Home Blog Page 15

మీ పిల్లలు తరచూ ఇలా కడుపునొప్పి అంటున్నారా.. కారణం ఇవే..

Intestinal Worms : ప్రస్తుత కాలంలో కొంతమంది పిల్లలు చాలా నీరసంగా కనిపిస్తారు. ఇలాంటి వారు ఎక్కువగా ఆహారం తినకపోవడం.. చురుకుదనం తక్కువగా కనిపించడం వంటివి ఉంటాయి. ఈ సమస్యలకు ప్రధాన కారణాల్లో నులి పురుగులు (Intestinal Worms) కూడా ఒకటి. ఇవి పేగుల్లో నివసిస్తూ పిల్లలు తినే ఆహారంలోని పోషకాలను పీల్చుకుంటాయి. ఫలితంగా శారీరక, మానసిక ఎదుగుదలపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా 1 నుంచి 14 సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే పిల్లలో ఈ నులిపురుగులు ఎలా వ్యాపిస్తాయి? ఇవి ఉంటే ఎలాంటి లక్షణాలు ఉంటాయి?

నులి పురుగులు ఎలా వ్యాపిస్తాయి?
వ్యక్తిగత పరిశుభ్రత పాటించకపోవడం వల్ల నులి పురుగులు సులభంగా వ్యాపిస్తాయి. భోజనం చేసే ముందు, మరుగుదొడ్డి ఉపయోగించిన తర్వాత చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోకపోవడం, కలుషితమైన నీరు తాగడం, సరిగా కడగని కూరగాయలు, పండ్లు తినడం, బయట దుమ్ము, మట్టిలో చెప్పులు లేకుండా తిరగడం వంటి కారణాల వల్ల పురుగుల గుడ్లు శరీరంలోకి చేరి పేగుల్లో పెరుగుతాయి. ఒక పిల్లవాడి నుంచి మరొకరికి కూడా ఈ సమస్య వ్యాపించే అవకాశం ఉంటుంది.

పిల్లల ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది?
నులి పురుగులు పిల్లలు తీసుకునే ఆహారంలోని విటమిన్లు, ఐరన్, ప్రోటీన్లు వంటి కీలక పోషకాలను గ్రహించేస్తాయి. దీంతో శరీరానికి సరిపడా పోషకాలు అందక రక్తహీనత, బలహీనత, ఎదుగుదల మందగించడం వంటి సమస్యలు తలెత్తుతాయి. రోగనిరోధక శక్తి తగ్గి తరచూ జలుబు, జ్వరం, ఇతర ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది. కొందరు పిల్లల్లో చదువుపై ఏకాగ్రత తగ్గడం, అలసట, బరువు పెరగకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

కనిపించే లక్షణాలు ఏమిటి?
నులి పురుగుల సమస్య ఉన్న పిల్లల్లో తరచూ కడుపునొప్పి, ఆకలి తగ్గడం లేదా కొన్నిసార్లు అసాధారణంగా ఎక్కువ ఆకలి వేయడం, బరువు తగ్గడం, వికారం, వాంతులు, విరేచనాలు లేదా మలబద్ధకం వంటి లక్షణాలు కనిపించవచ్చు. ముఖ్యంగా రాత్రి సమయంలో మలద్వారం వద్ద తీవ్రమైన దురద ఉండటం నులి పురుగుల ప్రధాన లక్షణంగా భావిస్తారు. కొంతమంది పిల్లల్లో చిరాకు, నిద్రలేమి కూడా కనిపిస్తుంది.

చికిత్స ఎలా ఉంటుంది?
నులి పురుగుల నివారణకు వైద్యుల సలహా మేరకు ఆల్బెండజోల్ (Albendazole) వంటి డీ-వార్మింగ్ మాత్రలు ఇస్తారు. వయస్సు, బరువు ఆధారంగా మోతాదు నిర్ణయిస్తారు. స్వయంగా మందులు కొనుగోలు చేసి పిల్లలకు ఇవ్వకుండా తప్పనిసరిగా వైద్యుల సూచనలు పాటించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో కుటుంబ సభ్యులందరికీ కూడా చికిత్స అవసరమవుతుంది.

నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
నులి పురుగుల నుంచి పిల్లలను కాపాడాలంటే వ్యక్తిగత పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి. భోజనం ముందు, మరుగుదొడ్డి తర్వాత సబ్బుతో చేతులు కడుక్కోవడం అలవాటు చేయాలి. కాచి చల్లార్చిన లేదా శుభ్రమైన నీటినే తాగించాలి. కూరగాయలు, పండ్లను బాగా కడిగి వాడాలి. గోళ్లను చిన్నగా కత్తిరించి శుభ్రంగా ఉంచాలి. పిల్లలు బయట చెప్పులు లేకుండా తిరగకుండా చూడాలి. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం కూడా చాలా ముఖ్యం.

'నాగ బంధం' 4 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. డిజాస్టర్ టాక్ తో ఇంత గ్రాస్ ఊహించలేదు..

Naga Bandham Pre Release Business
Naga Bandham Pre Release Business

Naga Bandham Box Office : విడుదలకు ముందు ప్రమోషనల్ కంటెంట్ తో ప్రేక్షకులను విశేషం గా ఆకట్టుకున్న చిత్రం ‘నాగబంధం’. భారీ బడ్జెట్ తో , కళ్ళు చెదిరే విజువల్ ఎఫెక్ట్స్ తో థియేట్రికల్ ట్రైలర్ తోనే భారీ అంచనాలను రేకెత్తించింది ఈ చిత్రం. కానీ విడుదల తర్వాత ఈ చిత్రానికి మొదటి ఆట నుండే డిజాస్టర్ టాక్ వచ్చింది. ఆ రేంజ్ టాక్ వచ్చినప్పటికి కూడా కలెక్షన్స్ డీసెంట్ రేంజ్ లో రావడం గమనార్హం. భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించాము అని మేకర్స్ చేసిన పబ్లిసిటీ ఈ చిత్రానికి బాగా వర్కౌట్ అయ్యిందని అనిపిస్తోంది. 4 వ రోజున తెలుగు రాష్ట్రాల నుండి ఈ చిత్రానికి 1 కోటి 20 లక్షల రూపాయిల రేంజ్ గ్రాస్ వసూళ్లు రాగా, ఓవరాల్ వరల్డ్ వైడ్ గా 1 కోటి 80 లక్షల రూపాయిల రేంజ్ లో గ్రాస్ వసూళ్లు వచ్చాయి.

ఓవరాల్ గా 4 వ రోజున వరల్డ్ వైడ్ షేర్ వసూళ్లు 80 లక్షల రేంజ్ లో ఉంటాయని సమాచారం. నాలుగు రోజులు పూర్తి అయ్యేసరికి ప్రాంతాల వారీగా ఈ చిత్రానికి వచ్చిన గ్రాస్ వసూళ్లను ఒకసారి పరిశీలిస్తే, నైజాం ప్రాంతం నుండి 5 కోట్ల 45 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు రాగా, ఆంధ్ర ప్రదేశ్ + సీడెడ్ ప్రాంతాల నుండి ఈ చిత్రానికి 4 కోట్ల 10 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల నుండి ఈ చిత్రానికి 9 కోట్ల 55 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు , 4 కోట్ల 75 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. వచ్చిన నెగెటివ్ టాక్ కి ఈ మాత్రం వసూళ్లు రావడం నిజంగా గ్రేట్. కానీ నిర్మాతకు బ్రేక్ ఈవెన్ అవ్వడానికి ఈ వసూళ్లు ఏ మాత్రం సరిపోవు అనేది వాస్తవం.

ఇక ఇతర ప్రాంతాల విషయానికి వస్తే కర్ణాటక నుండి 1 కోటి 55 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు రాగ, హిందీ + రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 2 కోట్ల 5 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు , ఓవర్సీస్ నుండి 1 కోటి 45 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇండియా వైడ్ గా డీసెంట్ స్థాయి వసూళ్లు వచ్చాయి , ఓవర్సీస్ లో మాత్రం డిజాస్టర్ రేంజ్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా ఈ చిత్రం కనీసం స్థాయిలో సేఫ్ అవ్వాలంటే వరల్డ్ వైడ్ గా 28 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టాలి. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం చూస్తే కేవలం 10 నుండి 15 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చేలా అనిపిస్తోంది. నిర్మాతకు భారీ నష్టాలు తప్పేలా లేవు.

