎంపిక చేసిన జట్టులో ఐపీఎల్ జట్ల ఆటగాళ్లు అందరికీ చోటు లభించింది. కానీ బెంగళూరు ఆటగాళ్లకు మాత్రమే అవకాశం లభించలేదు.

ఇటీవల ipl ట్రోఫీని బెంగళూరు జట్టుకు వరుసగా రెండవసారి అందించి కెప్టెన్ రజత్ పాటిదార్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. అతడికి చోటు లభించలేదు. నిలకడగా ఆడిన దేవదత్ పడికల్ కు చోటు లభించలేదు. హైదరాబాద్ నుంచి అభిషేక్ శర్మ.. ఇషాన్ కిషన్.. నితీష్ కుమార్ రెడ్డి జట్టులో చోటు సంపాదించుకున్నారు. ముంబై ఇండియన్స్ ఆటగాడు తిలక్ వర్మ ఏకంగా వైస్ కెప్టెన్ హోదా పొందాడు. చెన్నై జట్టు ప్లేయర్లు సంజు శాంసన్, శివం దుబే చోటు సంపాదించుకున్నారు. రాజస్థాన్ రాయల్స్ నుంచి రియాన్ పరాగ్ కు అవకాశం దక్కుతుంది అనుకున్నప్పటికీ అతడికి చోటు లభించలేదు. సూర్య వంశీ రవి కి చోటు లభించింది. కోల్కతా నైట్ రైడర్స్ నుంచి వరుణ్ చక్రవర్తి.. హర్షిత్ రానాకు అవకాశం లభించింది. ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి అక్షర్ పటేల్.. పంజాబ్ జట్టు నుంచి అర్ష్ దీప్ సింగ్, లక్నో జట్టు నుంచి ప్రిన్స్ యాదవ్.. గుజరాత్ పేట నుంచి సుందర్, సిరాజ్ కు చోటు లభించింది.

వాస్తవానికి పాటిదార్, పడికల్ నిలకడగా ఆడుతున్నారు. పైగా యంగ్ ప్లేయర్లు కూడా.. వీరికి అవకాశం ఇస్తే తమ సత్తా ఏమిటో చూపిస్తారు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు బలంగా నిలబడడం వీరిద్దరికి అలవాటు. వీరికి అవకాశం ఇస్తారని అందరూ అనుకున్నారు. కానీ గౌతమ్ గంభీర్ ఏకంగా ఆర్సిబి జట్టు మొత్తానికి షాకిచ్చాడు. అయితే ఇది కావాలని జరిగిందా.. యాదృచ్ఛికంగా చోటు చేసుకుందా.. భవిష్యత్తు కాలంలో వీరికి అవకాశాలు లభిస్తాయి.. అనే ప్రశ్నలు ఇప్పుడు మీడియాలో వినిపిస్తున్నాయి. మరి వీటికి గౌతమ్ గంభీర్ తన చేతల ద్వారా ఏ విధంగా సమాధానం చెబుతారో చూడాల్సి ఉంది.

డీకే శివ కుమార్: ట్రబుల్ షూటర్ కు వరుస ట్రబుల్స్.. ఇలాగైతే సీఎం పోస్టు నిలబడేది కష్టమే..

DK Shivakumar political troubles
DK Shivakumar political troubles

DK Shivakumar political troubles: కాంగ్రెస్ పార్టీలో ట్రబుల్ షూటర్ గా పేరు పొందారు కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్. ఆర్థికంగా బలవంతుడు. ఆలోచనలో ఉన్నత వంతుడు. పైగా అనేక సంక్షోభాలలో పార్టీని గట్టెక్కించాడు. పైగా సోనియాగాంధీకి అత్యంత నమ్మకమైన వ్యక్తి. అందువల్లే అంతటి సిద్ధరామయ్యను కూడా పక్కనపెట్టి కాంగ్రెస్ పార్టీ డీకే శివకుమార్ కు ముఖ్యమంత్రి పదవి ఇచ్చేసింది.

శివకుమార్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయనకు అంతా కూడా సానుకూలంగా ఉంటుందని.. మంత్రులు.. మిగతా ఎమ్మెల్యేలు మొత్తం సహకరిస్తారని అందరూ అనుకున్నారు. కానీ ఆయన సీఎం పీఠాన్ని అధిష్టించిన ఒక్కరోజు వ్యవధిలోనే కష్టాలు మొదలయ్యాయి. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన వరుసగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే తన కోరుకున్న శాఖ రాలేదని రామలింగారెడ్డి పదవికి రాజీనామా చేశారు. తన కోరుకున్న శాఖ ఇవ్వలేదని మరో మంత్రి మునియప్ప నిరసన తెలిపారు. తనకు చెప్పకుండా అధికారులను మార్చారని ఇంధన మంత్రి జార్జ్ అసంతృప్తిని వ్యక్తం చేశారు.. పీసీసీ పగ్గాలు తనకు అప్పగించలేదని మరొక మంత్రి సతీష్ అలక పాన్పు ఎక్కారు.

ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దారుణమైన పరాజయాన్ని చవిచూసింది. తమిళనాడులో ఐదు స్థానాలు గెలుచుకున్నప్పటికీ.. విజయ్ పార్టీకి అవసరం కాబట్టి కాంగ్రెస్ పరువు కాస్త నిలబడింది. మిగతా రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ దారుణమైన ఫలితాలను చవిచూసింది. ఒకరకంగా చెప్పాలంటే జాతీయ పార్టీ ప్రాంతీయ పార్టీ కంటే హీనంగా మారిపోతుంది. ఒకప్పుడు దేశ రాజకీయాలను మొత్తం శాసించిన హస్తం పార్టీ ఇప్పుడు ఇలా మారిపోవడం కార్యకర్తలకు మింగుడు పడడం లేదు.

దక్షిణ భారత దేశంలో కాంగ్రెస్ పార్టీకి అధికారం ఉన్న రాష్ట్రాలలో కర్ణాటక అత్యంత కీలకమైనది. ఈ రాష్ట్రం మీద బిజెపి అధినాయకత్వం ఫోకస్ చేసింది. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా సరే గెలిచి అధికారాన్ని సొంతం చేసుకోవాలని భావిస్తోంది. వాస్తవానికి బిజెపికి దక్కకుండా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ రాజకీయాలు చేయాల్సి ఉండేది. కానీ సిద్ధరామయ్య.. డీకే శివకుమార్ మధ్య ఆధిపత్య పోరు వల్ల కాంగ్రెస్ పార్టీ ఇక్కడ తీవ్రమైన ఇబ్బందులు పడుతోంది.

అనేక రకాల చర్చల తర్వాత శివకుమార్ కు ముఖ్యమంత్రి పదవి ఇచ్చినప్పటికీ మంత్రులు బహిరంగం గానే తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం.. రాజీనామా చేయడం వంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఘోరంగా మారుతుంది. అంతటి ట్రబుల్ షూటర్ డీకే కూడా తలనొప్పితో బాధపడుతున్నాడు అంటే కర్ణాటకలో రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.

ఓయో రూమ్ కు వెళ్తున్నారా.. ఇలాగైతే అడ్డంగా బుక్ అయినట్టే..

OYO room booking
OYO room booking

OYO room booking: నేటి కాలంలో చాలామంది ప్రైవసీని కోరుకుంటున్నారు. అలాంటప్పుడు మూడవ కంటికి కనపడకుండా ఉండాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే చాలామంది ఓయో రూములకు ఓటు వేస్తున్నారు. అక్కడైతే స్వేచ్ఛ ఎక్కువగా ఉంటుందని.. 4 గోడల మధ్య అంతకుమించిన ఏకాంతం లభిస్తుందని భావిస్తున్నారు. అందువల్లే ఓయో రూంలలో అపరిమితమైన స్వేచ్ఛను అనుభవిస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ.. ఓయో రూమ్ లు అసాంఘిక కార్యకలాపాలకు వేదికలవుతున్నట్టు కొంతకాలంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఓయో రూములపై పోలీసులు నిఘా పెట్టారు. తనిఖీలు ముమ్మరం చేశారు.

హైదరాబాద్ నగరంలో ఓయో రూంలలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేశారు. ఏకంగా 5000 మంది పోలీసులు ఈ తనిఖీలలో పాల్గొన్నారు. కొంతకాలంగా ఈ స్థాయిలో పోలీసులు తనిఖీలు చేసినట్టు చరిత్రలో లేదు. ఆపరేషన్ లో భాగంగా హైదరాబాద్ సిపి సజ్జనార్ ఆధ్వర్యంలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. హోటల్ రికార్డులు.. కస్టమర్ల వివరాలను సేకరించారు. ఓయో రూంలలో ఉన్న భద్రతా ప్రమాణాలను ఒకటికి రెండుసార్లు పరిశీలించారు. అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు ఈ భారీ ఆపరేషన్ చేపట్టినట్టు పోలీసులు చెబుతున్నారు.

