Home Blog Page 16

నా కొడుక్కి రావణాసురుడు అంటే ఇష్టం అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal
Kajal Aggarwal

Kajal Aggarwal: మన టాలీవుడ్ లో యూత్ నుండి ఫ్యామిలీ ఆడియన్స్ వరకు ప్రతీ ఒక్కరు ఇష్టపడే హీరోయిన్స్ లో ఒకరు కాజల్ అగర్వాల్. ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయం లోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగి , సౌత్ ఇండియా లో దాదాపుగా అందరి సూపర్ స్టార్స్ తో కలిసి సినిమాలు చేసి తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజ్ ని ఏర్పాటు చేసుకుంది. నేటి తరం సూపర్ స్టార్స్ తో కలిసి పని చేయడమే కాకుండా, నిన్నటి తరం స్టార్ హీరోలతో కూడా పనిచేసిన ఘనత కాజల్ అగర్వాల్ సొంతం. కెరీర్ పీక్ రేంజ్ లో ఉన్నప్పుడే గౌతమ్ కిచులు ని పెళ్ళాడి సినిమాలకు తాత్కాలిక బ్రేక్ ఇచ్చిన కాజల్, ఆ తర్వాత కొడుక్కి జన్మనిచ్చాక మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. అయితే రీ ఎంట్రీ తర్వాత కాజల్ అగర్వాల్ కి చెప్పుకోదగ్గ రోల్స్ దొరకడం లేదు.

అడపాదడపా సినిమాలు చేస్తూనే ఉంది కానీ సక్సెస్ మాత్రం రావడం లేదు. మెల్లిగా హీరోయిన్ రోల్స్ నుండి క్యారెక్టర్ రోల్స్ కి షిఫ్ట్ అయ్యే పరిస్థితులు ఇప్పుడు ఏర్పడ్డాయి. ఇకపోతే రీసెంట్ గా ఆమె ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ప్రస్తుతం ఆమె నితీష్ తివారీ బాలీవుడ్ లో తెరకెక్కిస్తున్న రామాయణం లో రావణాసురిడి భార్య మండోదరి క్యారెక్టర్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్యారెక్టర్ గురించి మాట్లాడుతూ ‘మా అబ్బాయికి రామాయణం అంటే చాలా ఇష్టం . నేను హిందీ రామాయణం లో నటిస్తున్నాను అనే విషయం వాడికి తెలిసినప్పుడు చాలా సొంతోషించాడు. ఈ సినిమా ప్రత్యేకత ఏమిటంటే రాముడి పాత్రలో రణబీర్ కపూర్ నటిస్తుండగా, రావణుడి పాత్రలో యాష్ నాయిస్తున్నారు. నేను రావణుడి భార్య మండోదరి క్యారెక్టర్ చేస్తున్నాను. మా అబ్బాయికి రావణుడి పాత్ర అంటే చాలా ఇష్టం. ఈ సినిమా రెండవ భాగం విడుదల అయ్యేసరికి వాడికి ఐదేళ్లు నిండుతాయి. థియేటర్ లో వాడు చూసే మొట్టమొదటి సినిమా ఇదే అవుతుంది’ అంటూ చెప్పుకొచ్చింది కాజల్ అగర్వాల్.

ఆమె మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. రామాయణం చూసి రాముడికి సీతకు , హనుమంతుడికి ఫ్యాన్ అవ్వాలి కానీ , రావణాసురుడికి ఫ్యాన్ ఏంటి?, అలాంటి రాక్షసుడు చిన్న పిల్లాడికి నచ్చడం ఏంటి అంటూ సోషల్ మీడియా లో కొంతమంది నెటిజెన్స్ మండిపడుతున్నారు. ఈ చిత్రం తో పాటు కాజల్ అగర్వాల్ నందమూరి బాలకృష్ణ , గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇది వరకే బాలయ్య తో ఆమె ‘భగవంత్ కేసరి’ అనే చిత్రం చేసింది. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇప్పుడు వీళ్లిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ రెండవ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ గా నిలుస్తుందో చూడాలి.

చిరంజీవి ప్లాన్ చేసి కొట్టాడు..అందుకే నెంబర్ వన్ అయ్యాడు...

Chiranjeevi
Chiranjeevi

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి పేరు చెప్తే చాలు అతని అభిమానులు ఆనందంతో ఊగిపోతారు. ప్రేక్షకులు అతని సినిమాలను చూడడానికి వేయికన్నులతో ఎదురు చూస్తుంటారు. ఇక అలాంటి చిరంజీవి ఈ మధ్యకాలంలో చేస్తున్న సినిమాల విషయంలో ఇంకాస్త కేర్ ఫుల్ గా వ్యవహరించాల్సిన అవసరమైతే ఉంది. ఒకప్పుడు ఆయననుంచి క్వాలిటీ సినిమాలు వచ్చేవి. కానీ ఇప్పుడు కమర్షియల్ సినిమాలకు మాత్రమే ఆయన పరిమితమైపోయాడు. నటన విషయంలో కూడా పెద్దగా వైవిధ్యాన్ని చూపించడం లేదనే వార్తలైతే వినిపిస్తున్నాయి. 70 సంవత్సరాలు పైబడిన వయసులో కూడా ఆయన సత్తా చాటుకుంటూ డిఫరెంట్ యాక్టింగ్ ను ట్రై చేయడానికి ప్రయత్నిస్తూ ముందుకు సాగుతున్నాడు.

ఇక ఈ విషయంలో అతన్ని మెచ్చుకోవచ్చు కానీ తన ఏజ్ కి తగ్గ పాత్రలను చేస్తే బాగుంటుందని మరి కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా చిరంజీవి అనే ఆయన ఒక శిఖరం లాంటివాడు. ఆయన చేసిన సినిమాలు అతన్ని టాప్ లెవెల్ కి తీసుకెళ్లాయి.

ఇప్పుడు ఆయన ఏ పాత్ర చేసినా కూడా ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్నాడు. అప్పట్లో చిరంజీవి కి పోటీ ఇచ్చే హీరోలు ఎంత మంది ఉన్నా కూడా తను మాత్రమే మెగాస్టార్ గా ఎలా మారారు అంటే ఆయన దానికోసం ఒక స్ట్రాటజీని మెయింటైన్ చేస్తూ ముందుకు సాగాడు. ఇక తను ఎక్కడ కూడా డౌన్ ఫాల్ అవ్వకుండా ప్రతి సినిమా విషయంలో క్షుణ్ణంగా పరిశీలిస్తూ ముందుకు సాగాడు. తన ఎంటైర్ కెరీర్ లో ఇప్పటివరకు ఎనిమిది ఇండస్ట్రీ హిట్లను సాధించాడు. వరుసగా ఆరు సంవత్సరాల్లో ఆరు ఇండస్ట్రీ హిట్స్ ను దక్కించుకున్న ఘనత కూడా తనకే దక్కింది. అందుకే చిరంజీవి మెగాస్టార్ గా మారాడు అనేది వాస్తవం…

తనను ఎంచుకున్న దర్శకులు కూడా అలాంటి వారే కావడం ప్రతి విషయంలోనూ పర్ఫెక్షన్ ను మెయింటైన్ చేస్తూ ముందుకు సాగాడు. ఇక తన తరంలో ఉన్న హీరోల్లో బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున లాంటి వాళ్ళు సైతం చిరంజీవికి పోటీని ఇచ్చినప్పటికి వాళ్లకి అందనంత ఎత్తులో ఆయన వరుసగా సినిమాలు చేస్తూ సూపర్ సక్సెస్ లను సాధించాడు. అందువల్లే ఆయన ఈరోజుకి మెగాస్టార్ గానే వెలుగొందుతున్నాడు…

'అనిమల్ పార్క్' మూవీ లో రన్బీర్ కపూర్ కాకుండా ఆ స్టార్ హీరో...

Animal Park Movie
Animal Park Movie

Animal Park Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీని కొత్త పుంతలు తొక్కించిన దర్శకులలో సందీప్ రెడ్డి వంగ ఒకరు…ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాల విషయంలో చాలా క్లారిటిని మెయింటైన్ చేస్తున్నాడు. ఇప్పటివరకు ఆయన చేసినవి చాలా తక్కువ సినిమాలే అయినప్పటికి తనదైన రీతిలో సత్తా చాటుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటివరకు ఆయన సాధించిన సక్సెస్ లు నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. ఇప్పుడు ప్రభాస్ తో చేస్తున్న స్పిరిట్ సినిమాతో సైతం పెను ప్రభంజనాన్ని క్రియేట్ చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఆయన లాంటి దర్శకుడు మరొకరు ఉండరు అంటూ చాలా మంది గొప్ప దర్శకులు అతనికి కితాబ్ ఐతే ఇచ్చారు. మరి అలాంటి దర్శకుడు ఇప్పుడు చేస్తున్న సినిమాలా విషయంలో మాత్రం ఆయన చాలా క్లారిటిని మెయింటైన్ చేస్తున్నాడు. ప్రభాస్ తో డిఫరెంట్ జానర్ లో సినిమా చేయడానికి ఆయన సన్నాహాలు చేసుకుంటూన్నాడు. ఇక ఇప్పటికే ఆల్మోస్ట్ సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇక బ్యాలెన్స్ ఉన్న షూటింగ్ సైతం తొందర్లోనే ఫినిష్ చేసి ఎలాగైనా సరే ఈ సినిమాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాలనే ప్రయత్నంలో ఉన్నాడు. ఈ సినిమా తర్వాత ఆయన అనిమల్ పార్క్ సినిమాని తెరమీదకి తీసుకొచ్చే ప్రయత్నాలైతే చేస్తున్నాడు.