'పెద్ది' వరల్డ్ వైడ్ క్లోజింగ్ కలెక్షన్స్.. కలెక్షన్స్ అదిరిపోయాయి.. కానీ నష్టాలు తప్పలేదు..

Peddi OTT
Peddi OTT

Peddi Closing Collections : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన నటించిన ‘పెద్ది’ మూవీ బాక్స్ ఆఫీస్ రన్ దాదాపుగా ముగిసింది. ఎల్లుండి నుండి ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. విడుదలైన మొదటి రోజు మొదటి ఆట నుండే ఈ చిత్రానికి ఆడియన్స్ నుండి అద్భుతమైన టాక్ వచ్చింది. మధ్యలో కొంతమంది ఆడియన్స్ ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ నెగెటివిటీ పెంచినప్పటికీ కూడా వసూళ్లు ఆగలేదు. నాన్ స్టాప్ గా బాక్స్ ఆఫీస్ ని కుమ్ముతూనే ఉన్నింది ఈ చిత్రం. 32 వ రోజున కూడా ప్రధాన నగరాల్లో ఈ చిత్రం హౌస్ ఫుల్ బోర్డ్స్ ని నమోదు చేసుకుందంటే సాధారణమైన విషయం కాదు. ఓవరాల్ గా థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి ప్రాంతాల వారీగా ఎంత షేర్ వసూళ్లు వచ్చాయి అనేది ఇప్పుడొకసారి చూద్దాం.

నైజాం ప్రాంతం లో 16 కోట్ల ఓపెనింగ్ తో మొదలైన ఈ చిత్రానికి 55 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లతో ముగిసింది. ఇది చాలా మంచి రన్ అనే చెప్పాలి , కానీ ఓపెనింగ్స్ ఇంకా బాగా వచ్చి ఉండుంటే , ఈ సినిమా క్లోజింగ్ ఇంకా పెద్దదిగా ఉండేదని అంటున్నారు. ఇక రామ్ చరణ్ కి కంచుకోటగా పిలవబడే రాయలసీమ ప్రాంతం లో ఆశించిన స్థాయి వసూళ్లు రాలేదు. 24 కోట్ల రూపాయలకు ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ ని కొనుగోలు చేయగా, కేవలం 21 కోట్ల 26 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చాయి. అదే విధంగా ఉత్తరాంధ్ర ప్రాంతం నుండి 23 కోట్ల 20 లక్షలు , ఈస్ట్ గోదావరి నుండి 13 కోట్ల రూపాయిలు , వెస్ట్ గోదావరి నుండి 9 కోట్ల 22 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.

ఇక కృష్ణా జిల్లా నుండి 10 కోట్ల 39 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టగా, గుంటూరు జిల్లా నుండి 12 కోట్ల 76 లక్షలు , నెల్లూరు జిల్లా నుండి 6 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల నుండి 150 కోట్ల రూపాయిల 80 లక్షల షేర్ వసూళ్లు , 234 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అదే విధంగా కర్ణాటక నుండి 15 కోట్ల 30 లక్షల రూపాయిలు , తమిళనాడు + కేరళ నుండి 2 కోట్ల 40 లక్షలు , హిందీ + రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 12 కోట్ల 15 లక్షలు , ఓవర్సీస్ నుండి 23 కోట్ల 80 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా 205 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు 350 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ వరల్డ్ వైడ్ బిజినెస్ 220 కోట్ల రూపాయలకు జరగ్గా 15 కోట్ల నష్టం వాటిల్లింది.

తుని జ్ఞానేశ్వరి మిస్సింగ్.. పోలీసుల సంచలన ప్రకటన

Tuni Gnaneswari missing case update
Tuni Gnaneswari missing case update

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తుని ప్రాంతంలో జ్ఞానేశ్వరి అనే బాలిక మిస్సింగ్ అయింది. ఈ సంఘటన జరిగి దాదాపు 15 రోజులు దాటింది.. అయినప్పటికీ ఇంతవరకు ఈ కేసులో పురోగతి లేదు. ఇంతవరకు ఆ బాలిక ఆచూకీ కనిపించలేదు. అనేక దఫాలుగా.. అనేక విధాలుగా అధికారులు ఆ పాప కోసం గాలింపు చేపట్టినప్పటికీ ఇంతవరకు ఆమె జాడ లభించలేదు. అనేక విధాలుగా ప్రయత్నాలు చేశారు. అయినప్పటికీ ఇంతవరకు ఉపయోగం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ పోలీసులు కీలక ప్రకటన చేశారు.

ప్రత్యేకమైన బలగాలు.. ప్రత్యేకమైన బృందాల సహాయంతో గాలింపు చేపట్టినప్పటికీ ఇంతవరకు పాప జాడ కనిపించలేదు. సీసీ కెమెరాలు జల్లెడ పట్టారు. అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. పాప మిస్సింగ్ అయినచోట చికెన్ ముక్కలు పెట్టారు. ఆట బొమ్మలు కూడా ఏర్పాటు చేశారు. ఇన్ని రకాలుగా ఏర్పాటు చేసినప్పటికీ పాప జాడ కనిపించలేదు.

పాప మిస్సింగ్ అయి రోజులు గడుస్తున్నప్పటికీ ఇంతవరకు ఆచూకీ లభించకపోవడంతో పోలీసులు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. ఒకవేళ పాపను ఎవరైనా ఎత్తుకెళ్లి ఉంటే అప్పగించాలని.. వారి మీద ఎటువంటి కేసులు నమోదు చేసే అవకాశం లేదని పోలీసులు హామీ ఇచ్చారు. ఒకవేళ సమాచారం ఇచ్చినా సరే తాము నేరుగా వెళ్లి పాపను తీసుకొస్తామని చెప్పారు. పాపను ఆమె తల్లికి అందించడాన్నే తమలక్ష్యంగా పెట్టుకున్నామని పోలీసులు చెబుతున్నారు. అపహరణ కోణంలోనే కేసులు దర్యాప్తు చేస్తున్నామని.. మొబైల్ ఫోన్ అసలు ఉపయోగించని వ్యక్తులే ఈ దారుణానికి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. జ్ఞానేశ్వరి కేసులో ఓ కారు గురించి చర్చ జరిగింది. కొంతమంది వ్యక్తులు అందులో వచ్చి ఆమెను అపహరించుకుని వెళ్లారని వార్తలు వచ్చాయి. అయితే అదంతా ఫేక్ ప్రచారమని పోలీసులు కొట్టిపడేశారు.

ఇన్ని రకాలుగా దర్యాప్తు చేపట్టినప్పటికీ జ్ఞానేశ్వరి జాడ లభించకపోవడంతో.. కొంతమంది కావాలని ఆమెను అపహరించారని.. పాపను బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. పై ఆ పాపను వేరే ప్రాంతానికి తీసుకొని వెళ్లి ఉంటారని భావిస్తున్నారు. ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినప్పటికీ పాప జాడ లభించడం లేదని పోలీసులు చెబుతున్నారు. అందువల్లే వారి మీద ఎటువంటి కేసులు నమోదు చేయకుండా.. పాపను ఆమె తల్లి దగ్గరికి చేర్చుతామని.. పాపను తీసుకెళ్లినవారు తమకు సమాచారం ఇస్తే సరిపోతుందని పోలీసులు పేర్కొంటున్నారు.

గొప్ప మనసు చాటుకున్న హీరో నిఖిల్.. భీమవరం విద్యార్థుల కోసం ఎంత పనిచేశాడంటే..

