Home Blog Page 155

కెసిఆర్ బస్సు మీద.. కేటీఆర్ రోడ్డు మీద.. చివరికి గులాబీ పార్టీ పరిస్థితి ఇలా మారింది

KCR and KTR
KCR and KTR

KCR and KTR: సరిగ్గా మూడు సంవత్సరాల క్రితం తెలంగాణ రాష్ట్ర సమితి కాస్త భారత రాష్ట్ర సమితిగా మారిపోయింది. జాతీయ పార్టీగా ఎదిగేందుకు కలలు కన్నది. ఆంధ్ర ప్రదేశ్లో శాఖను కూడా ఏర్పాటు చేసింది. తోట చంద్రశేఖర్ ను అధ్యక్షుడిని చేసింది. ఏపీలో కార్యాలయం కూడా ప్రారంభించింది. అంతేకాదు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కొనుగోలు చేయడానికి కూడా సింగరేణి ముందు వరుసలో నిలిపింది. ఇలా ఎన్నో చేసింది. కానీ సొంత రాష్ట్రంలోని గెలవలేకపోయింది. అంతేకాదు.. తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు పంజాబ్, బీహార్, ఢిల్లీ వంటి రాష్ట్రాలలో కేసీఆర్ పర్యటించారు. అక్కడి రైతులకు చెక్కులు కూడా ఇచ్చారు. ఇలా ఎన్నో రకాలుగా జాతీయ వాదాన్ని ఆయన వినిపించారు.

చివరికి కెసిఆర్ భారత రాష్ట్ర సమితి భారతదేశంలో అధికారంలోకి రాలేకపోయింది. సొంత రాష్ట్రమైన తెలంగాణలో పట్టు నిలుపుకోలేకపోయింది. అంతేకాదు పార్లమెంటు ఎన్నికల్లో సున్నా స్థానాలకు పరిమితం అయిపోయింది. రాజకీయంగా తీవ్రమైన ఒడిదుడులను ఎదుర్కొంటున్నది. మరోవైపు పార్టీ నుంచి కవిత వెళ్లిపోయింది. గులాబి పార్టీకి బలంగా ఉన్న తెలంగాణ పేరును తన పార్టీకి పెట్టుకుంది. అటు తెలంగాణ వాదాన్ని దూరం చేసుకోవడం.. జాతీయ రాజకీయాల మోజులో పడి ఇష్టానుసారంగా వ్యవహరించడంతో కెసిఆర్ పరిస్థితి దారుణంగా మారింది.

2027 ఎన్నికల్లో కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి గులాబీ పార్టీ మీద ఉంది. ఈ నేపథ్యంలోనే పార్టీ అధినేత కేసిఆర్ సరికొత్త నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఆయన ఇప్పుడు పాదయాత్ర చేసే అవకాశం లేదు. అప్పట్లో తెలంగాణ మూమెంట్ సాగుతున్నప్పుడు ఆయన కొద్ది రోజులపాటు పాదయాత్ర చేశారు. అయితే ఇప్పుడు పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది కాబట్టి వయసు రీత్యా ఆయన పాదయాత్ర చేసే అవకాశం లేదు.

వ్యవసాయ క్షేత్రానికి పరిమితమైన ఆయన ఇప్పుడు బస్సు యాత్ర చేస్తారని తెలుస్తోంది. కార్యకర్తలను ఏకతాటి పైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీని క్షేత్రస్థాయిలో బలబృతం చేసేందుకు బస్సు యాత్ర చేపట్టబోతున్నారు. దీనికోసం రూట్ మ్యాప్ కూడా సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది. మన వైపు కేటీఆర్ కూడా పాదయాత్ర చేస్తారని సమాచారం. పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లేందుకు కేటీఆర్ సిద్ధమవుతున్నారు.

అటు తండ్రి.. ఇటు కొడుకు రెండు వ్యూహాలతో ఒకేసారి జనంలోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ యాత్రలకు సంబంధించి త్వరలోనే పూర్తిస్థాయి షెడ్యూల్ వస్తుందని సమాచారం. ఇప్పటికే పార్టీలోని కీలక నాయకులకు కేసిఆర్.. కేటీఆర్ వర్తమానం పంపారని.. కొద్దిరోజులుగా దీని గురించి చర్చలు జరుగుతున్నాయని.. సమాచారం. ఇటీవల కేటీఆర్ మలేషియా వెళ్లారు. అక్కడ జరిగిన తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్నారు.. గతంలో కూడా కేటీఆర్ తన పాదయాత్ర గురించి బయటకు చెప్పేశారు. ఈ నేపథ్యంలో ఏకంగా కెసిఆర్ నుంచి మీడియాకు లీకులు వస్తున్న నేపథ్యంలో.. కచ్చితంగా పాదయాత్ర.. బస్సు యాత్ర ఉంటుందని తెలుస్తోంది.

స్లమ్ డాగ్ vs మహేంద్రగిరి వారాహి... రెండు టీజర్స్ లో ఎక్కువ క్రేజ్ వచ్చిన సినిమా ఏది..?

Slum Dog vs Mahendragiri Varahi
Slum Dog vs Mahendragiri Varahi

Slum Dog vs Mahendragiri Varahi: పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి హీరోగా చేస్తున్న ‘స్లమ్ డాగ్’ సినిమాకు సంబంధించిన టీజర్ గత రెండు రోజుల క్రితం రిలీజ్ అయింది. అయితే ఈ టీజర్ కి ప్రేక్షకుల్లో విశేషమైన స్పందన వస్తుంది. కొన్నిచోట్ల పూరీ మార్కు మిస్సయిందనే వార్తలు వినిపిస్తున్నప్పటికి పూరి కొత్తగా ట్రై చేశాడు. కాబట్టి ఇది బాగానే ఉంది అంటూ మరి కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. పూరి కంబ్యాక్ ఇవ్వాల్సిన అవసరమైతే ఉంది. కాబట్టి ఈ సినిమాతో ఒకసారి డిఫరెంట్ ప్రయత్నమైతే చేస్తున్నట్టుగా తెలుస్తుంది…ఇక దీంతో ఆయన ఎంతవరకు సక్సెస్ అవుతాడనే విషయం తెలియదు కానీ మొత్తానికైతే స్లమ్ డాగ్ సినిమాతో తను కంబ్యాక్ ఇవ్వడం పక్క అంటూ కొంత మంది కొన్ని కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమా ఆయన్ని ఏ రేంజ్ కి తీసుకెళ్తుందనే దానికోసమే ప్రతి ఒక్కరు వెయిట్ చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే అక్కినేని సుమంత్ హీరోగా సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో ‘మహేంద్రగిరి వారాహి’ అనే సినిమా తెరకెక్కుతుంది.

ఈ సినిమాతో ఎలాగైనా సరే భారీ పాపులారిటిని సంపాదించుకోవాలనే ప్రయత్నంలో తను ఉన్నాడు… ఇక ఈ సినిమాకు సంబంధించిన టీజర్ కూడా గత రెండు రోజుల క్రితం రిలీజ్ అయింది. సస్పెన్స్ మిస్టరీ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా టీజర్ ప్రేక్షకులను విశేషంగా అలరిస్తుంది. ఈ సినిమాతో సుమంత్ మరోసారి భారీ సక్సెస్ ని తన ఖాతాలో వేసుకోబోతున్నాడనే వార్తలు కూడా వస్తున్నాయి…

ఇక ఇప్పుడు పూరి విజయ్ సేతుపతి తో స్లమ్ డాగ్ సినిమాకి సుమంత్ – సంతోష్ జాగర్లపూడి చేస్తున్న ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా టీజర్ లో ఏ సినిమా టీజర్ కి ఎక్కువ క్రేజ్ దక్కింది. అనే దాని మీదనే ఇప్పుడు కీలకమైన చర్చలు నడుస్తున్నాయి.

ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారమైతే ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా టీజర్ కే ఎక్కువ క్రేజ్ దక్కింది. ఎందుకంటే అది సస్పెన్స్ మిస్టరీ థ్రిల్లర్ గా తెరకెక్కింది. అలాగే టీజర్ లోనే సినిమా కథని కూడా పరిచయం చేయడంతో సినిమా ఏదో ఇంట్రెస్టింగ్ గా సాగుతుందనే ఒక క్యూరియాసిటి అయితే ప్రేక్షకుల్లో కలుగుతుంది. కాబట్టి ఈ సినిమా టీజర్ కి భారీ రెస్పాన్స్ వస్తుంది…

వారణాసి విషయంలో లైట్ తీసుకుంటున్న టాప్ ఆర్టిస్టులు..

