Home Blog Page 168

ఇంత మంచి రోహిత్ మీద గంభీర్ కక్ష కట్టాడా.. వైరల్ వీడియో

Rohit Sharma Coach, Dinesh Lad

Rohit Sharma Viral Video : ధోని తర్వాత టీమిండియాలో అంతటి ప్రభావాన్ని చూపించిన నాయకుడు రోహిత్ శర్మ.. టీమ్ ఇండియాకు టి20 వరల్డ్ కప్ అందించాడు. వన్డే వరల్డ్ కప్ లో ఫైనల్ దాకా తీసుకెళ్లాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ దాకా టీమ్ ఇండియాను తీసుకెళ్లాడు. భారత జట్టుకు చాంపియన్ ట్రోఫీ అందించాడు. రోహిత్ శర్మ ఎలాంటి ఫార్మాట్లోనైనా అద్భుతంగా ఆడగలడు. అందువల్లే అతడిని ప్రమాదకర ఆటగాడు అని పిలుస్తారు.

టీమిండియా టి20 వరల్డ్ కప్ సాధించిన తర్వాత ఆ ఫార్మాట్ నుంచి రోహిత్ తప్పుకున్నాడు. మేనేజ్మెంట్ తీసుకొచ్చిన ఒత్తిడి.. గౌతమ్ గంభీర్ నుంచి వచ్చిన ఒత్తిడి.. వల్ల అతడు సుదీర్ఘ ఫార్మాట్ నుంచి తప్పుకున్నాడు. ఎవరు అంచనా వేయకుండానే.. ఎటువంటి సంకేతాలు ఇవ్వకుండానే అతడు జట్టు నుంచి తప్పుకున్నాడు. రోహిత్ టెస్ట్ జట్టు నుంచి తప్పుకోవడం చాలామంది అభిమానులకు రుచించలేదు. చాలామంది అభిమానులు తమ ఆవేదనను సోషల్ మీడియాలో బహిరంగంగానే వ్యక్తం చేశారు. ముఖ్యంగా గౌతమ్ గంభీర్ ను ఉద్దేశించి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఇప్పటికీ గౌతమ్ గంభీర్ ను రోహిత్ అభిమానులు ఏమాత్రం సహించడం లేదు. అతడు కనిపిస్తే చాలు తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేస్తున్నారు.

గౌతమ్ గంభీర్ ఎందుకు రోహిత్ ను పక్కన పెట్టాడు.. జట్టు నుంచి ఎందుకు వెళ్లిపోయేలా చేశాడు.. అనే ప్రశ్నలకు ఇప్పటికీ సమాధానం లేదు.. తను వెళ్లిపోవడానికి అధికారికంగా గౌతమ్ గంభీర్ కారణమని ఇంతవరకు రోహిత్ చెప్పలేదు. అయితే పెద్దల విషయంలో.. తనకు కోచింగ్ ఇచ్చిన వారి విషయంలో రోహిత్ ఎంతో మర్యాదగా ఉంటాడు. ఆ మధ్య తన పేరు మీద ముంబై మైదానంలో స్టాండ్ ఏర్పాటు చేసినప్పుడు.. తనకు శిక్షణ ఇచ్చిన వారిని అభినందించాడు. ఆ సమావేశంలో వారందరిని తలుచుకున్నాడు. ఇప్పుడు జరుగుతున్న ముంబై t20 లీగ్ లో కూడా రోహిత్ తన శిక్షణ ఇచ్చిన చిన్ననాటి కోచ్ ను ప్రేమను చూపించాడు. అంతేకాదు అతని పాదాల మీద పడి నమస్కరించాడు.

రోహిత్ శర్మకు కు చిన్నతనంలో దినేష్ ల్యాడ్ అనే వ్యక్తి శిక్షణ ఇచ్చాడు. అతడి నేతృత్వంలో రోహిత్ రాటు తేలాడు. అతడు అద్భుతంగా బ్యాటింగ్ చేయడంలో దినేష్ పాత్ర కచ్చితంగా ఉంటుంది. ఇదే విషయాన్ని అనేక సందర్భాలలో రోహిత్ బయటపెట్టాడు. తాజాగా ముంబై t20 లీగ్ చూసేందుకు రోహిత్ వాంఖడే స్టేడియానికి వెళ్ళాడు. స్టేడియం వెళ్తుండగా దినేష్ తన సతీమణితో కనిపించాడు. ఆయనను చూసిన రోహిత్ వెంటనే కాళ్ళ మీద పడి నమస్కరించాడు. అతడిని చూసి ఆనంద పరవశుడయ్యాడు. తన దగ్గర శిక్షణ పొందిన రోహిత్ ఈ స్థాయిలో ఎదగడం పట్ల దినేష్ హర్షం వ్యక్తం చేశాడు.

చుట్టుకొండలు.. అక్కడ కేజీఎఫ్ లాంటి కోట.. రామోజీరావు ఆలోచన అలా ఉంటుంది మరి..

Ramoji Rao Death Anniversary

Ramoji Rao Death Anniversary : ఈరోజు రామోజీరావు వర్ధంతి.. సహజంగానే తెలుగు పత్రికా రంగంలో ఎన్నో రకాల మార్పులకు.. సంచలనాలకు ఆయన కారణం. ఎక్కడో ఖమ్మంలో చిన్నపాటి ఫెర్టిలైజర్ షాపు పెట్టిన అతను.. ఈరోజు వేలకోట్లు సంపాదించాడు అంటే మామూలు విషయం కాదు. ఈ సంపాదన అక్రమమా.. సక్రమమా అనే విషయాన్నీ పక్కన పెడితే.. పేపర్, పచ్చళ్ళు, సినిమాలు, హోటళ్లు, చానెళ్ళు .. ఆయన అడుగుపెట్టని రంగం అంటూ లేదు. చేయని వ్యాపారం అంటూ లేదు. లాభాలు వచ్చాయి.. నష్టాలు కూడా పలకరించాయి. అయినప్పటికీ రామోజీరావు వెనుకడుగు వేయలేదు. వెనకడుగు వేస్తే ఆయన రామోజీరావు ఎందుకు అవుతారు.

మార్గదర్శి విషయంలో ఉండవల్లి అరుణ్ కుమార్ పెట్టిన ఇబ్బందులు.. రాజశేఖర్ రెడ్డి చూపించిన చుక్కలు.. ఆ స్థానంలో మరొకరు ఉంటే చేతులు జోడించి వెళ్లిపోయేవారు. నాటి రోజుల్లో.. కాంగ్రెస్ పార్టీ అంటే గిట్టని వ్యక్తిత్వం అయినప్పటికీ.. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వంతోనే రాజశేఖర్ రెడ్డికి చెప్పించాడు అంటే రామోజీరావు గుండె ధైర్యం ఎంతటిదో వివరించాల్సిన అవసరం లేదు. అబ్దుల్లాపూర్మెట్ ప్రాంతంలో కమ్యూనిస్టులు ధర్నాలు చేస్తుంటే.. తన రామోజీ ఫిలిం సిటీ అక్రమం అని ఆరోపణలు చేస్తుంటే.. వారి మూతులకు గట్టి బిరడా బిగించాడు. అంతటి సాహసి రామోజీరావు.

రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అబ్దుల్లాపూర్మెట్ ప్రాంతంలో చెరువులు ఆక్రమించారని.. అసైన్డ్ భూముల్లో ఫిలిం సిటీ కట్టారని.. ఆ భూములు మొత్తం పేదలకు ఇవ్వాలని రాజశేఖర్ రెడ్డి గట్టిగా ప్రయత్నించారు. అధికారులను పంపించారు. కానీ రాజశేఖర్ రెడ్డి ఉన్నన్ని రోజులు రామోజీ ఫిలిం సిటీ వైపు కన్నెత్తి కూడా చూడలేదు. సాక్షి ఎన్నో రాతలు రాసినప్పటికీ రామోజీ ఫిలిం సిటీ ఇటుక కూడా ఊడిపోలేదు.. అంతటి సౌధాలు నిర్మించుకున్నాడు.. వ్యాపార సామ్రాజ్యాలు ఏర్పాటు చేసుకున్నాడు రామోజీ.

“వార్త” పత్రికను తొక్కిపెట్టాడు. తనకు నచ్చని దాసరి నారాయణరావు ఉదయాన్ని చీకట్లో కలిపేశాడు. తనకంటూ పోటీ లేకుండా చేసుకున్నాడు. తను నిత్యం వ్యాపారం మాత్రమే చూస్తాడు. అందులో సెంటిమెంట్ కలిపి దర్జాగా వెనకేసుకుంటాడు. లేకపోతే తుఫాన్ సమయంలో విమానాలలో పత్రికను సరఫరా చేయడమేంటి.. ఎన్ని కష్టాలు ఎదురైనా సరే తన ఈనాడు పత్రికను సమయానికి పంపించడమేంటి.. పని చేయించుకునే విషయంలో.. డబ్బులు సమయానికి చెల్లించే విషయంలో.. రామోజీరావు ఓ రాక్షసుడు. ఈ మాట ఆయనతో పని చేసిన వారు ఇప్పటికీ అంటూనే ఉంటారు. గజ్జల మల్లారెడ్డి నుంచి మొదలు పెడితే ఇప్పటి నాగేశ్వరరావు, డిఎన్ రావు వరకు.. అతడు స్నేహం సాగించాడు. ఆ స్నేహంలోనే పనిని మరింత ముందుకు తీసుకెళ్లాడు.

