Home Blog Page 160

'భూమా' కుటుంబంలో ఏం జరుగుతోంది?!

Bhuma Family Politics
Bhuma Family Politics

Bhuma Family Politics: రాయలసీమ రాజకీయాల్లో భూమా కుటుంబానికి ప్రత్యేక స్థానం. భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి దంపతులు తమదైన శైలిలో రాజకీయాలు చేశారు. తమ మార్కు పాలిటిక్స్ చూపించారు. కానీ ఆ దంపతుల అకాల మరణంతో పిల్లలు ఇప్పుడు రాజకీయం చేస్తున్నారు. ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా భూమా అఖిలప్రియ ఉన్నారు. మరోవైపు నంద్యాలలో బ్రహ్మానంద రెడ్డి రాజకీయాలు చేస్తున్నారు. మరో కుమార్తె అలేఖ్య త్వరలో రాజకీయ అరంగేట్రం చేస్తున్నారు. అయితే పిల్లల మధ్య విభేదాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. నంద్యాలలో భూమా కుటుంబం కాకుండా వేరొకరు ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే అక్కడ రాష్ట్ర మంత్రుల పర్యటనకు భూమా అఖిలప్రియ ను ఆహ్వానిస్తే… ఆమె గైర్ హాజరయ్యారు. దీంతో ఆ కుటుంబంలో విభేదాలు ఉన్నట్లు ప్రచారం మొదలైంది.

* టిడిపిలో సుదీర్ఘకాలం..
తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘకాలం పనిచేసింది భూమా కుటుంబం. భూమా నాగిరెడ్డి తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. అయితే ప్రజారాజ్యం ఆవిర్భావంతో భూమా నాగిరెడ్డి తన భార్య శోభ నాగిరెడ్డి తో కలిసి చిరంజీవి గూటికి చేరారు. అప్పట్లో రాయలసీమ లో చిరంజీవితో పాటు ఈ దంపతులిద్దరూ గెలిచారు. తర్వాత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి 2014 ఎన్నికల్లో ఆళ్లగడ్డ నుంచి భూమా అఖిలప్రియ, నంద్యాల నుంచి భూమా నాగిరెడ్డి గెలిచారు. వైసీపీ నుంచి గెలిచిన ఈ ఇద్దరు తరవాత టిడిపిలోకి ఫిరాయించారు. అయితే నాగిరెడ్డి అకాల మరణంతో నంద్యాలకు ఉప ఎన్నిక జరిగింది. దీంతో కుమారుడు భూమ బ్రహ్మానంద రెడ్డి బరిలో దిగారు టిడిపి తరఫున. ఆ ఎన్నికల్లో బ్రహ్మానందరెడ్డి గెలిచారు. దీంతో అక్కతో పాటు తమ్ముడు కూడా అసెంబ్లీలో అడుగు పెట్టారు. ఆ సమయంలో అఖిలప్రియ మంత్రి కూడా అయ్యారు. కానీ 2019లో ఇద్దరు ఓడిపోయారు. మొన్నటి ఎన్నికల్లో కుటుంబానికి ఒక్కటే టికెట్ ఫార్ములాతో ఆళ్లగడ్డకు పరిమితం అయ్యారు అఖిలప్రియ. ఆళ్లగడ్డ నుంచి గెలిచిన అఖిల ప్రియ తరచు వివాదాస్పద అంశాల్లోకి చిక్కుకున్నారు.

* భవిష్యత్తు కోసం పోరాటం..
తాజాగా పిల్లలు ముగ్గురు మధ్య విభేదాలు తలెత్తినట్లు వార్తలు వస్తున్నాయి. అఖిల ప్రియ చాలా దూకుడుగా ఉంటారు. దూకుడు రాజకీయాలు చేస్తుంటారు. ఇంకోవైపు రెండో కుమార్తె అలేఖ్య మంచు మోహన్ బాబు కోడలు. మంచు మనోజ్ భార్య. త్వరలో ఆమె రాజకీయ ఎంట్రీ ఉంటుందని భర్త ప్రకటించారు. ఇప్పటికే భూమా బ్రహ్మానంద రెడ్డి కూడా ఉన్నారు. అయితే భవిష్యత్తు రాజకీయాల కోసం ఆ ముగ్గురు మధ్య పడడం లేదని తెలుస్తోంది. దీనిపై ఎప్పటికప్పుడు వారు జరుగుతున్న ప్రచారంపై ఖండిస్తూ వచ్చారు. అయితే నంద్యాలలో జరిగిన సమావేశానికి భూమా అఖిలప్రియ హాజరు కాకపోవడం వెనుక విభేదాలు ఉన్నట్లు ఇప్పుడు కొత్తగా ప్రచారం మొదలైంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.

విశాఖ స్టీల్ ప్లాంట్ ఘటన వెనుక కుట్ర కోణం?!

Visakhapatnam Steel Plant Accident
Visakhapatnam Steel Plant Accident

Visakhapatnam Steel Plant Accident: విశాఖ స్టీల్ ప్లాంట్ ఘటన వెనుక కుట్ర కోణం ఉందా? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇదే అనుమానం ఎందుకు వ్యక్తం చేశారు? ప్రమాదానికి ముందే మరో ఘటన జరిగిందా? ఈ విషయాన్ని పవన్ కు కార్మికులే చెప్పారా? స్టీల్ ప్లాంట్ సేఫ్టీ ఆడిట్ సరిగ్గా లేదా? ఇప్పుడు దీనిపైనే ఆసక్తికర చర్చ నడుస్తోంది. దేశంలో వివిధ ప్రాంతాల్లో స్టీల్ ప్లాంట్లు ఉన్నాయి. కానీ ఎక్కడా జరగని విధంగా.. విశాఖ స్టీల్ ప్లాంట్ లోనే వరుసగా ప్రమాదాలు జరగడంపై అనుమానం వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్. దీనిపై విచారణకు ముగ్గురు సభ్యులతో కూడిన బృందాన్ని నియమించారు. బొకారో స్టీల్ ప్లాంట్ అధికారులను సైతం విచారణ కమిటీలో నియమించారు.

* మానవతా దృక్పథంతో రాష్ట్ర ప్రభుత్వం..
విశాఖ స్టీల్ ప్లాంట్ లో భారీ ప్రమాదం సంభవించి తొమ్మిది మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు మంత్రి లోకేష్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధిత కుటుంబాలను పరామర్శించారు. అయితే ఇది కేంద్ర ప్రభుత్వం పరిధిలో పనిచేసే స్టీల్ ప్లాంట్. మానవతా దృక్పథంతో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కుట్ర రాజకీయాలను ప్రోత్సహిస్తుందన్న అనుమానం కూటమి నేతల్లో ఉంది. ముఖ్యంగా కార్మిక సంఘాల నేతల ముసుగులో కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు.. ఇతర వామపక్షాల ప్రతినిధులు వ్యవహరించిన తీరుపై అనేక రకాల అనుమానాలు ఉన్నాయి. అందుకే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన కామెంట్స్ చేశారు. ఈ ఘటనపై 360 డిగ్రీల కోణంలో దర్యాప్తు చేస్తేనే అసలు విషయం బయట పడుతుందని చెప్పారు. 33 సంవత్సరాల చరిత్రలో ఎన్నడూ ఇటువంటి ఘటన జరగలేదని.. అందుకే దీనిపై సమగ్ర దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

* కూటమి అండగా నిలిచినా..
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం గత కొన్నేళ్లుగా కుదిపేస్తోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఈ ప్రతిపాదన రాగా కార్మిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. అప్పట్లో జగన్ సర్కార్ అనుకున్న స్థాయిలో వ్యవహరించలేదన్న ఆరోపణలు వచ్చాయి. కానీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రైవేటీకరణ అంశానికి ఎప్పటికప్పుడు బ్రేక్ పడుతూ వచ్చింది. పైగా స్టీల్ ప్లాంట్ కు 13 వేల కోట్ల రూపాయల భారీ ఆర్థిక ప్యాకేజీ కూడా వచ్చింది. అయినా సరే కూటమి పై కార్మిక వర్గాల్లో అసంతృప్తికి రావడానికి ప్రధాన కారణం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అని అనుమానాలు ఉన్నాయి. కొంతమంది వామపక్షాల నేతలతో వైసిపి కుమ్మక్కై.. లేనిపోని రాజకీయ డ్రామాలు ఆడుతోందని కూటమి అనుమానిస్తూ వస్తోంది. నిన్న కూడా బాధ్యతగా వ్యవహరించి బాధితులను పరామర్శిస్తే.. సాక్షి మీడియా నినాదాలు చేయమని పురమాయించడం.. వామపక్షాల నేతలు నిలదీసినంత ప్రయత్నం చేయడం వంటి వాటిని కూటమి సీరియస్ గా తీసుకుంటుంది. ప్లాంట్ లో భద్రతా చర్యలు కొరవడితే కార్మిక సంఘాల ముసుగులో వామపక్షాల నేతలు ఉన్నారని.. వారెందుకు ముందుగా ఈ విషయాన్ని బహిర్గతం చేయలేదన్న ప్రశ్న ఇప్పుడు వినిపిస్తోంది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే పవన్ కళ్యాణ్ కుట్ర కోణం ఉందని ఆరోపించడం మాత్రం సంచలనంగా మారింది. మరి ముగ్గురు సభ్యులతో కూడిన విచారణ బృందం ఏం తెలుస్తుందో చూడాలి.