Nikhil Siddhartha

Nikhil Siddhartha : ప్రముఖ యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ్ అప్పుడప్పుడు తన శక్తి కి తగ్గట్టు సేవా కార్యక్రమాలు చేస్తుండడం మనం గమనిస్తూనే ఉన్నాం. రాజకీయ బ్యాక్ గ్రౌండ్ ఫ్యామిలీ నుండి ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ, ఏ రోజు కూడా తన మావయ్య పేరుని ఉపయోగించుకోలేదు , కేవలం తన వ్యక్తిగతంగానే సహాయ కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నారు. రీసెంట్ గానే ఆయన భీమవరం లో ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. భీమవరం వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలల్లో ని వెయ్యి మంది విద్యార్థులకు ఆయన విద్యా సామగ్రి ని అందించడం ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. నిఖిల్ చేసిన ఈ గొప్ప పని పై నెటిజెన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ మన జీవితం లో విద్యనే భవిష్యత్తుని మార్చగల ఏకైక శక్తి. విద్యార్థులందరూ బాగా చదువుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలి. తల్లిదండ్రులను , గురువులను గౌరవించాలి. భవిష్యత్తులో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థులకు కూడా ఈ కిట్స్ ని అందించడమే నా లక్ష్యం’ అంటూ నిఖిల్ సిద్దార్థ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాజీఫా వైరల్ అయ్యాయి. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ నియోజకవర్గాల్లో భీమవరం కూడా ఒకటి. అలాంటి చోట ఇలాంటి గొప్ప సేవా కార్యక్రమం చేసినందుకు పవన్ ఫ్యాన్స్ కూడా నిఖిల్ ని ప్రత్యేకంగా అభినందిస్తున్నారు. ఇలాంటి విషయాల్లో మా సపోర్టు ఎప్పుడూ ఉంటుందని ఈ సందర్భంగా చెప్పుకొస్తున్నారు. ఇక నిఖిల్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన ‘స్వయంభు’ అనే సోషియో ఫాంటసీ చిత్రం చేస్తున్నారు. నభ నటేష్ , సంయుక్త మీనన్ ఈ చిత్రం లో హీరోయిన్ గా నటిస్తున్నారు. నిఖిల్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా పై ఆయన భారీ ఆశలు పెట్టుకున్నారు.

ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన టీజర్ కి పర్వాలేదు అనే రేంజ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ ఏడాది సెప్టెంబర్ 3 వ తేదీన ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్లో గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు. నిఖిల్ గత చిత్రం ‘స్పై’ ఆశించిన స్థాయి ఫలితాన్ని సొంతం చేసుకోలేక పోయింది. ‘కార్తికేయ 2’ తో పాన్ ఇండియా లెవెల్ లో సూపర్ హిట్ ని అందుకున్న ఆయన , ‘స్వయంభు’ తో మరోసారి తన సత్తా చాటుతారో లేదో చూడాలి. ఈ సినిమాతో పాటు ఆయన ‘ఇండియా హౌస్’ అనే చిత్రం లో కూడా నటిస్తున్నారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఈ చిత్రానికి నిర్మాత.

 

నరేంద్ర మోడీ ఇండోనేషియా పర్యటన... తెర వెనక పెద్ద కథ ఉంది..

Narendra modi indonesia

Narendra Modi : ఇటీవల కాలంలో భారత ప్రధాన నరేంద్ర మోడీ విదేశాల్లో ఎక్కువగా పర్యటిస్తున్నారు. చిన్న చిన్న దేశాల నుంచి మొదలు పెడితే.. పెద్ద దేశాల వరకు నరేంద్ర మోడీ కాలికి బలపం కట్టుకుని తిరుగుతున్నారు. నరేంద్ర మోడీ ఇలా ఎందుకు వెళ్తున్నారు.. దీని వెనక ఏముంది.. దేశ ప్రయోజనాలు ఏ స్థాయిలో దాగి ఉన్నాయి.. అనేవి ఆసక్తికరమైన అంశాలుగా మారిపోయాయి.

ప్రస్తుతం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇండోనేషియాలో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన పర్యటన ఆసక్తికరంగా మారింది.. గ్లోబల్ మీడియా కూడా ఆయన పర్యటనకు విపరీతమైన ప్రయారిటీ ఇచ్చింది. దానికి ప్రధాన కారణం బ్రహ్మోస్. ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్ పాకిస్తాన్ మీద బ్రహ్మో స్ మిసైల్స్ ప్రయోగించింది. 100% సక్సెస్ రేట్ తో అవి పని చేశాయి. దీంతో వాటిని కొనుగోలు చేయడానికి ప్రపంచ దేశాలు ఆసక్తి చూపిస్తున్నాయి. తాజాగా ఈ మిస్సైల్స్ కోసం ఇండోనేషియా కూడా మన దేశాన్ని సంప్రదించింది. ఇండోనేషియా క భారత్ ఈ మిస్సైల్స్ కోసం ఒప్పందాలు కుదురుతుంది. ఇవి మాత్రమే కాకుండా అస్త్ర మిస్సైల్స్ కోసం కూడా రెండు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది.

ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో తో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చర్చలు జరిపారు. రెండు దేశాల మధ్య అనేక రకాల చర్చలు జరిగాయి. కీలకమైన ఒప్పందాలు కూడా కుదిరాయి. ఇండోనేషియాలో అపారమైన ఖనిజ వనరులు ఉన్నాయి. వాటి మీద భారీగా పెట్టుబడి పెట్టబోతోంది. ముఖ్యంగా స్టీల్.. నికెల్, రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ తయారీలో భారత్ భారీగా ఇన్వెస్ట్ చేయబోతోంది. ఇండోనేషియా ప్రాంతంలో సభాంగ్ పోర్టు కూడా నిర్మిస్తోంది. ఈ పోర్టు మలక్కా జల సంధికి దగ్గరగా ఉంటుంది. ఇది మన దేశానికి అత్యంత వ్యూహాత్మకమైనది.

ఇండోనేషియా కోసం భారత్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను తయారుచేసి అందించనుంది. ప్రధానికి ఇండోనేషియా ప్రభుత్వం బింటాంగ్ ఆది పూర్ణ రిపబ్లిక్ ఆఫ్ ఇండోనేషియా పురస్కారంతో గౌరవించింది. ఈ నేపథ్యంలో ఇండోనేషియా అధ్యక్షుడు భారత ప్రధానమంత్రిని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. రామాయణ కాలం నుంచి భారతదేశానికి, ఇండోనేషియాకు బలమైన సంబంధాలు ఉన్నాయని.. నరేంద్ర మోడీని చూసి తాను అనేక పథకాలను.. అనేక కార్యక్రమాలను కాపీ కొట్టానని ఇండోనేషియా అధ్యక్షుడు ప్రకటించడం విశేషం.

'ఓజీ 2' పై తమన్ షాకింగ్ అప్డేట్.. ఇలా ట్విస్ట్ ఇచ్చాదేంటి.. వీడియో వైరల్..

OG 2 Producer Change
OG 2 Producer Change

OG 2 : ‘ఓజీ 2’ గురించి ఏ చిన్న అప్డేట్ బయటకి వచ్చిన సోషల్ మీడియా మొత్తం ఒక రేంజ్ లో ఊగిపోతోంది అనే సంగతి మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ప్రకటన వీడియో కి పవన్ ఫ్యాన్స్ సృష్టించిన భీభత్సాన్ని అంత తేలికగా ఎవ్వరూ మర్చిపోలేరు. పవన్ కళ్యాణ్ సైతం ఈ ప్రాజెక్ట్ పై స్పెషల్ ఆసక్తి చూపిస్తుండడం తో , కచ్చితంగా మరోసారి ఈ చిత్రం తో ఇండస్ట్రీ రికార్డ్స్ బద్దలు అవుతాయనే నమ్మకం తో ఉన్నారు ఫ్యాన్స్. ఓజాస్ గంభీర తండ్రి ‘జై గంభీర’ కి ఫ్లాష్ బ్యాక్ కి సంబంధించిన స్టోరీ తో ‘ఓజీ 2’ ని తెరకెక్కించబోతున్నారు. యాక్షన్ తో పాటు ఫాంటసీ కూడా మిక్స్ అయ్యి ఉండే ఈ సినిమా పై మూవీ లవర్స్ లో కూడా ప్రత్యేకమైన క్రేజ్ ఉంది.

ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ ని , ఆ చిత్ర సంగీత దర్శకుడు తమన్ ‘హృదయం మురళి’ సాంగ్ లాంచ్ ఈవెంట్ లో ప్రకటించారు. శంషాబాద్ లోని గణేష్ థియేటర్లో ఈ ఈవెంట్ ని ఏర్పాటు చేయగా , తమన్ మైక్ అందుకొని మాట్లాడుతున్న సమయంలో , అక్కడి విద్యార్థులు పెద్ద ఎత్తున ‘ఓజీ..ఓజీ’ అంటూ నినాదాలు చేయడం మొదలు పెట్టారు. అప్పుడు తమన్ ‘సెప్టెంబర్ లో కలుద్దాం’ అంటూ ప్రకటన చేయడం తో ఒక్కసారిగా థియేటర్ మొత్తం బ్లాస్టింగ్ రేంజ్ రెస్పాన్స్ వచ్చింది. సెప్టెంబర్ 2 న పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేయబోతున్నారు. అదే రోజున షూటింగ్ ప్రారంభం తేదీని కూడా ప్రకటిస్తారట. అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రం షూటింగ్ ని సెప్టెంబర్ నెలలోనే మొదలు పెట్టబోతున్నారట.

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా సాగుతోంది. సుజిత్ ఈ సినిమాకు సంబంధించిన క్యాస్ట్ ని ఫైనల్ చేసే పనిలో పడ్డారు. ఈ చిత్రం లో హీరోయిన్ గా పూజా హెగ్డే నటించబోతుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపించిన టాక్ , కానీ అందులో ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది. సుజిత్ బాలీవుడ్ హీరోయిన్ కోసం సంప్రదింపులు జరుపుతున్నారట. అదే విధంగా ఈ చిత్రం లో అనేక కొత్త క్యారెక్టర్స్ పరిచయం అవుతాయని , పాన్ ఇండియా లెవెల్ లో మంచి క్రేజ్ ని సొంతం చేసుకున్న నటీనటులు ఈ సినిమాలో భాగం అవ్వబోతున్నారని టాక్. సెప్టెంబర్ నెలలో షూటింగ్ ని మొదలు పెట్టి , వచ్చే ఏడాది సమ్మర్ లోపు షూటింగ్ ని పూర్తి చేసే ప్లాన్ లో ఉన్నారట మేకర్స్.

విరిగిపడిన కొండ చరియలు.. వెంట్రుకవాసిలో బతికిపోయారు.. ఒళ్ళు గగుర్పొడిచే వీడియో

vainad

Kerala Floods : కేరళ రాష్ట్రంలో వరదలు అపారమైన నష్టాన్ని కలగజేస్తున్నాయి. ముఖ్యంగా వయనాడ్ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలు ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. సరిగ్గా గత ఏడాది ఇదే ప్రాంతంలో విపరీతంగా వర్షాలు కురిసాయి. ఇదే స్థాయిలో కొండ ప్రాంతాల నుంచి మట్టి, రాళ్లు విరిగిపడ్డాయి. భారీగా ప్రాణనష్టం సంభవించింది. గ్రామాలకు గ్రామాలు ఆనవాళ్లు కోల్పోయాయి. ఆ నష్టం నుంచి తేరుకోకముందే.. మళ్లీ అదే ప్రాంతంలో వర్షాలు కురుస్తున్నాయి. ప్రకృతి ప్రక్రోపానికి వయనాడ్ కకావికలం అవుతోంది.

గత కొద్దిరోజులుగా కేరళ రాష్ట్రంలో విపరీతంగా వర్షాలు కురుస్తున్నాయి. వయనాడ్ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలు భారీగా నష్టాన్ని కలగజేస్తున్నాయి . వరద ప్రవాహం ముంచెత్తడంతో ఇప్పటికే చాలా ప్రాంతాలు నీట మునిగిపోయాయి. రోడ్లు కొట్టుకుపోయాయి. కొండ ప్రాంతాల నుంచి మట్టి దిబ్బలు కింద పడ్డాయి. రాళ్లు కొట్టుకొని వచ్చాయి. దారులు నామరూపాలు లేకుండా పోయాయి. వరద ప్రవాహం గ్రామాలకు గ్రామాలనే ముంచెత్తింది. ప్రాథమిక సమాచారం ప్రకారం ఇప్పటివరకు ఇద్దరు చనిపోయారు. శిధిలాల కింద 30 మంది చిక్కుకున్నారు.

అనక్కం పోయిల్, కల్లాడి సొరంగం ప్రాంతంలో కొండ చరియలు విరిగిపడిపోయాయి. కల్లాడి ప్రాంతంలో మీనాక్షి వంతెన సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం ఒక్కసారిగా సంభవించడంతో అక్కడి ప్రజలు ఆందోళనకు గురయ్యారు. సునామి తరహాలోనే వరద నీరు పోటెత్తుతున్న నేపథ్యంలో భయంతో పరుగులు తీశారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. అప్పటికే ఆ ప్రాంతానికి ఎన్డీ ఆర్ఎఫ్ దళాలు చేరుకున్నాయి. మట్టి దిబ్బల కింద చిక్కుకుపోయిన వారిని రక్షించాయి. ఈ ఘటనలో ఇప్పటివరకు ఈ ఇద్దరు చనిపోయారు. 30 మంది చిక్కుకున్నారు. వారందరినీ కాపాడేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

గత ఏడాది కూడా ఇదే ప్రాంతంలో ఇదే స్థాయిలో వరదలు వచ్చాయి. కొన్ని సందర్భాలలో విపరీతంగా కురిసిన వర్షాలు ఈ ప్రాంతాన్ని నామరూపాలు లేకుండా చేశాయి. విపరీతంగా నష్టం వాటిల్లడంతో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. కేంద్ర ప్రభుత్వం అయితే ఏకంగా జాతీయ విపత్తు కింద ప్రకటించింది. వయనాడ్ ప్రాంతంలో విపరీతంగా విలయం చోటు చేసుకోవడంతో.. ఆ ప్రాంతాన్ని బాగు చేయడానికి చాలా రోజులు పట్టింది. అది జరిగి ఏడాదికాకముందే మళ్లీ వర్షాలు ఈ ప్రాంతాన్ని ముంచెత్తడం విశేషం.

మనవడి కోసం ఫాంహౌస్ వదిలి కదిలివచ్చిన కేసీఆర్

kcr

KCR : అప్పట్లో జీవన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి భారత రాష్ట్ర సమితిలో చేరుతున్నప్పుడు.. అక్కడ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఆ సభకు కెసిఆర్ హాజరయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం మీద తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఆ తర్వాత కేసీఆర్ ఇంతవరకు బయటికి రాలేదు. వ్యవసాయ క్షేత్రానికి మాత్రమే ఆయన పరిమితమవుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో అనేక రకాల రాజకీయ పరిణామాలు జరుగుతున్నప్పటికీ.. కెసిఆర్ పెద్దగా స్పందించడం లేదు. అప్పుడప్పుడు పత్రికా ప్రకటనలు మాత్రమే చేస్తున్నారు.

ఉన్నట్టుండి కేసీఆర్ వ్యవసాయ క్షేత్రం నుంచి బయటికి వచ్చారు. నేరుగా గచ్చిబౌలిలోని ఏఐజి ఆసుపత్రికి వెళ్లారు. కెసిఆర్ ఏఐజి ఆసుపత్రికి వెళ్లడం పట్ల రకరకాల చర్చలు జరిగాయి. ఆయన ఆరోగ్యం బాగోలేదా.. ఏమైనా పరీక్షల కోసం వచ్చారా.. అనే చర్చలు నడిచాయి. అయితే కెసిఆర్ ఆరోగ్యంగానే ఉన్నారు. గతంలో ఆయనకు అనారోగ్యంగా ఉన్నప్పుడు ఏఐజి ఆసుపత్రికి వచ్చారు. ఇప్పుడు ఆకస్మాత్తుగా ఆయన ఏఐజి ఆసుపత్రికి రావడానికి ప్రధాన కారణం మనవడు హిమాంషు.

కేటీఆర్ కుమారుడు హిమాంశు అమెరికాలో చదువుతున్నారు. కొంతకాలంగా హైదరాబాదులోనే ఉంటున్నారు. ఇటీవల మలేషియాలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు జరిగితే తండ్రి తో పాటు అక్కడికి వెళ్లారు. ఆ వేడుకల్లో ఆయన భాగమయ్యారు. హిమాంసు స్పోర్ట్స్ బాగా ఆడతారు. ఇటీవల ఆయన స్పోర్ట్స్ ఆడుతుండగా గాయపడ్డారు. గాయం తీవ్రం కావడంతో వెంటనే ఆయనను ఏఐజి ఆసుపత్రికి తరలించారు. కొద్దిరోజులుగా ఆయన అక్కడే చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో మనవడిని కెసిఆర్ పరామర్శించారు. అతడితో చాలాసేపు మాట్లాడారు. కెసిఆర్ ఏఐజి ఆసుపత్రికి వచ్చినప్పుడు ఆయన వెంట కేటీఆర్, హరీష్ రావు ఉన్నారు. హరీష్ రావు, కేటీఆర్ హిమాన్షు ఆరోగ్య పరిస్థితి గురించి ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు.