నేడు రామోజీరావు వర్ధంతి. అతడు విలువల సవ్యసాచి కాకపోవచ్చు. సక్రమంగా వ్యాపారం సాగించిన బిజినెస్మెన్ కాకపోవచ్చు.. కానీ వేలాది మందికి ఉపాధి కల్పించాడు. లక్షల మందికి పరోక్షంగా భరోసా ఇచ్చాడు. అతడి కోటను చూస్తే.. అచ్చం కేజీఎఫ్ సినిమాలో సౌధం లాగా కనిపిస్తూ ఉంటుంది. ఆ కోటలో రామోజీరావు కచ్చితంగా ఉండే ఉంటాడు. కాకపోతే భౌతికంగా లేడు కాబట్టి.. మానవమాత్రులకు కనిపించడు. ఎందుకంటే రామోజీరావు ఇప్పుడు మనిషి కాదు.. తాను నిర్మించిన వేలకోట్లకు కనిపించని అధిపతి. అన్నిటికంటే ముఖ్యంగా బతికున్నప్పుడే తనకంటూ సమాధిని నిర్మించుకున్న స్థపతి.

అల్లు అర్జున్ కుటుంబానికి ఎంతటి ప్రాధాన్యాన్ని ఇస్తున్నాడో కళ్లారా చూడండి.. ఫొటో వైరల్

allu arjun

Allu Arjun family photo : సినీ సెలబ్రిటీల నుండి కచ్చితంగా కొన్ని విషయాలను ఆదర్శంగా తీసుకోవాలి. ముఖ్యంగా అన్నదమ్ములు ఎలా కలిసి ఉండాలి చెప్పడానికి నిదర్శనం మెగా ఫ్యామిలీ. అన్నదమ్ములు అంటే ఎప్పుడూ కొట్లాడుకుంటూ ఉంటారు, ఆస్తుల విషయం లో గొడవలు వేసుకుంటూ ఉంటారు, అనే మనం అనుకుంటూ ఉంటాము. మన సమాజం లో జరిగే అంశాలను ఆధారంగా తీసుకొని ఇలాంటివి చెప్తుంటాము. కానీ మెగా ఫ్యామిలీ లో ఇప్పటికీ చిరంజీవి , పవన్ కళ్యాణ్ , నాగబాబు వంటి వారు రామలక్షణులు లాగానే ఉంటున్నారు. వీళ్ళని ఆదర్శంగా తీసుకొని అల్లు ఫ్యామిలీ లేటెస్ట్ జనరేషన్ కూడా అనుసరిస్తున్నారు. వీళ్లంతా ఒకే ఉమ్మడి కుటుంబం లాగా, ఒకే ఇంట్లో ఏళ్ళ తరబడి నుండి ఉంటున్నారు. ఒకే కుటుంబం లో ఉన్నప్పుడు అప్పుడప్పుడు గొడవలు వస్తుంటాయి. వీళ్ళ కుటుంబం లో కూడా అలాంటి గొడవలే అప్పుడప్పుడు వచ్చి ఉండొచ్చు.

కానీ ఇలా కలిసి ఒకే చోట ఉండడం , వాళ్ళ పిల్లలతో కలిసి ఆడుకోవడం వంటివి చూసే నెటిజెన్స్ కి ఎంతో బాగుంటుంది. ప్రస్తుతం సోషల్ మీడియా లో అల్లు ఫ్యామిలీ మొత్తం కలిసున్న ఫోటో ఒకటి బాగా వైరల్ అయ్యింది. ఈ ఫోటో లో అల్లు అర్జున్ , అల్లు స్నేహా రెడ్డి , అల్లు శిరీష్ , అల్లు శిరీష్ సతీమణి అల్లు నయనికా ఉన్నారు. అల్లు అర్జున్ తన కూతురు అల్లు స్నేహా రెడ్డి తో సరదాగా ఆదుకుంటుండం చూసేందుకు ఎంతో చక్కగా ఉంది. ఈ ఫోటో ఫ్రేమ్ లో ఒక్క అల్లు అయాన్ ఒక్కటే మిస్ అయ్యాడు. బహుశా ఆ ఫోటో ని తీసింది అయాన్ కావొచ్చు. కుటుంబం అంటే ఇలా ఎప్పుడూ కలిసుండాలి అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ ఈ ఫోటో క్రింద కామెంట్స్ చేస్తున్నారు. ఆ ఫోటో ని మీకోసం క్రింద అందిస్తున్నాం , మీరు కూడా చూసేయండి.

ఇక అల్లు అర్జున్ సినిమాల విషయానికి వస్తే , ప్రస్తుతం ఆయన తమిళ డైరెక్టర్ అట్లీ తో కలిసి ‘రాకా’ అనే చిత్రం చేస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ చిత్రం , వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా పై అభిమానుల్లోనే కాదు , ప్రేక్షకుల్లో కూడా అంచనాలు భారీ రేంజ్ లోనే ఉన్నాయి. అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ కి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చింది. ఇందులో అల్లు అర్జున్ ద్విపాత్రాభినయం చేస్తుండగా, దీపికా పదుకొనే , మృణాల్ ఠాకూర్ , జాన్వీ కపూర్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అదే విధంగా నేషనల్ క్రష్ రష్మిక మందాన ఈ చిత్రం లో విలన్ క్యారెక్టర్ చేస్తుంది.

వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీలో ఏం జరిగింది.. 8 మంది చనిపోవడానికి కారణం అదేనా..

Vizag Steel Plant accident

Vizag Steel Plant accident : విశాఖపట్నం కేంద్రంగా కార్యకలాపాలు సాగించే విశాఖ ఉక్కు కర్మాగారం లో దారుణం చోటు చేసుకుంది. సోమవారం కర్మాగారం ప్రాంతంలో ఘోరమైన ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో 8 మంది చనిపోయారు.. మొదట్లో కార్మికులకు గాయాలు మాత్రమే అయ్యాయని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఎనిమిది మంది దుర్మరణం పాలయ్యారని ఫ్యాక్టరీ వర్గాలు చెబుతున్నాయి.

విశాఖ ఉక్కు కర్మగారంలో స్టీల్ మెల్టింగ్ స్టేషన్ లు ఉంటాయి.. ఇక్కడ మరుగుతున్న లిక్విడ్ మీద పడి కార్మికులు గాయపడ్డారు. స్టీల్ మెల్టింగ్ స్టేషన్ 2 లో ఈ సంఘటన చోటుచేసుకుంది. కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. వేల డిగ్రీల టెంపరేచర్ గా ఉండే లిక్విడ్ మీద పడి పదిమంది కార్మికులు గాయపడ్డారు. మొదట్లో గాయాలు అని మాత్రమే వార్తలు వచ్చాయి. ఆ తర్వాత అందులో 8 మంది కార్మికులు చనిపోయారని తెలుస్తోంది. లిక్విడ్ మీద పడడంతో కార్మికుల దేహాలు చిద్రంగా మారిపోయాయి. ఆ దృశ్యాలు కూడా అత్యంత హృదయ విదారకంగా ఉన్నాయి.

స్టీల్ మెల్టింగ్ స్టేషన్ లో వేల డిగ్రీల టెంపరేచర్ వద్ద ద్రవ రూపంలో ఉన్న ఇనుమును రకరకాల ఆకృతులలో మార్చుతుంటారు. ఇక్కడే వైజాగ్ స్టీల్ తయారవుతూ ఉంటుంది. డిమాండ్ కు అనుగుణంగా బార్ లు తయారుచేస్తారు. అయితే ఇక్కడ ఏం జరిగిందో తెలియదు. మీడియాలో మాత్రం సాంకేతికపరమైన లోపాల వల్ల ఇలా జరిగిందని వార్తలు వస్తున్నాయి. వేల డిగ్రీల టెంపరేచర్ ఉండే ఆ ద్రవం కార్మికుల మీద పడింది. దీంతో వారు తీవ్రంగా గాయపడ్డారు.