Top artists ignoring Varanasi
Top artists ignoring Varanasi

Top artists ignoring Varanasi: తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు దూసుకెళ్తుంది. రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న ‘వారణాసి’ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. 1500 కోట్లతో తెరకెక్కుతున్న ఈ సినిమా విషయంలో ప్రతి ఒక్కరు చాలా క్లారిటి గా ఉంటున్నారు. ముఖ్యంగా రాజమౌళి ప్రతి విషయాన్ని చాలా క్లియర్ కట్ గా చూసుకుంటూ ఎక్కడా కూడా సినిమాకి డ్యామేజ్ జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇక ఈ సినిమాలో నటించే కొంతమంది నటీనటులు మాత్రం సినిమాను లైట్ తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఈ సినిమాలో నటించాలా వద్దా? రాజమౌళి పెట్టే కండిషన్స్ కి ఒప్పుకొని సినిమాలో ఎన్ని రోజులు పాటు తమ డేట్స్ ని బ్లాక్ చేయాలి అనే ఉద్దేశ్యంతోనే కొంతమంది ఆర్టిస్టులు అయితే భావిస్తున్నారట. ముఖ్యంగా ఈ సినిమా కోసం వివిధ భాషల్లో ఉన్న ప్రముఖ ఆర్టిస్టులను భాగం చేయాలని రాజమౌళి చూస్తున్నాడు.

కొంతమందికి రాజమౌళి సినిమాలో అవకాశాలు వస్తే చాలు అనుకుంటుంటే, ఛాన్స్ దక్కిన వాళ్ళు మాత్రం ఆయన పెట్టే కండిషన్స్ తో సినిమాని చేయాలా వద్దా అనే డైలోమాలో ఉంటున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఏది ఏమైనా కూడా రాజమౌళి సినిమాలో నటిస్తే ఆ ఆర్టిస్టులకు ఉండే క్రేజ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. వాళ్లకి వచ్చే పేరు కూడా బాగా పెరిగిపోతుంది. అలాగే చాలా సినిమాల్లో అవకాశాలు కూడా దక్కుతాయి. కాబట్టి చాలామంది అతని సినిమాలో నటించడానికి ఆసక్తి చూపిస్తారు.

తద్వారా వాళ్ళు ఇంతటి కష్టాలు అయినా సరే భరించాలనే ఉద్దేశ్యంతో ముందుకు సాగుతూ ఉంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే కొంతమంది మలయాళం ఆర్టిస్టులను సైతం ఇందులో భాగం చేయాలని చూస్తే వాళ్లు రాజమౌళి పెట్టే కండిషన్స్ కి నో చెప్పినట్టుగా తెలుస్తుంది…

ఫహద్ ఫజిల్ ను ఈ సినిమాలో ఒక క్యారెక్టర్ కోసం అడిగారట. ఫహద్ ఫజిల్ రాజమౌళి పెట్టే కండిషన్స్, ఎక్కువ డేట్స్ ని బ్లాక్ చేయడం అవన్నీ నచ్చక తను ఆ సినిమా చేయనని చెప్పినట్టుగా తెలుస్తుంది. ఇక ఇందులో ఎంత వరకు నిజం ఉంది అనే విషయం తెలియదు. కానీ మొత్తానికైతే ఫిలింనగర్ సర్కిల్లో ఈ వార్త హల్చల్ చేస్తుంది…

రాత్రి తొందరగా నిద్ర పట్టాలా... అయితే యూఎస్ మిలటరీ ట్రిక్ ఫాలో అవ్వండి!

US military sleep trick
US military sleep trick

US military sleep trick: నేటి వేగవంతమైన జీవనశైలిలో చాలామంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. పనిఒత్తిడి, ఆర్థిక సమస్యలు, కుటుంబ బాధ్యతలు, మొబైల్ ఫోన్ల అధిక వినియోగం వంటి కారణాల వల్ల రాత్రి వేళల్లో నిద్ర పట్టక ఇబ్బంది పడుతున్నారు. అయితే కొందరు ఆరోగ్య నిపుణులు త్వరగా నిద్రలోకి జారుకునేందుకు ఒక ప్రత్యేక శ్వాస వ్యాయామాన్ని సూచిస్తున్నారు. దీనినే చాలామంది ‘మిలటరీ స్లీప్ ట్రిక్’గా పిలుస్తారు. దీనిని పాటించి వారు తొందరగా నిద్రపోతారు. ఈ ట్రిక్ ఎలా ఉంటుందంటే?

ఈ పద్ధతిలో భాగంగా మొదట ప్రశాంతంగా మంచంపై పడుకుని శరీరాన్ని పూర్తిగా రిలాక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత నాలుగు సెకన్ల పాటు మెల్లగా శ్వాసను లోపలికి తీసుకోవాలి. అనంతరం ఏడు సెకన్ల పాటు శ్వాసను ఆపి ఉంచాలి. తర్వాత ఎనిమిది సెకన్ల వ్యవధిలో నెమ్మదిగా గాలిని బయటకు వదలాలి. ఈ ప్రక్రియను కొన్ని సార్లు పునరావృతం చేయడం ద్వారా శరీరం, మనసు రెండూ ప్రశాంత స్థితికి చేరుకుంటాయని నిపుణులు చెబుతున్నారు.

ఏడు సెకన్ల పాటు శ్వాసను నిలిపి ఉంచడం వల్ల శరీరంలో ఆక్సిజన్ వినియోగం మెరుగుపడుతుందని, మెదడుకు ప్రశాంతత కలుగుతుంది. అలాగే ఒత్తిడికి కారణమయ్యే హార్మోన్ల ప్రభావం తగ్గి, ఆందోళన క్రమంగా తగ్గే అవకాశం ఉంటుంది. దీంతో మనసు ప్రశాంతంగా మారి నిద్రకు అనుకూలమైన పరిస్థితి ఏర్పడుతుంది.

ఈ శ్వాస విధానాన్ని అనుసరించే ముందు రోజంతా ఎదురైన సమస్యలు, ఆందోళనలు, పనిభారం వంటి ఆలోచనలను కొంతసేపు పక్కన పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. నిద్రకు ముందు మనసును ప్రశాంతంగా ఉంచడం కూడా ఈ పద్ధతి విజయవంతంగా పనిచేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

కొందరు చెబుతున్న సమాచారం ప్రకారం.. అమెరికా మిలటరీ సిబ్బంది కూడా ఇలాంటి రిలాక్సేషన్, శ్వాస పద్ధతులను ఉపయోగిస్తారని చెబుతారు. క్లిష్టమైన పరిస్థితుల్లోనూ తక్కువ సమయంలో విశ్రాంతి తీసుకుని తిరిగి విధులకు సిద్ధం కావడానికి ఇవి సహాయపడతాయని అంటారు. అయితే దీనిపై వివిధ రూపాల్లో సమాచారం ఉన్నప్పటికీ, వ్యక్తిగతంగా ఫలితాలు మారవచ్చు.

అయితే నిద్రలేమి సమస్య తరచుగా కొనసాగితే కేవలం ఈ ట్రిక్‌పైనే ఆధారపడకుండా వైద్యులను సంప్రదించడం మంచిది. సరైన నిద్ర అలవాట్లు, సమయానికి నిద్రపోవడం, కాఫీన్ తగ్గించడం, స్క్రీన్ టైమ్ నియంత్రించడం వంటి చర్యలతో పాటు ఈ శ్వాస వ్యాయామాన్ని అనుసరిస్తే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది.

ఈ కార్లపై భారీ ఆఫర్లు.. ఏకంగా రూ.80 వేల వరకు డిస్కౌంట్లు..

Renault June Offers 2026
Renault June Offers 2026

Renault June Offers 2026: భారతీయ కార్ల మార్కెట్లో అమ్మకాలను మరింత పెంచుకునే లక్ష్యంతో ప్రముఖ ఫ్రెంచ్ కార్ల కంపెనీ Renault ఈ జూన్ నెలకు ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. కంపెనీకి చెందిన పాపులర్ మోడళ్లైన Renault Kiger, Renault Triber, Renault Kwid కార్లపై గరిష్టంగా రూ.80,000 వరకు డిస్కౌంట్లు, బెనిఫిట్స్ అందిస్తోంది. ఈ ఆఫర్లలో క్యాష్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ బోనస్, స్క్రాపేజ్ బెనిఫిట్స్, లాయల్టీ రివార్డ్స్, కార్పొరేట్ డిస్కౌంట్లు ఉన్నాయి. ఆ ఆఫర్ల వివరాల్లోకి వెళితె..