‘అనిమల్ పార్క్’ మూవీలో రన్బీర్ కపూర్ కాకుండా మరో హీరో నటించే అవకాశాలైతే ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారమైతే ఈ సినిమాలో అల్లు అర్జున్ తో చేయాలనే ఆలోచనలో సందీప్ రెడ్డివంగా ఉన్నారట. అనిమల్ లో రన్బీర్ కపూర్ అద్భుతంగా నటించాడు.

ఇక ఆ నటనని అల్లు అర్జున్ బీట్ చేయగలుగుతాడా అనేది తెలియాల్సి ఉంది. నిజంగానే అనిమల్ పార్క్ మూవీలో అల్లు అర్జున్ నటిస్తున్నాడా? లేదంటే రూమర్లు వస్తున్నాయా అనేది తెలియాల్సి ఉంది. మొత్తానికైతే ‘అనిమల్ పార్క్’ సినిమా ఎప్పుడు వచ్చినా సరే చూడడానికి ప్రేక్షకులైతే ఆసక్తి చూపిస్తున్నారు. ఇక అందులో హీరో ఎవరు అనేది డిసైడ్ కావాల్సి ఉంది. నిజానికి సందీప్ రెడ్డివంగా తలుచుకుంటే ఏ హీరో నైనా సరే అంతే వైల్డ్ గా చూపించగలరు.

మరి అలాంటి క్రమంలో సందీప్ రెడ్డి రన్బీర్ ను కాకుండా అల్లు అర్జున్ ను కనక పెట్టి సినిమా తీసినట్లయితే మాత్రం మార్కెట్ పరంగా ఈ సినిమా హెల్ప్ అవుతుంది. అలాగే ఈ సినిమా ను ప్రతి ఒక్కరు ఓన్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. చూడాలి మరి నిజంగానే సందీప్ రెడ్డివంగా అల్లు అర్జున్ తో ఈ సినిమా చేయగలుగుతాడా? లేదంటే రణ్బీర్ కపూర్ ను పెట్టి ఈ సినిమాని కంప్లీట్ చేస్తాడా అనేది తెలియాల్సి ఉంది…

100 రోజుల్లో స్వదేశీ రైఫిల్‌.. తెలంగాణ స్టార్టప్‌ అద్భుతం!

Telangana Defense Startup
Telangana Defense Startup

Telangana Defense Startup: తెలంగాణకు చెందిన రక్షణ స్టార్టప్‌ ‘ద్వీప డిఫెన్స్‌’ డీఆర్డీవోతో కలిసి అద్భుతం చేసింది. ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత స్వదేశీ ఆయుధాల తయారీపై డీఆర్డీవో దృష్టి పెట్టింది. ఆత్మనిర్భర్‌ భారత్‌లో భాగంగా కేంద్రం కూడా రక్షణ బడ్జెట్‌ పెంచింది. ఈ నేపథ్యంలో తెలంగాణకు చెందిన స్టార్టప్‌ 7.62×51 ఎంఎం క్యాలిబర్‌లో ఉగ్రం(UGRAM) అనే దేశీ రైఫిల్‌ను అభివృద్ధి చేసింది. ఈ ప్రాజెక్టును కేవలం 100 రోజుల్లోనే డిజైన్‌ చేసి, నమూనా తయారు చేయడం రక్షణ రంగంలో వేగాన్ని పెంచింది. సాధారణంగా ఆయుధాల అభివృద్ధికి సంవత్సరాలు పట్టే పరిస్థితుల్లో ఈ వేగం ఆత్మనిర్భర భారత్‌ లక్ష్యానికి బలం చేకూర్చుతోంది.

సైన్యం, కేంద్ర బలగాల పరీక్షల్లో విజయం..
ఉగ్రమ్‌ రైఫిల్‌ భారత సైన్యం, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నిర్వహించిన కఠినమైన పరీక్షలను విజయవంతంగా పూర్తి చేసింది. దీంతో కేంద్ర సాయుధ పోలీసు బలగాలు ఈ రైఫిల్‌ను తమ ఆయుధభండారంలో చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి. సాధారణంగా విదేశీ ఆయుధాలపై ఆధారపడే సీఏపీఎఫ్‌కు దేశీ రైఫిల్‌ అందుబాటులోకి రావడంతో ఖర్చు తగ్గడం, సరఫరా భద్రత పెరగడం, నిర్వహణ సౌలభ్యం వంటి ప్రయోజనాలు ఏర్పడతాయి.

వేగవంతమైన అభివృద్ధికి కారణాలు..
డీఆర్డీవోకి చెందిన ఆయుధ పరిశోధన, అభివృద్ధి సంస్థతో స్టార్టప్‌ సంయుక్తంగా పని చేయడంతో ఈ వేగం సాధ్యమైంది. ప్రైవేట్‌రంగ స్టార్టప్‌లు తమ సౌలభ్యం, ఆవిష్కరణ సామర్థ్యం, త్వరిత నిర్ణయాలతో డీఆర్డీవో సాంకేతిక నైపుణ్యాన్ని మిళితం చేస్తున్నాయి. ఇది రక్షణ రంగంలో ప్రైవేట్‌ భాగస్వామ్యం ఎంత ముఖ్యమో చాటుతోంది. 100 రోజుల్లో డిజైన్‌ నుంచి నమూనా వరకు పూర్తి చేయడం భవిష్యత్తులో అత్యవసర అవసరాలకు త్వరితంగా స్పందించే సామర్థ్యాన్ని నిరూపిస్తోంది.

ఆత్మనిర్భర భారత్‌కు కొత్త ఆశాకిరణం..
ఈ విజయం రక్షణ రంగంలో దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. సీఏపీఎఫ్‌కు వంటి పెద్ద సంఖ్యలో ఆయుధాలు అవసరమయ్యే బలగాలకు స్థానికంగా ఉత్పత్తి అయ్యే రైఫిల్‌లు అందుబాటులోకి రావడం వల్ల దేశీయ ఉత్పత్తి, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. తెలంగాణ వంటి రాష్ట్రాల్లో రక్షణ స్టార్టప్‌లు వృద్ధి చెందడం దేశవ్యాప్తంగా రక్షణ తయారీ పర్యావరణ వ్యవస్థను బలపరుస్తోంది.

ఉగ్రం విజయం తర్వాత ఇలాంటి స్టార్టప్‌లు మరిన్ని ఆయుధాలు, సామగ్రి అభివృద్ధిలో ముందుకు రావడానికి మార్గం సుగమం అవుతోంది. డీఆర్డీవోతో సహకారం కొనసాగితే, భారత్‌ రక్షణ రంగంలో ప్రపంచ స్థాయి ఆవిష్కరణలు సాధించే అవకాశాలు పెరుగుతాయి. ఈ మోడల్‌ ఇతర రంగాల్లో కూడా ప్రైవేట్‌ రంగం, ప్రభుత్వ సంస్థల మధ్య సహకారానికి ఆదర్శంగా నిలుస్తుంది.

పూణే వ్యాపారి కేతన్ కేసు.. సియా, చేతన్ మరో దారుణం మెలుగులోకి

Ketan Agarwal Case
Ketan Agarwal case

Ketan Agarwal Case: పూణే వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ దేశవ్యాప్తంగా సృష్టిస్తున్న సంచలనం అంతా ఇంతా కాదు. ఈ కేసులో ఇప్పటికే అనేక విషయాలు వెలుగు చూశాయి. తాజాగా మరో దారుణం వెలుగులోకి వచ్చింది. దర్యాప్తు సంస్థల అధికారులు ఈ కేసును విచారిస్తున్న క్రమంలో ఈ నిజం బయటపడింది.

కేతన్ కేసులో దర్యాప్తు సంస్థల అధికారులు కొద్దిరోజులుగా విచారణ సాగిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చేతన్, సియాకు మధ్య జరిగిన వ్యవహారం గురించి.. దర్యాప్తు సంస్థల అధికారులు మరింత లోతుగా విచారణ సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వీరిద్దరి మధ్య జరిగిన ఒక సంఘటన దర్యాప్తు సంస్థల అధికారులకు ఫ్యుజులు ఎగిరిపోయేలా చేసింది. అంతేకాదు ఇలా కూడా జరుగుతుందా అని వారు ఆశ్చర్యపోయేలా చేసింది.

కేతన్ తో సియా ఎంగేజ్మెంట్ చేసుకున్న తర్వాత.. చేతన్ ఆమెతో గొడవ పడినట్టు తెలుస్తోంది. ఇదే క్రమంలో ఆమె అతడు వివాహం కూడా చేసుకున్నట్టు తెలుస్తోంది. ఫిబ్రవరి నెలలో సియా కేతన్ అగర్వాల్ తో ఎంగేజ్మెంట్ చేసుకుంది. నవంబర్లో వీరిద్దరికి వివాహం జరగాల్సి ఉంది. ఉదయపూర్ ప్రాంతంలో ఒక విలాసవంతమైన హోటల్లో వీరిద్దరికి వివాహం జరిపించడానికి బంధువులు ఏర్పాట్లు కూడా చేశారు. అయితే కేతన్ తో వివాహం ఏమాత్రం ఇష్టం లేని సియా.. చేతన్ ను నాలుగు నెలల క్రితం పూణేలోని ఒక రిజిస్ట్రార్ ఆఫీస్ లో పెళ్లి చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ వివాహానికి సియా, చేతుల తరఫున ఇద్దరు స్నేహితులు హాజరైనట్టు సమాచారం. కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు విచారణ సాగిస్తుండగా.. వారిద్దరి ఫోన్లలో వాట్సాప్ సంభాషణల ద్వారా ఈ విషయం బయటపడినట్టు తెలుస్తోంది.