వేల డిగ్రీల టెంపరేచర్ ఉండే ద్రవం మీద పడడంతో కార్మికులు తీవ్రంగా గాయపడి చనిపోయారు. వారి శరీరాల మీద తీవ్రంగా గాయాలయ్యాయి. కార్మికులు నెత్తుటి మడుగులో ఉండడంతో.. ఆ ప్రాంతం మొత్తం శవాలదిబ్బగా ఉంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. చనిపోయిన కార్మికుల కుటుంబాలను ఆదుకుంటామని పేర్కొన్నారు. గాయపడిన వారికి సత్వరమే అత్యాధునిక వైద్యం అందించాలని అధికారులకు సూచించారు. విశాఖపట్నం ఉన్నతాధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

కాబోయే భార్య.. లవర్ తో జంప్.. ఆమె చెల్లి తో పెళ్లికి నిర్ణయం.. మధ్యలో ప్రియుడి ఎంట్రీ.. పెళ్ళికొడుకుకు ఎంతటి కష్టం

Bride And Groom Video Viral
Bride And Groom Video Viral

Uttar Pradesh wedding drama : ఎవరైనా పెళ్లిని ఆడంబరంగా జరుపుకుంటారు. జీవితాంతం నిలిచే వేడుక కాబట్టి ఎంతైనా ఖర్చు పెడతారు. విందులు వినోదాల విషయంలో ఏమాత్రం వెనకడుగు వేయరు. ఆభరణాలు.. వస్త్రాలు.. ఖరీదైన వస్తువులు కొనుగోలు చేయడంలో తమ తాహతు మించి చేస్తారు. ఇతడు కూడా అలానే చేశాడు. అంతకుమించి అనే స్థాయిలో ఖర్చు పెట్టాడు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ.. అతడి జీవితం సినిమా మాదిరిగా రకరకాల మలుపులు తీసుకుంది. చివరికి కన్నీటిని మిగిల్చింది.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బిత్రి ప్రాంతంలో షాజహాన్పూర్ బరేలి మార్గంలో ఓ ఫంక్షన్ హాల్లో పెళ్లి వేడుక అంబరాన్ని తాకే విధంగా సాగుతోంది.. బంధువులు సందడి చేస్తున్నారు. వధువు తరఫున వారు.. వరుడి తరఫున వారు కుశల ప్రశ్నలు అడుక్కుంటున్నారు.. వరుడు అందంగా ముస్తాబయ్యాడు.. రాజకుమారుడిలాగా కళ్యాణమండపం వద్దకు వచ్చాడు. పెళ్లి కుమార్తె రావాల్సి ఉంది. కానీ ఇంతలోనే చెడు వార్త. బంగారు ఆభరణాలతో.. ఆమె అంతకు ముందు రాత్రే తన ప్రియుడితో వెళ్లిపోయింది. ఈ విషయం వధువు తరుపు బంధువులు వరుడి తరఫు వారికి చెప్పలేదు. పైగా వధువు తరఫు వారు ఆమె చెల్లిని పెళ్లి మండపం మీద కూర్చోబెట్టారు. అక్క వెళ్లిపోయింది కాబట్టి.. నువ్వు అతనిని పెళ్లి చేసుకోవాలని ఆమెను ఒప్పించారు.

పెళ్లి వేదిక మీద తనకు కాబోయే భార్య కాకుండా.. ఆమె చెల్లి ఉండడంతో పెళ్ళికొడుకు ఆశ్చర్యపోయాడు. ఆ తర్వాత తాను ఈ పెళ్లి చేసుకోనని మొండికేశాడు. ఆ తర్వాత అతడిని ఒప్పించి పెళ్లికి సిద్ధం చేశారు. అంత బాగుంటుందనుకుంటున్న క్రమంలో ఒక వ్యక్తి వచ్చాడు. అతడు మరెవరో కాదు.. ఆ అమ్మాయి ప్రేమికుడు. మళ్లీ లొల్లి మొదలైంది. ఈసారి భౌతిక ఘర్షణల దాకా వెళ్ళింది. వధువు తరఫున వాళ్లు గాల్లోకి కాల్పులు కూడా జరిపినట్టు తెలుస్తోంది. ఈ గొడవలో కొంతమంది గాయపడ్డారు. ఒకరి పరిస్థితి దారుణంగా ఉంది. పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. కేసులు నమోదు చేయకపోయినప్పటికీ.. ఇరు వర్గాల వారికి క్లాస్ పీకినట్టు తెలుస్తోంది.

పెళ్లిని గొప్పగా చేసుకోవాలని అతడు అన్ని రకాలుగా ఖర్చులు పెట్టుకున్నాడు. బంధువులందరికీ కార్డులు ఇచ్చాడు. వారు మెచ్చే విధంగా విందు భోజనం తయారు చేయించాడు. తీరా మరి కాసేపట్లో పెళ్లి అనగా ఇలాంటి ఘటన జరగడంతో అతడు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాడు. తనకు పెళ్లి యోగం లేదేమో అనుకుంటూ మదన పడిపోతున్నాడు.

కాపులు పవన్ కళ్యాణ్ ని వీడటం జగన్ పగటి కల మాత్రమే

Pawan Kalyan Kapu community

Pawan Kalyan Kapu community : గత నాలుగైదు రోజుల నుంచి తెలుగు మీడియా ముఖ్యంగా సాక్షి మీడియా , వైసీపీ నేతలు పనిగట్టుకొని చేస్తున్న ప్రచారం చూస్తే.. ‘రాజ్యసభ క్యాండిడేట్ జనసేన ఎంపిక చేసిన దానిమీద దుమ్మెత్తి పోస్తున్నారు. కులాల కుంపట్లు రెచ్చగొడుతున్నారు. పవన్ ఇమేజ్ ను దెబ్బతీయాలనే ప్రయత్నం చేస్తున్నారు. కాపులను పవన్ కు దూరం చేయాలనే ప్రయత్నం జరుగుతోంది.

దీంట్లో ఎంత వరకూ కరెక్ట్ అని చూస్తే.. ‘కాపులకు ఇవ్వకుండా ఒక రాజ్యసభ సీటు కమ్మలకు ఇస్తున్నారన్నది ప్రధాన ఆరోపణ. వైసీపీ పుట్టినప్పటి నుంచి ఈరోజు వరకూ ఒక్క రాజ్యసభ సీటు కూడా కాపులకు ఇవ్వలేదు. జనసేనకు వచ్చింది ఒక రాజ్యసభ సీటు. వైసీపీ బోలెడు రాజ్యసభ సీట్లు వచ్చినా జగన్ ఎందుకు కాపులకు ఇవ్వలేదు. ఒక్కటీ కేటాయించలేదు. కేవలం కపట ప్రేమ కాదా? అని ప్రశ్నిస్తున్నాం.

ప్రచారం చేస్తున్నారు కాబట్టి ఆంధ్రాలో ముఖ్యమైన అంశం కాబట్టి తప్పనిసరిగా దీనిపై ఆలోచించాలి. వైసీపీ ఇవ్వని కాపు సీట్లు, జనసేన సీట్లు ఇవ్వకపోతే ఎందుకు ఇంత రాద్ధాంతం. జనసేన కోర్ బేస్ కాపులు అని ఒప్పేసుకున్నాడు. టీడీపీ సానా సతీష్ వంటి కాపుకు ఇచ్చింది. కేవలం జనసేన కాపులకు ఇవ్వలేదని అంటున్నారు. కాపులు జనసేనను ఓన్ చేసుకున్నారు కాబట్టి దాన్ని బ్రేక్ చేయాలని వైసీపీ ప్లాన్ చేస్తోంది.

కాపులు పవన్ కళ్యాణ్ ని వీడటం జగన్ పగటి కల మాత్రమే.. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

'పెద్ది' హిట్ అయ్యినందుకు పూజలు చేస్తున్న రామ్ చరణ్ కూతురు క్లిన్ కారా.. వీడియో వైరల్..

Ram Charan Daughter Klin Kaara Viral Video
Ram Charan Daughter Klin Kaara Viral Video

Ram Charan Daughter Klin Kaara Viral Video: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ చిత్రం భారీ బ్లాక్ బస్టర్ అవ్వడం , మెగా ఫ్యాన్స్ కి , రామ్ చరణ్ ఫ్యాన్స్ కి చాలా ఎమోషనల్ మూమెంట్ అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ‘రంగస్థలం’ నుండి రామ్ చరణ్ చేసిన సినిమాల్లో #RRR మినహా మరో బ్లాక్ బస్టర్ హిట్ లేదు. #RRR లో ఆయన మెయిన్ హీరో కాబట్టి , ఆ సినిమా కమర్షియల్ గా పెద్ద హిట్ అయ్యి వెయ్యి కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది కాబట్టి , కచ్చితంగా ఆయనకు గ్లోబల్ వైడ్ గా పాపులారిటీ , క్రేజ్ ఎవ్వరూ ఊహించని రేంజ్ లో వచ్చింది. అందులో ఎలాంటి సందేహం లేదు , కానీ #RRR కి ముందు వినయ విధేయ రామ , #RRR తర్వాత ఆయన చేసిన ఆచార్య, గేమ్ చేంజర్ చిత్రాలు దారుణమైన ఫ్లాప్స్ గా నిలిచాయి.