కైగర్‌పై అత్యధిక ప్రయోజనాలు
రెనాల్ట్ కైగర్ కొనుగోలు చేసే కస్టమర్లకు ఈ నెలలో అత్యధికంగా రూ.80,000 వరకు ప్రయోజనాలు లభిస్తున్నాయి. ఇందులో రూ.40,000 వరకు క్యాష్ డిస్కౌంట్, రూ.25,000 వరకు ఎక్స్ఛేంజ్ లేదా స్క్రాపేజ్ బెనిఫిట్, రూ.15,000 వరకు లాయల్టీ బోనస్ ఉన్నాయి. కొన్ని రాష్ట్రాల్లో కార్పొరేట్ కస్టమర్లకు అదనపు డిస్కౌంట్లు కూడా వర్తిస్తాయి. అయితే బేస్ వేరియంట్లపై ఈ ప్రయోజనాలు పరిమితంగా ఉండే అవకాశం ఉంది. ఈ కారు ధర ప్రస్తుతం రూ.5.81 లక్షల నుంచి రూ. 10.34 లక్షల వరకు విక్రయిస్తున్నారు.

ట్రైబర్‌పై రూ.60,000 వరకు ఆఫర్లు
ఏడు సీట్ల సామర్థ్యం కలిగిన ట్రైబర్‌పై కూడా కంపెనీ ఆకర్షణీయమైన ఆఫర్లను అందిస్తోంది. ఎంపిక చేసిన వేరియంట్లపై గరిష్టంగా రూ.60,000 వరకు బెనిఫిట్స్ లభిస్తున్నాయి. పాత స్టాక్ వాహనాలపై రూ.35,000 వరకు క్యాష్ డిస్కౌంట్, రూ.25,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ అందుబాటులో ఉంది. అదనంగా కార్పొరేట్, లాయల్టీ , రిఫరల్ బెనిఫిట్స్ కూడా పొందవచ్చు.దీనిని రూ.5.81 లక్షల ప్రారంభం నుంచి విక్రయిస్తున్నారు.

క్విడ్ కొనుగోలుదారులకు ప్రత్యేక తగ్గింపులు:
బడ్జెట్ హ్యాచ్‌బ్యాక్ క్విడ్‌పై కూడా రెనాల్ట్ మంచి ఆఫర్లను ప్రకటించింది. ఈ కారుపై గరిష్టంగా రూ.55,000 వరకు ప్రయోజనాలు లభిస్తున్నాయి. ఇందులో రూ.20,000 వరకు క్యాష్ డిస్కౌంట్, రూ.25,000 వరకు ఎక్స్ఛేంజ్ లేదా స్క్రాపేజ్ బెనిఫిట్, రూ.10,000 వరకు కార్పొరేట్ డిస్కౌంట్ ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల కస్టమర్లకు అదనపు ప్రయోజనాలు కూడా లభించే అవకాశం ఉంది.ఈ కారు ధర ప్రస్తుతం రూ. 4.30 లక్షల నుంచి రూ. 5.88 లక్షల వరకు విక్రయిస్తున్నారు.

స్క్రాపేజ్, లాయల్టీ బోనస్‌లతో మరింత లాభం:
ఇప్పటికే రెనాల్ట్ వాహనం కలిగి ఉన్న కస్టమర్లు లాయల్టీ బోనస్ పొందవచ్చు. అలాగే పాత వాహనాన్ని స్క్రాప్ చేసి కొత్త కారు కొనుగోలు చేసే వారికి ప్రత్యేక స్క్రాపేజ్ బెనిఫిట్స్ అందిస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. కొన్నివేరియంట్లపై 0 శాతం వడ్డీ ఫైనాన్స్ స్కీమ్ కూడా అందుబాటులో ఉంది.

ఈ ప్రత్యేక ఆఫర్లు జూన్ నెల మధ్య వరకు లేదా జూన్ 30 వరకు డీలర్‌షిప్ ఆధారంగా అందుబాటులో ఉండొచ్చని సమాచారం. అయితే నగరం, డీలర్ స్టాక్, వేరియంట్‌ను బట్టి డిస్కౌంట్ మొత్తాలు మారే అవకాశం ఉంది. కాబట్టి కారు కొనుగోలు చేయాలనుకునేవారు సమీప రెనాల్ట్ షోరూమ్‌ను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోవడం మంచిది.

పాక్‌ చీటింగ్‌ గేమ్‌.. పీవోకే స్వతంత్రం వెనుక చీకటి!

Pakistan Occupied Kashmir Autonomy Reality
Pakistan Occupied Kashmir Autonomy Reality

Pakistan Occupied Kashmir Autonomy Reality: పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌(పీవోకే) గురించి చాలామందికి ఒక ప్రశ్న తరచూ వస్తుంది. అక్కడ ప్రత్యేక అధ్యక్షుడు, ప్రధానమంత్రి, శాసనసభ, న్యాయవ్యవస్థ, మంత్రివర్గం, జెండా, తాత్కాలిక రాజ్యాంగం ఎందుకు ఉన్నాయి? ఇవి నిజంగా స్వయం ప్రతిపత్తిని సూచిస్తాయా? లేదా ఇవి కేవలం బాహ్య ప్రదర్శన మాత్రమేనా? ఈ ప్రశ్నలు ఇటీవలి ఆందోళనల నేపథ్యంలో మరింత స్పష్టంగా ఎదురవుతున్నాయి.

అధికారికంగానే పేరు..
పాకిస్థాన్‌ ఈ ప్రాంతాన్ని ‘‘ఆజాద్‌ జమ్మూ అండ్‌ కశ్మీర్‌’’ అని అధికారికంగా సంబోధిస్తుంది. ఇక్కడ అధ్యక్షుడు రాజ్యాంగపరమైన అధిపతిగా, ప్రధానమంత్రి కార్యనిర్వాహక అధిపతిగా వ్యవహరిస్తారని చెబుతారు. శాసనసభ, న్యాయస్థానాలు, మంత్రిమండలి, ప్రత్యేక జెండా వంటి నిర్మాణాలు ఉన్నాయి. బయటి నుంచి చూస్తే ఇది స్వతంత్రంగా లేదా స్వయం నిర్ణయాధికారంతో నడిచే ప్రాంతంలా కనిపిస్తుంది.

భారత్‌లో విలీనం..
1947లో భారత విభజన తర్వాత జమ్మూ కశ్మీర్‌ సంస్థానం భారతదేశంలో విలీనమైంది. దీంతో జరిగిన మొదటి యుద్ధం ముగిసే సమయానికి కొంత భూభాగం పాకిస్తాన్‌ నియంత్రణలో మిగిలింది. పాకిస్తాన్‌ ఆ ప్రాంతాన్ని తన సాధారణ ప్రావిన్సుల్లో కలపలేదు. మొత్తం కశ్మీర్‌పై తన హక్కును అంతర్జాతీయంగా కొనసాగించాలని అనుకుంది. అందుకే ఆ ప్రాంతాన్ని ప్రత్యేకంగా చూపించే విధానాన్ని అనుసరించింది.

కరాచీ ఒప్పందం…
1949లో కరాచీ ఒప్పందం ద్వారా రక్షణ, విదేశాంగ విధానం, సమాచార వ్యవస్థలు వంటి కీలక అధికారాలను పాకిస్తాన్‌ తన వద్దే ఉంచుకుంది. 1974లో తాత్కాలిక రాజ్యాంగం అమల్లోకి తెచ్చి అధ్యక్షుడు, ప్రధానమంత్రి, శాసనసభ వంటి సంస్థలను ఏర్పాటు చేసింది. అయితే ఈ రాజ్యాంగం ప్రకారం కూడా ప్రధాన నిర్ణయాలు ఇస్లామాబాద్‌ అనుమతితోనే తీసుకోవాలి. వాస్తవ పరిపాలన, నియంత్రణ స్వరూపంరక్షణ, విదేశాంగం, ఆర్థిక విధానాలు, వ్యూహాత్మక విషయాలు అన్నీ పాకిస్థాన్‌ కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. పీవోకే పరిపాలనలో పాకిస్తాన్‌ నుంచి పంపిన అధికారులు ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. శాసనసభలో కొన్ని స్థానాలు పాకిస్తాన్‌లో ఉన్న కశ్మీరీ శరణార్థుల కోసం రిజర్వ్‌ చేయబడ్డాయి. ఇది స్థానిక రాజకీయ సమీకరణాలను ప్రభావితం చేస్తుంది.