రిజిస్ట్రార్ ఆఫీసులో వీరి వివాహం ఆమోదం పొందిందా.. ధ్రువీకరణ పత్రం జారీ చేశారా.. అనే దానిమీద పోలీసులు వెరిఫై చేస్తున్నారు. అయితే వీరిద్దరూ పెళ్లి చేసుకున్నప్పుడు ఆ ఫోటోలను తన ఇన్ స్టా గ్రామ్ లో సియా షేర్ చేసినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత తొలగించినట్టు పోలీసులు గుర్తించారు. ఆ ఫోటోలను రిట్రీవ్ చేయడానికి సాంకేతిక బృందాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. కాగా గత నెల 18న లోయలో పడి కేతన్ చనిపోయిన విషయం తెలిసిందే.

హార్మోజ్ జలసంధి మూసివేత సంక్షోభాన్ని భారత్ ఎలా ఎదుర్కొంది?

India Energy Security

India Energy Security : 140 కోట్ల జనాభా కలిగిన దేశం. ఇంత జనాభా ఉన్న దేశంలో సంక్షోభం వస్తే తట్టుకోవడం కష్టమే. 100 ఏళ్లకు ఒకసారి వచ్చే మహమ్మారి వచ్చింది. దాన్ని ప్రపంచంలోనే మిగతా దేశాలతో పోలిస్తే తక్కువ మరణాలతో మేనేజ్ చేసింది భారతదేశం. మోడీ చాలా బాగా హ్యాండిల్ చేశాడు.

హార్మోజ్ జలసంధి ప్రపంచ ఇంధన సరఫరాకు అత్యంత కీలకమైన సముద్ర మార్గం. ప్రపంచంలో వినియోగించే చమురులో గణనీయమైన భాగం, సహజ వాయువు (LNG)లో పెద్ద శాతం ఈ మార్గం ద్వారానే రవాణా అవుతాయి. అలాంటి జలసంధి యుద్ధ పరిస్థితుల కారణంగా మూసివేతకు గురయ్యే ప్రమాదం ఏర్పడిన ప్రతిసారి ప్రపంచ మార్కెట్లు ఆందోళనకు గురవుతాయి. చమురు ధరలు పెరుగుతాయి.. దిగుమతులపై ఆధారపడిన దేశాల ఆర్థిక వ్యవస్థలు ఒత్తిడిని ఎదుర్కొంటాయి.

భారత్ కూడా చమురు అవసరాల్లో అధిక భాగాన్ని దిగుమతుల ద్వారానే తీర్చుకునే దేశం. అందువల్ల హార్మోజ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరిగినప్పుడు భారత ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం పడుతుందనే అంచనాలు సహజం. అయితే ఈసారి పరిస్థితిని ఎదుర్కొన్న తీరు విశ్లేషకుల దృష్టిని ఆకర్షించింది.

దీనికి ప్రధాన కారణం గత కొన్నేళ్లుగా భారత్ అనుసరిస్తున్న దిగుమతుల వైవిధ్యీకరణ (Diversification) విధానం. ఒకటి లేదా రెండు దేశాలపై ఆధారపడకుండా, చమురు సరఫరా చేసే దేశాల సంఖ్యను క్రమంగా పెంచడం ద్వారా ప్రమాదాన్ని తగ్గించే ప్రయత్నం జరిగింది. గతంలో పరిమిత దేశాల నుంచే అధికంగా చమురు కొనుగోలు చేసిన భారత్, ఇప్పుడు వివిధ ప్రాంతాల్లోని అనేక దేశాలతో ఇంధన కొనుగోలు ఒప్పందాలు కుదుర్చుకుంది. దీంతో ఒక ప్రాంతంలో సరఫరా అంతరాయం ఏర్పడినా, ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా అవసరాలను తీర్చుకునే అవకాశం పెరిగింది.

అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా రష్యా సహా ఇతర దేశాల నుంచి కూడా చమురు కొనుగోళ్లు పెరగడం, వ్యూహాత్మక చమురు నిల్వలు (Strategic Petroleum Reserves), దీర్ఘకాలిక సరఫరా ఒప్పందాలు వంటి చర్యలు కూడా ప్రభావాన్ని తగ్గించడంలో సహాయపడ్డాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళన నెలకొన్నప్పటికీ దేశీయంగా ఇంధన సరఫరాలో పెద్ద అంతరాయం కనిపించలేదు.

ఇది కేవలం తక్షణ నిర్ణయాల ఫలితం మాత్రమే కాదు. సరఫరా వ్యవస్థలో రిస్క్‌ను ముందుగానే గుర్తించి, ప్రత్యామ్నాయాలను సిద్ధం చేసుకోవడం, ఒకే ప్రాంతంపై ఆధారపడకుండా ఇంధన భద్రతకు ప్రాధాన్యం ఇవ్వడం వంటి దీర్ఘకాలిక వ్యూహాల ఫలితమని ఆర్థిక రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

అయితే హార్మోజ్ జలసంధి ప్రాధాన్యం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆ ప్రాంతంలో దీర్ఘకాలిక అస్థిరత కొనసాగితే చమురు ధరలు, రవాణా వ్యయాలు, ప్రపంచ ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. అందువల్ల భారత్ భవిష్యత్తులో కూడా దిగుమతుల వైవిధ్యీకరణ, దేశీయ ఇంధన ఉత్పత్తి, పునరుత్పాదక ఇంధన వనరుల విస్తరణపై మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.

హార్మోజ్ సంక్షోభం మరోసారి ఒక విషయాన్ని స్పష్టం చేసింది. ప్రపంచ భౌగోళిక రాజకీయాల్లో అనిశ్చితి పెరుగుతున్న ఈ కాలంలో, ముందుచూపుతో రూపొందించిన ఇంధన భద్రతా విధానాలే దేశ ఆర్థిక స్థిరత్వానికి కీలక ఆధారంగా నిలుస్తాయని ఈ పరిణామం సూచిస్తోంది.

హార్మోజ్ జలసంధి మూసివేత సంక్షోభాన్ని భారత్ ఎలా ఎదుర్కొంది? దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింద వీడియోలో చూడొచ్చు.

వర్షాకాలంలో ఆకు కూరలు తింటే అనారోగ్యమా.. అసలు నిజమేంటీ.

Monsoon Leafy Vegetables
Monsoon Leafy Vegetables

Monsoon Leafy Vegetables: వర్షాకాలం ప్రారంభమైన తర్వాత చాలా మంది ఎలాంటి ఆహారం తీసుకోవాలి? అనే సందేహం కలుగుతుంది. ముఖ్యంగా ఇలాంటి సమయంలో ఆకుకూరలు తినడానికి భయపడుతుంటారు. ఎందుకంటే వర్షాకాలంలో ఆకుకూరలు తింటే విరేచనాలు, కడుపు ఇన్‌ఫెక్షన్లు వస్తాయని చాలామంది భావిస్తుంటారు. అయితే ఇది పూర్తిగా నిజం కాదని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. ఆకుకూరల వల్ల కాదు, వాటిని శుభ్రంగా కడగకుండా వండుకుని తినడం వల్లే అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అసలు వర్షాకాలంలో ఆకు కూరలు తినొచ్చా?

ఆకుకూరలు శరీరానికి అవసరమైన ఐరన్, ఫోలేట్, కాల్షియం, ఫైబర్, విటమిన్ A, C, K వంటి పోషకాలను సమృద్ధిగా అందిస్తాయి. ఇవి రక్తహీనతను తగ్గించడంలో, రోగనిరోధక శక్తిని పెంచడంలో, జీర్ణక్రియను మెరుగుపరచడంలో, ఎముకలను దృఢంగా ఉంచడంలో సహాయపడతాయి.

అయితే వర్షాకాలంలో ఆకుకూరలు తినడం వల్లే డయేరియా వస్తుందని కొందరి అపోహ మాత్రమే. నిజానికి కలుషితమైన ఆకుకూరలు లేదా శుభ్రం చేయని ఆహారం వల్ల బ్యాక్టీరియా, వైరస్‌లు లేదా పరాన్నజీవులు శరీరంలోకి ప్రవేశిస్తే విరేచనాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సమస్య ఆకుకూరల్లో కాదు, వాటి పరిశుభ్రతలోనే ఉందని వైద్యులు చెబుతున్నారు.

అయితే వాటిని శుభ్రపరచడంలో నిర్లక్ష్యంగా ఉండకూడదని చెబుతున్నారు. సాధారణంగా ఆకు కూరలు పొలాల్లో మట్టి, బురద వంటి ప్రాంతాల్లో పెరుగుతాయి. ముఖ్యంగా పాలకూర, తోటకూర, మెంతికూర, బచ్చలికూర వంటి ఆకుకూరల ఆకులపై మట్టి, దుమ్ము, సూక్ష్మజీవులు, పురుగుల గుడ్లు, కీటకాలు అంటుకునే అవకాశం ఉంటుంది. అయితే వీటిని శుభ్రం చేయకుండా వండితే బ్యాక్టీరియా, పరాన్నజీవులు శరీరంలోకి చేరి జీర్ణాశయ సమస్యలు కలిగించవచ్చు.

