Lenin Movie Twist: ఈమధ్య కాలం లో డైరెక్టర్స్ థియేటర్స్ కి వచ్చే ప్రేక్షకులను థ్రిల్ కి గురి చెయ్యాలని కొన్ని ప్రయోగాలు చేస్తున్నారు. ఒకప్పుడు ఇలాంటి ప్రయోగాలు చేయడానికి భయపడేవారు. ఎందుకంటే అప్పట్లో కమర్షియల్ హంగులకు ఆడియన్స్ బాగా అలవాటు పడ్డారు కాబట్టి. హీరో చనిపోతే అసలు తట్టుకునేవారు కాదు , సినిమాని డిజాస్టర్ చేసేవారు, కేవలం అదొక్కటే కాదు , విచారకరమైన ఎండింగ్ తో వచ్చే ఏ సన్నివేశాన్ని కూడా ఆడియన్స్ తీసుకోలేకపోయేవారు. కానీ ఇప్పుడు ఆరోజులు పోయాయి , ఇప్పుడంతా జెన్ జీ యుగం. ఇలాంటి సరికొత్త ప్రయోగాలను వాళ్ళు ఒక రేంజ్ లో స్వాగతిస్తున్నారు. మేకర్స్ కి ఫ్రీ హ్యాండ్ దొరికేలోపు , వాళ్ళ ఆలోచలను చాలా స్వేచ్ఛగా వెండితెర పై పెట్టేందుకు ఏ మాత్రం మొహమాటం చూపించడం లేదు. ‘ఉప్పెన’ చిత్రం లోని క్లైమాక్స్ ట్విస్ట్ ప్రతీ ఒక్కరికి పెద్ద షాక్.
ఇలాంటి క్లైమాక్స్ ని టాలీవుడ్ హిస్టరీ లో ఇప్పటి వరకు ఎవ్వరూ చూపించలేదు. ఇక ‘ఉప్పెన’ ని తెరకెక్కించిన బుచ్చి బాబు , రీసెంట్ గా ‘పెద్ది’ చిత్రాన్ని నిర్మించాడు. ఈ సినిమాలోని క్లైమాక్స్ కూడా ఆడియన్స్ కి ఒక పెద్ద షాక్. ఒక స్టార్ హీరోని ఇలాంటి ప్రయోగం లో ఇప్పటి వరకు ఎవ్వరూ చూడలేదు అనడం లో ఎలాంటి సందేహం లేదు. ఆడియన్స్ ఈ క్లైమాక్స్ ని కూడా స్వీకరించారు. ఇలా ఈ ట్రెండ్ ని ఆడియన్స్ బాగా ఆదరిస్తుండడం తో , మేకర్స్ కూడా ఈ విధంగా మరిన్ని ప్రయోగాలు చేసేందుకు సిద్ధం అవుతున్నారు. ‘లెనిన్’ చిత్రం లో కూడా అలాంటి ప్రయోగమే చేస్తున్నట్టు తెలుస్తోంది. ‘ఏజెంట్’ వంటి దారుణమైన ఫ్లాప్ తర్వాత అక్కినేని అఖిల్ హీరో గా నటిస్తున్న చిత్రమిది. ఈ సినిమా ద్వారా మురళి కిషోర్ అబ్బూరి అనే నూతన డైరెక్టర్ ఇండస్ట్రీ కి పరిచయం కాబోతున్నాడు.
ఈ సినిమా లో హీరో అక్కినేని అఖిల్ కి కళ్ళు పోతాయని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. హీరోయిన్ భాగ్యశ్రీ భొర్సే కోసం ఆయన తన నేత్రాలను దానం చేస్తాడట, లేటెస్ట్ గా విడుదల చేసిన మూడవ పాటలో కూడా డైరెక్టర్ చిన్న చిన్న హింట్స్ ఇచ్చాడు. అక్కినేని అఖిల్ కి నటించడానికి ఫుల్ స్కోప్ ఉన్న పాత్ర ఇది. కంటెంట్ కూడా ఈసారి చాలా బలంగా ఉన్నట్టుగానే అనిపిస్తోంది. విడుదల చేసిన రెండు పాటలకు , టీజర్ కి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది , చూస్తుంటే అయ్యగారు ఈసారి గట్టిగానే బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసేలా ఉన్నాడు , ఇండస్ట్రీ లో ఎప్పటి నుండో ఉన్నప్పటికీ , సరైన సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్న అఖిల్ , ఈ సినిమాతో ఇండస్ట్రీ రికార్డ్స్ బద్దలు కొడుతాడనే నమ్మకం తో ఉన్నారు అక్కినేని ఫ్యాన్స్.
