విధేయతే ప్రమాణం..
శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే నాయకులు, న్యాయమూర్తులు, రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు కశ్మీర్‌ను పాకిస్తాన్‌లో విలీనం చేయాలనే వాదనకు మద్దతు ఇస్తామని తప్పనిసరిగా ప్రమాణం చేయాలి. దీంతో భిన్న అభిప్రాయాలు, ప్రత్యామ్నాయ రాజకీయ ఆలోచనలకు అవకాశం చాలా తక్కువగా ఉంటుంది.

భారత్‌ స్థిరమైన వైఖరి..
భారత్‌ ఈ మొత్తం ప్రాంతం తన అంతర్భాగమని, 1947 నుంచి పాకిస్తాన్‌ అక్రమ ఆక్రమణలో ఉందని స్పష్టంగా పేర్కొంటుంది. స్థానిక సంస్థలు ఉన్నప్పటికీ అవి నిజమైన స్వతంత్రతను సూచించవని, అవి పాకిస్తాన్‌ నియంత్రణలోనే పనిచేస్తున్నాయని భారత్‌ అభిప్రాయం. ఈ వ్యవస్థలు ప్రపంచానికి స్వయం ప్రతిపత్తి చూపించడానికి సృష్టించినవని భారత్‌ వాదిస్తుంది.

బయటికి కనిపించే అధ్యక్షుడు, ప్రధానమంత్రి, శాసనసభ వంటి నిర్మాణాలు ఉన్నప్పటికీ, రక్షణ, విదేశాంగం, కీలక నిర్ణయాలు అన్నీ ఇస్లామాబాద్‌లోనే తీసుకోబడుతున్నాయి. ఈ వ్యవస్థ మొత్తం పాకిస్తాన్‌ రిమోట్‌ కంట్రోల్‌లోనే నడుస్తుంది.

పాకిస్థాన్ పై కోహ్లీ చెలరేగుతుంటే.. డివిలియర్స్ డ్యాన్సులు వేశాడు..

Virat Kohli 82 Runs Against Pakistan
Virat Kohli 82 Runs Against Pakistan

Virat Kohli 82 Runs Against Pakistan: సహజంగానే విరాట్ కోహ్లీని మనం రన్ మిషన్ అంటాం. ఎందుకంటే పరుగులు తీయడంలో అతడు ఆ స్థాయిలో దూకుడు చూపిస్తూ ఉంటాడు. విరాట్ కోహ్లీ కేవలం రన్ మిషన్ మాత్రమేకాదు, ఛేజింగ్ మాస్టర్ కూడా. బీభత్సంగా పరుగులు తీయడంలో.. కఠినమైన లక్ష్యాలను ఛేదించడంలో విరాట్ కోహ్లీ తర్వాతే ఎవరైనా. విరాట్ ఆటకు మన జాతీయ జట్టులోని ప్లేయర్లు మాత్రమేకాదు, ప్రత్యర్థి జట్టు ప్లేయర్లు కూడా ఫిదా అవుతుంటారు. ఈ జాబితాలో దక్షిణాఫ్రికా ఆల్ రౌండర్ ఏబీ డివిలియర్స్ ముందువరుసలో ఉంటాడు.

డివిలియర్స్ ను మైదానంలో మిస్టర్ 360 అని పిలుస్తుంటారు. అతడు బంతిని మైదానం నలుమూలలవైపు కొడుతూ ఉంటాడు. ఎంతటి తోపు బౌలర్ అయినా సరే అతడి ముందు తలవంచాల్సిందే. అందరి డివిలియర్స్ కూడా విరాట్ కోహ్లీకి ఫ్యాన్ అయిపోయాడు. అతడు ఆడుతుంటే తీన్మార్ డ్యాన్స్ వేశాడు. ఆ విషయాన్ని ఇటీవల అతడు పంచుకున్నాడు.

ఓ ఇంటర్వ్యూలో డివిలియర్స్ కీలక వ్యాఖ్యలు చేశాడు..”ఇప్పటివరకు నేను చూసిన అత్యుత్తమ టి20 ఇన్నింగ్స్ విరాట్ కోహ్లీ ఆడింది. అతడు ఆ మ్యాచ్లో 82 పరుగులు చేశాడు. అప్పుడు జరుగుతున్న టి20 వరల్డ్ కప్ లో పాకిస్థాన్ జట్టుతో భారత్ ఆడుతోంది. ఆ మ్యాచ్లో భారత్ కష్టాల్లో పడింది. తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొంటున్నది. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీ గట్టిగా నిలబడ్డాడు. ఏ మాత్రం కంగారు పడలేదు. నమ్మకాన్ని కోల్పోకుండా బ్యాటింగ్ చేశాడు. పాకిస్తాన్ బౌలర్ రౌఫ్ బౌలింగ్లో సిక్సర్లు కొట్టాడు. అప్పుడే ఆట స్వరూపం పూర్తిగా మారిపోయింది. అతని ఓపిక.. సమయమనం ఇక్కడిదాకా తీసుకొచ్చాయి. అతడు ఆ స్థాయిలో ఆడటం వల్లే ప్రపంచ స్థాయి ఆటగాడిగా పేరు తెచ్చుకున్నాడని” డివిలియర్స్ పేర్కొన్నాడు.

డివిలియర్స్ ఐపీఎల్ లో బెంగళూరు జట్టు తరఫున ఆడాడు. అతడు ఆడినప్పుడు బెంగళూరు ఐపిఎల్ ట్రోఫీ అందుకోలేకపోయింది. గత సీజన్ లో విజేతగా నిలిచినప్పుడు బెంగళూరు జట్టును డివిలియర్స్ అభినందించాడు. ఈ సీజన్లో కూడా బెంగళూరు విజేతగా నిలవడంతో.. డివిలియర్స్ ఆనందం వ్యక్తం చేశాడు. తాను జట్టులో ఉన్నప్పుడు బెంగళూరు ట్రోఫీ గెలిచి ఉంటే బాగుండేదని డివిలియర్స్ వ్యాఖ్యానించాడు. అయినప్పటికీ తన జట్టు రెండుసార్లు విజేతగా నిలిచిందని.. ఇది ఆనందకరమైన విషయమని డివిలియర్స్ పేర్కొన్నాడు.

మద్యం స్కామ్ కేసులో అన్నంతపని చేసిన విజయసాయిరెడ్డి!

Vijayasai Reddy Liquor Scam
Vijayasai Reddy Liquor Scam

Vijayasai Reddy Liquor Scam: ఏపీలో మద్యం కుంభకోణానికి సంబంధించి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ దూకుడు పెంచింది. ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో ఏకకాలంలో సోదాలు జరిపింది. గురువారం ఉదయం హైదరాబాద్, ఏపీలోని చాలా ప్రాంతాల్లో ఈడి అధికారులు తనిఖీలు చేశారు. మద్యం కుంభకోణంలో సూత్రధారిగా భావిస్తున్న రాజ్ కసిరెడ్డి, ఆయనకు సహకరించిన ఇతర నిందితుల ఇళ్లు, కార్యాలయాలే లక్ష్యంగా ఈ సోదాలు జరుగుతున్నాయి. హైదరాబాద్ నానక్ రామ్ గూడ లోని ఏక్తా హైలాండ్ అపార్ట్మెంట్ లో ఉన్న రాజ్ కసిరెడ్డి నివాసంలో ఈడి బృందాలు లోతుగా తనిఖీలు చేపట్టాయి. మొన్ననే విజయసాయిరెడ్డి ఏడు గంటల పాటు విచారణ సాగింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయంలో. ఆయన ఇచ్చిన సమాచారంతోనే ఇప్పుడు ఈడీ సోదాలు చేస్తున్నట్లు ప్రచారం నడుస్తోంది. ఒక్క రాజ్ కసిరెడ్డి మాత్రమే కాదు.. ఏపీ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ మాజీ ఎంపీ వాసుదేవ రెడ్డి నివాసంతో పాటు కోకాపేటలోని ఆయన బంధువుల ఇళ్లు, ఆ సిండికేట్ లో మధ్యవర్తులుగా వ్యవహరించిన వల్లు సందీప్, ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి వంటి మొత్తం ఆరుగురు నిందితుల ఆస్తులపై దాడులు జరిగాయి.