ఆకుకూరలను ముందుగా పసుపు రంగు లేదా పాడైన ఆకులను తొలగించాలి. తర్వాత ఒక పాత్రలో గోరువెచ్చని నీరు తీసుకుని అందులో కొద్దిగా ఉప్పు లేదా వెనిగర్ వేసి ఆకుకూరలను సుమారు 10 నిమిషాలు నానబెట్టాలి. దీంతో ఆకులపై ఉండే మట్టి, చిన్న కీటకాలు, కొన్ని సూక్ష్మజీవులు తొలగిపోవడానికి సహాయపడుతుంది. అనంతరం శుభ్రమైన నీటితో రెండు నుంచి మూడు సార్లు బాగా కడిగి వండుకోవాలి.

పోషకాహార నిపుణుల సూచన ప్రకారం ఒక ఆరోగ్యవంతమైన వ్యక్తి రోజుకు సుమారు 50 గ్రాముల ఆకుకూరలు ఆహారంలో భాగంగా తీసుకోవచ్చు. అయితే ఒక్క రకమైన ఆకుకూర మాత్రమే కాకుండా వారంలో వివిధ రకాల ఆకుకూరలను మారుస్తూ తీసుకోవడం మంచిది. దీంతో శరీరానికి విభిన్న రకాల పోషకాలు అందుతాయి.

చిన్నపిల్లలు, గర్భిణులు, వృద్ధులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు ఆకుకూరలను తప్పనిసరిగా బాగా శుభ్రం చేసి, పూర్తిగా ఉడికించి మాత్రమే తినాలి. పచ్చిగా సలాడ్ రూపంలో తీసుకునే ఆకుకూరల విషయంలో మరింత జాగ్రత్త అవసరం. బయట విక్రయించే శుభ్రత లేని ఆకుకూరలను కొనుగోలు చేయకుండా తాజా, నాణ్యమైన వాటినే ఎంచుకోవాలి.

బిగ్ బ్రేకింగ్.. కోటి ఐ ఫోన్లకు ఆర్డర్.. ఈ ఫోన్ కు ఎందుకంత డిమాండ్..

Apple Foldable iPhone
Apple Foldable iPhone

Apple Foldable iPhone: యాపిల్ ప్రేమికులకు ఇది నిజంగానే ఒక అద్భుతమైన వార్త. టెక్ దిగ్గజం యాపిల్ తన మొట్టమొదటి ఫోల్డబుల్ ఐఫోన్ (Foldable iPhone) ను మార్కెట్లోకి తీసుకురావడానికి సర్వసిద్ధం అవుతోంది. ఇప్పటివరకు ఆండ్రాయిడ్ మార్కెట్‌లో శాంసంగ్, వన్‌ప్లస్, గూగుల్ వంటి సంస్థలు ఫోల్డబుల్ ఫోన్ల విభాగంలో దూసుకుపోతుండగా.. ఇప్పుడు యాపిల్ కూడా ఆ రేసులోకి అధికారికంగా అడుగుపెట్టబోతోంది. ఈ మేరకు కంపెనీ తన సప్లయర్లకు కీలక ఆదేశాలు జారీ చేసినట్లు మార్కెట్ వర్గాల సమాచారం. అదేంటంటే… ఇప్పటి వరకు ఈ ఫోల్డబుల్ ఫోన్లు కోటి వరకు ఆర్డర్ వచ్చాయి.. ఈ వివరాల్లోకి వెళితె..

యాపిల్ తన తొలి ఫోల్డబుల్ ఐఫోన్‌ను ఈ ఏడాదే మార్కెట్లోకి తీసుకురావడానికి సన్నాహాలు ముమ్మరం చేస్తున్నట్లు తాజా సమాచారం. మొదటి ఫోల్డబుల్ మోడల్‌ను ‘iPhone Fold’ లేదా ‘iPhone Ultra’ పేరుతో విడుదల చేసే అవకాశం ఉందని టెక్ వర్గాల సమాచారం. అయితే తన మొదటి ఫోల్డబుల్ ఐఫోన్ కోసం యాపిల్ పెద్ద ఎత్తున తయారీ లక్ష్యాన్ని పెట్టుకున్నట్లు తెలుస్తోంది. మొదటి దశలోనే ఏకంగా 1 కోటి (10 మిలియన్) ఫోల్డబుల్ ఫోన్లను ఉత్పత్తి చేసేందుకు సిద్ధంగా ఉండాలని యాపిల్ తన సప్లై చైన్ భాగస్వాములకు సూచించినట్లు తెలుస్తోంది.

సాధారణంగా ఏ కంపెనీ అయినా తమ సరికొత్త డిజైన్ ఫోన్లను తక్కువ సంఖ్యలో ప్రయోగాత్మకంగా విడుదల చేస్తుంది. కానీ యాపిల్ మాత్రం మొదటి ప్రయత్నంలోనే భారీ స్థాయిలో మార్కెట్‌ను ఆక్రమించాలని చూస్తోంది.ఫోల్డబుల్ సెగ్మెంట్‌లో ఇది అత్యంత కీలక అడుగుగా భావిస్తున్నారు, ఎందుకంటే యాపిల్ ఇప్పటివరకు ఈ రకమైన డిజైన్‌లో ఫోన్‌ను విడుదల చేయలేదు. అందుకే, డిమాండ్, ప్రీమియం ధర, సరఫరా సామర్థ్యం అన్నీ కలిసి ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలను పెంచుతున్నాయి.

ఫోల్డబుల్ ఐఫోన్‌తో పాటు యాపిల్ తన అప్‌కమింగ్ ఫ్లాగ్‌షిప్ సిరీస్ అయిన iPhone 18 పై కూడా భారీ అంచనాలు పెట్టుకుంది. కంపెనీ సుమారు 7 కోట్ల (70 మిలియన్) యూనిట్ల ఐఫోన్ 18 ప్రో , ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ మోడళ్లను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనిని బట్టి ప్రీమియం, అల్ట్రా-ప్రీమియం స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను పూర్తిగా శాసించాలని యాపిల్ వ్యూహాలు రచిస్తున్నట్లు స్పష్టమవుతోంది.

యాపిల్ ఉత్పత్తులు ఎప్పుడూ ప్రీమియం ధరలోనే ఉంటాయి, ఇక ఫోల్డబుల్ ఫోన్ అంటే ఆ ధర మరింత ఆకాశాన్ని తాకడం ఖాయం. ఈ సరికొత్త ఫోల్డబుల్ ఐఫోన్ అల్ట్రా ధర సుమారు 2,500 డాలర్లు ఉండవచ్చని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. భారత కరెన్సీలో దీని విలువ దాదాపు రూ. 2.38 లక్షల వరకు ఉంటుంది. టాక్స్ లు, ఇతర సుంకాలు కలిపితే భారత్‌లో దీని ధర ఇంకా ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది.

ఈ కారుకు ఫుల్ డిమాండ్.. అయినా ధర తగ్గించారు.. ఎందుకంటే..

Maruti Suzuki
Maruti Suzuki

Maruti Suzuki: ఆటోమోబైల్ రంగంలో సాధారణంగా ఒక మోడల్ కార్లు బాగా అమ్ముడవుతుంటే వాటి ధరలను పెంచడం కంపెనీలకు అలవాటు. కానీ, దేశీయ దిగ్గజ కార్ల తయారీ సంస్థ Maruti Suzuki ఇందుకు భిన్నంగా సరికొత్త వ్యూహంతో ముందుకెళ్తోంది. మార్కెట్లో తన కంపెనీకి చెందిన ఓ కారుకు విపరీతమైన డిమాండ్, అద్భుతమైన అమ్మకాలు ఉన్నప్పటికీ.. ఆ కారు ధర తగ్గించింది. మరి ఈ కారు ధర తగ్గడానికి కారణాలేంటో చూద్దాం..

మారుతి సుజుకి విక్టోరిస్ బెస్ట్ సెల్లింగ్:
మారుతి సుజుకీ కంపెనీకి చెందిన పాపులర్ ఎస్‌యూవీ మోడల్ మారుతి సుజుకి విక్టోరిస్ (Maruti Suzuki Victoris) గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. కంపెనీ సొంతంగా తయారు చేసిన కార్లలో ‘విక్టోరిస్’ అత్యంత అధునాతనమైనది. ఇందులో అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ADAS), పవర్డ్ టెయిల్‌గేట్, అండర్‌బాడీ సీఎన్‌జీ ట్యాంక్ ఉన్నాయి. అలాగే ఇందులో 10.1 అంగుళాల భారీ టచ్‌స్క్రీన్ వంటి హై టెక్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ప్రస్తుతం ఈ కారును రూ. 13. 26 లక్షలనుంచి రూ. 25.06 లక్షల వరకు విక్రయిస్తున్నారు. ఈ కారు జూన్ 2026లో 20వేల కంటే ఎక్కువ విక్రయాలు జరుపుకుంది. దీంతో 2025 ఏడాదితో పోలిస్తే19.3 శాతం వృద్ధి సాధించింది. దీంతో మార్కెట్లో విక్టోరిస్ కారు సెగ్మెంట్‌లో రెండో బెస్ట్ సెల్లింగ్ మోడల్‌గా దూసుకుపోతోంది.