అందాల దివీ.. అలా చూడకే మరీ..!

Divi Vadthya photos
Divi Vadthya photos

ఎందరో స్టార్ లను తయారు చేసిన ప్రముఖ దర్శకుడి దుర్మరణం...

Bharathiraja Passed Away
Bharathiraja Passed Away

Bharathiraja Passed Away: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో లెజెండరీ దర్శకుడిగా గొప్ప గుర్తింపును సంపాదించుకున్న డైరెక్టర్ ‘భారతీ రాజా’ ఇక లేరు అనే విషయం ప్రతి ఒక్కరిని కలవరపెడుతుంది.4 దశాబ్దాలుగా ఎన్నో అద్భుతమైన సినిమాలను తెరికెక్కించి ఎంతో మంది నటీనటులను ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఘనత కూడా తనకే దక్కింది. అలాంటి దర్శకుడు ఈరోజు ఉదయం తన తుది శ్వాస విడిచారనే విషయం తమిళ్ ఇండస్ట్రీ తో పాటు ఇండియన్ సినిమా ఇండస్ట్రీని సైతం తీవ్రమైన దిగ్భ్రాంతికి గురిచేసింది… ఆయన తెలుగులో ‘సీతాకోకచిలుక’, మెగాస్టార్ చిరంజీవి ని హీరోగా పెట్టి ‘ఆరాధన’ అనే సినిమా చేశాడు..ఒక రకంగా చిరంజీవి ఏరి కోరి మరి అతనితో సినిమా చేశాడు. జమదాగ్ని లాంటి గొప్ప సినిమాలను చేశాడు. నిజానికి ఆయన సినిమాల్లో ఒక ఎమోషన్ అయితే ఉంటుంది. సినిమా మొదటి నుంచి చివరి వరకు ఆ ఎమోషన్ ని చాలా బాగా హ్యాండిల్ చేస్తూ ముందుకు తీసుకెళ్లగలిగిన ఘనత కూడా తనకే దక్కింది. అలాంటి దర్శకుడు ఎంతో మంది రచయితలకు, దర్శకులకు ఇన్స్పిరేషన్ గా కూడా మారాడు…1941 జూలై 17 న జన్మించిన భారతీరాజా ’16 వయదినిలే ‘ తెలుగులో (పదహారేళ్ళ వయసు) మూవీ తో దర్శకుడిగా మారాడు.

‘కొత్త జీవితాలు’ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఆయన ఇక్కడ చాలా సక్సెస్ లను కూడా అందుకున్నాడు. ఆయన చేసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ సక్సెస్ గా నిలిచాయి. ఆరుసార్లు నేషనల్ అవార్డుని అందుకున్న ఘనత కూడా తనకే దక్కింది… రాధ, రాధిక, కార్తీక్ ఎంతోమంది నటులను ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఘనత కూడా తనకి దక్కడం విశేషం…

ఇక బాలయ్య బాబు హీరోగా చేసిన ‘మంగమ్మగారి మనవడు’ సినిమాకి రచయితగా వ్యవహరించాడు. అలాగే ‘పల్నాటి పౌరుషం’ సినిమాకి స్క్రీన్ ప్లే ని అందించిన ఘనత కూడా తనకే దక్కింది. ఇక మోహన్ లాల్ హీరోగా మలయాళం ఇండస్ట్రీలో వచ్చిన తుడురుమ్ చివరిసారిగా కనిపించాడు.

ఈ మూవీలో కూడా అతని పాత్రకి చాలా మంచి ప్రాముఖ్యత అయితే దక్కింది. సినిమా ఇండస్ట్రీ కి తను అందించిన సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం ఆయన్ని ‘పద్మ శ్రీ’ పురస్కారంతో సత్కరించింది… గతేడాది తన కుమారుడు గుండెపోటుతో మరణించడంతో అప్పటినుంచి కృంగిపోయిన భారతీ రాజా కొద్ది రోజులుగా శ్వాస సంబంధిత వ్యాధితో ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడు… మొత్తానికైతే ఈరోజు ఉదయం ఆయన తన తుది శ్వాసను విడవడం అనేది ప్రతి ఒక్కరి హృదయాలను కలచివేస్తుంది. అలాంటి లెజెండరీ దర్శకుడికి ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తం కన్నీటి వీడ్కోలు పలుకుతుంది…

సింధు జలాల్లో పాక్‌కు చుక్క నీరూ వెళ్లదు.. మోడీ ఎత్తు.. పాకిస్తాన్‌ చిత్తు!

Indus Waters Treaty
Indus Waters Treaty

Indus Waters Treaty: పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్‌ పాకిస్తాన్‌ విషయంలో అనేక కఠిన నిర్ణయాలు తీసుకుంది. దౌత్యపరమైన చర్యలు చేపట్టింది. దశాబ్దాల నాటి సిందూ జల ఒప్పందాన్ని హోల్డ్‌లో పెట్టింది. తర్వాత ఆపరేషన్‌ సిందూర్‌ చేపట్టింది. రక్తం నీరు ఏకకాలంలో పారవని స్పష్టం చేసింది. దీంతో సింధూ జలాలు రాక పాకిస్తాన్‌లో కరువు చాయలు, ఆకస్మిక వరదలు వస్తున్నాయి. ఒప్పందం పునరుద్ధరణకు పాకిస్తాన్‌ అంతర్జాతీయంగా భారత్‌పై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నించింది. కానీ అవి ఫలించలేదు.

చుక్క నీరివ్వం..
తాజాగా కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్‌.పాటిల్‌ సింధు జలాల విషయంలో భారత్‌ కఠిన నిర్ణయాన్ని మరోసారి స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో సింధు నదీ వ్యవస్థ నుంచి పాకిస్థాన్‌కు ఒక్క చుక్క నీరు కూడా చేరకుండా చర్యలు తీసుకుంటున్నామని ప్రకటించారు. ‘సింధు జలాల ఒప్పందం రద్దు చేయలేదు. ఇంకా అమలులోనే ఉంది. కానీ తాత్కాలికంగా నిలిపివేశాం. సరిహద్దు గుండా నీళ్లు వెళ్లకుండా ఆపేందుకు తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి’ అని సీఆర్‌.పాటిల్‌ తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాల మేరకు హోం మంత్రి అమిత్‌ షా ఈ అంశాన్ని స్వయంగా పర్యవేక్షిస్తున్నారని వెల్లడించారు.

ఒప్పందం స్థితి ఏమిటి?
1960 సింధు జలాల ఒప్పందం ప్రస్తుతం హోల్డ్‌లో ఉంది. భారత్‌ ఈ ఒప్పందాన్ని పూర్తిగా రద్దు చేయకపోయినా, పాకిస్తాన్‌కు నీరు అందకుండా చేసేందుకు సాంకేతిక, ఇంజనీరింగ్‌ చర్యలు తీసుకోవడం ద్వారా ఒప్పంద స్ఫూర్తిని కార్యరూపంలోకి తీసుకురావాలని కేంద్రం భావిస్తోంది. ఇటీవలి సరిహద్దు ఉద్రిక్తతలు, ఉగ్రవాద సంఘటనల నేపథ్యంలో భారత్‌ సింధు జలాలను ఒక వ్యూహాత్మక ఆయుధంగా ఉపయోగించుకోవాలని నిర్ణయించింది. నీటిని భారత్‌ సొంత అవసరాల కోసం వినియోగించుకోవాలి అన్న ప్రధాని మోదీ స్పష్టమైన ఆదేశాలను అమలుకు చర్యలు చేపట్టారు.

ఆ రాష్ట్రాలకు అదనపు నీరు..
సింధూ జలాలను కేంద్రం పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఢిల్లీ వంటి రాష్ట్రాలకు మళ్లించాలని భావిస్తోంది. దీంతో ఆ రాష్ట్రాలకు అదనపు నీటి వనరులు లభించే అవకాశం ఉంది. శత్రు దేశానికి నీటిని వెళ్లకుండా చేయడమే లక్ష్యంగా ఇప్పటికే సింధూ, దాని ఉప నదులపై బ్యారేజీలు నిర్మిస్తోంది. అధిక వర్షాలు ఉంటే గేట్లు ఎత్తి పాకిస్తాన్‌లో ఆకస్మిక వరదలు సృష్టిస్తోంది.