* వైసిపి హయాంలో భారీ కుంభకోణం..
వైసిపి ప్రభుత్వ హయాంలో భారీ మద్యం కుంభకోణం జరిగిందని కూటమి ప్రభుత్వం అనుమానించింది. గత ప్రభుత్వ పెద్దల అండదండలతో సుమారు రూ.3500 కోట్ల పక్కదారి పట్టిందన్న ఆరోపణలు పై.. ఇప్పటికే ఈడి రూ.441 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది. గతంలో కూడా ఈడి పలుమార్లు విస్తృత సోదాలు జరిపింది. విజయసాయిరెడ్డిని ఏడు గంటల పాటు సుదీర్ఘంగా ప్రశ్నించారు ఈడీ అధికారులు. అయితే తనకు ఈ స్కాంతో ఎలాంటి సంబంధాలు లేవని.. ఈ కుంభకోణానికి సూత్రధారి రాజ్ కసిరెడ్డి అని తేల్చి చెప్పారు విజయసాయిరెడ్డి. విజయసాయిరెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ తోనే ఇప్పుడు ఈడి రంగంలోకి దిగింది. విస్తృత తనిఖీలు చేపట్టింది.

* సమాంతరంగా విచారణలు..
మద్యం కుంభకోణానికి సంబంధించి ఒకవైపు ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ చేపడుతోంది. దీనిని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. లోతైన దర్యాప్తు కొనసాగిస్తోంది. ఇటీవల జగన్మోహన్ రెడ్డి పిఎ నాగేశ్వర్ రెడ్డి ఇంట్లో కూడా భారీగా ఆస్తుల దృవపత్రాలతో పాటు అక్రమ నగదును గుర్తించింది. అయితే దానికి సమాంతరంగా ఇప్పుడు ఈడీ రంగంలోకి దిగింది. ఒకవైపు ఏపీ దర్యాప్తు సంస్థ.. ఇంకోవైపు కేంద్ర ప్రభుత్వానికి చెందిన సంస్థ ఏకకాలంలో విచారణ చేపడుతున్నాయి మద్యం కుంభకోణం కేసులో. అయితే విచారణ జరుగుతున్న కొలది అనేక ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గతంలో కూడా ఓ కేసు విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి మద్యం కుంభకోణానికి అవసరం అయిన సమాచారం ఇస్తానంటూ చెప్పుకొచ్చారు. అటు తరువాతనే మద్యం కుంభకోణం కేసులో అరెస్టులు మొదలయ్యాయి. ఇప్పుడు రెండోసారి ఈ డి విచారణతో నిందితుల ఇళ్లపై దాడులు చేసి తనిఖీలు చేస్తున్నారు. మద్యం కుంభకోణం కేసులో ఇప్పుడు విజయసాయిరెడ్డి ప్రముఖంగా నిలుస్తుండడం విశేషం.

భారత్ తో యుద్దానికి పాకిస్థాన్ రె‘ఢీ’.. ఆపరేషన్ సిందూర్ డోస్ సరిపోలేదనుకుంటా..

India Pakistan Border Tensions
India Pakistan Border Tensions

India Pakistan Border Tensions: గత ఏడాది సరిగ్గా ఇదే సమయానికి పాకిస్థాన్ నెత్తినోరూ మొత్తుకుంది. బ్బాబ్బాబూ మమ్మల్ని వదిలేయండి మీకు దండం పెడతాం అంటూ కాళ్లు పట్టుకుంది. చచ్చిన పామును ఏం చంపుతామని భారత్ బతుకుపో అంటూ వదిలిపెట్టింది. లేకుంటేనా పాకిస్థాన్ ప్రపంచ పటంలో ఉండేదే కాదు.

భారత్ దయాదాక్షిణ్యాల మీద బతికిన పాకిస్థాన్ మళ్లీ పిచ్చి లేసిన కుక్క లాగా అరవడం మొదలుపెట్టింది. సరిహద్దుల్లో మళ్లీ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. నిబంధనలు అతిక్రమించి జమ్మూలో భారత సైన్యం ఏర్పాటు చేసుకున్న చెక్ పోస్టుల ప్రాంతాలలో పాకిస్థాన్ సైన్యం ఈనెల 9న తెల్లవారుజామున డ్రోన్లను పంపించింది.

ఆ డ్రోన్లను కూల్చివేయడానికి భారత సైన్యం 15 రౌండ్ల పాటు కాల్పులు జరపాల్సి వచ్చింది. అయితే ఆ డ్రోన్లు మళ్లీ పాకిస్థాన్ భూభాగంలోకి వెళ్లిపోయాయి. ప్రతిసారీ నిబంధనలు అతిక్రమించడం పాకిస్థాన్ కు అలవాటే. కాకపోతే పహల్గాం ఘటన తర్వాత భారత్ కట్టుదిట్టంగా భద్రతను ఏర్పాటు చేస్తోంది. సరిహద్దుల్లో చీమచిటుక్కుమన్నా తెలిసేలా సెక్యూరిటీ ఏర్పాటు చేసింది. అందువల్లే పాకిస్థాన్ డ్రోన్లపై భారత్ కాల్పులు జరిపింది.

ఇలాంటి పనులు పాకిస్థాన్ ఎందుకు చేస్తోందంటే..ప్రస్తుతం పాకిస్థాన్ లో అంతర్గత సంక్షోభాలు ఏర్పడ్డాయి. భారత్ జీలం, చినాబ్ నది ప్రవాహాలకు అడ్డుకట్ట వేసింది. దీంతో పాకిస్థాన్ లో వ్యవసాయం సాగే పరిస్థితి లేదు. పీవోకే లో పాకిస్థాన్ కు వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్నాయి. బలూచిస్థాన్ ఆర్మీ పాకిస్థాన్ కు చుక్కలుచూపిస్తోంది. ఆర్థిక సంక్షోభం కూడా పాకిస్థాన్ పాలకులను కలవరపాటుకు గురి చేస్తోంది.

ఇవన్నీతగ్గిపోవాలంటే ఏదోఒకటి చేయాలి. భారత్ మీద దాడులు చేసినట్టు కలరింగ్ ఇస్తే అంతర్గత సంక్షోభాలను డైవర్ట్ చేయవచ్చని పాకిస్థాన్ భావిస్తోంది. అయితే ఆపరేషన్ సిందూరు జస్ట్ శాంపిల్ మాత్రమేనని..ఈసారి పాకిస్థాన్ కయ్యానికి కాలు దువ్వితే.. లేపడానికి కాలు..దువ్వాడానికి చేయి ఉండవని భారతసైన్యం స్పష్టం చేస్తోంది. అంటే ఈలెక్కన పాకిస్థాన్ దేశాన్నిప్రపంచ పటం నుంచి తీసివేయడానికి భారత్ గట్టిగా ఫిక్స్ అయిందన్నమాట.

యుద్ధం ఉధృతం.. ఇరాన్ షాకింగ్ నిర్ణయం!

Iran US Conflict Escalation
Iran US Conflict Escalation

Iran US Conflict Escalation: కొద్ది రోజుల క్రితం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇరాన్‌తో జరుగుతున్న ఘర్షణ త్వరలో ముగుస్తుందని, శాంతి చర్చలు సానుకూలంగా సాగుతున్నాయని ప్రకటించారు. ఈ ప్రకటనతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన, సహజవాయువు ధరలు తగ్గే అవకాశం ఉందని ఆశలు చిగురించాయి. కానీ ఆ ఆశలు కొన్ని రోజుల్లోనే బూడిద అయ్యాయి. రెండు దేశాలు కూడా సెల్ఫ్‌ డిఫెన్స్‌ పేరుతో సీజ్‌ఫైర్‌ను ఉల్లంఘించాయి. అమెరికా ఇరాన్‌పై భారీ వైమానిక దాడులు చేయగా, ఇరాన్‌ ప్రతిస్పందనగా హార్ముజ్‌ జలసంధిని పూర్తిగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది.

హర్మూజ్ క్లోజ్‌..
పశ్చిమ ఆసియాలోని ఈ వ్యూహాత్మక జలసంధి హర్మూజ్‌ ప్రపంచ ఇంధన సరఫరాలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇరాన్‌ ఈ మార్గాన్ని మూసివేయడంతో ప్రపంచ మార్కెట్లలో మళ్లీ ఆందోళన వ్యాపించింది. అమెరికా మాత్రం వాణిజ్య నౌకలు ఇంకా ఆ మార్గంలో సాగుతున్నాయని చెబుతోంది. అయితే ఇరాన్‌ రెవల్యూషనరీ గార్డ్స్‌ నేవీ ఆ మార్గాన్ని ఉల్లంఘించిన రెండు నౌకలపై దాడి చేసినట్లు ప్రకటించింది.ఈ పరిణామాలు ప్రపంచ ఇంధన ధరలను మళ్లీ పెంచే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఆసియా, యూరప్‌ దేశాలపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని అంచనా.