38,900 వరకు తగ్గింపు:
ఇటీవలి కాలంలో దాదాపు అన్ని ఆటోమోబైల్ కంపెనీలు తమ కార్ల ధరలను పెంచుకుంటూ పోతుంటే, మారుతి సుజుకి మాత్రం విక్టోరిస్ కారు ధరను తగ్గించి కొనుగోలుదారులకు షాక్ ఇచ్చింది. సెలెక్ట్ చేసిన పెట్రోల్ వేరియంట్లపై గరిష్టంగా రూ. 38,900 వరకు ఎక్స్-షోరూమ్ ధరను తగ్గించింది. ముఖ్యంగా ఈ మిడ్-సైజ్ ఎస్‌యూవీలోని టాప్ ఎండ్ వేరియంట్లు అయిన జెడ్ఎక్స్ఐ , జెడ్ఎక్స్ఐ ప్లస్ మాన్యువల్, ఆటోమేటిక్ వేరియంట్లకు మాత్రమే ఈ ధరల తగ్గింపు వర్తిస్తుంది. బేస్ వేరియంట్ల ధరల్లో ఎలాంటి మార్పు లేదు.

మరికొన్ని కార్లకు భారీ బెనిఫిట్స్:
ధరల తగ్గింపు కేవలం కొన్ని పెట్రోల్ మోడళ్లకు మాత్రమే పరిమితం కాగా, మిగిలిన వేరియంట్లపై కంపెనీ భారీ బెనిఫిట్స్ అందిస్తోంది. విక్టోరిస్ స్ట్రాంగ్ హైబ్రిడ్ మోడళ్లపై దాదాపు రూ. 90,000 వరకు ప్రయోజనాలను, సీఎన్‌జీ వెర్షన్లపై రూ. 80,000 వరకు తగ్గింపు ఆఫర్లను అందిస్తున్నారు. దీనివల్ల ఎక్కువ మైలేజ్ ఇచ్చే కార్లను ఎంచుకునే వారికి ఈ ప్రీమియం కారు మరింత అందుబాటు ధరలోకి రానుంది.

ధర తగ్గించడంపై వ్యూహం
మార్కెట్లో విక్టోరిస్ కారు సెగ్మెంట్‌లో రెండో బెస్ట్ సెల్లింగ్ మోడల్‌గా దూసుకుపోతోంది. అయినప్పటికీ ధరలు తగ్గించడం వెనుక ఒక వ్యూహం దాగి ఉంది. సాధారణ పెట్రోల్ మోడళ్లతో పోలిస్తే, అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ ఉండే స్ట్రాంగ్ హైబ్రిడ్ వేరియంట్ల ధరలు కాస్త ఎక్కువగా ఉంటాయి. ఈ రెండింటి మధ్య ఉన్న ధరల వ్యత్యాసాన్ని తగ్గించి, కస్టమర్లను మరింత ప్రీమియం వేరియంట్ల వైపు ఆకర్షించేందుకే మారుతి సుజుకి ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే ప్రస్తుతం ఈ మిడ్-సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో పోటీ విపరీతంగా పెరగడంతో తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి ఈ తగ్గింపు సహాయపడుతుంది.

హీరోయిన్ కృతి శెట్టి తో అసభ్యంగా ప్రవర్తించిన ఫోటో గ్రాఫర్.. వీడియో వైరల్..

Krithi Shetty
Krithi Shetty

Krithi Shetty: సినీ సెలబ్రిటీలు కూడా సాధారణ మనుషులే , వాళ్ళకంటూ కొన్ని ఇబ్బందులు ఉంటాయి అనేది కొంతమంది ఎందుకు గ్రహించారో అర్థం కాదు. వాళ్ళు ఇబ్బంది పడుతున్నారా లేదా?, ఏ మూడ్ లో ఉన్నారు?, ఎలా ప్రవర్తించాలి వంటివి ఏమి ఉండవు, వాళ్ళు కనిపించగానే మనకి కావాల్సిన ఎంటర్టైన్మెంట్ ఇచ్చేయాలి , ఒకవేళ ఇవ్వకపోతే వాళ్లపై నెగెటివ్ కథనాలు ప్రచారం చేయడం , ఇవే జరుగుతూ వస్తున్నాయి. ముఖ్యంగా హీరోయిన్స్ ఫోటోగ్రాఫర్స్ నుండి తీవ్రమైన ఇబ్బందులు ఎదురుకుంటున్నారు. రీసెంట్ గా ప్రముఖ యంగ్ హీరోయిన్ కృతి శెట్టి ఈ లిస్ట్ లో చేరిపోయింది. రీసెంట్ గా ఈమె షూటింగ్ ని ముగించుకొని వస్తున్న సమయం లో విమానాశ్రయం లో చేదు అనుభవం ఎదురైంది. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.

విమానాశ్రయం లో దిగి కారు ఎక్కుతున్న సమయం లో కృతి శెట్టి ని ఫోటో గ్రాఫర్స్ చుట్టుముట్టి ఫోటోలు తీశారు. వాళ్ళ కోసం ఆమె ఆగి ఫోటోలు కూడా దిగింది. తిరిగి వెళ్తున్నప్పుడు ఆమె బ్యాక్ వైపు కూడా ఫోటోలు తీశారు. అందుకు ఆమె ఇబ్బంది పడుతూ వద్దు అని చెప్పింది. అయినప్పటికీ వినకుండా ఫోటోలు తీస్తూనే ఉన్నారు. చివరికి చిరాకు పడి కారు ఎక్కి వెళ్ళిపోయింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఫోటో గ్రాఫర్స్ తీరుపై సోషల్ మీడియా లో నెటిజెన్స్ మండిపడుతున్నారు. ఇలా సినీ సెలబ్రిటీలను ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదని , వాళ్ళు ఒక్కసారి నో చెప్తే అర్థం చేసుకోవాలంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియా లో బాగా వైరల్ అయినటువంటి ఈ వీడియో ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి. ఈ వీడియో పై నెటిజెన్స్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు.

ఇక కృతి శెట్టి విషయానికి వస్తే , ఈమధ్య కాలం లో ఈమె చేసే ప్రతీ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్స్ గా మిగులుతున్నాయి. దీంతో ఈమెకు ఐరన్ లెగ్ అనే ముద్ర బలంగా పడింది. ఇప్పుడు ఈమె వెంకటేష్ , అనిల్ రావిపూడి , కళ్యాణ్ రామ్ కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న క్రేజీ మూవీ లో ఒక హీరోయిన్ గా నటించబోతుంది. వరుస హిట్స్ తో ఉన్న అనిల్ రావిపూడి , కృతి శెట్టి కి హిట్ ఇస్తాడా లేదా ఆయనే కృతి శెట్టి కారణంగా డిజాస్టర్ ని అందుకుంటాడా అనేది చూడాలి. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.

రాత్రి భోజనం చేసిన వెంటనే నిద్రపోయే వారికి హెచ్చరిక..

Night Dinner Tips
Dinner

Night Dinner Tips: రోజంతా పనులతో అలసిపోయిన చాలా మంది రాత్రి భోజనం చేసిన వెంటనే మంచంపైకి వెళ్లి నిద్రపోతుంటారు. అయితే ఈ అలవాటు ఆరోగ్యానికి మంచిది కాదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. భోజనం చేసిన వెంటనే పడుకోవడం వల్ల జీర్ణవ్యవస్థపై ఒత్తిడి పెరిగి అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. అందుకే రాత్రి భోజనానికి, నిద్రకు మధ్య కనీసం 2 నుంచి 3 గంటల విరామం ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు. అసలు తిన్న వెంటనే నిద్రపోతే ఉండే ఆరోగ్య సమస్యలు ఏంటి? భోజనం చేసిన తర్వాత ఏం చేయాలి?

భోజనం చేసిన వెంటనే నిద్రపోతే..?
తిన్న వెంటనే పడుకుంటే ఆహారం సరిగా జీర్ణం కాకపోవచ్చు. దీంతో అసిడిటీ, గ్యాస్, కడుపు ఉబ్బరం, అజీర్ణం వంటి సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా కడుపులోని ఆమ్లం ఆహారనాళంలోకి తిరిగి రావడం వల్ల ఛాతీలో మంట (యాసిడ్ రిఫ్లక్స్) ఎక్కువయ్యే ప్రమాదం ఉంటుంది. ఈ సమస్య తరచూ ఉంటే నిద్ర కూడా సరిగా పట్టదు.

భోజనం తర్వాత వాకింగ్ ఎందుకు మంచిది?
రాత్రి భోజనం చేసిన తర్వాత 5–10 నిమిషాలు వజ్రాసనం వేయడం జీర్ణక్రియకు ఎంతో సహాయపడుతుంది. అలాగే 10–15 నిమిషాలు నెమ్మదిగా నడవడం వల్ల కడుపులో భారంగా అనిపించడం తగ్గుతుంది. శరీరంలో రక్తప్రసరణ మెరుగుపడి ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. అయితే భోజనం చేసిన వెంటనే వేగంగా నడవడం లేదా కఠినమైన వ్యాయామాలు చేయకూడదు.