భారత్‌–పాకిస్థాన్‌ మధ్య నీటి వివాదంలో కొత్త అధ్యాయం మొదలైంది. ఒప్పందం నిలిపివేతను ఆచరణాత్మకంగా అమలు చేయడం ద్వారా భారత్‌ తన నీటి సార్వభౌమత్వాన్ని బలపరచుకోవాలని చూస్తోంది. ఈ అంశం రాబోయే రోజుల్లో ద్విపాక్షిక సంబంధాలపై ఎంత ప్రభావం చూపించనుందనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

కెట్ మక్కా కాదు.. చెత్త గ్రౌండు అని ఐసిసి తొక్కలా తీసి పడేసింది

Lord's Ground Controversy (1)
Lord's Ground Controversy (1)

Lord’s Ground Controversy: గత ఏడాది ఇంగ్లాండ్ జట్టుతో టీమ్ ఇండియా టెస్ట్ సిరీస్ ఆడుతోంది. ఆ సమయంలో సోషల్ మీడియాలో ఇండియన్ గ్రౌండ్ల మీద విపరీతంగా ట్రోలింగ్ జరిగింది. ముఖ్యంగా లార్డ్స్ మైదానాన్ని ఇండియన్ మైదానాలతో పోల్చి చూపుతూ రకరకాల విమర్శలు చేశారు. లార్డ్స్ మై దానం చాలా అందంగా ఉందని.. ఇండియన్ మైదానాలు పాన్ పరాగ్ ప్రకటనలకు అనుకూలంగా ఉంటాయని సోషల్ మీడియాలో కొంతమంది ప్రచారం చేయడం మొదలుపెట్టారు. దీంతో అందరూ కూడా ఇండియన్ క్రికెట్ మేనేజ్మెంట్ పై విమర్శలు చేశారు.

కాలం వేగంగా జరిగింది. ఏడాది గడిచే లోపే లార్డ్స్ మైదానం చెత్త జాబితాలోకి వెళ్లిపోయింది. ఈ మైదానం నిర్వహణ సరిగా లేదని.. అత్యంత చెత్తగా ఉందని ఐసిసి ఆరోపించింది. 200 సంవత్సరాల చరిత్ర ఈ గ్రౌండ్ కు ఉంది. అయితే ఈ గ్రౌండ్ నిర్వహణ దారుణంగా ఉండడంతో ఐసీసీ డి మెరిట్ పాయింట్ విధించింది. గతవారం న్యూజిలాండ్, ఇంగ్లాండ్ జట్ల మధ్య ఇక్కడ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ నేపథ్యంలో గ్రౌండ్ క్వాలిటీ ఏమాత్రం బాగోలేదని ఐసిసి ఆగ్రహం వ్యక్తం చేసింది. రెండు రోజులైనా సరే బంతి బౌన్స్ తగ్గలేదని ఐసిసి నిపుణులు తమ పరిశీలన ద్వారా తెలుసుకున్నారు.

వాస్తవానికి ఒక మైదానం సరిగా లేకపోతే మెరిట్ పాయింట్ ఇస్తారు. మైదానం అత్యంత చెత్తగా ఉంటేనే రెండు డి మెరిట్ పాయింట్ లు ఇస్తారు. అంతకంటే దారుణంగా ఉంటే మూడు ఇస్తారు. ఇలా ఆరు డీ మెరిట్ పాయింట్ల గనుక ఇస్తే ఆ గ్రౌండ్ ఏడాది పాటు మ్యాచ్ లు నిర్వహించేందుకు ఐసీసీ ఒప్పుకోదు. లార్డ్స్ లాంటి మైదానానికి ఈ దుస్థితి రావడం నిజంగా ఆందోళన కలిగిస్తుంది. ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ఇంత దారుణంగా మైదానం నిర్వహించడం పట్ల అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

వాస్తవానికి లార్డ్స్ మైదానం విశాలంగా ఉంటుంది. అక్కడ అత్యంత అద్భుతంగా సౌకర్యాలు ఉంటాయి. క్రికెట్ చూసే అభిమానులు అక్కడ వాతావరణాన్ని నిత్యం ఆస్వాదిస్తూ ఉంటారు. అయితే ఈ మైదానం ఈ స్థాయిలో ఉండటం పట్ల అభిమానులు కూడా నిర్వేదం వ్యక్తం చేస్తున్నారు. ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు పెద్దలు పాఠాలు నేర్చుకోవాలని సూచిస్తున్నారు. ఇప్పటికైనా ఇండియన్ మైదానాల మీద ఏడ్చి చచ్చే ఇంగ్లాండ్ అభిమానులు.. ఇకపై తమ లార్డ్స్ మైదానం గురించి చూసుకోవాలని భారత క్రికెట్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు.

తెలంగాణలో ఒంటరి పోటీ.. బీజేపీ సంచలనం.. తెరవెనుక ప్లాన్‌ఏంటి?

Amit Shah
Amit Shah

Amit Shah Telangana: దేశ రాజకీయాల్లో తిరుగులేని శక్తిగా ఎదిగిన బీజేపీ.. ఉత్తర భారత దేశంలో ఢిల్లీ మినహా మిగతా అన్ని రాష్ట్రాల్లో పట్టు సాధించింది. ఈశాన్య రాష్ట్రాల్లో హిమాచల్‌ ప్రదేశ్‌ ఒక్కటే కాంగ్రెస్‌ చేతిలో ఉంది. తాజాగా బెంగాల్‌లోనూ బీజేపీ పాగా వేసింది. ఇక ఇప్పుడు బీజేపీ దక్షిణాదిపై ఫోకస్‌ పెట్టింది. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న కర్నాటక, తెలంగాణలో గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో 2028లో జరిగే ఎన్నికలకు ఇప్పటి నుంచే సిద్ధమవుతోంది. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా తెలంగాణ రాజకీయాలపై స్పష్టమైన సంకేతం ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోకుండా బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. ఇకపై ఏ రాష్ట్రంలోనైనా ఒంటరిగా పోటీ చేసి అధికారంలోకి రావాలన్నదే లక్ష్యమని స్పష్టం చేశారు.

తెలంగాణ, పంజాబ్‌పై ప్రత్యేక వ్యూహం.
తెలంగాణ, పంజాబ్‌లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటిగా పోటీ చేసేందుకు ఇప్పటి నుంచే బీజేపీ వ్యూహం రూపొందిస్తోంది. దక్షిణాది రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టామని అమిత్‌షా తెలిపారు. ఈ వ్యాఖ్యలు బీజేపీ రాజకీయ వ్యూహంలో ముఖ్యమైన మలుపును సూచిస్తున్నాయి. గతంలో ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో పొత్తుల ద్వారా అడుగుపెట్టిన బీజేపీ, ఇప్పుడు ఒంటరి బలంపై మరింత విశ్వాసం పెంచుకుంది. ఇది పార్టీ తన సొంత ఆధారాలను విస్తరించాలని, స్వతంత్రంగా అధికారం సాధించాలని భావిస్తోందని తెలియజేస్తోంది.

తెలంగాణలో బలహీనంగానే..
తెలంగాణలో ప్రస్తుతం కాంగ్రెస్‌ అధికారంలో ఉండగా, బీఆర్‌ఎస్, ఏఐఎంఐఎం వంటి ప్రాంతీయ పార్టీలు కూడా బలంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ పొత్తులు తిరస్కరించడం రాష్ట్ర రాజకీయాలను మరింత ఆసక్తికరంగా మార్చనుంది. యూనిఫామ్‌ సివిల్‌ కోడ్‌పై కీలక ప్రకటనఅమిత్‌ షా మరో ముఖ్యమైన విషయం చెప్పారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో యూనిఫామ్‌ సివిల్‌ కోడ్‌ అమలు చేస్తామని. ఇది బీజేపీ ముఖ్య సిద్ధాంతాల్లో ఒకటైన యూనిఫామ్‌ సివిల్‌ కోడ్‌ను దక్షిణాది రాష్ట్రాలకు కూడా విస్తరించాలన్న ఆలోచనలో ఉంది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో అమలు చేయడం ద్వారా పార్టీ తన విజన్‌ను స్పష్టం చేస్తోంది.

తెలంగాణలో పట్టు చిక్కేనా?
ఒంటరి పోటీ ప్రకటన తెలంగాణ రాజకీయ దృక్పథాన్ని మార్చేస్తుందని విశ్లేషకులు అంటున్నారు. పొత్తు ఆశల్లో ఉన్న చిన్న పార్టీలకు ఇది ఎదురుదెబ్బ కావచ్చు. బీజేపీ తన సొంత ఓటు బ్యాంకును విస్తరించి, స్వతంత్ర శక్తిగా ఎదగాలని ప్రయత్నిస్తోంది. దక్షిణాది రాష్ట్రాల్లో బలం పెంచుకోవాలన్న బీజేపీ లక్ష్యం స్పష్టమవుతోంది. ఇది దీర్ఘకాలిక వ్యూహం కావచ్చు. పంజాబ్‌తోపాటు తెలంగాణను కూడా ఒంటరి పోటీ మోడల్‌గా తీసుకురావడం ద్వారా బీజేపీ దేశవ్యాప్తంగా తన సానుకూలతను మరింత బలోపేతం చేసుకోవాలని చూస్తోంది.

అమిత్‌ షా వ్యాఖ్యలు కేవలం తెలంగాణకు మాత్రమే కాకుండా, బీజేపీ జాతీయ స్థాయి రాజకీయ వ్యూహంలోని ముఖ్యమైన మార్పును తెలియజేస్తున్నాయి. పొత్తులపై ఆధారపడకుండా సొంత బలంతో అధికారం సాధించాలన్న లక్ష్యం దక్షిణ భారతదేశంలో పార్టీ విస్తరణకు కీలకమవుతుంది. రాబోయే రోజుల్లో తెలంగాణ రాజకీయాలు మరింత ఉత్కంఠభరితంగా మారనున్నాయి.