కెసిఆర్ రావడంతో ఏఐజి ఆసుపత్రిలో సందడి నెలకొంది. కెసిఆర్ వచ్చారని తెలుసుకొని చాలామంది ఆసుపత్రి చేరుకున్నారు.. కెసిఆర్ ను చూసేందుకు ఉత్సాహం చూపించారు. దాదాపు 45 నిమిషాల పాటు కేసీఆర్ ఆసుపత్రిలో ఉన్నారు. ఆ తర్వాత అక్కడ నుంచి నేరుగా తన వ్యవసాయ క్షేత్రానికి వెళ్లిపోయారు.. ఒకటి లేదా రెండు రోజుల్లో హిమాంశు కు పరీక్షలు చేసి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేస్తామని ఏఐజి వర్గాలు తెలిపాయి.

పవన్ కాదు.. ఎన్టీఆర్ సీఎం అవుతాడు.. వేణు స్వామి హాట్ కామెంట్స్.. వీడియో వైరల్

Venu swamy Comments On Tollywood
Venu swamy Comments On Tollywood

Venu Swamy : వేణు స్వామి అంటేనే వివాదాలకు కేంద్ర బిందువు. అవసరం లేకపోయినా ఒకప్పుడు హీరోలు , హీరోయిన్లు జాతకాలు చెప్పేవారు. సమంత విడాకులు తీసుకుంటుంది అనే విషయాన్ని ఈయన ముందుగా చెప్పారు. దానిని మార్కెటింగ్ చేసుకుంటూ ఈయన తెచ్చుకున్న పేరు మామూలుది కాదు. ప్రభాస్ ఇక ఎప్పటికీ హిట్ కొట్టలేదని , జగన్ మరోసారి ముఖ్యమంత్రి అవుతాడని, పవన్ కళ్యాణ్ మరోసారి ఎమ్మెల్యే గా ఓడిపోతాడని , ఇలా ఒకటా రెండా , ఎన్నో రకాల వ్యాఖ్యలు చేశారు. ఎప్పుడైతే ఆయన శోభిత , నాగ చైతన్య పెళ్లి చేసుకున్న రోజున , వీళ్ళు భవిష్యత్తులో విడిపోతారు అంటూ వ్యాఖ్యలు చేశారో , అప్పుడే ఈయన పై తీవ్రమైన నెగెటివిటీ ఏర్పడింది. మహిళా కమీషన్ సైతం ఈయనకు నోటీసులు పంపారు. ఆ తర్వాత కొన్ని రోజులు సైలెంట్ గా ఉన్నటువంటి వేణు స్వామి , చాలా రోజుల తర్వాత రీసెంట్ గానే ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు.

ఈ ఇంటర్వ్యూ లో ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. సినీ హీరోల గురించి ఒక్కొక్కరి పేరు ని యాంకర్ అడగ్గా, వాళ్ళ గురించి ఒక్కో మాట చెప్పుకుంటూ వచ్చారు వేణు స్వామి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పర్ఫెక్ట్ రాజకీయ నాయకుడు అని , ఎన్టీఆర్ కాబోయే ముఖ్యమంత్రి అంటూ ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో సంచలనం గా మారాయి. ఇక మిగిలిన హీరోల గురించి ఆయన మాట్లాడుతూ విజయ్ దేవరకొండ బాగా కష్టపడే వ్యక్తి అని , ప్రభాస్, చిరంజీవి , రాజమౌళి కారణజన్ములు అంటూ ఆయన సంబోధించడం విశేషం. సీనియర్ ఎన్టీఆర్ యుగ పురుషుడని , సమంత గొప్ప ఫైటర్ అని , రామ్ చరణ్ వంశాన్ని నమ్ముకోకుండా కష్టాన్ని నమ్ముకున్న వ్యక్తి అని , మహేష్ బాబు మంచి అందగాడు అంటూ ఆయన ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.

అదే విధంగా నరేంద్ర మోడీ కారణం జన్ముడు అని , పాకిస్థాన్ ఒక్క దరిద్రంగా దేశం అంటూ ఆయన మాట్లాడిన మాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అంతా బాగానే ఉంది , రాజకీయాల్లో ఉప ముఖ్యమంత్రి స్థానం లో కూర్చున్న పవన్ కళ్యాణ్ ముఖ్య మంత్రి అవుతాడని చెప్పలేదు , అసలు రాజకీయాల్లోకి వస్తాడో లేదో తెలియని జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య మంత్రి అవుతాడని చెప్పడమే సోషల్ మీడియా లో వివాదాలకు దారి తీసింది. ఈ వీడియో ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి.

అలియా భట్ 'ఆల్ఫా' 4 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ఇంత తక్కువ గ్రాస్ ఊహించలేదు..

Alpha Box Office Collection

Alpha Box Office Collection : ఒకప్పుడు బాలీవుడ్ లో స్పై జానర్ సినిమాలకు ఏ రేంజ్ క్రేజ్ ఉండేదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. యూత్ ఆడియన్స్ ఈ జానర్ సినిమాల కోసం మెంటలెక్కిపోయే వారు. అందులోనూ యాష్ రాజ్ ఫిలిమ్స్ నుండి వచ్చే స్పై యూనివర్స్ సినిమాలకు ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజ్ ఉండేది. అయితే ఆ బ్రాండ్ ఇప్పుడు మసకబారింది. ‘పఠాన్’ చిత్రం తోనే ఈ స్పై యూనివర్స్ కి క్రేజ్ పడిపోయింది. ‘పఠాన్’ తర్వాత విడుదలైన ‘టైగర్ 3’, ‘వార్ 2’ చిత్రాలు ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్స్ గా నిలిచాయి. ఇక ఇదే యూనివర్స్ లో రీసెంట్ గా విడుదలైన చిత్రం ‘ఆల్ఫా ‘. అలియా భట్ , శార్వరి ప్రధాన పాత్రలు పోషించిన ఈ లేడీ ఓరిటెంటెడ్ మల్టీస్టార్రర్ చిత్రానికి మొదటి ఆట నుండే డివైడ్ టాక్ వచ్చింది.

అయినప్పటికీ ఓపెనింగ్స్ పర్వాలేదు అనిపించాయి. మొదటి రోజు ఈ చిత్రానికి ఇండియా వైడ్ 9 కోట్ల 12 లక్షల రూపాయిల నెట్ వసూళ్లు రాగా, 2 వ రోజున 11 కోట్ల 50 లక్షలు , 3 వ రోజున 12 కోట్ల 86 లక్షల రూపాయిల నెట్ వసూళ్లు వచ్చాయి. టాక్ డివైడ్ గా వచ్చినప్పటికీ మొదటి వీకెండ్ లో 33 కోట్ల 38 లక్షల రూపాయిల నెట్ వసూళ్లను రాబట్టి పర్వాలేదు అనిపించుకుంది. కానీ నాల్గవ రోజున మాత్రం ఈ సినిమా వసూళ్లు దారుణంగా పడిపోయాయి. ట్రేడ్ విశ్లేషకులు అందిస్తున్న లెక్కల ప్రకారం ఈ చిత్రానికి నాల్గవ రోజున కేవలం 3 కోట్ల 80 లక్షల రూపాయిల నెట్ వసూళ్లు మాత్రమే వచ్చాయి. ఓవరాల్ గా 37 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లను ఈ చిత్రం నాలుగు రోజుల్లో రాబట్టింది. ఇక ఓవర్సీస్ లో ఈ చిత్రానికి మొదటి మూడు రోజులకు కలిపి 1.55 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.

అంటే 14 కోట్ల 75 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు అన్నమాట. నాలుగు రోజులకు కలిపి 16 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా ఈ చిత్రానికి వరల్డ్ వైడ్ గా 50 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు వచ్చాయి. ఈ సినిమాని నిర్మించడానికి 130 కోట్ల రూపాయిల బడ్జెట్ ఖర్చు అయ్యింది. నిర్మాతకు బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకా 80 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టాల్సి ఉంటుంది. అది ప్రస్తుతం ఉన్నటువంటి ట్రెండ్ ని చూస్తుంటే అసాధ్యమని అనిపిస్తోంది. రాబోయే రోజుల్లో ఏమైనా డెవలప్మెంట్ ఉంటుందా లేదా అనేది చూడాలి.