అలాంటి సమయం లో ‘పెద్ది’ చిత్రం నుండి విడుదలైన ప్రతీ ప్రమోషనల్ కంటెంట్ అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని రేకెత్తించేలా చేసింది , అదే విధంగా మామూలు ఆడియన్స్ లో కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అలా భారీ అంచనాల నడుమ రీసెంట్ గానే థియేటర్స్ లోకి వచ్చిన ఈ సినిమాకు మొదటి ఆట నుండే బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. దీంతో ఈ చిత్రం వసూళ్ల సునామీని సృష్టించింది. కేవలం మొదటి వీకెండ్ లోనే వరల్డ్ వైడ్ గా 240 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించిన ఈ చిత్రం , ఫుల్ రన్ లో 400 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టే దిశగా అడుగులు వేస్తోంది. అయితే ఈ సందర్భంగా అభిమానులు ఎంత ఆనందిస్తున్నారో , రామ్ చరణ్ కూతురు క్లిన్ కారా కూడా అదే రేంజ్ లో ఆనందిస్తోంది.

తెలిసి తెలియని వయస్సులో , తన తండ్రి మీద ఈ చిన్నారి చూపిస్తున్న ప్రేమకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. రీసెంట్ గానే ఈ చిన్నారి తన తండ్రికి స్వీట్ సర్ప్రైజ్ ఇస్తూ, తన ఇంటి స్టాఫ్ తో చికిరి చికిరి రీల్ చేయించింది. ఈ రీల్ సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో వైరల్ అయ్యింది. అదే విధంగా ఈ చిత్రం భారీ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం తో , తన తాతయ్య చిరంజీవి మరియు ఇతర కుటుంబ సభ్యులతో కలిసి దేవుడికి పూజ చేస్తోంది. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఇందులో క్లిన్ కారా ఎంతో క్యూట్ గా కనిపించింది. సోషల్ మీడియా లో బాగా వైరల్ అయినటువంటి ఈ వీడియో ని మీరు కూడా చూసేయండి.

 

View this post on Instagram

 

A post shared by Praveen ♥️ (@aku_lapraveen)

'పెద్ది' క్రికెట్ షాట్స్..రామ్ చరణ్ నే మించిపోయిన అభిమాని.. వైరల్ అవుతున్న వీడియో..

Ram Charan Fan Viral Video
Ram Charan Fan Viral Video

Ram Charan Fan Viral Video: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘పెద్ది’ భారీ అంచనాల నడుమ విడుదలై , మొదటి ఆట నుండే ఎలాంటి బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుందో మనమంతా చూస్తూనే ఉన్నాం. మొదటి వీకెండ్ లోనే ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 240 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఈమధ్య కాలం లో ఈ రేంజ్ వసూళ్లను చూసి మన టాలీవుడ్ ఎన్ని రోజులైంది. కేవలం తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి వీకెండ్ లోనే 100 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి అంటేనే అర్థం చేసుకోవచ్చు , ఏ రేంజ్ బ్లాక్ బస్టర్ అనేది. ఫుల్ రన్ లో కచ్చితంగా 150 కోట్ల షేర్ వసూళ్లను కేవలం తెలుగు రాష్ట్రాల నుండి రాబడుతుందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.

ఇక సోషల్ మీడియా లో కూడా ఎక్కడ చూసినా ‘పెద్ది’ మేనియా నే కనిపిస్తోంది. సినిమాల్లో కొత్తగా ఏదైనా క్లిక్ అయితే, వాటిని అనుసరిస్తూ హంగామా చేసే జెన్ జీ ఆడియన్స్ , ఈ చిత్రానికి కూడా ఇన్ స్టాగ్రామ్ లో అదే రేంజ్ హంగామా చేస్తున్నారు. ముఖ్యంగా ఈ చిత్రం లో రామ్ చరణ్ క్రికెట్ షాట్స్ ని అంత తేలికగా ఆడియన్స్ మర్చిపోలేరు , థియేటర్ నుండి బయటకు వచ్చిన తర్వాత ప్రేక్షకుడు ఈ చిత్రం నుండి మర్చిపోలేని షాట్స్ లిస్ట్ తీస్తే , కచ్చితంగా ఈ క్రికెట్ షాట్స్ ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఇన్ స్టాగ్రామ్ లో ఈ షాట్స్ ని అనుసరిస్తూ జెన్ జీ యూత్ క్రియేట్ చేసిన కొన్ని వీడియోస్ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. అందులో ఒక వీడియోలో అభిమాని ఆడిన క్రికెట్ షాట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా ట్రెండ్ అవుతోంది.

రామ్ చరణ్ ని మించి ఆ అభిమాని ఇందులో క్రికెట్ షాట్స్ ని క్రియేట్ చేశాడు . అవి చూసేందుకు చాలా బాగున్నాయి , ఇవి డైరెక్టర్ బుచ్చి బాబు వరకు చేరితే, అరెరే , ఇలాంటి షాట్స్ పెట్టలేకపోయానే , ఎవరీ కుర్రాడు ఇంత టాలెంట్ గా ఉన్నాడు అని అతన్ని పిలిపించి , రామ్ చరణ్ తో కలిపించేలా చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు విశ్లేషకులు. ఆ రేంజ్ లో ఉంది ఆ షాట్. సోషల్ మీడియా ని ఒక రేంజ్ లో ఊపేస్తున్న ఈ ఇన్ స్టాగ్రామ్ రీల్ ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి. ఇకపోతే ఈ సినిమా బంపర్ హిట్ అయ్యినందుకు గానూ నేడు మేకర్స్ గ్రాండ్ గా థాంక్యూ మీట్ ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఈవెంట్ కి రామ్ చరణ్ కూడా రాబోతున్నాడు.

బాలకృష్ణ - కొరటాల శివ మూవీలో విలన్ గా టాప్ హీరో.. ఇది కదా అసలు సిసలు కాంబినేషన్ అంటే..

Balakrishna Koratala Siva Movie Updates
Balakrishna Koratala Siva Movie Updates

Balakrishna Koratala Siva Movie Updates: ప్రస్తుతం సీనియర్ హీరోల్లో నందమూరి బాలకృష్ణ ఊపు ఏ రేంజ్ లో ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ‘అఖండ’ నుండి ‘డాకు మహారాజ్’ చిత్రం వరకు వరుస బ్లాక్ బస్టర్స్ తో అభిమానులను ఆనందంతో ఉక్కిరిబిక్కిరి చేసిన ఈ నందమూరి సింహం , రీసెంట్ గా ‘అఖండ 2’ తో కాస్త తడబడిన సంగతి అందరికీ తెలిసిందే. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం కమర్షియల్ గా పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ గా మిగిలింది. ఈ రేంజ్ ఫ్లాప్ అవుతుందని అభిమానులు కూడా ఊహించలేకపోయారు. ఈ సినిమా తర్వాత బాలయ్య స్క్రిప్ట్ సెలక్షన్ విషయం లో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ప్రస్తుతానికి ఆయన గోపీచంద్ మలినేని దర్శకత్వం లో ఒక సినిమా చేస్తున్నాడు. రీసెంట్ గానే షూటింగ్ కార్యక్రమాలను మొదలుపెట్టుకున్న ఈ చిత్రంలో మంచు మనోజ్ విలన్ గా నటిస్తున్నాడు.

తమన్ సంగీతం అందిస్తుండగా , ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ని త్వరలోనే విడుదల చేయబోతున్నారు మేకర్స్. ఈ సినిమా సంగతి పక్కన పెడితే రీసెంట్ గానే బాలయ్య బాబు కొరటాల శివ దర్శకత్వం లో ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు అనిరుద్ మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నాడు. త్వరలోనే షూటింగ్ మొదలు పెట్టుకోనున్న ఈ సినిమాకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయం ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. ఈ చిత్రం లో విలన్ గా నటించబోతున్నది మరెవరో కాదు , సీనియర్ హీరో రాజశేఖర్. ఒకప్పుడు రాజశేఖర్ కి ఎలాంటి క్రేజ్ ఉండేదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. బాలకృష్ణ తో సమానమైన క్రేజ్ , ఫాలోయింగ్ ఉండేది. కానీ మధ్యలో వరుస ఫ్లాప్స్ కారణంగా ఆయన మార్కెట్ బాగా దెబ్బ తినింది.