జగన్ కొత్త కోర్ టీం.. వారంతా ఔట్!

YS Jaganmohan Reddy
YS Jaganmohan Reddy

YS Jagan Mohan Reddy: జగన్మోహన్ రెడ్డికి ఒక కోర్ టీం ఉంది. చాలా దగ్గరగా మెలిగే ఒక బృందం ఉంది. ఆయన చుట్టూ ఒక రక్షణ కవచంలా ఉంటుంది. ఆయన రాజకీయాల్లో యాక్టివ్ అయిన తర్వాత… వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత.. అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఈ కోర్ కమిటీ లో కీలక వ్యక్తులు చేరుతూ వచ్చారు. నాగేశ్వర్ రెడ్డి వ్యక్తిగత సహాయకుడిగా ఉండేవారు. కృష్ణమోహన్ రెడ్డి ఓ ఎస్ డి గా వ్యవహరించేవారు. సీఎంగా మారిన తర్వాత ధనుంజయ రెడ్డి ఆయనకు వ్యక్తిగత కార్యదర్శిగా ఉండేవారు. సజ్జల రామకృష్ణారెడ్డి సలహాదారుడిగా మెలిగారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అయితే గట్టి మద్దతుదారుడిగా నిలిచారు. కానీ తాజాగా వీరందరినీ పక్కనపెట్టి కొత్త టీం ఏర్పాటు చేసుకునే పనిలో ఉన్నారట జగన్మోహన్ రెడ్డి. ఇటీవల జరిగిన పరిణామాలతో ఆయన కలత చెందారట. చుట్టూ వీరిని ఉంచుకొని రాజకీయాలు చేయలేనని భావించి.. కొత్త టీం ను రంగంలోకి దించేందుకు సిద్ధమయ్యారట.

* అనేక రకాల ఆరోపణలు..
2024 ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దారుణ పరాజయంతో జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న కోటరీ పై అనేక రకాల ఆరోపణలు వచ్చాయి. వారి తీరుతోనే పార్టీ నేతలకు అధినేతకు మధ్య గ్యాప్ వచ్చిందని విమర్శలు వచ్చాయి. అయితే వైసిపి అధికారంలో ఉన్నప్పుడే జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న కోర్ టీం పై అనేక రకాల ఫిర్యాదులు ఉన్నాయి. కానీ అధికారంలో ఉన్నప్పుడు ఇవి సహజం అని చాలా లైట్ తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి. అటు అధికారం కోల్పోయిన తర్వాత కూడా ఈ కోర్ టీం కూటమి ప్రభుత్వానికి టార్గెట్ అయింది. అయితే తనకు అండగా నిలిచినందునే ప్రభుత్వం టార్గెట్ చేసిందని భావించారు జగన్మోహన్ రెడ్డి. కానీ ఎప్పుడైతే మద్యం కుంభకోణంలో నమ్మలేని నిజాలు బయటపడ్డాయో అప్పటినుంచి ఆలోచనలో పడ్డారు.

* సాధారణం అనుకున్నారు..
సాధారణంగా అధికార పార్టీ అంటేనే అవినీతి అనేది ఉంటుంది. ఆ ఆరోపణలు కూడా వస్తుంటాయి. అదే మాదిరిగా తన చుట్టూ ఉన్న కోర్ టీం పై అవినీతి ఆరోపణలు వచ్చి ఉంటాయని జగన్మోహన్ రెడ్డి భావించారు. కానీ ఒక్కొక్కరి అక్రమ సంపాదనను ప్రత్యేక దర్యాప్తు బృందం బయటపెడుతోంది. మరోవైపు కేంద్ర సంస్థ ఈడీ సైతం వెల్లడిస్తోంది. తన వ్యక్తిగత సహాయకుడి వద్ద వందల కోట్ల రూపాయల ఆస్తులు బయటపడేసరికి జగన్ సైతం ఆశ్చర్యపోయారట. తాను ఎంతో నమ్మిన అధికారులుగా తన వద్ద పెట్టుకున్న వారు సైతం భారీగా పోగేసుకోవడాన్ని జగన్మోహన్ రెడ్డి గుర్తించారట. అయితే అత్యంత వీర విధేయుడుగా మెలిగిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అక్రమ సంపాదన చూసి ఆశ్చర్యపోయారట. సజ్జల రామకృష్ణారెడ్డి శిబిరం చేతికి మట్టి అంటకుండా చేసిన దోపిడీ గురించి తెలుసుకొని జగన్ బాధపడ్డారట. ఇంతకాలం ఇటువంటి వారిని చుట్టూ పెట్టుకున్నానా? అని బాధపడుతున్నారట. అందుకే కోర్ టీం మార్చాలన్న నిర్ణయానికి వచ్చారట.

* పాదయాత్ర నాటికి..
వచ్చే ఏడాది పాదయాత్రకు సిద్ధపడుతున్నారు జగన్మోహన్ రెడ్డి. ఆ సమయానికి తన చుట్టూ ఉన్న టీం ను మార్చే పనిలో ఉన్నారట. గతంలో విజయసాయిరెడ్డి ఉండేవారు. ఆయన సైతం బయటకు వెళ్లిపోయారు. అయితే ఇప్పుడు నమ్మకస్తులుగా భావించిన కోర్ టీం నట్టేట ముంచెయ్యడంతో జగన్ ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే జగన్ కొత్త టీం లో ఎవరు చేరుతారు అనేది ఇప్పుడు ప్రశ్నార్థకం. రకరకాల పేర్లు తెరపైకి వస్తున్నాయి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్ కోర్ టీంలో ఎవరు చేరుతారు? అనే సందేహాలు కూడా ఉన్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో.

పంజాబ్ జట్టు కెప్టెన్ గా హార్దిక్ పాండ్యా.. మరి అయ్యర్ పరిస్థితి ఏంటి..

Hardik Pandya
Hardik Pandya

Hardik Pandya: టీమ్ ఇండియా టి20 సారథిగా ఇటీవలే కదా అయ్యర్ కు ప్రమోషన్ లభించింది. అది జరిగి మూడు రోజులు కూడా కావడం లేదు. అంతలోనే అతడికి బ్యాడ్ న్యూస్.. నిజమే సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అలా ఉంది మరి. ఎందుకంటే ఐపీఎల్లో పంజాబ్ జట్టుకు సారధిగా వ్యవహరిస్తున్న అతడు.. తన స్థానాన్ని కోల్పోయే అవకాశం కల్పిస్తోంది. అతడు వేరే జట్టుకు ట్రేడ్ విధానంలో వెళ్లిపోయే అవకాశం ఉందని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

జాతీయ మీడియాలో ప్రసారమవుతున్న కథనాల ప్రకారం ముంబై జట్టు నుంచి హార్దిక్ పాండ్యా వెళ్లి పోతాడని తెలుస్తోంది. అతడు పంజాబ్ జట్టుకు ఒక మూడు సీజన్ల పాటు సారధిగా ఉంటాడని సమాచారం. ఇప్పటికే ప్రీతి జంట అతడికి బ్లాంక్ ఇచ్చిందని.. దానికి అతడు కూడా ఓకే చెప్పాడని తెలుస్తోంది. ఇటీవల టి20 జట్టులో హార్దిక్ పాండ్యా చోటు కోల్పోయాడు. అంతకుముందు ఐపీఎల్ లో ముంబై జట్టు సారధిగా అతడు అంతగా ఆకట్టుకోలేకపోయాడు. ముంబై మేనేజ్మెంట్ కూడా అతని మీద తీవ్రస్థాయిలో ఆగ్రహం గా ఉందని ప్రచారం జరుగుతుంది. అందువల్లే అతడిని పక్కనపెట్టాలని నిర్ణయించినట్టు సమాచారం.

ముంబై మేనేజ్మెంట్ అయ్యర్ మీద ఆసక్తిగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.. అయ్యర్, హార్దిక్ పాండ్యా, అర్ష్ దీప్ సింగ్, చాహల్ మధ్య ఒప్పందం జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. అయ్యర్ కూడా ముంబై జట్టుకు వెళ్లడానికి ఆసక్తిగా ఉన్నట్టు సమాచారం. అయ్యర్ ఢిల్లీ జట్టును ఒకసారి ఫైనల్ గా తీసుకెళ్లాడు. ఆ తర్వాత పంజాబ్ జట్టును ఫైనల్ గా తీసుకెళ్లాడు. అంతకుముందు కోల్కతాను విజేతగా చేశాడు. అతడికి ఐపీఎల్లో విజయవంతమైన చరిత్ర ఉంది. అందువల్లే ముంబై మేనేజ్మెంట్ అతని మీద ఆసక్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు హార్దిక్ ముంబై ఇండియన్స్ జట్టులోనే ఉండాలని నీతా అంబానీ పట్టుబడుతున్నట్టు సమాచారం. అయితే దీనిపై త్వరలోనే తుది నిర్ణయం వెలు వడుతుందని సమాచారం.