గోరువెచ్చని నీరు తాగడం వల్ల..
భోజనం అనంతరం కొద్దిసేపటి తర్వాత గోరువెచ్చని నీరు తాగడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడటంతో పాటు అసిడిటీ, గ్యాస్ వంటి సమస్యలను తగ్గించడంలో ఉపయోగపడుతుంది. అయితే ఒకేసారి ఎక్కువ నీరు తాగకుండా, మితంగా తీసుకోవడం ఉత్తమం.

డిన్నర్‌లో ఎలాంటి ఆహారం తీసుకోవాలి?
రాత్రి భోజనం తేలికగా ఉండేలా చూసుకోవాలి. ఫైబర్ అధికంగా ఉండే కూరగాయలు, సలాడ్లు, సంపూర్ణ ధాన్యాలు, అలాగే ప్రొటీన్ ఎక్కువగా ఉండే పప్పులు, పెరుగు, గుడ్లు లేదా ఇతర ఆరోగ్యకరమైన ప్రోటీన్ పదార్థాలను తీసుకోవడం మంచిది. నూనె ఎక్కువగా ఉండే, మసాలా అధికంగా ఉండే, వేయించిన ఆహారాన్ని రాత్రి తగ్గించడం వల్ల జీర్ణవ్యవస్థపై భారం తగ్గుతుంది.

మంచి నిద్ర కోసం..
రాత్రి భోజనాన్ని ప్రతిరోజూ ఒకే సమయానికి పూర్తి చేయడం మంచిది. భోజనం చేసిన వెంటనే మొబైల్ లేదా టీవీ ముందు ఎక్కువసేపు కూర్చోవడం కంటే కొద్దిసేపు నడవడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అలాగే నిద్రకు ముందు టీ, కాఫీ వంటి కెఫీన్ పానీయాలు తీసుకోకుండా ఉంటే మంచి నిద్రతో పాటు జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది.

రాత్రి భోజనం చేసిన వెంటనే నిద్రపోవడం చిన్న అలవాటులా అనిపించినా, దీర్ఘకాలంలో జీర్ణ సమస్యలు, అసిడిటీ, ఊబకాయం వంటి సమస్యలకు దారితీయవచ్చు. కాబట్టి భోజనానికి, నిద్రకు మధ్య కనీసం 2–3 గంటల విరామం, తేలికపాటి వాకింగ్, వజ్రాసనం, ఆరోగ్యకరమైన డిన్నర్ వంటి అలవాట్లు పాటించడం ద్వారా జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.

Xiaomi ఫోన్ కొనేవారికి గుడ్ న్యూస్.. లీకైన సమాచారంతో యూత్ లో ఉత్సాహం..

Xiaomi 18 Pro Max
Xiaomi 18 Pro Max

Xiaomi 18 Pro Max: స్మార్ట్‌ఫోన్ లవర్స్ ఎక్కువగా Xiaomi మొబైల్స్ అప్డేట్ పై ఆసక్తిగా ఉంటారు. ఈ కంపెనీ నుంచి కొత్తగా 18 Pro Max అనే మొబైల్ వస్తున్నట్లు ఇప్పటికే కంపెనీ ప్రకటించింది. అయితే తాజాగా ఈ మొబైల్ గురించి తాజాగా ఇంటర్నెట్‌లో లీకులు వచ్చాయి. చైనాకు చెందిన ప్రముఖ టిప్‌స్టర్ ‘డిజిటల్ చాట్ స్టేషన్’ అందించిన సమాచారం ప్రకారం.. ఈ సరికొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ అల్ట్రా-ప్రీమియం ఫీచర్లతో మార్కెట్లోకి రాబోతోంది. ఇంకా ఈ మొబైల్ లో ఏమేం ఉన్నాయో చూద్దాం..

Xiaomi 18 Pro Max ఫోన్‌లో వాడబోయే ప్రాసెసర్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఇందులో క్వాల్కమ్ కంపెనీకి చెందిన అప్‌కమింగ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 6 ప్రో చిప్‌సెట్‌ ఉండనుంది. ఇది అత్యంత అధునాతనమైన 2 నానోమీటర్ ప్రాసెస్‌పై తయారవుతోంది. దీనివల్ల ఫోన్ పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉండటమే కాకుండా, బ్యాటరీ వినియోగం చాలా వరకు తగ్గుతుంది. అంతేకాకుండా, ఇందులో తొలిసారిగా అత్యంత వేగవంతమైన LPDDR6 ర్యామ్ ను కూడా ఉపయోగించబోతున్నట్లు తెలుస్తోంది.

కెమెరా విభాగంలో షావోమి ఈసారి ఊహించని రేంజ్‌లో అప్‌గ్రేడ్స్ చేస్తోంది. షావోమి 18 ప్రో మ్యాక్స్ వెనుక భాగంలో ఏకంగా రెండు 200 మెగాపిక్సెల్ కెమెరాలను ఇవ్వబోతున్నారు. ఇందులో మెయిన్ కెమెరాకు డైనమిక్ రేంజ్‌ను అద్భుతంగా మెరుగుపరిచే LOFIC టెక్నాలజీని జోడించారు. ఇది తక్కువ వెలుతురులో లేదా మిక్స్డ్ లైటింగ్‌లో కూడా అద్భుతమైన ఫోటోలను ఇస్తుంది. అలాగే 200MP పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్, 50MP అల్ట్రా-వైడ్ లెన్స్ కూడా ఉంటుంది. ఎప్పటిలాగే ఈ కెమెరాలు ప్రముఖ లైకా (Leica) ట్యూనింగ్‌తో వస్తాయి.

షావోమి ఈ మోడల్‌లో ఏకంగా 8,500mAh భారీ సిలికాన్-కార్బన్ బ్యాటరీని టెస్ట్ చేస్తున్నట్లు లీకులు స్పష్టం చేస్తున్నాయి. ఇంత పెద్ద బ్యాటరీ ఉన్నప్పటికీ, ఈ టెక్నాలజీ వల్ల ఫోన్ లావుగా మారకుండా స్లిమ్‌గానే ఉంటుంది. ఈ భారీ బ్యాటరీని వేగంగా ఛార్జ్ చేయడానికి 100W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, అలాగే 50W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కూడా ఇస్తున్నారు. ఈ ఫోన్ లో 6.9 అంగుళాల OLED ఫ్లాట్ డిస్‌ప్లేతో రానుంది. దీని చుట్టూ ఉండే బెజెల్స్ చాలా సన్నగా, సమానంగా ఉంటాయి. ఇంకా మెరుగైన ఆడియో కోసం అప్‌గ్రేడెడ్ స్టీరియో స్పీకర్లు అమర్చారు.ఈ అల్ట్రా-ప్రీమియం స్మార్ట్‌ఫోన్ సెప్టెంబర్ లో మొదట చైనా మార్కెట్లో విడుదలయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత గ్లోబల్ మార్కెట్లోకి అడుగుపెడుతుంది.

చిరంజీవి ఎప్పటి నుంచో చేయాలనుకుంటున్న సినిమాలు ఇవేనా..?

Megastar Chiranjeevi
Megastar Chiranjeevi

Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ఎప్పటికప్పుడు ఇలాంటి సినిమాలు చేయాలి అనే దానిమీద కసరత్తులు చేస్తూ ఉంటాడు. ప్రస్తుతం ఉన్న ప్రేక్షకులు తన నుంచి ఎలాంటి సినిమాలను కోరుకుంటున్నారో అలాంటి సినిమాలను మనం వాళ్లకు అందించడానికి ఏం చేయాలి? ఎలా చేస్తే ప్రేక్షకులు మనల్ని ఆదరిస్తారు. ఎలాగైతే మనం వాళ్ళని ఎంటర్టైన్ చేయగలుగుతాం అని ధోరణిలో కూడా చిరంజీవి ఒకటికి పది సార్లు ఆలోచిస్తూ ఉంటాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ఇప్పటివరకు ఆయన చేసిన పాత్రలన్నీ ఒకతైతే ఇప్పుడు ఆయన కొన్ని డిఫరెంట్ పాత్రలను చేయాలని అనుకుంటున్నాడట. తన ఎంటైర్ కెరియర్ లో ఇప్పటివరకు ఆయన ఒక్కసారి కూడా రాముడి పాత్రలో గాని, కృష్ణుడి పాత్రలో గాని కనిపించలేదు. కాబట్టి ఈ రెండు పాత్రల్లో ఏదో ఒక పాత్రను వీలైనంత తొందరగా చేయాలని అనుకుంటున్నాడట.

ఎందుకంటే తను వెనక్కి తిరిగి చూసుకుంటే ఎలాంటి పాత్ర చేయలేదనే ఒక రిగ్రేట్ అయితే అతనికి ఉండకూడదట. అన్ని పాత్రలను చేసి అందులో అన్ని పాత్రల్లో తను మెప్పించాను అనే ఒక సంతృప్తి కలగాలనే ఉద్దేశ్యంతోనే డిఫరెంట్ పాత్రలవైపు అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తుంది.

వీలైనంత తొందరలోనే పౌరాణికానికి సంబంధించిన కథలను చేసి వాటిలో ఆ పాత్రలను వేయాలని చూస్తున్నారట. మరి మూవీ మొత్తం రాముడికి క్యారెక్టర్ కనిపించేలా దానికి సంబంధించిన సినిమాని చేస్తాడా? లేదంటే ఏదైనా ఒక సినిమాలో తను రాముడి పాత్రను పోషిస్తాడా? లేదా అనేది తెలియాల్సి ఉంది… మొత్తానికైతే చిరంజీవి చేసిన పాత్రలు మాస్ ప్రేక్షకులకు విపరీతంగా దగ్గరయ్యాయి. కాబట్టి ఇప్పుడు ఆయన చేయబోయే పాత్రలు విభిన్నంగా ఉండాలని చూస్తున్నాడు. ఇక తన సన్నిహిత రైటర్ల దగ్గర అలాంటి కథలను కూడా రెడీ చేయిస్తున్నట్టుగా తెలుస్తుంది.