బుచ్చి బాబు ని విమర్శిస్తూ జాన్వీ కపూర్ కి సపోర్టుగా నిల్చిన యంగ్ హీరోయిన్..
Buchi Babu: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘పెద్ది’ రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండే బ్లాక్ బస్టర్ టాక్ ని సొంతం చేసుకొని , కరువులో టాలీవుడ్ ని కాసుల కనకవర్షం తో నింపేసింది. ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే ఇప్పుడు చర్చ. ఈ చిత్రానికి సంబంధించిన క్లైమాక్స్ గురించి , చివరి 45 నిమిషాల గురించి ఆడియన్స్ ఎంతలా అయితే మాట్లాడుకుంటున్నారో , హీరో జాన్వీ కపూర్ గురించి కూడా అదే రేంజ్ లో మాట్లాడుకుంటున్నారు. డైరెక్టర్ బుచ్చి బాబు ఆమె పాత్రని మలచిన తీరుపై తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. కేవలం డైరెక్టర్ ని మాత్రమే కాదు, మహానటి శ్రీదేవి కూతురు అయ్యుండి , ఇలాంటి పాత్రలు చేయడానికి సిగ్గు లేదా అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ జాన్వీ కపూర్ మీద కూడా తీవ్రమైన ట్రోల్స్ వేస్తున్నారు.
అయితే ఈ అంశం పై ఇప్పుడు సినీ సెలబ్రిటీలు కూడా స్పందిస్తున్నారు. నిన్ననే యాంకర్ అనసూయ , దర్శకులు ఒక సినిమా ని తీసేటప్పుడు , కాస్త బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉందంటూ చెప్పుకొచ్చింది. ఇప్పుడు లేటెస్ట్ గా ప్రముఖ యంగ్ హీరోయిన్ ఆషికా రంగనాథ్ కూడా ఈ చిత్రంలోని జాన్వీ కపూర్ పాత్రపై వస్తున్న కామెంట్స్ కి రెస్పాన్స్ ఇచ్చింది. ఆమె మాట్లాడుతూ ‘దయచేసి హీరోయిన్లను అనవసరంగా నిందించకండి. చిత్రానికి సంబంధించిన దర్శక నిర్మాతలను నిందించండి. మా లాంటి హీరోయిన్స్ కి పెద్ద హీరోల సినిమాల్లో భాగం అవ్వాలని , ఎక్కువమంది ప్రేక్షకులకు రీచ్ అవ్వాలని ఉంటుంది. ఈ క్రమం లోనే అందుబాటులోకి వచ్చే అవకాశాల మేరకు పనిచేస్తాము. డైరెక్టర్ మహిళా పాత్రలను సరిగా రాయబడలేదని మీకు అనిపిస్తే, ఆ పాత్రలను రాసే రచయితలకు , డైరెక్టర్స్ కి ఎంత బాధ్యత ఉంటుంది అనేది గుర్తించండి’ అంటూ చెప్పుకొచ్చింది.
ఒక్క ముక్కలో చెప్పాలంటే , ఎందుకు మీరంతా అనవసరంగా జాన్వీ కపూర్ ని నిందిస్తున్నారు , ఆ పాత్ర ని క్రియేట్ చేసిన బుచ్చి బాబు ని తిట్టండి అంటూ చెప్పుకొచ్చింది ఆషికా రంగనాథ్. ఆమె మాట్లాడిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. కన్నడ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న ఈ కుర్ర హీరోయిన్ , తెలుగు లోకి అక్కినేని నాగార్జున హీరో గా నటించిన ‘నా సామి రంగ’ చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా యావరేజ్ గా ఆడింది , ఇక రీసెంట్ గా ఈమె మాస్ మహారాజ రవితేజ నటించిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే చిత్రం లో నటించింది. ఇప్పుడు ఈమె ముఖ్యపాత్ర పోషించిన మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది.