Rohit Sharma Viral Video : ధోని తర్వాత టీమిండియాలో అంతటి ప్రభావాన్ని చూపించిన నాయకుడు రోహిత్ శర్మ.. టీమ్ ఇండియాకు టి20 వరల్డ్ కప్ అందించాడు. వన్డే వరల్డ్ కప్ లో ఫైనల్ దాకా తీసుకెళ్లాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ దాకా టీమ్ ఇండియాను తీసుకెళ్లాడు. భారత జట్టుకు చాంపియన్ ట్రోఫీ అందించాడు. రోహిత్ శర్మ ఎలాంటి ఫార్మాట్లోనైనా అద్భుతంగా ఆడగలడు. అందువల్లే అతడిని ప్రమాదకర ఆటగాడు అని పిలుస్తారు.
టీమిండియా టి20 వరల్డ్ కప్ సాధించిన తర్వాత ఆ ఫార్మాట్ నుంచి రోహిత్ తప్పుకున్నాడు. మేనేజ్మెంట్ తీసుకొచ్చిన ఒత్తిడి.. గౌతమ్ గంభీర్ నుంచి వచ్చిన ఒత్తిడి.. వల్ల అతడు సుదీర్ఘ ఫార్మాట్ నుంచి తప్పుకున్నాడు. ఎవరు అంచనా వేయకుండానే.. ఎటువంటి సంకేతాలు ఇవ్వకుండానే అతడు జట్టు నుంచి తప్పుకున్నాడు. రోహిత్ టెస్ట్ జట్టు నుంచి తప్పుకోవడం చాలామంది అభిమానులకు రుచించలేదు. చాలామంది అభిమానులు తమ ఆవేదనను సోషల్ మీడియాలో బహిరంగంగానే వ్యక్తం చేశారు. ముఖ్యంగా గౌతమ్ గంభీర్ ను ఉద్దేశించి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఇప్పటికీ గౌతమ్ గంభీర్ ను రోహిత్ అభిమానులు ఏమాత్రం సహించడం లేదు. అతడు కనిపిస్తే చాలు తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేస్తున్నారు.
గౌతమ్ గంభీర్ ఎందుకు రోహిత్ ను పక్కన పెట్టాడు.. జట్టు నుంచి ఎందుకు వెళ్లిపోయేలా చేశాడు.. అనే ప్రశ్నలకు ఇప్పటికీ సమాధానం లేదు.. తను వెళ్లిపోవడానికి అధికారికంగా గౌతమ్ గంభీర్ కారణమని ఇంతవరకు రోహిత్ చెప్పలేదు. అయితే పెద్దల విషయంలో.. తనకు కోచింగ్ ఇచ్చిన వారి విషయంలో రోహిత్ ఎంతో మర్యాదగా ఉంటాడు. ఆ మధ్య తన పేరు మీద ముంబై మైదానంలో స్టాండ్ ఏర్పాటు చేసినప్పుడు.. తనకు శిక్షణ ఇచ్చిన వారిని అభినందించాడు. ఆ సమావేశంలో వారందరిని తలుచుకున్నాడు. ఇప్పుడు జరుగుతున్న ముంబై t20 లీగ్ లో కూడా రోహిత్ తన శిక్షణ ఇచ్చిన చిన్ననాటి కోచ్ ను ప్రేమను చూపించాడు. అంతేకాదు అతని పాదాల మీద పడి నమస్కరించాడు.
రోహిత్ శర్మకు కు చిన్నతనంలో దినేష్ ల్యాడ్ అనే వ్యక్తి శిక్షణ ఇచ్చాడు. అతడి నేతృత్వంలో రోహిత్ రాటు తేలాడు. అతడు అద్భుతంగా బ్యాటింగ్ చేయడంలో దినేష్ పాత్ర కచ్చితంగా ఉంటుంది. ఇదే విషయాన్ని అనేక సందర్భాలలో రోహిత్ బయటపెట్టాడు. తాజాగా ముంబై t20 లీగ్ చూసేందుకు రోహిత్ వాంఖడే స్టేడియానికి వెళ్ళాడు. స్టేడియం వెళ్తుండగా దినేష్ తన సతీమణితో కనిపించాడు. ఆయనను చూసిన రోహిత్ వెంటనే కాళ్ళ మీద పడి నమస్కరించాడు. అతడిని చూసి ఆనంద పరవశుడయ్యాడు. తన దగ్గర శిక్షణ పొందిన రోహిత్ ఈ స్థాయిలో ఎదగడం పట్ల దినేష్ హర్షం వ్యక్తం చేశాడు.
A touching moment at Wankhede Stadium has won hearts online. Before entering the stadium, Indian cricket star Rohit Sharma noticed his childhood coach Dinesh Lad and his wife and immediately walked over to greet them.
Despite being in a hurry, Rohit took a moment to meet the… pic.twitter.com/XF7pbEmcXH
— Pune Mirror (@ThePuneMirror) June 8, 2026
















తప్పు మొత్తం డైరెక్టర్ బుచ్చి బాబు దే అంటూ మేకప్ ఆర్టిస్ట్ సంచలన వ్యాఖ్యలు..
Makeup Artist comments on Buchi Babu: కొన్ని కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలకు కమర్షియల్ స్పేస్ ఏ మాత్రం ఉండదు. కానీ మన తెలుగు ఆడియన్స్ కోసం కమర్షియల్ ఎలిమెంట్స్ ని బలవంతంగా జోడించాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితే రీసెంట్ గా విడుదలైన ‘పెద్ది’ చిత్రానికి ఏర్పడింది. వాస్తవానికి చాలా గొప్ప కాన్సెప్ట్ ని డైరెక్టర్ బుచ్చి బాబు ఎంచుకున్నాడు. ఈ కాన్సెప్ట్ , కథ కు అసలు హీరోయిన్ అవసరం ఏ మాత్రం లేదు. కానీ మన తెలుగు ఆడియన్స్ కి హీరోయిన్ క్యారెక్టర్ లేకపోతే సినిమా ఎక్కదు అనే భయం తో , జాన్వీ కపూర్ క్యారెక్టర్ ని డిజైన్ చేశాడు బుచ్చి బాబు. ఈ క్యారెక్టర్ ని ఆయన జెన్ జీ ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకొని డిజైన్ చేసినట్టు ఉన్నాడు , కానీ అది మిస్ ఫైర్ అయ్యి సోషల్ మీడియా లో విపరీతమైన నెగెటివిటీ ని ఎదురుకుంటుంది.
ఇలాంటి క్యారెక్టర్ ని డిజైన్ చేసినందుకు డైరెక్టర్ బుచ్చి బాబు ని ఆడియన్స్ ఎలా తిడుతున్నారో , అలాంటి క్యారెక్టర్ లో నటించినందుకు హీరోయిన్ జాన్వీ కపూర్ ని కూడా అదే రేంజ్ లో తిడుతున్నారు నెటిజెన్స్. రోజురోజుకు ఈ ట్రోల్స్ ఎక్కువ అయిపోయాయి, దీంతో పలువురు సెలబ్రిటీలు కూడా ఈ ట్రోల్స్ పై స్పందించాల్సిన అవసరం ఏర్పడింది. ఈ చిత్రం లో నటించిన జగపతి బాబు కూడా జాన్వీ కపూర్ పై ట్రోల్స్ చేయడం సరికాదు అంటూ రెస్పాన్స్ అయ్యాడు. అదే విధంగా యాంకర్ అనసూయ కూడా కొన్ని హాట్ కామెంట్స్ చేసింది. కన్నడ టాప్ హీరోయిన్ ఆశికా రంగనాథ్ కూడా ఈ వ్యవహారం పై స్పందిస్తూ , హీరోయిన్స్ పెద్ద సినిమాల్లో కనిపిస్తే ఎక్కువ రీచ్ వస్తుందని , వాళ్లకు ఇష్టం లేకపోయినా కొన్ని విషయాల్లో తగ్గాల్సి ఉంటుంది , జాన్వీ కపూర్ పరిస్థితి కూడా అదే, అలాంటి పాత్రలో నటించడం ఆమె తప్పు కాదు , కానీ అలాంటి క్యారెక్టర్ ని డిజైన్ చేయడం తప్పు అంటూ చెప్పుకొచ్చింది.
ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గా ఈ అంశం పై జాన్వీ కపూర్ మేకప్ ఆర్టిస్ట్ సావలీన్ కౌర్ కొన్ని హాట్ కామెంట్స్ చేశారు. జాన్వీ కపూర్ డైరెక్టర్ బుచ్చి బాబు కి ఒక ప్రొఫెషినల్ బౌండరీ ని గీశాడని, కానీ ఆయన జాన్వీ కపూర్ చేత ఆ గీతని దాటించేలా చేసాడని చెప్పుకొచ్చారు. బోల్డ్ సన్నివేశాల్లో నటించాను అని డైరెక్టర్ బుచ్చి బాబు కి జాన్వీ కపూర్ ముందుగానే చెప్పారని, కానీ బుచ్చి బాబు అందుకు ఒప్పుకోలేదని , కమెర్షియాలిటీ కోసం ఎడిటింగ్ లో ఆ సన్నివేశాలను తొలగించకుండా అలాగే ఉంచేశారని చెప్పుకొచ్చారు. డైరెక్టర్ తీసుకున్న ఆ నిర్ణయం వల్ల , ఇప్పుడు జాన్వీ కపూర్ కూడా తీవ్రమైన విమర్శలను ఎదురుకోవాల్సి వస్తుందని ఆమె చేసిన పోస్ట్ ఇప్పుడు సంచలనం గా మారింది.