అలా వెళ్తే మాత్రం..
ఓయో రూములకు వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. వెంట ఐడి కార్డులు లేకుండా వెళ్తే మాత్రం బుక్ అయినట్టేనని హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే ఇటీవల కాలంలో హైదరాబాద్ నగరంలో అక్కడక్కడ ఓయో రూములలో అసాంఘిక కార్యకలాపాలు జరిగినట్టు వార్తలు వచ్చాయి. పైగా హైదరాబాద్ అత్యంత సున్నితమైన ప్రాంతం.. దాంతోపాటు గ్లోబల్ సిటీగా ఎదుగుతున్న నేపథ్యంలో.. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండడానికి పోలీసులు ఈ దిశగా ఏర్పాట్లు చేస్తున్నారు. అటువంటి వ్యక్తులకు అవకాశం కల్పించకుండా తనిఖీలు చేపడుతున్నారు. ఏకకాలంలో 5000 మంది పోలీసులు తనిఖీలు చేపట్టారు అంటే హైదరాబాద్ నగరంలో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

“వ్యక్తిగత స్వేచ్ఛకు మేము భంగం కలిగించేది లేదు. మాకు అలాంటి ఉద్దేశం కూడా లేదు. శాంతి భద్రతలను పరిరక్షించడమే మా ధ్యేయం. అందువల్లే ఓయో గదులలో ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా ఉండడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. ఇటీవల కాలంలో వరుసగా ఫిర్యాదులు వచ్చాయి. అందువల్లే విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నాం. భద్రత ప్రమాణాలను.. ఓయో గదులలో ఉన్న సౌకర్యాలను జాగ్రత్తగా పరిశీలిస్తున్నామని” పోలీస్ అధికారులు చెబుతున్నారు.

 

View this post on Instagram

 

A post shared by NewsMeter (@newsmeter_in)

సాలరీ స్లిప్, ఇన్ కం సర్టిఫికెట్ లేకుండా క్రెడిట్ కార్డు పొందడమెలా..

How to get credit card without salary slip
How to get credit card without salary slip

How to get credit card without salary slip: ప్రస్తుతం క్రెడిట్ కార్డ్ అనేది కేవలం ఖర్చుల కోసం మాత్రమే కాకుండా, అత్యవసర సమయాల్లో ఆర్థిక సహాయంగా కూడా ఉపయోగపడుతోంది. సాధారణంగా బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలు క్రెడిట్ కార్డ్ జారీ చేసే ముందు దరఖాస్తుదారుడి ఆదాయం, ఉద్యోగ స్థిరత్వం, క్రెడిట్ స్కోర్, రుణ చెల్లింపు చరిత్ర వంటి అంశాలను పరిశీలిస్తాయి. తమ నుంచి ఇచ్చే క్రెడిట్‌ను వినియోగదారు తిరిగి చెల్లించగలడా లేదా అన్నది అంచనా వేయడానికి ఈ వివరాలు కీలకంగా ఉంటాయి. అయితే ప్రతి ఒక్కరి వద్ద జీత స్లిప్‌లు, ఆదాయపు పన్ను రిటర్నులు లేదా ఇతర ఆదాయ ధృవీకరణ పత్రాలు ఉండకపోవచ్చు. అలాంటి పరిస్థితుల్లో ఇన్‌కమ్ ప్రూఫ్ లేకుండా క్రెడిట్ కార్డ్ పొందడం పూర్తిగా అసాధ్యం కాకపోయినా, కొన్ని ప్రత్యేక మార్గాల ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది.

ఫిక్స్ డ్ డిపాజిట్:
ఇన్‌కమ్ ప్రూఫ్ లేకుండా క్రెడిట్ కార్డ్ పొందడానికి అత్యంత సులభమైన మార్గం సెక్యూర్డ్ క్రెడిట్ కార్డ్. ఇందులో దరఖాస్తుదారు బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) రూపంలో ఒక నిర్దిష్ట మొత్తాన్ని జమ చేయాలి. ఆ డిపాజిట్‌ను భద్రతగా తీసుకుని బ్యాంకు క్రెడిట్ కార్డును జారీ చేస్తుంది. సాధారణంగా FD మొత్తంలో 75 నుంచి 90 శాతం వరకు క్రెడిట్ లిమిట్ ఇస్తారు. బ్యాంకుకు రిస్క్ తక్కువగా ఉండటంతో ఆదాయ పత్రాలపై ఎక్కువగా ఆధారపడాల్సిన అవసరం ఉండదు. ఉద్యోగులు, విద్యార్థులు, స్వయం ఉపాధి చేసుకునే వారు ఈ మార్గాన్ని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు.