అయినప్పటికీ హీరో గా కొన్ని సినిమాలు చేసాడు రాజశేఖర్, అవి కూడా పెద్దగా వర్కౌట్ అవ్వలేదు , దీంతో క్యారెక్టర్ రోల్స్ , విలన్ రోల్స్ చేయడానికి ఆయన సిద్దమయ్యాడు. అందులో భాగంగానే ఆయన ఈ ఏడాది ‘బైకర్’ చిత్రం లో నటించాడు. ఇందులో శర్వానంద్ కి తండ్రి పాత్రలో , పాజిటివ్ క్యారెక్టర్ లో బలమైన ఎమోషన్స్ పండించాడు. ఈ చిత్రం తర్వాత ఆయన విజయ్ దేవరకొండ హీరో గా నటిస్తున్న ‘రౌడీ జనార్ధన’ అనే చిత్రం లో పవర్ ఫుల్ విలన్ క్యారెక్టర్ చేయడానికి ఒప్పుకున్నాడు. ఇప్పుడు లేటెస్ట్ గా ఆయన బాలయ్య , కొరటాల శివ కాంబినేషన్ లో విలన్ గా నటించబోతున్నాడు. ఒకప్పుడు బాలయ్య తో సమానంగా వసూళ్లను రాబడుతూ టాప్ 5 హీరోలలో ఒకరిగా కొనసాగిన రాజశేఖర్ , ఇప్పుడు అదే బాలయ్య సినిమాలో విలన్ గా నటించబోతుండడం గమనార్హం. చూడాలి మరి ఈ కాంబినేషన్ బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి అద్భుతాలు సృష్టించబోతోంది అనేది.

బంగారం అమ్మేయాలని ప్రధాని మోడీ విజ్ఞప్తి చేశారా?

PM Modi Gold Selling Appeal Truth
PM Modi Gold Selling Appeal Truth

PM Modi Gold Selling Appeal Truth: సోషల్‌ మీడియాలో ఒక వార్త తీవ్రంగా వైరల్‌ అవుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ మహిళలను ప్రత్యేకంగా లక్ష్యం చేసుకుని మీ బంగారాన్ని అమ్మి, ఆ డబ్బును బ్యాంకుల్లో జమ చేయాలి అని విజ్ఞప్తి చేశారని ఆ వార్త చెబుతోంది. కానీ ఇది పూర్తిగా తప్పుడు సమాచారం. ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో (పీఐబీ) ఫ్యాక్ట్‌ చెక్‌ యూనిట్‌ స్పష్టంగా తెలిపింది. ప్రధాని మోదీ అలాంటి ఏ విజ్ఞప్తి చేయలేదు. ఇలాంటి అవాస్తవాలను నమ్మొద్దని ప్రజలకు సూచించింది.

నిజం ఏమిటి?
ప్రపంచ ఆర్థిక పరిస్థితులు ప్రస్తుతం సవాలుతో కూడుకుని ఉన్న నేపథ్యంలో, బంగారం కొనుగోళ్లను కొంతకాలం వాయిదా వేసుకోవాలినని మాత్రమే ప్రధాని సూచించారు. ఇప్పటికి ఉన్న బంగారాన్ని అమ్మాలని ఎక్కడా చెప్పలేదు. మహిళలను లేదా ఎవరినీ లక్ష్యం చేసుకుని అమ్మకాలు చేయమని కూడా అనలేదు. భారతదేశం బంగారం దిగుమతులపై ఆధారపడి ఉండడంతో విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి పెరుగుతుందన్న ఆందోళనతో ఈ సూచన వచ్చింది. కానీ దీన్ని బంగారం అమ్మేయండి అని తప్పుగా చిత్రీకరించి ప్రచారం చేయడం జరిగింది.

ఫేక్‌ న్యూస్‌ వ్యాప్తి..
భారతీయ సమాజంలో బంగారం కేవలం ఆస్తి కాదు. ఇది భద్రత, సంప్రదాయం, పెళ్లి, పండుగలు, మహిళల ఆర్థిక స్వాతంత్య్రంతో ముడిపడి ఉంది. ఇలాంటి సెంటిమెంట్‌ను తాకే వార్తలు వైరల్‌ అయితే సులభంగా వ్యాప్తి చెందుతాయి. కొందరు సోషల్‌ మీడియా యూజర్లు మరియు వ్యతిరేక శక్తులు ఈ సున్నితమైన అంశాన్ని ఉపయోగించి గందరగోళం సృష్టించి, ప్రభుత్వం పై అపనమ్మకం కలిగించడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇది సాధారణమైన తప్పుడు సమాచారం కంటే మరింత ప్రమాదకరం, ఎందుకంటే ఇది సామాన్యుల ఆర్థిక నిర్ణయాలను ప్రభావితం చేస్తుంది.

ప్రధాని మోదీ సూచన ఆర్థిక సంక్షోభ నిర్వహణకు సంబంధించినది. కానీ దాన్ని తప్పుగా అర్థం చేసుకుని భయపెట్టే వార్తలు వ్యాప్తి చేయడం దేశ ఆర్థిక వ్యవస్థపైనే ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఈ రకమైన ఫేక్‌ న్యూస్‌లు కేవలం అసత్యాలు మాత్రమే కాదు.. అవి ప్రజల మధ్య అపనమ్మకం, ఆందోళన, తప్పుడు ఆర్థిక నిర్ణయాలకు దారితీస్తాయి.

తప్పు మొత్తం డైరెక్టర్ బుచ్చి బాబు దే అంటూ మేకప్ ఆర్టిస్ట్ సంచలన వ్యాఖ్యలు..

Buchi Babu Mahesh Babu Film
Buchi Babu Mahesh Babu Film

Makeup Artist comments on Buchi Babu: కొన్ని కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలకు కమర్షియల్ స్పేస్ ఏ మాత్రం ఉండదు. కానీ మన తెలుగు ఆడియన్స్ కోసం కమర్షియల్ ఎలిమెంట్స్ ని బలవంతంగా జోడించాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితే రీసెంట్ గా విడుదలైన ‘పెద్ది’ చిత్రానికి ఏర్పడింది. వాస్తవానికి చాలా గొప్ప కాన్సెప్ట్ ని డైరెక్టర్ బుచ్చి బాబు ఎంచుకున్నాడు. ఈ కాన్సెప్ట్ , కథ కు అసలు హీరోయిన్ అవసరం ఏ మాత్రం లేదు. కానీ మన తెలుగు ఆడియన్స్ కి హీరోయిన్ క్యారెక్టర్ లేకపోతే సినిమా ఎక్కదు అనే భయం తో , జాన్వీ కపూర్ క్యారెక్టర్ ని డిజైన్ చేశాడు బుచ్చి బాబు. ఈ క్యారెక్టర్ ని ఆయన జెన్ జీ ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకొని డిజైన్ చేసినట్టు ఉన్నాడు , కానీ అది మిస్ ఫైర్ అయ్యి సోషల్ మీడియా లో విపరీతమైన నెగెటివిటీ ని ఎదురుకుంటుంది.

ఇలాంటి క్యారెక్టర్ ని డిజైన్ చేసినందుకు డైరెక్టర్ బుచ్చి బాబు ని ఆడియన్స్ ఎలా తిడుతున్నారో , అలాంటి క్యారెక్టర్ లో నటించినందుకు హీరోయిన్ జాన్వీ కపూర్ ని కూడా అదే రేంజ్ లో తిడుతున్నారు నెటిజెన్స్. రోజురోజుకు ఈ ట్రోల్స్ ఎక్కువ అయిపోయాయి, దీంతో పలువురు సెలబ్రిటీలు కూడా ఈ ట్రోల్స్ పై స్పందించాల్సిన అవసరం ఏర్పడింది. ఈ చిత్రం లో నటించిన జగపతి బాబు కూడా జాన్వీ కపూర్ పై ట్రోల్స్ చేయడం సరికాదు అంటూ రెస్పాన్స్ అయ్యాడు. అదే విధంగా యాంకర్ అనసూయ కూడా కొన్ని హాట్ కామెంట్స్ చేసింది. కన్నడ టాప్ హీరోయిన్ ఆశికా రంగనాథ్ కూడా ఈ వ్యవహారం పై స్పందిస్తూ , హీరోయిన్స్ పెద్ద సినిమాల్లో కనిపిస్తే ఎక్కువ రీచ్ వస్తుందని , వాళ్లకు ఇష్టం లేకపోయినా కొన్ని విషయాల్లో తగ్గాల్సి ఉంటుంది , జాన్వీ కపూర్ పరిస్థితి కూడా అదే, అలాంటి పాత్రలో నటించడం ఆమె తప్పు కాదు , కానీ అలాంటి క్యారెక్టర్ ని డిజైన్ చేయడం తప్పు అంటూ చెప్పుకొచ్చింది.

ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గా ఈ అంశం పై జాన్వీ కపూర్ మేకప్ ఆర్టిస్ట్ సావలీన్ కౌర్ కొన్ని హాట్ కామెంట్స్ చేశారు. జాన్వీ కపూర్ డైరెక్టర్ బుచ్చి బాబు కి ఒక ప్రొఫెషినల్ బౌండరీ ని గీశాడని, కానీ ఆయన జాన్వీ కపూర్ చేత ఆ గీతని దాటించేలా చేసాడని చెప్పుకొచ్చారు. బోల్డ్ సన్నివేశాల్లో నటించాను అని డైరెక్టర్ బుచ్చి బాబు కి జాన్వీ కపూర్ ముందుగానే చెప్పారని, కానీ బుచ్చి బాబు అందుకు ఒప్పుకోలేదని , కమెర్షియాలిటీ కోసం ఎడిటింగ్ లో ఆ సన్నివేశాలను తొలగించకుండా అలాగే ఉంచేశారని చెప్పుకొచ్చారు. డైరెక్టర్ తీసుకున్న ఆ నిర్ణయం వల్ల , ఇప్పుడు జాన్వీ కపూర్ కూడా తీవ్రమైన విమర్శలను ఎదురుకోవాల్సి వస్తుందని ఆమె చేసిన పోస్ట్ ఇప్పుడు సంచలనం గా మారింది.

తమిళనాడు రాజకీయ భవిష్యత్తు అన్నామలై దే

Annamalai

Annamalai resignation : అన్నామలై బీజేపీకి రాజీనామా.. కొత్త రాజకీయ ఉద్యమానికి శ్రీకారం.. ఈ వార్త దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దాదాపు 3 , 4 రోజులుగా నేషనల్ చానెల్స్ లో విపరీతంగా చర్చ జరుగుతోంది. మేధావులు, ఎక్స్ పర్ట్స్ అని చెప్పుకునే వాళ్లు అన్నామలై వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు.

తమిళనాడు రాజకీయ భవిష్యత్తు అన్నామలై దే బీజేపీ నేతలు, శేఖర్ అయ్యర్, అయ్యంగర్, , రాజగోపాల్ లాంటి ప్రో బీజేపీ నేతలు, జేవీవీ శ్రీరాం అనలిస్ట్ విరుచుకుపడ్డారు. అన్నామలై నిర్ణయం కరెక్ట్ అని ఒక్కరూ కూడా చెప్పలేదు. వీళ్లను ఇంటర్వ్యూ చేసిన యాంకర్లు పాజిటివ్ గా ఉన్నారు.

బీజేపీ అన్నామలైకి పూర్తి సహకారం , ఊతం ఇచ్చినా ఆయన ఉపయోగించుకోలేదని విమర్శించారు. ఎక్కువ సీట్లలో పోటీచేయడం వల్లనే బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చాయని అన్నామలైని తక్కువ చేసి చూపించారు. అన్నామలై ఆర్థిక ఇబ్బందులు పార్టీ నడిపేందుకు ఉన్నాయి.

ఎవరు ఏం కించపరిచినా సోషల్ మీడియా మాత్రం అన్నామలైకి మద్దతుగా నిలిచారు. 15 లక్షల మంది 24 గంటల్లో మద్దతునిచ్చారు.తమిళనాడులో మంచి స్పందన వచ్చింది..

తమిళనాడు రాజకీయ భవిష్యత్తు అన్నామలై దే.. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడండి..

మృగశిర కార్తెతో.. ఈ 4 రాశుల వారికి డబ్బేడబ్బు..

Mrigashira Karthi Horoscope Predictions
Mrigashira Karthi Horoscope Predictions

Mrigashira Karthi Horoscope Predictions: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యుడు రోహిణి నక్షత్రాన్ని విడిచి మృగశిర నక్షత్రంలోకి ప్రవేశించే కాలాన్ని మృగశిర కార్తెగా పరిగణిస్తారు. 2026లో జూన్ 8న ప్రారంభమైన ఈ కార్తె వ్యవసాయం, వర్షాలు, వాతావరణ మార్పులతో పాటు కొన్ని రాశుల జీవితాలపై కూడా ప్రత్యేక ప్రభావం చూపుతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మేష, సింహ, కన్య, వృశ్చిక రాశుల వారి జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయో చూద్దాం..

మేష రాశి:
మృగశిర కార్తె ప్రారంభంతో మేష రాశి వారికి కొత్త ఉత్సాహం, ఆత్మవిశ్వాసం పెరిగే అవకాశం ఉంది. కుజుడు ఈ రాశికి అధిపతి కావడంతో మృగశిర నక్షత్ర ప్రభావం మరింత బలంగా పనిచేస్తుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. గతంలో నిలిచిపోయిన పనులు తిరిగి ప్రారంభమై విజయవంతంగా పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు లభించవచ్చు. ఆర్థిక పరంగా కూడా ఈ కాలం అనుకూలంగా ఉండవచ్చు. కొత్త ఆదాయ మార్గాలు కనిపించడంతో పాటు వ్యాపారవేత్తలకు లాభాలు పెరిగే సూచనలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో సంబంధాలు మెరుగుపడి ఇంట్లో ఆనందకర వాతావరణం నెలకొనవచ్చు. అయితే తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండటం మంచిది.

సింహ రాశి:
సింహ రాశి వారికి మృగశిర కార్తె శుభప్రదమైన కాలంగా పరిగణించబడుతోంది. నాయకత్వ లక్షణాలు మరింత వెలుగులోకి వచ్చి సమాజంలో గౌరవం పెరిగే అవకాశముంది. ఉద్యోగాల్లో పదోన్నతులు లేదా కొత్త బాధ్యతలు రావచ్చు. ప్రభుత్వ రంగానికి సంబంధించిన పనులు సానుకూలంగా పూర్తయ్యే సూచనలు ఉన్నాయి.వ్యాపార రంగంలో కొత్త ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి మంచి అవకాశాలు కనిపించవచ్చు. కుటుంబంలో పెద్దల ఆశీర్వాదం లభించి, శుభకార్యాల గురించి చర్చలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఆరోగ్య పరంగా సాధారణ జాగ్రత్తలు పాటిస్తే మంచి ఫలితాలు ఉంటాయి.

కన్యా రాశి:
కన్యా రాశి వారికి ఈ కార్తె కాలం కష్టానికి తగిన ప్రతిఫలం అందించే సమయంగా ఉండవచ్చు. చాలా కాలంగా ఎదురుచూస్తున్న అవకాశాలు ఈ సమయంలో లభించే సూచనలు కనిపిస్తున్నాయి. విద్యార్థులకు చదువులో ఏకాగ్రత పెరిగి పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉంది.
ఉద్యోగస్తులకు కొత్త ప్రాజెక్టులు, బాధ్యతలు రావచ్చు. వ్యాపారవేత్తలు తమ ప్రణాళికలను విజయవంతంగా అమలు చేసే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి క్రమంగా మెరుగుపడి పొదుపులు పెరిగే సూచనలు ఉన్నాయి. కుటుంబ సభ్యుల సహకారం లభించడం వల్ల మానసిక ప్రశాంతత పెరుగుతుంది.

వృశ్చిక రాశి:
వృశ్చిక రాశి వారికి మృగశిర కార్తె అనేక శుభ పరిణామాలను తీసుకురావచ్చని జ్యోతిష్య విశ్లేషణలు సూచిస్తున్నాయి. కుజుడి అనుకూల ప్రభావంతో ధైర్యం, నిర్ణయ సామర్థ్యం పెరుగుతుంది. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి అయ్యే అవకాశముంది. ఉద్యోగాల్లో మార్పులు కోరుకునే వారికి అనుకూల అవకాశాలు రావచ్చు. ఆర్థికంగా లాభాలు పెరిగే సూచనలు ఉన్నాయి. స్థిరాస్తి, భూమికి సంబంధించిన వ్యవహారాలు అనుకూలంగా ఉండవచ్చు. కుటుంబ జీవితంలో సంతోషం పెరిగి, బంధువులతో సంబంధాలు బలపడే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో గతంతో పోలిస్తే మెరుగైన పరిస్థితులు కనిపించవచ్చు.

జగన్ కు రిటర్న్ గిఫ్ట్ అవుతోందా?

YS Jagan Failed Experiments
YS Jagan Failed Experiments

YS Jagan Latest News: ఏపీలో కూటమి దూకుడు మీద ఉంది. అధికారంలోకి వచ్చి రెండేళ్లు సమీపిస్తోంది. ఈనెల 12 నాటికి తన రెండేళ్ల పాలన పూర్తి చేసుకోనుంది. అదే సమయంలో ఘోర ఓటమితో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారానికి దూరమై రెండేళ్లు అవుతుంది. అయితే ప్రజలు ఇచ్చిన తీర్పును ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు. అయితే పుంజుకోవడం పక్కన పెడితే ఆ పార్టీకి అవినీతి కేసులు వెంటాడుతున్నాయి. పార్టీ ఉనికినే ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి. అయితే ఆ పార్టీ నేతలు ఒక్కొక్కరిపై కేసులు నమోదు అవుతున్నాయి. కొందరి అరెస్టులు కూడా జరిగాయి. కానీ అధినేత జగన్మోహన్ రెడ్డి రిలాక్స్ మూడ్ లో ఉన్నారు. ఆ పార్టీ నేతలు కేసులతో అరెస్టు అయితే దానిని సానుభూతి కోణంలో చూపించే ప్రయత్నం చేస్తున్నారు జగన్ మోహన్ రెడ్డి. అయితే ఇప్పుడు నేరుగా ఆయనే డేంజర్ జోన్ లో ఉన్నట్లు స్పష్టం అవుతోంది.