శృతిమించిన భర్త అసహజ కోరికలు.. రాత్రికి రాత్రే ఆ భార్య తీసుకున్న ఊహించని నిర్ణయం

Hyderabad
Hyderabad

Hyderabad: ఇది మామూలు దారుణం కాదు. సభ్య సమాజం తలదించుకునే ఘోరం. అసలు ఇలా కూడా జరుగుతుందా.. మనుషులు ఇలా కూడా ఉంటారా.. ఇంత ఘోరంగా ప్రవర్తిస్తారా.. ఇలాంటి దుర్మార్గమైన ఆలోచనలు ఎందుకు వస్తాయి. న్యాయస్థానం తీర్పు ఇచ్చిన తర్వాత సగటు మనుషులు ఇటువంటి భావాలే వ్యక్తం అవుతున్నాయి.

దాంపత్య జీవితంలో భార్యాభర్తల మధ్య “ఆ కార్యక్రమం” జరగాలి. అలాగని ఆరోగ్యాలు సరిగా లేనప్పుడు అటువంటి పనిచేయకూడదు. ముఖ్యంగా భార్య గర్భం దాల్చినప్పుడు అటువంటి వ్యవహారాలకు పాల్పడకూడదు. కానీ ఈ సంఘటనలో ఈ భర్త ఘోరానికి పాల్పడ్డాడు. దారుణంగా వ్యవహరించాడు. దీంతో ఆ భార్య కీలక నిర్ణయం తీసుకుంది. కాల యముడు లాంటి భర్త దుర్మార్గాన్ని తట్టుకోలేక కీలక నిర్ణయం తీసుకుంది. ఆమె బాధతో ఏకీభవించిన న్యాయస్థానం ఆ మూర్ఖుడైన భర్తకు.. కఠిన శిక్ష విధించింది.

సియాసత్ అనే పత్రికలో ప్రచురితమైన కథనం ప్రకారం.. హైదరాబాద్ నగరంలో నంది ముసలాయిగూడ లో రామ్ అనే వ్యక్తి జీవిస్తున్నాడు. ఇతడు ఒక టైలర్. ఇతడికి లతా అనే మహిళతో వివాహం జరిగింది.. భార్యతో అతడి ప్రవర్తన ప్రారంభంలో బాగానే ఉండేది. ఆ తర్వాత అతడు తన వికృత రూపాన్ని బయటపెట్టాడు. ప్రతిరోజు భార్యను ఇబ్బంది పెట్టసాగాడు. ముఖ్యంగా ఆ విషయంలో తన అసహజమైన కోరికలను ఆమె ముందు ఉంచేవాడు. ఆమెను అలా చేయాలని బలవంత పెట్టాడు. ఆమెను శారీరకంగా హింసించేవాడు. ఈలోగా గర్భం దాల్చింది. అయినప్పటికీ అతడు తన క్రూరత్వాన్ని దాచుకోలేదు. పైగా ఆమె పొట్ట మీద దాడి చేశాడు.

దాంపత్య జీవితంలో ఆమె మీద ప్రతి సందర్భంలోనూ అత్యంత క్రూరంగా ప్రవర్తించేవాడు. ప్రతిరోజు కూడా అత్యంత అసహజమైన లైంగిక విధానాలకు పాల్పడేవాడు. ఆమెను తీవ్రంగా ఇబ్బంది పెట్టేవాడు. భర్త ఇబ్బందులను తట్టుకోలేక ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. సాక్షాలతో సహా వారికి తాను పడుతున్న బాధలను వివరించింది. ఆమె ఫిర్యాదుతో పోలీసులు అతడిని అరెస్టు చేశారు. ఆ తర్వాత కోర్టులో పూర్తిస్థాయిలో సాక్షాలు సబ్మిట్ చేయడంతో.. రామ్ కు న్యాయస్థానం ఐదు సంవత్సరాల పాటు జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది.

సుకుమార్ ఆ మూవీ చేసినందుకు ఇప్పటికి ఇబ్బంది పడుతున్నాడుగా...

Sukumar
Sukumar

Sukumar: ఒక సినిమా పాజిటివ్ టాక్ ను సంపాదించుకున్న లేదంటే నెగెటివ్ ఫీడ్ బ్యాక్ ను తీసుకువచ్చిన దానికి పూర్తి బాధ్యత దర్శకుడే వహించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆయన రాసుకున్న కథ స్క్రీన్ మీద పర్ఫెక్ట్ గా ప్రజెంట్ చేయాలి. అది ప్రేక్షకుడికి నచ్చాలి అప్పుడే ఆ సినిమా సక్సెస్ అవుతుంది. లేకపోతే మాత్రం చాలా వరకు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి ఒక సినిమాకి దర్శకుడు పర్ఫెక్ట్ గా ఉన్నప్పుడే సక్సెస్ దక్కుతుంది. ఈ విషయాన్ని ఎప్పటికీ మర్చిపోవద్దు. ఇండస్ట్రీ లో ఎవ్వరు రాత్రికి రాత్రి సడన్ గా టాప్ హీరోగా మారిపోరు కథలో అతన్ని పర్ఫెక్ట్ గా ప్రజెంట్ చేసినప్పుడు మాత్రమే అతనికి ప్రేక్షకుల నుంచి ఆదరణ లభిస్తుంది. అప్పుడే మాత్రమే ఆయన స్టార్ హీరో అవుతాడు. దాసరి నారాయణ రావు, రాఘవేంద్రరావు లాంటి వాళ్ళు సైతం చాలా మందిని హీరోలుగా, స్టార్ హీరోలుగా మార్చారు. ప్రస్తుతం రాజమౌళి సైతం హీరోలను టాప్ రేంజ్ కి తీసుకెళ్తున్నాడు. దీన్ని బట్టి చూస్తే ఒక సినిమా మీద దర్శకుడి యొక్క ప్రాధాన్యత ఏ రేంజ్ లో ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు… ప్రస్తుతం ఇండియాలో ఉన్న టాప్ 3 డైరెక్టర్లలో సుకుమార్ ఒకరు. ఆయన చేసిన ‘పుష్ప 2’ సినిమాతో 1850 కోట్లకు పైన కలెక్షన్స్ ను కొల్లగొట్టిన ఘనత ఆయన సొంతం…

మరి అలాంటి దర్శకుడు ఇప్పటివరకు చేసిన సినిమాలన్నింటి విషయంలో చాలా వరకు సాటిస్ఫాక్షన్ తో ఉన్నప్పటికి ఒక్క సినిమా విషయంలో మాత్రం ఆయన అంత సంతృప్తి చెందలేదట. ఇంతకీ ఆ సినిమా ఏంటి అంటే రామ్ హీరోగా వచ్చిన ‘జగడం’ సినిమా కావడం విశేషం… అయితే ఈ సినిమా కథని మొదట మహేష్ బాబు కోసం రాసుకున్నారు.

మహేష్ బాబు ఆ క్యారెక్టర్ చేస్తే సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని సుకుమార్ అనుకున్నాడు. ఇక దానికి తగ్గట్టుగానే మహేష్ బాబు ఆ కథను రిజెక్ట్ చేయడంతో ఈ కథలోకి రామ్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. దాంతో సినిమా కథ మొత్తం మారిపోయింది. దాని వల్ల అతను చాలా వరకు కాంప్రమైజ్ అయి సినిమా చేయాల్సి వచ్చింది. ఎట్టకేలకు ఆ సినిమా ఫ్లాప్ అయింది. దాంతో ఆ సినిమా చేయకపోయిన బాగుండేదని సుకుమార్ చాలా సందర్భాల్లో చెప్పేశాడు.

అయితే ఈ సినిమాని చూసిన చాలామంది ఇది ఒక కల్ట్ క్లాసికల్ సినిమా అని అప్పుడు ప్రేక్షకులకు అంత పెద్దగా ఎక్కలేదు. కానీ రాను రాను ఈ సినిమా చూసిన కొద్ది ప్రేక్షకులు దీనికి అభిమానులుగా మారిపోతున్నారని ఈ సినిమా ఇన్స్పిరేషన్ తోనే చాలా సినిమాలు వచ్చాయని చాలా మంది చాలా రకాల కామెంట్స్ చేస్తున్నారు…

సంజు శాంసన్ కెరియర్ ముగిసినట్టేనా..