ఇజ్రాయెల్‌–హెజ్బొల్లా దాడులు..
ఇరాన్‌తో జరుగుతున్న ఘర్షణతోపాటు ఇజ్రాయెల్‌ లెబనాన్‌పై తన సైనిక కార్యకలాపాలను తీవ్రం చేసింది. హెజ్బొల్లా నుంచి వచ్చిన రాకెట్‌ దాడులకు ప్రతిగా బీరూట్‌ దక్షిణ ప్రాంతాలు, దక్షిణ లెబనాన్‌ పట్టణాలపై వైమానిక దాడులు చేస్తోంది. ఈ దాడుల్లో అనేక మంది సాధారణ పౌరులు మరణించినట్లు నివేదికలు వస్తున్నాయి.

అంతర్జాతీయ ఆందోళన
ఈ పరిణామాలు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగించాయి. ఐక్యరాష్ట్ర సమితి సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెరెస్‌ యుఎన్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ను వెంటనే జోక్యం చేసుకోవాలని కోరారు. స్థానిక స్థాయి ఘర్షణ పెద్ద స్థాయి ప్రాంతీయ యుద్ధంగా మారే ప్రమాదం ఉందని, ఇది లక్షలాది మంది ప్రాణాలను బలిగొనడమే కాకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్టం కలిగిస్తుందని హెచ్చరించారు.

ఈ ఘర్షణ ప్రారంభమై నాలుగు నెలలు దాటినా, ఇరు పక్షాల మధ్య శాంతి చర్చలు ఇంకా స్థిరంగా సాగడం లేదు. హార్ముజ్‌ జలసంధి మూసివేత, లెబనాన్‌లో ఇజ్రాయెల్‌ దాడులు, ఇరాన్‌–అమెరికా మధ్య నేరుగా జరుగుతున్న సైనిక చర్యలు పరిస్థితిని మరింత సంక్లిష్టం చేస్తున్నాయి. రెండు దేశాలు వెంటనే యుద్ధ విరామం చేసి, నిజమైన శాంతి చర్చలకు కుదుర్చకపోతే సంక్షోభం మరింత విస్తరించే అవకాశం ఉంది.

ఒకప్పటి టీవీ9 రవి ప్రకాష్ కు ఏమైంది.. ఎందుకు ఇంత కదిలిపోయాడు.. కన్నీరు పెట్టుకున్నాడు..

Ravi Prakash TV9 Issue
Ravi Prakash TV9 Issue

Ravi Prakash Emotional Reaction: ఎలక్ట్రానిక్ మీడియాను బాగా ఫాలో అయ్యే వారికి రవి ప్రకాష్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అతడు తెలుగు ఎలక్ట్రానిక్ మీడియాకు సరికొత్త దశ దిశ చూపించాడు. 24 గంటలపాటు వార్త ఛానల్ అంటూ టీవీ9 ను రవి ప్రకాష్ ఏర్పాటు చేసినప్పుడు చాలామంది ఆశ్చర్యపోయారు. అది ఎలా సాధ్యమని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు అతడు చూపించిన తోవలో చాలామంది నడుస్తున్నారు. తెలుగు ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో టీవీ9 తర్వాత.. టీవీ9 ముందు అని చెప్పుకోవచ్చు. దీనంతటికీ ప్రధాన కారణం రవి ప్రకాష్.

రవి ప్రకాష్ అంతకుముందు తేజ చానల్లో పని చేశాడు. ఎన్కౌంటర్ అనే ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించాడు. తద్వారా ఎలక్ట్రానిక్ మీడియా నాడి పట్టుకున్నాడు. టీవీ9 ఛానల్ ఏర్పాటు చేసిన తర్వాత.. రవి ప్రకాష్ ఎక్కడికో వెళ్లిపోయాడు. కొన్ని సందర్భాలలో ప్రభుత్వ అధికారుల కంటే.. టీవీ9 కు ఫోన్ చేస్తే పనులు జరిగిపోతాయని ప్రజలు అనుకునేవారంటే.. అతడు చూపించిన ప్రభావం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

టీవీ9 నుంచి బయటికి వచ్చిన తర్వాత రవి ప్రకాష్ రకరకాల మీడియా సంస్థలను ఏర్పాటు చేశారు. మోజో టీవీ మూతపడింది. ఆ తర్వాత కొన్ని ప్లాట్ఫామ్స్ కూడా ఒత్తిడి ఎదురుకోవాల్సి వచ్చింది. చివరికి తన స్థాపించిన టీవీ 9 ఛానల్ నుంచే అపరాధ భావంతో బయటికి రావాల్సి వచ్చింది. చివరికి రవి ప్రకాష్ ఇప్పుడు ఆర్ టీవీ పేరుతో యూట్యూబ్ ఛానల్.. తొలి వెలుగు.. మెరుపు అనే పేరుతో పిడిఎఫ్ న్యూస్ పేపర్ నిర్వహిస్తున్నారు. సంచలన వార్తలతో నిత్యం చర్చల్లో ఉంటున్నారు రవి ప్రకాష్.

తాజాగా రవి ప్రకాష్ తన ట్విట్టర్ ఖాతాలో ఒక వీడియోను షేర్ చేశారు. ఆ వీడియోలో గుజరాత్ రాష్ట్రానికి చెందిన ఒక గిగ్ వర్కర్ కన్నీటి కథ ఉంది. ఆర్థిక కష్టాలు తట్టుకోలేక అతడు బిల్డింగ్ పైనుంచి దూకి చనిపోయాడు. అయితే అతడు బిల్డింగ్ పైనుంచి చనిపోతున్నప్పుడు అక్కడి సన్నివేశాలు కెమెరాలలో నిక్షిప్తమయ్యాయి. అవి కాస్త బయటకు వచ్చాయి. ఆ వీడియోను పోస్ట్ చేస్తూ రవి ప్రకాష్ తీవ్రంగా బాధపడ్డాడు. కన్నీటి పర్యంతమయ్యాడు. గుండె బరువెక్కి పోయిందని వ్యాఖ్యానించాడు.

ఆ వ్యాఖ్యలు చదువుతుంటే రవి ప్రకాష్ గుండెలో ఇంత ఆవేదన ఉందా.. అతడు కూడా కన్నీరు పెడతాడు.. ప్రతి విషయంలో ధైర్యంగా ఉంటాడు కదా.. ఇతడికి ఏమైంది అని సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. ఎంతటి కఠినమైన మనిషి అయినప్పటికీ.. ఎంతటి స్థిర చిత్తమున్న వ్యక్తి అయినప్పటికీ.. ఏదో ఒక సందర్భంలో కన్నీరు పెట్టాలి. బాధపడాలి. ఎంతమందిని ఇలా ఏడిపించాడో తెలియదు కానీ.. ఇప్పుడు మాత్రం రవి ప్రకాష్ మారిపోయాడు. మనిషిలాగ కనిపిస్తున్నాడు.

డాక్టర్ కాదు. నర్స్ అంతకంటే కాదు.. ఐదు వేల ప్రసవాలు చేసింది..

Suva Dai Story
Suva Dai Story

Suva Dai Story: ఆమె పేరు మోసిన విశ్వవిద్యాలయాలలో చదివిన డాక్టర్ కాదు. రోగులను చిరునవ్వుతో పలకరించి.. వారికి సేవలు చేయడంలో తరఫున నర్స్ కాదు. ఆమెకు స్టెత్ అంటే ఏంటో తెలియదు. కానీ గర్భిణుల నాడి ఇట్టే తెలుసుకుంటుంది. ఎటువంటి స్థానికులు చేయకుండానే అమ్మ కడుపులో ఉన్న బిడ్డ పరిస్థితిని కచ్చితంగా చెప్పేస్తుంది. నేటి కాలంలో కూడా ఆమెకు విపరీతమైన డిమాండ్ ఉందంటే దానికి ప్రధాన కారణం ఆమె నేర్పరితనం

అది రాజస్థాన్ రాష్ట్రం.. ఇక్కడ అజ్మీర్లోని 84 సంవత్సరాల సువా దైమా మహిళ జీవిస్తూ ఉంటుంది. గడిచిన 60 సంవత్సరాలుగా ఆ చుట్టుపక్కల 6 గ్రామాల ప్రజలకు వైద్యం అందిస్తోంది. ఆమెను ప్రజల డాక్టరమ్మ అని పిలుస్తుంటారు.. ఇలా ఆమె డాక్టరమ్మ కావడానికి ఒక కారణం ఉంది. ఎందుకంటే అజ్మీర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆస్పత్రులు ఉండేవి కావు.