దర్యాప్తు సంస్థల షాక్..
కూటమి రెండేళ్ల పాలన పూర్తి చేసుకోనుంది. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి విషయంలో కేంద్ర రాష్ట్ర దర్యాప్తు సంస్థలు గట్టి షాక్ ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నాయని సోషల్ మీడియాలో భారీ ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ వారంలోనే జగన్ హయాంలో జరిగిన అతిపెద్ద స్కాం కు సంబంధించిన ఆధారాలు బయటపడబోతున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఏపీని కుదిపేసిన రూ.3,500 కోట్ల భారీ మద్యం కుంభకోణం దర్యాప్తు తుది దశకు చేరుకుంది. ఇప్పటివరకు పాత్రధారులు చుట్టూ విచారణ సాగింది. ఇక అంతిమ లబ్ధిదారుడు టార్గెట్ అన్నట్టు ప్రచారం నడుస్తోంది. కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడి మద్యం కుంభకోణం ద్వారా సంపాదించిన వేల కోట్లను మైనింగ్, రియల్ ఎస్టేట్ రంగాల్లోకి హవాలా మార్గంలో దారి మళ్లించినట్లు ఆధారాలు లభించాయి. ఈ మొత్తం వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయనకు నోటీసులు జారీ చేసి.. నేరుగా విచారణకు పిలిచే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది.

పిఏ అడ్డంగా దొరకడంతో..
అయితే ఇంతకాలం పార్టీ నేతలతో పాటు అప్పట్లో పనిచేసిన అధికారుల చుట్టూ విచారణ కొనసాగింది. అయితే జగన్మోహన్ రెడ్డి మాజీ పిఏ నాగేశ్వర్ రెడ్డి నివాసాలపై కూడా ప్రత్యేక దర్యాప్తు బృందం దాడులు జరిపింది. లిక్కర్ సిండికేట్ కు, మాజీ ముఖ్యమంత్రి కి మధ్య ఈ అనే ప్రధాన అనుసంధాన కర్తగా వ్యవహరించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ దాడుల్లో స్వాధీనం చేసుకున్న బినామీ ఆస్తుల పత్రాలు, డిజిటల్ డైరీలు జగన్ రెడ్డి పాత్రను ఆధారాలతో సహా నిరూపించేలా ఉన్నాయని ఒక టాక్ నడుస్తోంది. ఒక విధంగా తన పిఏ అత్యంత ఆప్తుడు అనుకోవాలి. అతని ఇంట్లోనే ఆధారాలు దొరకడంతో జగన్మోహన్ రెడ్డి డిఫెన్స్ లో పడిపోయారు. దీనికి తగ్గట్టుగానే సోషల్ మీడియాలో అయితే విస్తృతమైన ప్రచారం నడుస్తోంది. విచారణకు పిలవడమే కాదు అరెస్టు కూడా రంగం సిద్ధం అవుతున్నట్లు టాక్ నడుస్తోంది.

సెంటిమెంట్ అస్త్రం..
మరోవైపు జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉచ్చు బిగిస్తుండడంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆందోళనతో ఉన్నాయి. ఒకవేళ దర్యాప్తు సంస్థలు గట్టి చర్యలకు దిగితే దీనిని రాజకీయ అస్త్రంగా మార్చుకోవాలని ఆ పార్టీ భావిస్తోంది. రాజకీయ కక్ష సాధింపుగా చిత్రీకరించి సెంటిమెంటును రగిలించాలని జగన్ వ్యూహంగా కనిపిస్తోంది. అయితే గతం మాదిరిగా సెంటిమెంట్ వర్కౌట్ అయ్యే పరిస్థితి లేదు. ఎందుకంటే అప్పట్లో సానుభూతి ఉండేది. కానీ 151 సీట్ల నుంచి 11 సీట్లకు దించేశారు. తద్వారా ఏ స్థాయిలో ప్రజావ్యతిరేకతను ఆయన మూటగట్టుకున్నారో స్పష్టం అవుతోంది. ఇటువంటి సమయంలో ప్రజలు కూడా నమ్మే స్థితిలో లేరు. జగన్ కు నోటీసులు ఇచ్చి విచారణకు పిలుస్తారు. అంతేతప్ప అరెస్టు చేయరు అని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

సినిమాల పరంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి చేదు వార్త.. ఇలాంటి నిర్ణయం తీసుకుంటాడని ఊహించలేదు..

Pawan Kalyan Fans
Pawan Kalyan Upcoming Movies

Pawan Kalyan Upcoming Movies: ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ అనే పేరు ఏ రేంజ్ లో వినిపిస్తుందో మనం ప్రతీ రోజు మీడియా , సోషల్ మీడియా లో చూస్తూనే ఉన్నాం. ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా , పంచాయితీ రాజ్ మరియు పర్యావరణ మంత్రిగా పవన్ కళ్యాణ్ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు వేరే లెవెల్ లో ఉన్నాయి. ప్రతీ అడుగులోనూ ఆయన తన మార్క్ చూపిస్తున్నాడు. లేటెస్ట్ గా ఆయన పంచాయితీ రాజ్ శాఖకు 5 నేషనల్ అవార్డ్స్ వచ్చేలా చేశాడు. దేశం లో ఏ రాష్ట్రంలో కూడా ఈ రేంజ్ అభివృద్ధి జరగడం లేదనేది వాస్తవం అని చెప్పొచ్చు. అంతే కాదు , పవన్ కళ్యాణ్ లుక్స్ పరంగా కూడా ప్రస్తుతం పీక్ రేంజ్ లో ఉన్నాడు. ఆయన లేటెస్ట్ లుక్స్ ని చూసి అభిమానులు ఎంతగానో మురిసిపోతున్నారు.

పవన్ కళ్యాణ్ లేటెస్ట్ లుక్స్ ని చూసిన అభిమానులు, ఆయన తదుపరి చిత్రాన్ని త్వరలోనే ప్రారంభించబోతున్నాడని , అందుకే తన లుక్స్ ని ఈ రేంజ్ లో మార్చున్నాడని అనుకున్నారు. అలా అభిమానుల ఆనందానికి సోషల్ మీడియా లో లేటెస్ట్ గా జరుగుతున్న ఒక ప్రచారం చెక్ పెట్టింది. పవన్ కళ్యాణ్ కి రీసెంట్ గానే డైరెక్టర్ సురేందర్ రెడ్డి పూర్తి స్థాయి బౌండెడ్ స్క్రిప్ట్ ని రెడీ చేసి వినిపించాడని , కానీ పవన్ కళ్యాణ్ అందుకు పూర్తి స్థాయిలో సంతృప్తి చెందలేదని, కాబట్టి సురేందర్ రెడ్డి తో సినిమా ఇప్పట్లో మొదలయ్యే అవకాశాలు లేవని తెలుస్తోంది. మరోపక్క పవన్ కళ్యాణ్ అభిమానులు ‘ఓజీ 2’ ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ కూడా రీసెంట్ గానే సుజిత్ పూర్తి చేశాడని తెలుస్తోంది. జనవరి నుండి ఈ చిత్రాన్ని మొదలు పెడతాడని అంతా అనుకున్నారు.

కానీ అది సాధ్యం అయ్యేలా అనిపించడం లేదని అంటున్నారు విశ్లేషకులు. అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ ప్రస్తుతానికి ఎలాంటి సినిమా కమిట్మెంట్స్ ఇచ్చే మూడ్ లో లేడని, ఆయన ద్రుష్టి మొత్తం ఇప్పుడు పాలన మీదనే ఉందని, వచ్చే ఏడాది గోదావరి పుష్కరాలు జరగబోతున్నాయి , ఈ నేపథ్యం లో పవన్ కళ్యాణ్ ఈ పుష్కరాల బాధ్యతని తన భుజాల మీద వేసుకున్నాడని , ప్రపంచం మొత్తం ఈ పుష్కరాల గురించి అద్భుతంగా మాట్లాడుకునే చేయడమే పవన్ కళ్యాణ్ లక్ష్యమని, ఆ మహోన్నత కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసే వరకు ఆయన ఎలాంటి సినిమా కమిట్మెంట్స్ ని ఒప్పుకునే పరిస్థితి లో లేడని సమాచారం. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఏమి జరగబోతుంది అనేది.