Sanju Samson
Sanju Samson

Sanju Samson: జింబాబ్వే టూర్ కు టీమిండియా ను ప్రకటించారు. ఇందులో సంజు శాంసన్ కు అవకాశం లభించలేదు. వైభవ్ సూర్య వంశీ.. అభిషేక్ శర్మ.. కిషన్ కిషన్.. అయ్యర్.. తిలక్ వర్మ.. శివం దుబే.. సూర్యాంష్, వరుణ్ చక్రవర్తి, ప్రిన్స్ యాదవ్, హర్ష్ దుబే, యశ్ ఠాకూర్, అశోక్ శర్మ, ప్రభ్ సిమ్రాన్ సింగ్, మయాంక్ యాదవ్, రింకు సింగ్ వంటి వారికి చోటు లభించింది. జింబాబ్వే టూర్ లో సంజు శాంసన్ కు చోటు లభించకపోవడంతో రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి.

సంజు కెరియర్ ముగిసిందని.. త్వరలోనే అతడు బ్యాగుల సర్దుకోవాలని కొంతమంది కామెంట్లు చేయడం మొదలుపెట్టారు. వాస్తవానికి సంజు అద్భుతమైన ఆటగాడు. అతడు కెరియర్ ఇప్పుడు పెద్దగా ఇబ్బందులలో లేదు. ఐర్లాండ్ సిరీస్ లో అతడు విఫలమైన విషయం తెలిసిందే. ఇంగ్లాండ్ సిరీస్ లోను అంతగా ఆకట్టుకోలేని విషయం కూడా తెలిసిందే. కాకపోతే ఈ మూడు మ్యాచ్ లనే ప్రామాణికంగా తీసుకొని అతడిని తక్కువ చేయడం ఏమాత్రం సరికాదు. ఎందుకంటే టి20 వరల్డ్ కప్ లో అతడు ప్లేయింగ్ 11 జాబితాలో లేడు. చివరికి అతడిని తీసుకొచ్చారు. ఎలాంటి విధ్వంసం సృష్టించాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విధ్వంసానికి పరాకాష్టగా బ్యాటింగ్ చేశాడు. టీమిండియాను విజేతగా నిలిపాడు. అండర్ డాగ్ లాగా వచ్చి.. సింహం లాగా ఆడి అదరగొట్టాడు.

జింబాబ్వే టూర్ ద్వారా సంజు శాంసన్ తనను తాను నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. అభిషేక్ శర్మ.. వైభవ్ సూర్య వంశీ ఓపెనర్లుగా ఉన్నారు. అలాంటప్పుడు మూడో ఓపెనర్ గా సంజు వెళ్లాల్సిన అవసరం ఏముంది. జింబాబ్వే టూర్ తర్వాత సెప్టెంబర్ నెలలో ఏషియన్ గేమ్స్ ఉన్నాయి. అది అత్యంత కీలకమైంది. పైగా ఆ టోర్నీకి సంజు ఎంపికయ్యాడు. అలాంటప్పుడు సంజుకు మేనేజ్మెంట్ ప్రయారిటీ ఇవ్వలేదు అని అనడంలో అర్థం ఏముంది. ఇంగ్లాండ్ సిరీస్ లో విఫలమయ్యాడు కాబట్టి.. అంతకుముందు ఐర్లాండ్ సిరీస్ లోను అదరగొట్టలేదు కాబట్టి.. అతడిని మేనేజ్మెంట్ పక్కన పెట్టింది. అలాగని అతడిని తొలగించినట్టు కాదు. విఫలమవుతున్నాడు కాబట్టి తన ఆట తీరు మార్చుకోవాలని అవకాశం ఇచ్చింది. కేవలం సంజుకే కాదు.. ఎంతటి ఆటగాడు అయినా సరే కొన్ని సందర్భాలలో బ్యాడ్ ఫేస్ ను ఎదుర్కోవాల్సి ఉంటుంది. దానికి సంజు మినహాయింపు కాదు. అంతటి సచిన్ కూడా ఒక సందర్భంలో ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడ్డాడు. ఆ తర్వాత వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్నాడు. సంజు కూడా అలాంటి వాడే.. ఆ మాత్రం దానికి లేనిపోని విమర్శలు చేసి.. అతడి కెరియర్ ముగిసింది అని చెప్పడం సబబు కాదు.

'మా ఇంటి బంగారం' 18 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. పెద్ద టార్గెట్ మిస్ అయిందిగా..

Maa Inti Bangaram 18 Days Collection
Maa Inti Bangaram 18 Days Collection

Maa Inti Bangaram 18 Days Collection సమంత ప్రధాన పాత్ర పోషించిన ‘మా ఇంటి బంగారం’ చిత్రం కమర్షియల్ గా ఈ ఏడాది ఇప్పటి వరకు విడుదలైన అన్ని చిత్రాలకంటే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. లాభాల రిటర్న్స్ విషయం లో అయితే ఈ సినిమా టాలీవుడ్ హిస్టరీ లోనే ది బెస్ట్ మూవీస్ లో ఒకటి గా చెప్పుకోవచ్చు. సినిమా విడుదలై 18 రోజులైంది. ఇప్పటికీ ఈ చిత్రానికి బాక్స్ ఆఫీస్ వద్ద స్టడీ కలెక్షన్స్ నమోదు అవుతున్నాయి. దీనిని బట్టే చెప్పొచ్చు, ఈ సినిమా బాక్స్ ఆఫీస్ సునామీ ఎలాంటిది అనేది. 18 వ రోజున కూడా ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల నుండి 24 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు నమోదు అయ్యాయి అట. గత వారం విడుదలైన కొత్త సినిమాలకు కూడా నిన్న ఈ రేంజ్ వసూళ్లు నమోదు అవ్వలేదు. ఓవరాల్ గా 18 వ రోజున వరల్డ్ వైడ్ గా 32 లక్షల రూపాయల రేంజ్ షేర్ వసూళ్లు వచ్చాయి.

18 రోజుల్లో ప్రాంతాల వారీగా ఈ చిత్రానికి వచ్చిన వసూళ్లు ఎంతో ఒకసారి చూద్దాం. ఒక్క నైజం ప్రాంతం నుండే ఈ చిత్రానికి 14 కోట్ల 72 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు రావడం అనేది సాధారణమైన విషయం కాదు. ఇంకో రెండు కోట్ల రూపాయల షేర్ వసూళ్లు వస్తే , ‘ఉస్తాద్ భగత్ సింగ్’ క్లోజింగ్ కలెక్షన్స్ ని దాటేస్తుంది. కానీ అంత దూరం వెళ్తుందో లేదో చూడాలి. ఇక ఆంధ్ర ప్రదేశ్ + సీడెడ్ ప్రాంతాలకు కలిపి ఈ చిత్రానికి 18 రోజులకు గానూ 11 కోట్ల 22 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. నైజాం రన్ తో పోలిస్తే ఆంధ్రా రన్ బాగా తగ్గిందనే చెప్పాలి. ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల నుండి ఈ చిత్రానికి 26 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు , 50 కోట్ల 35 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.

ఇక ఇతర ప్రాంతాల విషయానికి వస్తే తమిళనాడు నుండి ఈ చిత్రానికి 1 కోటి 91 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు రాగా, కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 5 కోట్ల 27 లక్షలు , ఓవర్సీస్ నుండి 10 కోట్ల 70 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా వరల్డ్ వైడ్ గా ఈ చిత్రానికి 43 కోట్ల 82 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు , 89 కోట్ల 25 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అయితే ఈ సినిమా ఊపుని చూసి కచ్చితంగా 100 కోట్ల గ్రాస్ మార్కుని అందుకుతుందేమో అని అంతా అనుకున్నారు , కానీ ఆ రేంజ్ వసూళ్లు కష్టమే అని తెలుస్తోంది.

టాటా ఈవీ కార్లకు గట్టి పోటీతో మహీంద్రా కార్లు.. 679 కి.మీ. రేంజ్..