హార్థిక్ పాండ్యా గతంలో జీటీ నుంచి ట్రేడ్ విధానంలోనే ఎంఐ జట్టుకు వచ్చాడు. ముంబై జట్టుకు 2024 నుంచి నాయకత్వం వహించడం మొదలుపెట్టాడు. అతడి నాయకత్వంలో ముంబై జట్టు 2025లో నాలుగో స్థానంలోకి వెళ్ళింది. ఈ సీజన్లో.. 2024 సీజన్లో అంతగా ఆకట్టుకోలేదు. పైగా వ్యక్తిగతంగా హార్దిక్ ప్రదర్శన కూడా అంత బాగోలేదు.

పాకిస్తాన్ ముర్దాబాద్.. ప్రజల్లో ఎందుకు ఈ వ్యతిరేకత.. పిఓకే లో ఏం జరుగుతోంది..

PoK Protests
PoK Protests

PoK Protests: మామూలు హింస కాదు అది.. ఇంటర్నెట్ లేదు. సోషల్ మీడియా లేదు. బయటికి ప్రపంచంతో సంబంధం లేదు. మొత్తం పాకిస్తాన్ ఆర్మీ ఆ ప్రాంతంలో దిగింది. ప్రజలను బయటికి రాకుండా అడుగడుగునా ఆంక్షలు విధిస్తోంది. అయినప్పటికీ అక్కడి ప్రజలు ఆగడం లేదు. బయటికి వస్తున్నారు. ఆందోళన చేస్తున్నారు. తుపాకీ బుల్లెట్లు శరీరాన్ని దూసుకొని వెళ్తున్నప్పటికీ లెక్కచడం లేదు. పైగా పాకిస్తాన్ ముర్దాబాద్ అంటూ వారు నినాదాలు చేస్తున్నారు. ఇదంతా ఎందుకు జరుగుతోంది.. ఎందువల్ల అక్కడి ప్రజల్లో ఆగ్రహం ఈ స్థాయిలో వ్యక్తమవుతోంది..

పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో దాదాపు 45 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఇందులో దాదాపు 12 సీట్లను పాకిస్తాన్ తన గుప్పిట్లో పెట్టుకుంది. ఈ స్థానాలను పాకిస్థాన్లో స్థిరపడ్డ కాశ్మీరీ శరణార్థులకు కేటాయించాలని 1947 లోనే తీర్మానం చేశారు. కానీ ఆ తర్వాత పాకిస్తాన్ దీనికి చరమగీతం పాడింది. ఈ స్థానాలను తన గుప్పిట్లో పెట్టుకోవడానికి రావలపిండి, ఇస్లామాబాద్, కరాచీ ఇతర నగరాల్లో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించింది. అయితే అక్కడవారిని పాకిస్తాన్ రాజకీయ పార్టీలు ప్రభావితం చేయడం మొదలుపెట్టాయి.

దీనివల్ల పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో పాకిస్తాన్ ఆధిపత్యం పెరిగిపోయింది. 12 స్థానాలలో తనకు నచ్చిన వారిని నియమించుకోవడం మొదలుపెట్టింది. ప్రజాస్వామ్యం అనే విధానానికి చరమగీతం పాడింది. ఫలితంగా ఇక్కడ ప్రజలు చాలా సంవత్సరాలుగా ఆందోళన చేస్తున్నారు. తాజాగా పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు ఇక్కడ నిరసనలు చేపడుతున్నారు. ఇప్పటివరకు చాలామంది చనిపోయారు. అయినప్పటికీ భారతదేశంలో మాదిరిగానే ఇక్కడ కూడా ప్రజాస్వామ్య విధానంలో ఎన్నికలు నిర్వహించాలని ఇక్కడి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడి విలువైన వనరులు ఇతర ప్రాంతాలకు తరలించకూడదని స్పష్టం చేస్తున్నారు. మా ప్రాంతం.. మా వనరులు.. మాకు మాత్రమే సొంతం అన్నట్టుగా ఇక్కడి ప్రజలు నినాదాలు చేస్తున్నారు. దీంతో పాకిస్తాన్ ప్రభుత్వం వారి మీద ఉక్కు పాదం మోపుతోంది… మరోవైపు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో జాయింట్ అవామి యాక్షన్ కమిటీ పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు జరుపుతోంది.

ఈ ఆందోళనలు తీవ్రహింసాత్మకంగా మారిపోయాయి. పాకిస్తాన్ ఆర్మీ, ప్రజల మధ్య జరిగిన గొడవల్లో ఇప్పటివరకు 30 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందులో పిల్లలు, గర్భిణీలు కూడా ఉన్నారు. వారిపై పాకిస్థాన్ ఆర్మీ దారుణంగా కాల్పులు జరుపుతోంది. ఫైరింగ్ లో 19 చిన్నారులు.. ఏడుగురు గర్భిణులు చనిపోయారు అంటే అక్కడ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు పాకిస్థాన్ ఆర్మీ మారణకాండ పై విచారణకు ఇంటర్నేషనల్ కమ్యూనిటీ డిమాండ్ చేసింది.

చాటు పని కోసం మాటుగా.. చీకట్లో చితక్కొట్టుడుకు ఇంత ముఖం వాచి ఉన్నారా..

Dating App Fraud
Dating App Fraud

Secret Dating Apps: అసలు ఆ పని ఒక చండాలం. అత్యంత దారుణం.. పరమ నీచాతి నీచం. అటువంటి దానికోసం భారతీయులు ముఖం వాచిపోయి ఉన్నారు. అందువల్లే దిగజారి పోతున్నారు. కనీసం విలువలకు మంగళం పాడేస్తున్నారు. వలువలు ఎప్పుడు ఇప్పుదామంటూ కుతూహలంగా ఉన్నారు.

మన దేశంలో ఇటీవల కాలంలో సీక్రెట్ డేటింగ్ ట్రెండ్ అనేది పెరిగిపోయింది. ఇది ఎంతలా ఉందంటే రోజురోజుకు ఈ తరహా యాప్స్ లో చాలామంది ప్రవేశిస్తున్నారు. ఈ సంఖ్య దాదాపు 6 కోట్ల ఒక లక్ష వరకు చేరుకుంది. ఇంతమంది సబ్స్క్రైబర్లు ఉన్నారంటే ఆ యాప్స్ నిర్వాహకులు ఏ స్థాయిలో దందా సాగిస్తున్నారు అర్థం చేసుకోవచ్చు. గడచిన ఐదు సంవత్సరాల కాలంలో 4.5 కోట్ల మంది సబ్స్క్రైబర్లు ఉంటే.. గత ఏడాది 1.6 కోట్లమంది చేరడం ఆందోళన కలిగిస్తోంది.

ఇందులో చేరిన వారిలో బ్యాచిలర్లు ఎక్కువగా ఉంటున్నారు. అదే సమయంలో పెళ్లయిన వారు కూడా ఎక్కువగా ఉంటున్నారు. వివాహితులు కూడా ఎక్కువగా ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ఇందులో చేరిన వారు ఎక్కువగా వివాహేతర సంబంధాల వైపు ఆసక్తి చూపిస్తున్నారని నివేదికలు వెల్లడిస్తున్నాయి. యూజర్ల బలహీనతను యాప్ నిర్వాహకులు కూడా క్యాష్ చేసుకుంటున్నారని తెలుస్తోంది. వీటి ఆధారంగా కోట్ల వ్యాపారం జరుగుతోంది.

కొన్ని యాప్స్ నిర్వాహకులు ఏకంగా ప్రీమియం అవకాశాన్ని కూడా కల్పిస్తున్నాయి. నచ్చిన అబ్బాయిని లేదా అమ్మాయిని సెలెక్ట్ చేసుకుని మాట్లాడుకునే అవకాశం.. ఆ తర్వాత ఓయో రూములలో ఎంజాయ్ చేసే సౌలభ్యం కల్పిస్తున్నట్టు సమాచారం. అందువల్లే ఈ తరహా యాప్స్ వ్యాపారం మూడుపువ్వులు ఆరుకాయలుగా సాగుతోంది. మొదట్లో లక్షల కు మాత్రమే పరిమితమైన వీటి వ్యాపారం.. ఇప్పుడు కోట్లకు చేరుకుంది. ఈ తరహా యాప్స్ చాలావరకు మసాజ్ సెంటర్లు.. స్పా సెంటర్లతో లింక్ అయి ఉన్నాయని తెలుస్తోంది. దీనిని బట్టి చీకటి వ్యాపారానికి వెలుతురు కోణం ఇచ్చినట్టు అర్థమవుతుంది.

ఈ తరహా యాప్స్ ద్వారా వ్యవహారాలు సాగించడం ప్రమాదకరమని.. ఆ తర్వాత అనేక రకాల కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. సాధ్యమైనంత వరకు ఇటువంటి బంధాలకు దూరంగా ఉండాలని.. ఇటువంటి యాప్స్ వాడకూడదని అంటున్నారు. అయితే వీటిపై కూడా నిషేధం విధిస్తే చాలా వరకు యువత దారి తప్పకుండ ఉండాలని నిపుణులు అంటున్నారు.

మారిన 'తల్లికి వందనం' ముహూర్తం.. ఎప్పుడు పడుతాయంటే..