ముంబైని వదిలిపోవడం గ్యారంటీ.. సూర్య చేరేది ఆ జట్టులోనే.. ఇది మామూలు బ్లాస్టింగ్ న్యూస్ కాదు

Suryakumar Yadav New IPL Team
Suryakumar Yadav New IPL Team

Suryakumar Yadav New IPL Team: మొత్తానికి ఐపిఎల్ లో ముంబై జట్టు నుంచి సూర్య కుమార్ యాదవ్ వెళ్లిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. అతడు ముంబై ఇండియన్స్ జట్టును ఇన్ స్టా గ్రామ్ లో అన్ ఫాలో చేశాడు. అంత కాదు ముంబై జట్టుతో గతంలో దిగిన ఫోటోలను మొత్తం డిలీట్ చేశాడు.. ఈ నేపథ్యంలో అతడు వచ్చే సీజన్లో ముంబై నుంచి బయటికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మేనేజ్మెంట్ కూడా అతడి విషయంలో అంత సానుకూలంగా లేనట్టు కనిపిస్తోంది.

సూర్య కుమార్ యాదవ్ ముంబై జట్టు నుంచి బయటికి వస్తే వచ్చే సీజన్లో అతడు ఏ జట్టులో ఆడతాడు.. ఏ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తాడు.. అనే ప్రశ్నలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఒక వార్త కనిపిస్తోంది. అది ఎంతవరకు నిజమో తెలియదు గాని.. సూర్య కుమార్ యాదవ్ వచ్చే సీజన్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఆడే అవకాశం ఉందని తెలుస్తోంది. ట్రేడ్ లో భాగంగా సూర్య కుమార్ యాదవ్ బెంగళూరు వెళ్తాడని.. బెంగళూరు నుంచి బెతల్.. పావెల్ ముంబై జట్టుకు వెళ్ళిపోతారని తెలుస్తోంది. రెండు జట్ల మధ్య ఈ ట్రేడ్ కుదిరిందని.. అధికారికంగా ప్రకటన మాత్రమే మిగిలి ఉందని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

ఇంతవరకు సూర్య కుమార్ యాదవ్ తాను ముంబై జట్టు నుంచి బయటికి వెళ్తున్నట్టు అధికారికంగా ప్రకటించలేదు. ముంబై జట్టు కూడా సూర్యకుమార్ యాదవ్ విషయంలో ఎటువంటి ప్రకటన చేయలేదు. అయితే అతడు ముంబై ఇండియన్స్ జట్టును సోషల్ మీడియాలో అన్ ఫాలో చేయడం రకరకాల ఊహాగానాలకు కారణమవుతోంది. గతంలో ముంబై జట్టు కూడా హార్దిక్ పాండ్యాను గుజరాత్ నుంచి ట్రేడ్ విధానం లో తీసుకుంది. అయితే ఇప్పుడు అదే విధానాన్ని బెంగళూరు కూడా కొనసాగించే అవకాశం కనిపిస్తుందని తెలుస్తోంది. మరోవైపు బెంగళూరు ప్రతిపాదనకు.. ముంబై ఓకే చెబుతుందా.. ఈ ట్రేడ్ కార్యరూపం దాల్చుతుందా.. చూడాల్సి ఉంది.

సూర్య కుమార్ యాదవ్ ఈ సీజన్లో అంతగా ఆడలేదు. అతడు హార్థిక్ పాండ్యాతో కూడా టచ్ మీ నాట్ అన్నట్టుగానే వ్యవహరించాడు. టీ మీడియాకు టి20 వరల్డ్ కప్ సాధించి పెట్టినప్పటికీ.. వ్యక్తిగత ప్రదర్శన అంత గొప్పగా చేయలేదు. అందువల్లే అతడిని మేనేజ్మెంట్ జాతీయ జట్టు నుంచి పక్కనపెట్టింది. ఆటగాడిగా కూడా అతడిని ఎంపిక చేయలేదు. ఈ నేపథ్యంలో అతడు గనుక మిగతా టోర్నీలలో అవకాశం వస్తే.. తనను తాను నిరూపించుకుంటే.. జట్టులో స్థానం స్థిరంగా ఉంటుందని.. క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.. ప్రస్తుతం జరుగుతున్న ముంబై t20 లో కూడా సూర్యకుమార్ యాదవ్ తన స్థాయిలో ఆడటం లేదు.

'వర్కింగ్ డే' లో కూడా దుమ్ములేపుతున్న 'పెద్ది' చిత్రం.. ఈరోజు ఎంత గ్రాస్ వస్తుందంటే..

Tollywood Box Office Collection
Tollywood Box Office Collection

Peddi Movie Box Office Collections: సంక్రాంతి తర్వాత టాలీవుడ్ లో విడుదలైన ఏ సినిమాకు కూడా ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదు. ట్రేడ్ మొత్తం నిరాశలో ఉంది , హైదరాబాద్ వంటి టాప్ సిటీలలో కూడా థియేటర్స్ ని మూసి వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి సమయం లో ఒక్క సరైన హిట్ పడకపోతే సినీ ఇండస్ట్రీ సంక్షోభం లోకి వెళ్తుందని అందరూ భయపడ్డారు. అలాంటి సమయం లో ఎన్నో అంచనాలు , ఆశల మధ్య విడుదలైన ‘పెద్ది’ చిత్రానికి ఆడియన్స్ నుండి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చింది. ప్రీమియర్ షోస్ నుండే ఈ చిత్రానికి వచ్చిన పాజిటివ్ టాక్ ని చూసి ట్రేడ్ పండితులు ఈ చిత్రం రామ్ చరణ్ కెరీర్ లో మరో మగధీర, రంగస్థలం రేంజ్ బ్లాక్ బస్టర్ గా నిలుస్తుందని అనుకున్నారు. వాళ్ళ అంచనాలకు తగ్గట్టుగానే ఈ చిత్రం ఆ రేంజ్ బ్లాక్ బస్టర్ దిశగా అడుగులు వేస్తోంది.

నేడు ఈ చిత్రానికి బాక్స్ ఆఫీస్ వద్ద అసలైన పరీక్ష. ఎందుకంటే వర్కింగ్ డే కాబట్టి. ఈ వర్కింగ్ డే టెస్ట్ లో ఈ చిత్రం పాస్ అవుతుందా లేదా ? అనే అనుమానం అభిమానుల్లో ఉండేది. అయితే ఈ టెస్ట్ ని డిస్టింక్షన్ లో పాస్ అయ్యింది ఈ చిత్రం అనడం లో ఎలాంటి సందేహం లేదు. నూన్ షోస్ నుండే ఈ చిత్రానికి డీసెంట్ స్థాయి వసూళ్లు నమోదు అయ్యాయి. నైజాం ప్రాంతం లో మ్యాట్నీ షోస్ నుండి అద్భుతమైన ఆక్యుపెన్సీలు నమోదు అవ్వడం మొదలయ్యాయి. ఆ కారణం చేత ఈ చిత్రానికి బుక్ మై షో యాప్ లో గంటకు 15 వేల టిక్కెట్లు అమ్ముడుపోవడం జరిగింది. ఈమధ్య కాలం లో మన టాలీవుడ్ స్టార్ హీరో సినిమాకు ఈ రేంజ్ అడ్వాన్స్ బుకింగ్స్ వర్కింగ్ డే లో జరగడం ఎప్పుడూ చూడలేదు.

దీనిని బట్టీ చూస్తుంటే ఈ చిత్రానికి ఏ రేంజ్ లాంగ్ రన్ ఉండబోతుందో అర్థం అవుతుంది. ‘రంగస్థలం’ రేంజ్ లాంగ్ రన్ ఎప్పుడు వస్తుందో మళ్లీ రామ్ చరణ్ కి అని అంతా అనుకునేవారు , ‘పెద్ది’ చిత్రం ఆ స్థాయి బ్లాక్ బస్టర్ అని బలంగా నమ్మారు , వాళ్ళ నమ్మకాలను నిజం చేసింది ఈ చిత్రం. మొదటి వీకెండ్ లో ప్రపంచవ్యాప్తంగా 240 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించిన ఈ చిత్రం , ఈ వీకెండ్ తో 300 కోట్ల గ్రాస్ క్లబ్ లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇవ్వబోతుంది. #RRR తో వెయ్యి కోట్ల గ్రాస్ ని అందుకున్న రామ్ చరణ్ , ఇప్పుడు ‘పెద్ది’ తో 300 కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇవ్వడం పై చరణ్ ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. మరి లాంగ్ రన్ లో ఈ చిత్రం 400 కోట్ల గ్రాస్ ని రాబడుతుందా లేదా అనేది చూడాలి. నేడు ఈ చిత్రానికి నమోదు అవుతున్న హౌస్ ఫుల్స్ ని చూస్తుంటే, కచ్చితంగా నేడు 15 కోట్ల గ్రాస్ ని కొల్లగొడుతుందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.