Mahindra EV
Mahindra EV

Mahindra EV: భారత ఎలక్ట్రిక్ వాహన మార్కెట్లో ప్రస్తుతం టాటా మోటార్స్‌ అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఈ కంపెనీకి గట్టి పోటీ ఇచ్చేందుకు మహీంద్రా అండ్ మహీంద్రా సరికొత్త వ్యూహాలతో సిద్ధమవుతోంది. ప్రస్తుతం మార్కెట్లో టాప్ సెల్లర్స్‌గా ఉన్న టాటా నెక్సాన్ ఈవీ , అలాగే ప్రీమియం సెగ్మెంట్‌లో ఉన్న టాటా హారియర్ ఈవీ మోడళ్లకు చెక్ పెట్టేందుకు మహీంద్రా రెండు సరికొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలను రంగంలోకి దించుతోంది. ఇంతకీ అవి ఎలా ఉన్నాయో తెలుసా?

ప్రస్తుతం కాంపాక్ట్ EV సెగ్మెంట్‌లో టాటా నెక్సాన్ ఈవీ రాజ్యాన్ని ఏలుతోంది. దీనికి నేరుగా పోటీగా మహీంద్రా ఎక్స్‌యూవీ 7ఎక్స్‌ఓ ను తీసుకురాబోతోంది. ఇది మహీంద్రా పాపులర్ మోడల్ XUV 3XO ఆధారంగా రూపొందుతున్న ఎలక్ట్రిక్ వెర్షన్. నెక్సాన్ ఈవీ లాగే ఇది కూడా మధ్యతరగతి ఈవీ కొనుగోలుదారులను టార్గెట్ చేస్తూ బడ్జెట్ మరియు ప్రీమియం ఫీచర్ల కలయికతో రానుంది. దాదాపు 350 నుండి 400 కిలోమీటర్ల రేంజ్ ఇచ్చే బ్యాటరీ ప్యాక్‌తో ఈ కారు మార్కెట్లోకి అడుగుపెట్టే అవకాశం ఉంది.

అలాగే ప్రీమియం , లగ్జరీ ఈవీ సెగ్మెంట్‌లో టాటా హారియర్ ఈవీ, సఫారీ ఈవీ వంటి మోడళ్లకు సవాల్ విసిరేందుకు మహీంద్రా సరికొత్త BE.07 ఎస్‌యూవీని సిద్ధం చేస్తోంది. ఇటీవల ఈ కారుకు సంబంధించిన టెస్ట్ మోడల్స్ ఇండియన్ రోడ్లపై ట్రయల్స్ నిర్వహిస్తూ కనిపించాయి. సుమారు 4.6 మీటర్ల పొడవుతో, ఒక అద్భుతమైన ఫ్యూచరిస్టిక్ డిజైన్‌తో ఈ కారు రూపుదిద్దుకుంటోంది. లగ్జరీ కార్ల తరహాలో ఫ్రేమ్‌లెస్ డోర్లు, ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ మరియు స్లోపింగ్ రూఫ్‌లైన్‌తో దీని లుక్ చాలా అగ్రెసివ్‌గా ఉండబోతోంది.

మహీంద్రా BE.07 ప్రీమియం ఈవీలో కస్టమర్ల అవసరాలకు తగ్గట్టుగా 59kWh నుంచి 79kWh సామర్థ్యం గల మూడు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లను ఇచ్చే అవకాశం ఉంది. ఒకే ఛార్జ్‌పై ఈ కారు ఏకంగా 520 కిలోమీటర్ల నుండి గరిష్టంగా 679 కిలోమీటర్ల భారీ రేంజ్ ను ఆఫర్ చేయగలదని మార్కెట్ వర్గాల అంచనా. ఇందులో రియర్ వీల్ డ్రైవ్ తో పాటు మరింత పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్ కోసం ఆల్-వీల్ డ్రైవ్ ఆప్షన్ కూడా ఉండనుంది.

ధర విషయానికొస్తే… నెక్సాన్ ఈవీకి పోటీగా వచ్చే మోడల్ రూ. 14 లక్షల నుంచి రూ. 18 లక్షల శ్రేణిలో ఉండే అవకాశం ఉండగా, హారియర్ ఈవీకి పోటీగా వచ్చే BE.07 మోడల్ రూ. 22 లక్షల నుండి రూ. 28 లక్షల (ఎక్స్-షోరూమ్) బడ్జెట్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ రెండు కొత్త కార్ల ఎంట్రీతో భారత ఈవీ మార్కెట్లో టాటా, మహీంద్రా మధ్య పోటీ నెక్స్ట్ లెవెల్‌కు చేరడం ఖాయం.

'రావు బహదూర్' 4 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. బ్రేక్ ఈవెన్ అసాధ్యం.. మహేష్ కి ఎదురుదెబ్బ..

Rao Bahadur 4 Days Collection
Rao Bahadur 4 Days Collection

Rao Bahadur 4 Days Collection: రీసెంట్ సమయం లో ప్రమోషనల్ కంటెంట్ తో ఆడియన్స్ కి మెంటలెక్కిపోయేలా చేసిన చిత్రాల్లో ఒకటి ‘రావు బహదూర్’. సత్యదేవ్ హీరో గా , వెంకటేష్ మహా దర్శకత్వం లో , సూపర్ స్టార్ మహేష్ బాబు నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రం భారీ అంచనాల నడుమ రీసెంట్ గానే ప్రేక్షకుల ముందుకొచ్చి మొదటి ఆట నుండే డివైడ్ టాక్ వచ్చింది. కానీ మొదటి నుండి మంచి క్రేజ్ ఉన్న సినిమా కావడంతో ఓపెనింగ్ వసూళ్లు డీసెంట్ గా వచ్చాయి. మొదటి వీకెండ్ వసూళ్లు కూడా బాగానే ఉన్నాయి. ఇక నాల్గవ రోజున తెలుగు రాష్ట్రాల నుండి ఈ చిత్రానికి 30 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు , ఓవరాల్ వరల్డ్ వైడ్ 45 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చినట్టు సమాచారం. ప్రాంతాల వారీగా ఈ చిత్రానికి 4 రోజుల్లో ఎంతో గ్రాస్ వసూళ్లు వచ్చాయో ఒకసారి చూద్దాం.

నైజాం ప్రాంతం లో ఈ చిత్రానికి ఊహించినదానికంటే ఎక్కువ వసూళ్లు వస్తున్నాయి. మొదటి నాలుగు రోజులకు కలిపి ఈ చిత్రానికి 2 కోట్ల 55 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు , ఆంధ్ర ప్రదేశ్ + సీడెడ్ నుండి 2 కోట్ల 10 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా తెలుగు రాష్ట్రల నుండి ఈ చిత్రానికి 4 కోట్ల 65 లక్షలు గ్రాస్ వసూళ్లు , 2 కోట్ల 26 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఇది సాధారణమైన విషయం కాదు. ఇక ఇతర ప్రాంతాల విషయానికి వస్తే కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 90 లక్షల రూపాయిల గ్రాస్, ఓవర్సీస్ నుండి 3 కోట్ల 55 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ వరల్డ్ వైడ్ గా ఈ చిత్రానికి 9 కోట్ల 10 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు , 4 కోట్ల 35 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.

మేకర్స్ లెక్కల ప్రకారం ఈ చిత్రానికి ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ 8 కోట్ల రూపాయలకు పైగా జరిగింది. అన్ని ప్రాంతాల్లోనూ అడ్వాన్స్ బేసిస్ మీదనే ఈ చిత్రం విడుదలైంది. ఈ కారణం చేత బయ్యర్స్ కి కలిగే నష్టం ఏమి లేదు , కానీ నిర్మాత పెట్టిన బడ్జెట్ తో సహా మొత్తం రీకవర్ అవ్వాలంటే 8 కోట్ల 50 లక్షల రూపాయిల రేంజ్ లో షేర్ వసూళ్లను రాబట్టాలి. ఎంత వసూళ్లు రాబట్టిన ఈ రెండు రోజుల్లోనే రాబట్టాలి , ఆ తర్వాత ‘లెనిన్’ వంటి చిత్రం వస్తుంది , థియేటర్స్ మొత్తం ఆ చిత్రానికే వెళ్లిపోతాయి , కాబట్టి ఈ సినిమా బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవడం అసాధ్యమే.