ఇక ఏది ఏమైనా కూడా చిరంజీవి రాబోయే రోజుల్లో డిఫరెంట్ సినిమాలను చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడు. తను ఇంతకుముందు చేయనటువంటి పాత్రలను చేయడానికి ఆసక్తి చూపిస్తున్నట్టుగా తెలుస్తుంది… వీలైనంత తొందరగా ఆయన సినిమాలను చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడట…

వారణాసి క్లైమాక్స్.. అన్ బిలీవబుల్.. మైండ్ బ్లోయింగ్ అంట.. ఇదీ కథ

Varanasi
Varanasi

Varanasi: రాజమౌళి నుంచి ఒక సినిమా వచ్చింది అంటే చాలు అది భారీ యుద్ద నేపథ్యంతో కూడుకున్న సినిమా గా ఉంటుంది. ముఖ్యంగా ఆయన సినిమాల్లో పోరాట సన్నివేశాకు ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంటుంది. ఆయన నుంచి వచ్చే ప్రతి సినిమాలో తన మార్క్ కనిపిస్తుంది. ఇప్పటివరకు ఆయన చేసిన 12 సినిమాల్లో 12 సినిమాలు సూపర్ సక్సెస్ లను సాధించడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు అతన్ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళాయి. ఇక ఇప్పుడు చేయబోతున్న సినిమాలతో ప్రపంచ స్థాయి ప్రేక్షకులను మెప్పించాలనే ప్రయత్నంలో తను ఉన్నట్టుగా తెలుస్తోంది. వారణాసి సినిమాతో ఆయన ఏ రేంజ్ సక్సెస్ ని సాధిస్తాడు. ప్రేక్షకుల్లో చిరస్మరణీయంగా నిలిచిపోతాడా? లేదా అనేది తెలియాల్సి ఉంది. తను ఇంతకుముందు చేసిన సినిమాలకు సంబంధించిన అంతర్జాతీయ వేదికలపై అవార్డు లను అందుకుంటున్నప్పటికి వారణాసి సినిమా షూటింగ్ మాత్రం ఎక్కడ నిర్లక్ష్యం చేయడం లేదు. దేనికి అదే అన్నట్టుగా ఆయన ముందుకు సాగుతున్నారు. ఇక ఫ్రాన్స్ వేదికపై రాజమౌళికి దక్కిన గౌరవం భారతీయ సినీ పరిశ్రమ కి దక్కిన మరో గుర్తింపుగా నిలిచింది. అలాంటి రాజమౌళి పేరు ఇప్పుడు ప్రపంచస్థాయి దర్శకులు సైతం గొప్పగా చెబుతున్నారు. ఎక్కడ చూసిన మనకు రాజమౌళి పేరే వినిపిస్తుంది అంటే నిజంగా అది ఇండియన్ సినిమా ఇండస్ట్రీకి ఒక గర్వకారణం అనే చెప్పాలి… ప్రముఖ వాల్ ఆఫ్ ఫిలిం మేకర్స్ లో రాజమౌళి పేరు చేర్చడం కూడా ఒక అరుదైన గౌరవంగా ఆయన భావిస్తున్నాడు.

ఇక తనకే కాదు ఇండియన్ సినిమా ఇండస్ట్రీకి సైతం ఆయన ఒక దిక్సూచి గా మారాడనే చెప్పాలి. నిజానికి ఒకప్పుడు మన సినిమాలు తెలుగుకి మాత్రమే పరిమితమయ్యేవి బాలీవుడ్ లో సైతం మన సినిమాలను ఆదరించే వారు కాదు. కానీ రాజమౌళి చేసిన బాహుబలి సినిమాతో మన సినిమాల స్థాయి అమాంతం పెరగడమే కాకుండా ప్రపంచ స్థాయి ప్రేక్షకులు సైతం మనందరిని గౌరవిస్తున్నారు.

మన సినిమాలంటే ఏంటో వాళ్లకు తెలిసి వచ్చింది… ఇక ఇదిలా ఉంటే రాజమౌళి చేస్తున్న వారణాసి సినిమా ప్రస్తుతం క్లైమాక్స్ ని చిత్రీకరించబోతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ క్లైమాక్స్ కోసం దాదాపు 150 కోట్ల వరకు ఖర్చు పెడుతున్నట్టుగా తెలుస్తుంది.

క్లైమాక్స్ చాలా గ్రాండియార్ గా తెరకెక్కించాలనే ఉద్దేశ్యంతో రాజమౌళి ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా చిత్రీకరిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ సినిమాని 2027 ఏప్రిల్ 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలైతే చేస్తున్నారు. మొత్తానికైతే వాళ్ళు అనుకున్న సమయానికి ఈ సినిమా రిలీజ్ అవుతుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…

ప్రశాంత్ నీల్ ను లైట్ తీసుకున్న స్టార్ హీరో...ఇలా అయితే కష్టమేనా..?

Prashanth Neel
Prashanth Neel

Prashanth Neel: సినిమా ఇండస్ట్రీలో ఎవరు సక్సెస్ లను సాధిస్తారు. ఎవరు ఇండస్ట్రీ నుంచి ఫేడౌట్ అయిపోతారు అనేది చెప్పడం చాలా కష్టం…కానీ టాలెంట్ ఉన్న వాళ్లు మాత్రమే ఇండస్ట్రీలో సర్వైవల్ అవుతారనేది వాస్తవం…వారసత్వం ఉన్నప్పటికి ఇండస్ట్రీలో రాణించడం అనేది అంత ఆషామాషీ వ్యవహారమైతే కాదు. ఇక ఇలాంటి క్రమంలోనే కన్నడ సినిమా ఇండస్ట్రీలో తన కెరీర్ ని మొదలుపెట్టిన ప్రశాంత్ నీల్ ‘ఉగ్రం’ సినిమాను చేసి సక్సెస్ ని సాధించాడు. ఇక ఆ తర్వాత చేసిన ‘కేజిఎఫ్’ సినిమాతో ప్రపంచ స్థాయి ప్రేక్షకులను అలరించడమే కాకుండా పాన్ ఇండియాలో ఈ సినిమా పెను ప్రభంజనాన్ని క్రియేట్ చేసింది. దాదాపు 600 కోట్ల వరకు కలెక్షన్స్ ను రాబట్టింది. ఇక రెండో పార్ట్ 1300 కోట్ల కలెక్షన్స్ ను కొల్లగొట్టడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం అనే చెప్పాలి.

ఇక ఈ సినిమాలతో పాటు మరోసారి ఆయన ప్రభాస్ ని హీరోగా పెట్టి చేసిన సలార్ సినిమా 800 కోట్ల కలెక్షన్స్ ను రాబట్టింది. ప్రశాంత్ నీల్ ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ తో ‘డ్రాగన్’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించాలని చూస్తున్నాడు. అయితే ఈ మూవీ తర్వాత ఆయన సలార్ 2 సినిమాలో బిజీ కానున్నట్టుగా తెలుస్తుంది.

సలార్ 2 పూర్తయిన తర్వాత ఆయన మహేష్ బాబుతో సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడనే వార్తలైతే వస్తున్నాయి. కానీ మహేష్ బాబు మాత్రం ప్రశాంత్ నీల్ దర్శకత్వం నటించడానికి పెద్దగా ఆసక్తి చూపించడం లేదట. కారణం ఏంటంటే ప్రశాంత్ నీల్ సినిమాలు లో లైటింగ్ లో చాలా వైలెంట్ గా ఉంటాయి.

అలాగే ఎలివేషన్స్ సైతం టాప్ రేంజ్ లో ఉంటాయని అంతటి ఎలివేషన్స్, అలాగే అలాంటి లో లైటింగ్ మహేష్ బాబు ఇమేజ్ కి సెట్ అవ్వదని ఆయన అలాంటి సినిమాలను చేస్తే తన ఫ్యాన్స్ కూడా తన సినిమాలు చూడరేమో అని ఒక డైలామాలో మహేష్ బాబు ఉన్నాడట. మొత్తానికైతే రాజమౌళితో చేస్తున్న వారణాసి సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆయన క్రేజ్ ఏ రేంజ్ లో ఉంటుంది దాన్ని బట్టి సినిమాలను ప్లాన్ చేసుకోవాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది…

జగన్ కేసులపై కాంగ్రెస్ పోరాటం!