Talliki Vandanam
Talliki Vandanam

Talliki Vandanam Scheme: తల్లికి వందనం పథకం పై బిగ్ అప్డేట్ వచ్చింది. పథకం అమలు తేదీ పై ఒక క్లారిటీ వస్తోంది. అదే రోజున తల్లుల ఖాతాల్లో నిధులు జమ కానున్నాయి. విద్యా సంవత్సరం ప్రారంభం అవుతున్న దృష్ట్యా ప్రభుత్వం ఒక్కో నిర్ణయం తీసుకుంటోంది. ఈనెల 12న విద్యాసంస్థలు తెరుచుకోనున్న సంగతి తెలిసిందే. దాదాపు 50 రోజుల విరామం తర్వాత పాఠశాలలు తెరవనున్నాయి. అయితే ఈ నెల 12న పాఠశాలలు తెరిచిన రోజు తల్లికి వందనం నిధులు జమ అవుతాయని అంతా భావించారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి చూస్తుంటే మాత్రం ఈ ప్రక్రియ ఆలస్యమయ్యే అవకాశం ఉంది. మరోవైపు విద్యార్థులకు ఇచ్చే కిట్ల పంపిణీకి కూడా మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. అయితే పాఠశాలలు మాత్రం యధావిధిగా ఈ నెల 12న ప్రారంభం కానున్నాయి.

* ఎప్పటి నుంచో కసరత్తు…
తల్లికి వందనం పథకానికి సంబంధించి ఎప్పటినుంచో కసరత్తు ప్రారంభించింది ఏపీ ప్రభుత్వం. సచివాలయాల వారీగా సర్వే కూడా చేసింది. విద్యాశాఖకు వచ్చిన వివరాలను సచివాలయాల వారీగా సరిపోల్చుతూ ఈ సర్వే కొనసాగింది. హౌస్ మ్యాపింగ్ తో పాటు ఇతరత్రా వివరాలను అందులో సరిపోల్చారు. ఈ ప్రక్రియ జాప్యం జరగడంతో ఈ నెల 19న తల్లికి వందనం నిధులు జమ చేస్తారని అంతా భావించారు. మెగా పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ ఏర్పాటు చేసి అదే రోజు నిధులు జమకు ఆలోచన జరిగింది. అయితే ఇప్పుడు ఉన్నఫలంగా నిధుల జమ జూలై మొదటి వారంలో చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. గత ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభం రోజునే ఈ పథకం అమలు చేశారు. కానీ ఈ ఏడాది మాత్రం వచ్చే నెల మొదటి వారంలో అమలు చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

* పెరిగిన లబ్ధిదారులు..
రాష్ట్రవ్యాప్తంగా గత ఏడాది 67.27 లక్షల మందికి పథకం వర్తించగా… ఈ ఏడాది ఆ సంఖ్య 68 లక్షలు గా గుర్తించారు. ఒకటో తరగతి నుంచి ఇంటర్ విద్యార్థుల వరకు ఎంత మంది చదువుకుంటే అంత మందికి ఈ పథకం అమలు చేస్తున్నారు. గత ఏడాది మార్గదర్శకాలు, నిబంధనల ప్రకారమే ఈ ఏడాది కూడా పథకం అమలుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి నిధులు వేరువేరుగా అందజేయనుంది. ఈ పథకానికి గాను సుమారు తొమ్మిది వేల కోట్ల రూపాయలు అవసరం కానున్నాయి. విద్యా సంవత్సరం ప్రకారం ఈ నెల 12న పాఠశాలలు తెరుచుకోనున్నాయి. వేసవి ఉష్ణోగ్రతల దృష్ట్యా సెలవులు పొడిగిస్తారు అన్న ప్రచారం సాగింది. ఉపాధ్యాయ సంఘాలు కూడా విజ్ఞప్తి చేశాయి. కానీ ప్రభుత్వం మాత్రం 12నే బడులు తెరవాలని ఉత్తర్వులు జారీచేసింది. మరోవైపు యుద్ధం కారణంగా విద్యార్థి మిత్ర కిట్ల తయారీలో కొంత జాప్యం జరిగింది. ఆ ప్రభావం పంపిణీ పై పడింది.

పాక్, చైనా వెన్నులో వణుకు.. మోడీ చేసిన అద్భుతమిదీ

Zojila Tunnel
Zojila Tunnel

Zojila Tunnel: ఇది మోడీ చేసిన అద్భుతం. మంచుకొండల్లో మానవ మహా నిర్మితం. ఇంతవరకు ఏ పాలకులు ఆలోచించలేదు. కనీసం అలాంటి నిర్ణయం కూడా తీసుకోలేదు. నరేంద్ర మోడీ ఇదంతా గుర్తించి.. మంచుకొండల్లో సరికొత్త చరిత్రను సృష్టించారు. కొండలను తొలచి సరికొత్త సొరంగం నిర్మించారు. ఇది కాస్త చైనాలో.. పాకిస్థాన్ వెన్నులో వణుకు పుట్టిస్తోంది. ఇంతకీ నరేంద్ర మోడీ చేసిన ఆ అద్భుతం ఏంటంటే..

శ్రీనగర్ నుంచి లద్ధాక్ వరకు దాదాపు 441 కిలోమీటర్ల మేర జాతీయ రహదారి 1 నిర్మించారు. ఇక్కడ శ్రీనగర్ నుంచి లద్ధాక్ వరకు ప్రయాణం సాగించాలంటే 13 వేలకు పైగా అడుగుల ఎత్తులో ఉన్న హిమాలయ పర్వత శిఖరాలను అధిరోహిస్తూ వెళ్లాలి. అత్యంత శీతల వాతావరణం లో ప్రయాణం సాగించాలి. సుమారు 12 నుంచి 14 వరకు ఈ ప్రయాణం సాగుతూ ఉంటుంది. శీతకాలంలో అయితే ఆరు నెలల పాటు ఈ రోడ్డు మూసి ఉంటుంది.

ముఖ్యంగా సోనా మార్గ్ ప్రాంతంలోని బాల్తాల్ నుంచి కార్గిల్ జిల్లా మీనా మార్గ్.. మధ్యలో కేవలం 40 కిలోమీటర్లు మాత్రమే దూరం ఉంటుంది. కానీ మంచు వల్ల ఈ ప్రయాణానికి నాలుగు గంటల వరకు పడుతుంది. ఏడాదిలో సగం రోజుల వరకు ఈ రోడ్డు మూతపడుతుంది. దీనికి ప్రధాన కారణం మంచు. దీనివల్ల పాకిస్తాన్, చైనాతో కూడా ఇబ్బంది ఏర్పడుతోంది. యుద్ధాలు.. భారత సైన్యం సక్రమంగా వ్యవహారాలు సాగించడానికి వీలు లేకుండా పోవడం వల్ల అనేక రకాల కార్యకలాపాలు ఆగిపోతుంటాయి.

ఈ పరిస్థితిని గమనించిన నరేంద్ర మోడీ ఈ ప్రాంతంలో ఒక సొరంగాన్ని నిర్మించాలని అనుకున్నారు. దానికి తగ్గట్టుగా 6, 808 కోట్ల రూపాయల కేటాయించారు. సుమారు 13.15 కిలోమీటర్ల మేర సొరంగాన్ని నిర్మించారు. దీనికి జోజిలా పాస్ అని నామకరణ చేశారు. ఇది కార్గిల్, జోజిలా, ద్రాస్ ప్రాంతాలకు ఏడాది పాటు రాకపోకలు సాగేలా చేస్తుంది. 2020 అక్టోబర్ 1న ఫస్ట్ స్టేజి పనులు ప్రారంభమయ్యాయి. ఇంకా ఇందులో అంతర్గతంగా రోడ్లు నిర్మించాలి. సైడ్ డ్రైనేజీలు నిర్మించాలి. నిఘా కెెమెరాలు.. మరో ఏడాదిలో ఈ పూర్తవుతాయి.

బాల్తాల్ పశ్చిమ పోర్టల్ నుంచి ద్రాస్, కార్గిల్ ప్రాంతంలో మీనా మార్గం తూర్పు పోర్టల్ వరకు ఈ టన్నెల్ విస్తరించి ఉంది.. ఈ ప్రాంతాలతో పాటు శ్రీనగర్, లద్ధాక్ ప్రాంతాలకు ఏడాదిపాటు ప్రయాణం సాగించవచ్చు. సముద్రమట్టానికి దాదాపు 11,578 అడుగుల ఎత్తులో దీనిని నిర్మించారు.. ఇది ఆసియా ఖండంలోనే అతి ఎత్తైన బై డైరెక్షనల్ సొరంగం. ఇది గనుక అందుబాటులోకి వస్తే బాల్తాల్ నుంచి మీనా మార్క్ ప్రాంతానికి 27 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. ప్రయాణ సమయం అయితే నాలుగు గంటల నుంచి 20 నిమిషాలకు తగ్గిపోతుంది. చైనా, పాకిస్తాన్ సరిహద్దుల్లో డిఫెన్స్ ఆపరేషన్లు చేపట్టడానికి భారత సైన్యానికి ఈ మార్గం అత్యంత అనుకూలంగా ఉంటుంది.

15 ఏళ్ల కొడుకు మొబైల్ కు బానిసయ్యాడు.. పోలీసులకు ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు.. తర్వాత ఏమైందంటే..