ఇలాంటి సమయంలోనే సువా దై తనకు 24 సంవత్సరాల వయసులో మొదటిసారి ఒక గర్భిణికి పురుడు పోసింది. అప్పుడు ఒక పండంటి బాబు పుట్టాడు. అప్పటినుంచి చుట్టుపక్కల వారు ఆమెతో పురుడు పోయించుకోవడం మొదలుపెట్టారు. ఆమెకు అనుభవం.. జ్ఞానం ఎక్కువ ఉండడంతో గర్భిణుల నాడి చెక్ చేసేది. గర్భధారణను కూడా నిర్ధారించేది. గర్భం ధరించిన తర్వాత మహిళలకు జాగ్రత్తలు చెప్పేది. ప్రసవం తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా వివరించేది.

అర్ధరాత్రి, అపరాత్రి అని తేడా లేకుండా ప్రసవాలు చేసేది. ఎవరింట్లోనైనా నొప్పులు మొదలయ్యాయి అనే మాట వినగానే వెంటనే ఎక్కడికి వెళ్లి పోతూ ఉంటుంది. పనులు మొత్తం పక్కన పెట్టి ప్రసవం చేస్తూ ఉంటుంది. అప్పట్లో అయితే దీపం వెలుతురులోనే ప్రసవాలు చేసేదట. అయితే ఇన్ని చేసినప్పటికీ ఆమె ఎవరి దగ్గర కూడా ఒక్క రూపాయి తీసుకోలేదు. ఇతర కానుకలు కూడా స్వీకరించదు..”అమ్మ అనే పిలుపు అత్యంత గొప్పది. అమ్మదనం అత్యంత విలువైనది. ప్రతి ఆడపిల్ల అమ్మకావడం ఆమె జీవితంలో ఒక మధుర ఘట్టం. బిడ్డ పుట్టిన తర్వాత మహిళ ఈ ప్రపంచాన్ని జయించినంత గొప్పగా భావిస్తూ ఉంటుంది. బిడ్డ పుట్టిన తర్వాత ఆ తల్లి కళ్ళల్లో కలిగే ఆనందం నాకు గొప్పగా అనిపిస్తూ ఉంటుందని” సువా చెబుతూ ఉంటుంది .కాగా ఇటీవల ఆమె చనిపోయింది.

రిక‘వర్రీ’.. కరీంనగర్‌ పోలీసులకు సవాల్‌గా మారిన పీఎంజే కేసు!

PMJ Jewellery Robbery Karimnagar
PMJ Jewellery Robbery Karimnagar

PMJ Jewellery Robbery Karimnagar: కరీంనగర్‌ జ్యోతినగర్‌లోని ప్రముఖ పీఎంజే జ్యువెలరీ షోరూమ్‌పై జరిగిన భారీ దోపిడీ కేసు పోలీసులకు పెద్ద తలనొప్పిగా మారింది. ఘటన జరిగి దాదాపు 40 రోజులు అయినా చోరీ అయిన వజ్రాలు, బంగారు ఆభరణాల ఆచూకీ ఇప్పటికీ పూర్తిగా లభ్యం కాలేదు. సాధారణ దోపిడీ కేసుల్లో కొద్ది రోజుల్లోనే సొత్తు రికవరీ అయ్యేవి, కానీ ఈ కేసు పూర్తి వ్యతిరేక దిశలో సాగుతోంది.

గ్యాంగ్‌స్టర్‌ సుబోధ్‌ సింగ్‌ అరెస్ట్‌..
ఈ దోపిడీ కేసులో కీలక నిందితుడిగా పోలీసులు గ్యాంగ్‌స్టర్‌ సుబో«ద్‌సింగ్‌ అని గుర్తించారు. ఇటీవలే అతడిని అరెస్టు చేసి కరీంనగర్‌కు తీసుకొచ్చారు. అతనితోపాటు ఇతర నిందితులు కూడా విచారణలో పరస్పరం విరుద్ధమైన వాదనలు చెబుతున్నారు. ఒకరు ఒక విషయం చెప్పగా, మరొకరు దానికి పూర్తి వ్యతిరేకంగా సమాధానాలు ఇవ్వడం పోలీసులను తీవ్ర గందరగోళంలో పడేస్తోంది. ఈ విరుద్ధ సమాధానాలు సహజమైనవా లేదా నిందితులు కావాలని పోలీసులను తప్పుదారి పట్టించడానికి చేస్తున్న వ్యూహాత్మక ప్రయత్నమా అనేది ప్రశ్నార్థకంగా మిగిలింది. గ్యాంగ్‌స్టర్‌ నేతృత్వంలోని ఈ బృందం ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి ముందుగానే సిద్ధమై ఉండవచ్చని పోలీసు వర్గాలు అనుమానిస్తున్నాయి.

క్లిష్టంగా మారిన దర్యాప్తు..
పీఎంజే కేసు దర్యాప్తు సాధారణ దొంగతనం కంటే చాలా క్లిష్టంగా మారింది. దోపిడీ జరిగిన వెంటనే సొత్తును వేర్వేరు చోట్లకు తరలించినట్లు పోలీసులు భావిస్తున్నారు. తర్వాత ఆభరణాలను కరిగించి వేరే రూపంలో మార్చడం లేదా ఇతర రాష్ట్రాలు, దేశాలకు పంపించడం జరిగి ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. నిందితుల మధ్య ఉన్న విరుద్ధ వాదనలు నిజమైన సమాచారాన్ని బయట పెట్టడం లేదు. సైంటిఫిక్‌ ఫారెన్సిక్‌ ఆధారాలు, సీసీటీవీ ఫుటేజ్‌ లోతైన విశ్లేషణ, ఇంటెలిజెన్స్‌ నెట్‌వర్క్, సాంకేతిక పర్యవేక్షణ వంటి అధునాతన పద్ధతులు తప్పనిసరి అవుతున్నాయి.

పోలీసులకు సవాల్‌..
ఈ కేసు పోలీసులకు తలనొప్పిగా మారింది. సుబోధ్‌ సింగ్‌ ఇప్పటికే అనేక ఇతర కేసుల్లో ప్రమేయం ఉన్న గ్యాంగ్‌స్టర్‌ కావడంతో దోపిడీ వెనుక పెద్ద నెట్‌వర్క్‌ ఉన్నట్లు సమాచారం. పోలీసులు ఇప్పుడు కేవలం నిందితుల వాదనలపైనే ఆధారపడకుండా మరింత లోతైన విచారణ జరపాల్సి ఉంది. సొత్తు రికవరీలో ఆలస్యం జరిగితే నేరస్తులకు ధైర్యం పెరిగి, ఇలాంటి భారీ దోపిడీలు మరింత పెరిగే ప్రమాదం ఉంది.

పోలీసులు ఈ విరుద్ధ సమాచారాలను అధిగమించి, నిజమైన సొత్తు ఆచూకీని త్వరగా గుర్తించి రికవరీ చేయగలరా అనేదే ఈ కేసులో అత్యంత కీలకమైన అంశం. దర్యాప్తు ఎంత సమర్థవంతంగా, ఎంత త్వరగా ముగుస్తుందో అనేది రాబోయే రోజుల్లో స్పష్టమవుతుంది.

అద్దంలో బట్టతల చూసుకొని బాధపడకండి.. ఈ దేవుడికి మొక్కితే జుట్టు గ్యారంటీ

Baldness Cure Temple Japan
Baldness Cure Temple Japan

Baldness Cure Temple Japan: శీర్షిక చదివి ఈ కాలంలో కూడా ఇలాంటివి జరుగుతాయా.. ఇంకా ఎక్కడున్నారు స్వామి.. స్మార్ట్ ఫోన్ యుగంలో దేవుళ్ళు.. జుట్టు అంటూ మాట్లాడుతున్నారు అనుకోకండి. ఎవరి నమ్మకాలు వారివి. ఇంతకీ బట్టతల మీద జుట్టు మొలిపించే ఆ దేవుడు ఎక్కడ ఉన్నాడు.. ఎలాంటి మొక్కులు మొక్కితే ఆ దేవుడు జుట్టును ప్రసాదిస్తాడు.. ఈ ప్రశ్నలకు సమాధానమే ఈ కథనం.

ప్రతిరోజు మనకు ఏదో ఒక సందర్భంలో బట్టతల ఉన్నవారు కనిపిస్తూనే ఉంటారు. వారు నిత్యం బాధపడుతూనే ఉంటారు. ఎందుకంటే జుట్టు ఉంటేనే ముఖం బాగుంటుంది. ఆ జుట్టు లేకపోతే విక్రమార్కుడు సినిమాలో మంత్రిగారి భార్య లాగా ఉంటుంది. బట్టతల చూసుకొని బాధపడేవారు.. దానిమీద జుట్టును రాబట్టడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. ఖరీదైన ఆయిల్స్ వాడుతుంటారు. వైద్యులను సంప్రదించి వేలకు వేలు ఖర్చు పెడుతుంటారు. అయినప్పటికీ అంతగా ఉపయోగముండదు.