YS JaganMohan Reddy
YS JaganMohan Reddy

YS Jagan Mohan: ఏపీలో ఆసక్తికర రాజకీయ పరిణామాలు జరుగుతున్నాయి. కూటమి దూకుడుగా ముందుకు సాగుతోంది. ఆ దూకుడుకు బ్రేక్ వేసి పూర్వ వైభవం సాధించాలని జగన్మోహన్ రెడ్డి తహతహలాడుతున్నారు. అందుకు ఏ చిన్న అవకాశం వచ్చినా జారవిడుచుకోవడం లేదు. జగన్ దూకుడు పెంచుతున్న తరుణంలో మళ్లీ పాత కేసుల మాట వినిపిస్తోంది. గత 14 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి బెయిల్ పై ఉన్నారు. ఆయనపై పాత కేసులు అలానే ఉన్నాయి. అందుకే కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపితో సఖ్యతగా మెలుగుతున్నారు అనేది ఒక ప్రధాన ఆరోపణ. బిజెపి జగన్మోహన్ రెడ్డికి పరోక్ష సహకారం అందిస్తోంది అనేది బహిరంగ రహస్యమే. జగన్ ఏపీలో కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తారు కానీ కేంద్ర బీజేపీని అస్సలు ఏమీ అనరు. అందుకు ప్రధాన కారణం ఆయనపై ఉన్న కేసుల భయమే. తనపై కేసులు ఉన్నాయని.. కేంద్రం కన్నెర్ర చేస్తే జరిగే పరిణామాలు తెలుసు. అందుకే జగన్మోహన్ రెడ్డి బిజెపి విషయంలో మౌనంగా ఉన్నారు. బిజెపి సైతం ఆయన విషయంలో చూసి చూడనట్టుగా ఉంది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దానినే హైలెట్ చేస్తోంది. తమిళనాడు మాజీ సీఎం జయలలితకు ఒక న్యాయం? జగన్మోహన్ రెడ్డికి ఒక న్యాయమా? అంటూ ప్రశ్నిస్తోంది.

* తీవ్రమైన అభియోగాలు..
ఈ రాష్ట్రానికి ఐదేళ్లపాటు ముఖ్యమంత్రిగా వ్యవహరించారు రాజశేఖర్ రెడ్డి. 2004లో అధికారంలోకి వచ్చి 2009 వరకు కొనసాగారు. అయితే తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని.. కంపెనీలతో క్విడ్ ప్రోకో ఒప్పందాలను చేసుకున్నారు అనేది ప్రధాన అభియోగం. భూములు, మైనింగ్ లీజులు, అడ్డగోలు అనుమతుల ద్వారా రాజశేఖర్ రెడ్డి హయాంలో లబ్ధి పొందిన సంస్థలు.. ప్రతిఫలంగా జగన్ కంపెనీలో వేలకోట్ల విలువైన పెట్టుబడులు పెట్టాయని సిపిఐ తేల్చింది. ఈ వ్యవహారంలో జగన్ దురాశకు సహకరించిన ఆరోపణలపై అప్పట్లో ఆరుగురు మంత్రులు, 8 మంది ఐఏఎస్ అధికారులపై సైతం కేసులు నమోదయ్యాయి. జగన్ పై సిబిఐ దాఖలు చేసిన 11 చార్ట్ సీట్లలో.. 43 వేల కోట్ల రూపాయల అక్రమల లావాదేవీలు జరిగినట్లు తేల్చింది. వాటి ఆధారంగా ఈడి నమోదు చేసిన మరో ఆరు మనీలాండరింగ్ కేసులు సైతం విచారణలో ఉన్నాయి. ఈ కేసుల్లో జగన్మోహన్ రెడ్డి 2012లో అరెస్టయ్యారు. 16 నెలలు జైలులో రిమాండ్ ఖైదీగా ఉండిపోయారు. ఈ కేసులు నిరూపితమై జగన్మోహన్ రెడ్డి నిందితుడిగా తేలితే మాత్రం పదహారేళ్లకు పైగా జైలుకే అంకితం అయ్యే అవకాశం ఉంది. ఈ కేసుల తీవ్రత దృష్ట్యా కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీతో సఖ్యత పెంచుకున్నారు జగన్మోహన్ రెడ్డి. అందుకే కాంగ్రెస్ పార్టీ కంటే బిజెపి వైపే ఆయన ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు.

* బిజెపిని కార్నర్ చేయాలని..
ఏపీలో రాజకీయాలు మారాయి. ఏపీలో కూటమి ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ భాగస్వామ్యం గా ఉంది. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వంలో సైతం కీలక భాగస్వామిగా ఉంది తెలుగుదేశం. అయినా సరే జగన్మోహన్ రెడ్డి తన లాబీయింగ్ తో తన కేసుల విషయంలో ఎటువంటి కదలిక లేకుండా బిజెపితో సంధి చేసుకున్నారన్నది ప్రధాన ఆరోపణ. ఇప్పుడు తాజాగా దీనిపై కాంగ్రెస్ పార్టీకి చెందిన కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్మోహన్ రెడ్డి కేసుల విషయంలో కేంద్ర బిజెపి సహకరిస్తోందని ఆరోపించారు. గతంలో తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్న జయలలిత కేసుల విషయంలో కఠినంగా వ్యవహరించింది సిబిఐ. ఆమెకు శిక్ష పడే వరకు సిబిఐ ఉడుం పట్టు పట్టింది. ఆ స్థాయిలో మాత్రం జగన్మోహన్ రెడ్డి విషయంలో లేదు అనేది చింతా మోహన్ అభిప్రాయం. ఈ అంశాన్ని హైలెట్ చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. మున్ముందు జగన్మోహన్ రెడ్డి కేసులను అడ్డం పెట్టుకుని బిజెపిని ఇరకాటంలో పెట్టాలని చూస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో..

'రావు బహదూర్' చిత్రాన్ని వదులుకున్న యంగ్ హీరో అతనేనా..? చేసుంటే డిజాస్టర్ అయ్యేది..

Rao Bahadur
Rao Bahadur

Rao Bahadur: రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలై కాస్త ఆడియన్స్ నుండి డివైడ్ టాక్ తెచ్చుకున్న చిత్రాల్లో ఒకటి ‘రావు బహదూర్’. టాక్ డివైడ్ గా వచ్చినప్పటికీ మొదటి వీకెండ్ లో ఈ చిత్రానికి డీసెంట్ రేంజ్ వసూళ్లు వచ్చాయి. కానీ ఓవరాల్ గా ఫుల్ రన్ లో ఈ చిత్రం పెద్ద రేంజ్ కి వెళ్లే అవకాశాలు లేవు , ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం అయితే , ఈ చిత్రం కేవలం యావరేజ్ రేంజ్ లోనే నిలిచేట్టు ఉంది. ఇకపోతే ఈ సినిమాలో హీరో సత్యదేవ్ ఎంత అద్భుతంగా నటించారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ సినిమాని చూసిన ప్రతీ ఒక్కరు డైరెక్టర్ వెంకటేష్ మహా ని కాస్త బాగా తీసుంటే బాగుండేది అన్నారు కానీ , సత్యదేవ్ ని మాత్రం ఒక రేంజ్ లో పొగిడారు.

ఆయన నటనకు నేషనల్ అవార్డు ఇచ్చినా తక్కువే అని విమర్శకులు కూడా ప్రశంసిస్తున్నారు. అయితే ఈ చిత్రాన్ని ముందుగా సత్యదేవ్ తో చెయ్యాలని అనుకోలేదట. నేచురల్ స్టార్ నాని తో చెయ్యాలని అనుకున్నారట డైరెక్టర్ వెంకటేష్ మహా. నాని ని కలిసి స్టోరీ ని వివరించగానే , ఆయనకు కాన్సెప్ట్ నచ్చింది కానీ , సినిమాలో ఎక్కడో ఎదో మ్యాజిక్ మూమెంట్స్ మిస్ అవుతోంది, ‘కేర్ ఆఫ్ కంచెరపాలెం’ లో ఉన్న మ్యాజిక్ ఈ స్క్రిప్ట్ లో లేదు , పైగా స్క్రీన్ ప్లే చాలా స్లో గా ఉంది , ఆడియన్స్ ఈ చిత్రాన్ని ఎంత వరకు ఆదరిస్తారో తెలియదు , పైగా ఇప్పుడు మార్కెట్ ని పెంచుకునే సినిమాలు చేస్తున్న సమయంలో , ఇలాంటి చిత్రం చేయడం కరెక్ట్ కాదని నాని ఈ ప్రాజెక్ట్ ని రిజెక్ట్ చేసినట్టు తెలుస్తోంది. అనంతరం ఇది సత్యదేవ్ వద్దకు వెళ్ళింది.

నాని జడ్జిమెంట్ లో ఎలాంటి లోపం లేదని ఈ సినిమాని చూస్తే అర్థం అవుతోంది. ఒకవేళ నాని ఈ సినిమా చేసుంటే పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అయ్యేది. ఎందుకంటే ఆయన మార్కెట్ కి భారీ గా ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ సినిమాని నాని చేసుంటే 20 కోట్ల షేర్ వసూళ్లు రావడం కూడా కష్టమే , కాబట్టి కమర్షియల్ గా డిజాస్టర్ ఫ్లాప్ అయ్యేది. ఇప్పుడు ‘రావు బహదూర్’ చిత్రానికి విడుదలకు ముందు కేవలం 10 కోట్ల రూపాయిల రేంజ్ లో ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బాక్స్ ఆఫీస్ నుండి ఇప్పటి వరకు 4 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టింది. అంటే 40 శాతం రీకవరీ అయ్యింది అన్నమాట. ఫుల్ రన్ లో మరో 20 శాతం రీకవరీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే మరో రెండు రోజుల్లో లెనిన్ చిత్రం విడుదల కాబోతుంది , అత్యధిక శాతం థియేటర్స్ మొత్తం ఆ సినిమాకే వెళ్లనున్నాయి. దీంతో ‘రావు బహదూర్’ రన్ ఆగిపోయే అవకాశాలు ఉన్నాయి.