Mobile Addiction In Teenagers
Mobile Addiction In Teenagers

Mobile Addiction In Teenagers: నేటి కాలంలో చరవాణి అనేది వ్యసనం లాగా మారిపోయింది. మొబైల్ లేకుండా పూట కూడా గడిచే పరిస్థితి లేకుండా పోయింది. రాత్రి కూడా మొబైల్ పక్కన పెట్టుకొని పడుకునే వాళ్ళు చాలామంది. అర్ధరాత్రి దాకా మొబైల్ చూస్తూ.. ఎప్పుడో తెల్లవారుజామున కునుకు తీసేవారు చాలామంది ఉన్నారు. మొబైల్ వ్యసనాన్ని తట్టుకోలేక.. మొబైల్ వాడకాన్ని మానుకోలేక చాలామంది అదే లోకంగా బతుకుతున్నారు.

మొబైల్ ద్వారా మాటలు మాత్రమే కాదు ప్రతి ఒక్క పని జరుగుతున్న నేపథ్యంలో చాలామంది అదే లోకంగా బతుకుతున్నారు. చిన్నపిల్లల నుంచి మొదలుపెడితే పెద్దవాళ్ల వరకు మొబైల్ లోనే జీవితాన్ని గడిపేస్తున్నారు. పక్క వాళ్ళతో కనీసం మాట కూడా మాట్లాడలేదు. ఎదుటివాళ్ళు కనపడినా సరే పలకరించడం లేదు. మొబైల్ లోనే చూస్తూ.. మొబైలే లోకంగా వివరిస్తూ బతికిస్తున్నారు. స్క్రీన్ టైమ్ పెరిగిపోయి చాలామంది దృష్టిలోపాలతో బాధపడుతున్నారు. ఫలితంగా నేత్ర సంబంధిత వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారు. ఇటీవల కాలంలో ఈ తరహా వ్యాధులకు గురయ్యేవారు పెరిగిపోతున్నారు.

ముఖ్యంగా పిల్లలకు ఫోన్ అనేది వ్యసనంగా మారిపోయింది. కోవిడ్ లో ఆన్లైన్ క్లాసులు నిర్వహించడం వల్ల తల్లిదండ్రులు కూడా పిల్లలకు ఫోన్లు కొనియాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆ ఫోన్లే లోకంగా పిల్లలు బతికేస్తున్నారు. సోషల్ మీడియా చూడటం.. ఇంకా ఇతర వ్యవహారాలకు పాల్పడటంతో పిల్లలు ఫోన్లకు బానిసలు అయిపోయారు. కనీసం తల్లిదండ్రులతో కూడా మాట్లాడటం లేదు. ఫోన్ లోనే విహరిస్తూ.. అదే లోకంగా విహరిస్తున్నారు. రాత్రి మొత్తం మొబైల్లో ఆన్లైన్ గేమ్స్ ఆడుతున్నారు. సోషల్ మీడియా చూస్తున్నారు. పగటి సమయంలో నిద్ర పోతున్నారు. పిల్లలు ఏకాంతంగా గడపడం.. ఎవరితోనూ మాట్లాడకపోవడం వల్ల వారిలో భావోద్వేగాలు నియంత్రించుకోలేని స్థాయికి దిగజారి పోతున్నాయి.

రాత్రి మొత్తం మొబైల్లో ఆన్లైన్ గేమ్స్ ఆడటం.. సోషల్ మీడియా చూడటం.. పగలు మొత్తం నిద్రపోవడం.. ఇవి అలవాటుగా మార్చుకున్నాడు ఒక 15 సంవత్సరాల బాలుడు. ఇది తప్పని తల్లిదండ్రులు చెబితే.. వారిని దూషిస్తున్నాడు. చివరికి దాడి చేసే స్థాయికి అతడి మొబైల్ వ్యసనం దిగజారిపోయింది. ఈ సంఘటన ఏలూరులో జరిగింది. తట్టుకోలేక తల్లిదండ్రులు భయపడ్డారు. తల్లి ధైర్యం చేసి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు ముందుగా అతడికి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఆ తర్వాత ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి డి అడిక్షన్ సెంటర్లో చేర్పించారు.

సూర్యతో ముంబై ఇండియన్స్ చర్చలు.. ఎగ్జిట్ వేళ కీలక పరిణామం.. ఏం జరిగిందంటే?

Suryakumar Yadav
Suryakumar Yadav

Suryakumar Yadav: టీమిండియా టీ20 జట్టు మాజీ కెప్టెన్‌ సూర్యకుమరా యాదవ్‌పై సోషల్‌ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇటీవలే బీసీసీఐ ఆయనను కెప్టెన్సీతోపాటు జట్టు నుంచి కూడా తప్పించింది. ఐపీఎల్‌లో సూర్యకుమార్‌ ఆటతీరుపై అసంతృప్తి, ముంబై ఇండియన్స్‌ జట్టును నడిపించడంలోనూ విఫలమైన తీరు ఆధారంగా బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో సూర్యకుమార్‌ యాదవ్‌(ఎస్‌కేవై) భవిష్యత్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. ఇదే క్రమంలో స్కై ముంబై జట్టు నుంచి కూడా తప్పుకుంటారన్న వార్తలు వస్తున్నాయి. అయితే ముంబై ఇండియన్స్‌ మేనేజ్‌మెంట్, సూర్కకుమార్‌ యదావ్‌ మధ్య జరిగిన 3 గంటల సుదీర్ఘ సమావేశం ఐపీఎల్‌లో ప్రస్తుతం హాట్‌ టాపిక్‌గా మారింది.

ముంబై జట్టును అన్‌ఫాలో..
కొన్ని రోజులుగా సూర్య తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఎంఐ సంబంధిత పోస్టులు తీసివేయడం, ఫ్రాంచైజీని అన్‌ఫాలో చేయడం వంటి చర్యలతో ట్రాన్స్‌ఫర్, ఎగ్జిట్‌ రూమర్లు జోరుగా వ్యాపించాయి. అయితే ఈ 3 గంటల మీటింగ్‌లో ఫ్రాంచైజీ యాజమాన్యం సూర్యను ఒప్పించడంలో విజయం సాధించింది.

మీటింగ్‌లో చర్చింని అంశాలు..
సమావేశంలో ముఖ్యంగా మూడు కీలక అంశాలపై విస్తృత చర్చ జరిగింది. సూర్యకుమార్‌ దీర్ఘకాలిక రోల్, రాబోయే సీజన్లలో అతనికి ఏ స్థానం ఇవ్వాలి? జట్టు లీడర్‌షిప్‌ గ్రూప్‌లో అతని భవిష్యత్‌ పాత్ర
ఫ్రాంచైజీ భవిష్యత్‌ ప్రణాళికలు, ఐపీఎల్‌ 2027 – ఐ్కఔ 2027 మెగా ఆక్షన్‌ ముందు జట్టు వ్యూహంపై ప్రధానంగా చర్చించారు. ఫ్రాంచైజీ యాజమాన్యం సూర్యకు స్పష్టమైన హామీలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇది కేవలం ఒక సీజన్‌ కాంట్రాక్టు కంటే మించి, దీర్ఘకాలిక అనుబంధానికి సంకేతాలు ఇచ్చింది.

రూమర్లకు కారణం ఏంటి?
ఈ సంవత్సరం ఐపీఎల్‌ 2026లో సూర్య ఆటతీరు అందరినీ నిరాశపర్చింది. ఫ్యాన్స్, విశ్లేషకుల్లో అనుమానాలు రేకెత్తించింది. అంతేకాకుండా ఇటీవల భారత టీ20 కెప్టెన్‌ పదవి కోల్పోవడం
జాతీయ జట్టు నుంచి డ్రాప్‌ కావడం ఇన్‌స్టాగ్రామ్‌లో ఎంఐ సంబంధిత కంటెంట్‌ తొలగించడం పుకార్లకు కారణమైంది. సూర్య ఎంఐని వదిలేస్తాడు అనే రూమర్లకు బలం చేకూర్చాయి. కొన్ని మీడియా రిపోర్టులు కూడా అతనిని కేకేఆర్, పంజాబ్‌ లాంటి జట్లతో లింక్‌ చేశాయి.

ఎంఐకి కీలక ఆటగాడు..
సూర్య 2018 నుంచి ముంబై ఇండియన్స్‌తో కొనసాగుతున్నాడు. 360 డిగ్రీ బ్యాటింగ్‌ స్టైల్‌తో ప్రపంచ గుర్తింపు సాధించాడు టీ20 వరల్డ్‌ కప్‌ విన్నింగ్‌ కెప్టెన్‌గా రికార్డు సృష్టించాడు. మిడిల్‌ ఓవర్లలో అత్యంత ప్రముఖ ఫినిషర్‌లలో ఒకరు. జట్టుకు కేవలం బ్యాటింగ్‌ బలం మాత్రమే కాదు యువ ఆటగాళ్లకు మార్గదర్శకుడు, ఫీల్డింగ్‌ స్టాండర్డ్‌ను ఎత్తైన స్థాయిలో ఉంచేవాడు. అందుకే తాజా సమావేశం ఫలితంగా సూర్య ముంబైతోనే కొనసాగడం ఫ్రాంచైజీకి పెద్ద ఊరట.