బ్యాంకుతో సత్సంబంధాలు:
కొన్ని సందర్భాల్లో బ్యాంకుతో చాలా కాలంగా ఖాతా నిర్వహిస్తున్న కస్టమర్లకు ప్రత్యేక ప్రాధాన్యం లభిస్తుంది. ముఖ్యంగా సేవింగ్స్ అకౌంట్ లేదా కరెంట్ అకౌంట్‌లో క్రమం తప్పకుండా లావాదేవీలు జరిపే కస్టమర్ల ఆదాయ ప్రవాహాన్ని బ్యాంకులు స్వయంగా అంచనా వేయగలవు. ఖాతాలో మంచి బ్యాలెన్స్ ఉండటం, రెగ్యులర్ ట్రాన్సాక్షన్లు జరగడం వంటి అంశాల ఆధారంగా కొన్ని బ్యాంకులు ముందస్తుగా ప్రీ-అప్రూవ్డ్ క్రెడిట్ కార్డ్ ఆఫర్లను అందిస్తాయి. ఇలాంటి సందర్భాల్లో ప్రత్యేక ఆదాయ పత్రాలు సమర్పించాల్సిన అవసరం లేకపోవచ్చు.

డిపాజిట్ల ఆధారంగా..
కొన్ని బ్యాంకులు తమ వద్ద ఉన్న ఫిక్స్‌డ్ డిపాజిట్లు, మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు లేదా ఇతర ఆర్థిక ఆస్తులను పరిగణనలోకి తీసుకుని కూడా క్రెడిట్ కార్డులు మంజూరు చేస్తాయి. వ్యక్తి వద్ద స్థిరమైన ఆదాయ పత్రాలు లేకపోయినా, గణనీయమైన పెట్టుబడులు ఉన్నట్లు నిరూపించగలిగితే బ్యాంకులు సానుకూలంగా స్పందించే అవకాశం ఉంటుంది. ఈ విధానం సాధారణంగా అధిక విలువ గల కస్టమర్లకు వర్తిస్తుంది.

యాడ్-ఆన్ కార్డ్స్:
ఇన్‌కమ్ ప్రూఫ్ లేని వారికి మరో మార్గం యాడ్-ఆన్ క్రెడిట్ కార్డ్. కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా ఇప్పటికే క్రెడిట్ కార్డ్ ఉంటే, వారి ఖాతాపై అదనపు కార్డును పొందవచ్చు. దీనిని యాడ్-ఆన్ కార్డ్ లేదా సప్లిమెంటరీ కార్డ్ అంటారు. అలాగే కొన్ని సందర్భాల్లో భార్యాభర్తలు లేదా కుటుంబ సభ్యులు కో-అప్లికెంట్‌గా ఉండటం ద్వారా కూడా క్రెడిట్ సదుపాయాలను పొందే అవకాశం ఉంటుంది. అయితే ప్రధాన బాధ్యత మాత్రం ప్రైమరీ కార్డ్ హోల్డర్‌పైనే ఉంటుంది.

క్రెడిట్ హిస్టరీ :
ఆదాయ పత్రాలు లేకపోయినా, మంచి క్రెడిట్ హిస్టరీ ఉంటే బ్యాంకులు మీ దరఖాస్తును పరిశీలించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. గతంలో తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించడం, EMIలు ఆలస్యం చేయకపోవడం, మంచి క్రెడిట్ స్కోర్‌ను నిర్వహించడం వంటి అంశాలు విశ్వసనీయతను పెంచుతాయి. ముఖ్యంగా 750కు పైగా క్రెడిట్ స్కోర్ ఉన్నవారికి బ్యాంకులు సులభంగా అవకాశాలు కల్పించే అవకాశం ఉంటుంది.

ఇన్‌కమ్ ప్రూఫ్ లేకుండా క్రెడిట్ కార్డ్ పొందడం సాధ్యమైనా, కార్డు పొందిన తర్వాత బాధ్యతాయుతంగా వినియోగించడం చాలా ముఖ్యం. క్రెడిట్ లిమిట్‌ను పూర్తిగా వినియోగించడం, బిల్లులు ఆలస్యంగా చెల్లించడం లేదా కనీస మొత్తం మాత్రమే చెల్లించడం వల్ల భారీ వడ్డీ భారం పడుతుంది. అంతేకాకుండా క్రెడిట్ స్కోర్ కూడా దెబ్బతింటుంది. కాబట్టి అవసరమైనంత మాత్రమే ఖర్చు చేసి, బిల్లులను గడువులోపు చెల్లించడం ఉత్తమం.