3 గంటల మీటింగ్‌ కేవలం ఒక ఆటగాడిని నిలుపుకోవడం కాదు … ఇది ముంబై ఇండియన్స్‌ భవిష్యత్‌ను స్థిరపరచే కీలక నిర్ణయం. సూర్యకుమార్‌ యాదవ్‌ నీలం–గోల్డ్‌ జెర్సీలోనే తన మ్యాజిక్‌ చూపించడం క్రికెట్‌ ప్రేమికులందరికీ సంతోషకరమైన వార్త. ఇక రూమర్లు ముగిసాయి. ఇకపై ఆట మాత్రమే మాట్లాడాల్సిన సమయం ఇది!

తాగుడు, వాగుడు.. క్రికెటర్ ను తన్ని తరిమేస్తారని తెలిసి రిటైర్మెంట్ ప్రకటించాడు

Ben Stokes Retirement
Ben Stokes Retirement

Ben Stokes Retirement: క్రికెట్ అనేది జెంటిల్మెన్ గేమ్. ఇందులో ఆడే ఆటగాళ్లు జెంటిల్మెన్ మాదిరిగానే ఉండాలి. చిల్లర విహారాలు వేస్తే ఆటకున్న విలువ పోతుంది. అటువంటి ఆటగాళ్లు ఉండకూడదు. క్రికెట్ ఆడకూడదు. ఇప్పుడు వరకు ప్రపంచ క్రికెట్లోకి చాలామంది ఆటగాళ్లు వచ్చారు… ఆ ఆటకు విలువ తీసుకొచ్చారు. కానీ కొంతమంది మాత్రం దారుణంగా ప్రవర్తించారు. వీధి రౌడీల కంటే హీనంగా వ్యవహరించారు. అటువంటివారు కెరియర్ మధ్యలోనే వెళ్లిపోయారు. కొందరైతే అనామకంగా క్రికెట్ కు గుడ్ బై చెప్పేసారు. అందులో ఇతడికి మొదటి స్థానం ఉంటుందేమో.

క్రికెట్ పుట్టింది ఇంగ్లాండ్లో. అటువంటి ఇంగ్లాండు జట్టుకు చెందిన బెన్ స్టోక్స్ దాదాపు రిటైర్మెంట్ ప్రకటించినట్టే. ఇంగ్లాండ్ జట్టు సారధిగా ఇతడు ఎన్నో వివాదాలకు కారణమయ్యాడు. తాగడం.. వాగడం వంటివి ఇతడికి పరిపాటి. క్లబ్లో దూరడం.. పనికిమాలిన పనులు చేయడం.. గొడవలకు దిగడం వంటివి ఇతడికి అలవాటు. అనేక సందర్భాలలో ఇతడు అలా చేసినప్పటికీ మేనేజ్మెంట్ మాటలతోనే సరిపుచ్చింది. ఇప్పుడు ఆ మాటలు కూడా సరిపోవడం లేదు. ఎందుకంటే ఇతడికి తాగడం అలవాటుగా మారింది. తాగిన మైకంలో గొడవలకు దిగడం పరిపాటిగా మారింది. దీంతో ఇంగ్లాండ్ క్రికెట్ పరువు పోతోంది. ఈ నేపథ్యంలో మేనేజ్మెంట్ ఇతడిని తన్ని తరిమియడానికి సిద్ధమైంది. కాకపోతే ఆ అవకాశం ఇవ్వకుండా ఇతడే రిటైర్మెంట్ ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది.

న్యూజిలాండ్ జట్టు తో జరిగిన టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లాండ్ గెలిచింది. ఈ విజయాన్ని పురస్కరించుకొని ఒక క్లబ్లో ఇంగ్లాండ్ కెప్టెన్ విపరీతంగా తాగాడు. తాగిన మైకంలో గొడవకు దిగాడు. ఇది వెస్ట్రన్ మీడియాలో ప్రముఖంగా ప్రసారమైంది. ఇది ఒక రకంగా ఇంగ్లాండ్ క్రికెట్ మేనేజ్మెంట్ తల వంపులకు కారణమైంది. అందువల్లే స్టోక్స్ టెస్ట్ క్రికెట్ కు వీడ్కోలు పలకబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే అతడు వన్డే ఫార్మాట్.. టి 20 ఫార్మాట్ నుంచి తప్పుకున్నాడు.

ఇటీవల ఆస్ట్రేలియా జట్టుతో యాషెస్ సిరీస్ లో ఇంగ్లాండ్ ఆడింది. అంత గొప్పగా ప్రదర్శన చేయలేకపోయింది. ఫలితంగా ఆస్ట్రేలియా విజేతగా నిలిచింది. ఒక మ్యాచ్లో గెలిచిన తర్వాత ఇంగ్లాండ్ జట్టు ఒక క్లబ్ లోకి వెళ్ళింది. అక్కడ స్టోక్స్ పీకల దాకా మద్యం తాగి రచ్చ రచ్చ చేశాడు. ఈ వ్యవహారం మొత్తం మీడియాలో ప్రసారమైంది. అప్పుడే ఇతడి మీద ఇంగ్లాండ్ మేనేజ్మెంట్ వేటు వేస్తుందని ప్రచారం జరిగింది. తర్వాత ఏమైందో తెలియదు గానీ.. మేనేజ్మెంట్ చర్యలు తీసుకునే విషయంలో వెనుకడుగు వేసింది. దానిని ఆసరాగా తీసుకున్న స్టోక్స్ మరింత రెచ్చిపోవడం మొదలుపెట్టాడు. చివరికి మేనేజ్మెంట్ కన్నెర్ర చేయడంతో రిటైర్మెంట్ తీసుకునే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.

పాక్ ఆక్రమిత కాశ్మీరులో అంతర్యుద్ధ పరిస్థితులు

PoK protests

PoK protests : పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ అట్టుడికి పోతోంది. అంత్యరుద్ధం రీతీలో అక్కడి పరిస్థితులు అదుపుతప్పాయి. ఏదైతే కశ్మీరీలు మేము మతం పరంగా పాక్ లో చేరాలని చూశారా వాళ్లకు ఇది పెద్ద గుణపాఠం.. నిన్న ముజఫరాబాద్ లో ఆస్పత్రి దగ్గర నిరసనలు చేపట్టిన ఒక వ్యక్తిని చంపేస్తే
ఆయన అంతిమ యాత్ర జరిగే సమయంలో మళ్లీ సైన్యం జోక్యం చేసుకొని మరో 30 మంది ని చంపేశారని సమాచారం. పోలీసులు, సెక్యూరిటీ వాళ్లు ఏడుగురిని నిరసనకారులు చంపేశారట.. చనిపోయిన వారు , 450 మందిని నిర్బంధించారని సమాచారం.

పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని గిల్గిట్ బాల్టిస్తాన్ లో సపరేట్ ప్రభుత్వం ఉంటుంది. ముజఫరా ఒప్పందాన్ని అమలు చేయాలని జాక్ అనే కమిటీ నిరసనకారులు కోరుతున్నారు. 2025న చేసుకున్న ఒప్పందంలో కరెంట్ చార్జీలు తగ్గించాలి. మొత్తం పాకిస్తాన్ కు కరెంట్ మేమే సరఫరా చేస్తున్నా మాకు కరెంట్ ఇవ్వడం లేదని ఆరోపిస్తున్నారు. సబ్సిడీ ధరకు గోధుమలు ఇవ్వాలి. మా దగ్గర నుంచే హైడ్రో ఎలక్ట్రిక్ ప్లాంట్ల నుంచి కరెంట్ పోతున్నది మాకు రాయల్టీ చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు.

పీఓకే అసెంబ్లీలో మొత్తం 45 స్థానాలకు ప్రత్యక్ష ఎన్నికలు జరుగుతాయి. అయితే ఇందులో ఒక విచిత్రమైన, వివాదాస్పదమైన నిబంధన ఉంది. మొత్తం స్థానాల్లో 12 సీట్లను 1947 దేశ విభజన సమయంలో పాకిస్థాన్‌లోని వివిధ ప్రాంతాలకు వలస వెళ్ళి అక్కడే స్థిరపడిన కశ్మీరీ శరణార్థుల కోసం కేటాయించారు. ప్రస్తుతం ఈ శరణార్థులు పీఓకేలో కాకుండా పాకిస్థాన్‌లోని కరాచీ, ఇస్లామాబాద్, రావల్పిండి, లాహోర్ వంటి ప్రధాన నగరాల్లో నివసిస్తున్నారు. వారు తాము నివసిస్తున్న నగరాల నుంచే ఓటు హక్కును వినియోగించుకుంటూ పీఓకే అసెంబ్లీకి ప్రతినిధులను ఎన్నుకుంటున్నారు. ఇదే ఇప్పుడు స్థానిక ప్రజల ఆగ్రహానికి కారణమైంది. మొత్తం ఇవీ పీవోకేను అగ్నిగుండంగా మరిచి నిరసనలకు కారణమైంది.

పాక్ ఆక్రమిత కాశ్మీరులో అంతర్యుద్ధ పరిస్థితులు.. దీనిపై ‘రామ్’గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.