బట్టతల మీద జుట్టు మొలిపించడానికి ఒక దేవుడున్నాడు. కాకపోతే ఆ దేవుడు మనదేశంలో లేడు. జపాన్ దేశంలో ఉన్నాడు. ఆశ్చర్యంగా ఉంది కాదు.. జపాన్ దేశంలోని క్యోటో నగరంలో ఉన్న మికామి అనే పుణ్యక్షేత్రానికి బట్టతల ఎక్కువగా ఉన్నవారు వెళుతూ ఉంటారు. ఆ ఆలయంలో దేవుడిని దర్శించుకుంటే జుట్టు వస్తుందని అక్కడ ప్రజలు నమ్ముతుంటారు. అక్కడ గుడిలో జరిగే పూజలు కూడా చాలా విచిత్రంగా ఉంటాయి.

ఆలయానికి వెళ్లేవారు ప్రత్యేకమైన కవర్ కొనుక్కుని వెళతారు. ఆలయంలో ఉండే పూజారులు భక్తుల జుట్టును కొంత కత్తిరిస్తారు. దాన్ని ఆ కవర్లో వేస్తారు. అ కవర్ ను భక్తులు అక్కడి దేవుడి వద్ద పెడతారు. ప్రార్థనలు చేస్తారు. అనంతరం ఆ కవర్ ను ఆలయంలోని పూజారులకు అందిస్తారు. ఇలా అనేక సందర్భాల్లో చేయడం ద్వారా కోల్పోయిన వెంట్రుకలు మళ్ళీ వస్తాయని.. వెంట్రుకలకు సంబంధించిన సమస్యలు మొత్తం పరిష్కారం అవుతాయని అక్కడి భక్తులు నమ్ముతుంటారు. దీని వెనుక కూడా ఒక చరిత్ర ఉంది. ఈ ఆలయంలో ఒక క్షురకుడు ఉండేవాడు. ఇతడిని జపాన్ దేశంలో తొలి హెయిర్ డ్రెస్సర్ అని పిలుస్తుంటారు. ఇతడు వృత్తినే దైవంగా భావించేవాడు. అందువల్లే ఆయన పేరు మీద ఈ ఆలయాన్ని నిర్మించారు. అతడు చనిపోయిన రోజు జపాన్ దేశంలో ఉన్న క్షురకులు ఇక్కడికి వచ్చి నివాళులు అర్పిస్తారు.

ఇదో వింత రెస్టారెంట్.. వాళ్లు పోస్తూ ఉంటారు.. మనం నాకుతూ ఉండాలి..

Weird Restaurant Concept
Weird Restaurant Concept

Weird Restaurant Concept: మామూలుగా మనం రెస్టారెంట్లకు వెళ్లినప్పుడు.. ముందుగా చేతులు కడుక్కొని రమ్మంటారు. ఆ తర్వాత టేబుల్ ముందు కూర్చుంటే.. మనం ఆర్డర్ చేసిన పదార్థాలను వండి తీసుకొస్తుంటారు. అయితే ఈ రెస్టారెంట్ మాత్రం పూర్తి విభిన్నం. ఇక్కడ జరిగేది కూడా వింతగా ఉంటుంది. విచిత్రంగా ఉంటుంది.

అక్కడ రెస్టారెంట్ కి వెళ్తే వెయిటర్లు స్పూన్లతో పద్ధతిగా వడ్డించరు. పోర్కులు ఇచ్చి తినమని చెప్పరు. అక్కడ అంతా విచిత్రంగా సాగుతూ ఉంటుంది. విభిన్నంగా ఉంటుంది. అమెరికాలోని ఎల్ సీయోలో అనే రెస్టారెంట్లో ప్రతిదీ వింతగానే ఉంటుంది. అక్కడికి వెళ్ళగానే వెయిటర్ వేడివేడిగా కరిగించిన చాక్లెట్ మొత్తాన్ని నేరుగా తినడానికి వచ్చిన వారి అరచేతుల్లో పోస్తాడు. దాన్నుంచి బయటపడే లోగా.. ఆ చాక్లెట్ మొత్తాన్ని చేతులకు రుద్దుకుంటూ నాకండి అంటూ చెబుతుంటాడు. చదువుతుంటే ఇదేం వింత రా బాబు అనుకున్నప్పటికీ.. అలా చేయాల్సిందే.

ఇలా మనం మన చేతులను నాక్కోవాలి అంటే కచ్చితంగా 26000 ఖర్చు పెట్టాలి. ఈ కాన్సెప్ట్ ను కొలంబియా దేశానికి చెందిన ప్రముఖ మాన్యుయల్ అందుబాటులోకి తీసుకొచ్చాడు. ఇతడు న్యూరో గ్యాస్ట్రోనమీ అనే విధానం ద్వారా దీనిని రూపొందించాడు. రెస్టారెంట్ కి వచ్చే వాళ్లకు కేవలం నాలుకకు మాత్రమే అనుభూతిని ఇవ్వకుండా.. ముక్కు, చర్మం వంటి వాటికి అనుభూతి ఇవ్వాలనే లక్ష్యంతో ఈ చాకో థెరపీని అందుబాటులోకి తీసుకొచ్చాడు.. చేతుల మీద చాక్లెట్ పోయగానే వచ్చే ఆ పరిమళం వెంటనే చిన్నతనంలో ఉన్న జ్ఞాపకాలను ఒకసారి గా గుర్తుకు తెస్తుంది. కేవలం చాక్లెట్ కోసం మాత్రమే అక్కడ 26,000 వసూలు చేయడం లేదు. ఇక్కడ ది ఎక్స్పీరియన్స్ మెనూ అనేది ఒకటి ఉంటుంది. ఇందులో దాదాపు 22 రకాల వంటకాలు ఉంటాయి. వాటి మొత్తాన్ని కస్టమర్లకు వడ్డిస్తుంటారు. అందులో ఒక వంటకమే చాక్లెట్ థెరపీ.. ఇది కూడా ఒక కోర్స్ లాంటిది అన్నమాట.

ఇంత ఖరీదు ఉన్నప్పటికీ చాలామంది ఈ రెస్టారెంట్ కు వచ్చేస్తున్నారు. చాక్లెట్ కి ద్రవాన్ని లొట్టలు వేసుకుంటూ తాగుతున్నారు. అమెరికాలో రకరకాల చాక్లెట్లు అందుబాటులో ఉంటాయి. అవన్నీ కూడా రకరకాల రుచులను కలిగి ఉంటాయి. కస్టమర్లను ఆకట్టుకోవడానికి ఈ విధమైన పద్ధతిని ఇక్కడ ప్రవేశపెట్టారని వార్తలు వస్తున్నాయి. డబ్బు సంగతి ఎలా ఉన్నప్పటికీ చాక్లెట్ ను నాకడానికి చాలామంది వస్తున్నారు. ఈ హోటల్ విపరీతంగా లాభాలు సొంతం చేసుకోవడానికి చాక్లెట్ థెరపీ ప్రధాన కారణమని ఇక్కడి వ్యాపార వర్గాలు చెబుతున్నాయి.

 

 

https://www.youtube.com/shorts/QWHvaNPFAos?feature=share

టిడిపికి మరో గవర్నర్ పోస్ట్.. ఛాన్స్ ఆయనకే!

TDP
TDP

TDP Governor Post News: మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ మూడోసారి అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతోంది. ఎన్నెన్నో రికార్డులను సొంతం చేసుకున్నారు నరేంద్ర మోడీ. పుష్కరకాలం వరుసగా ప్రధాని బాధ్యతలు చేపట్టి జవహర్లాల్ నెహ్రూ పేరుతో ఉన్న రికార్డును సొంతం చేసుకున్నారు. అందుకే 2029 సార్వత్రిక ఎన్నికలపై కూడా ఫుల్ ఫోకస్ పెట్టారు. అందులో భాగంగా నిన్ననే ఢిల్లీలో ఎన్డీఏ పక్ష సమావేశం జరిగింది. ఎన్డీఏ భాగస్వామ్యులుగా ఉన్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. పుష్కరకాలం ప్రధానిగా చేసిన నరేంద్ర మోడీ అభినందన తీర్మానం ప్రవేశపెట్టే ఛాన్స్ దక్కించుకున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. అయితే ఈ సమావేశంలో 2029 ఎన్నికల రూట్ మ్యాప్ తయారు చేయాలని నిర్ణయించారు. ఎన్డీఏలో భాగస్వామ్య పార్టీల ఆశలు,, ఆకాంక్షలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలని కేంద్ర పెద్దలు డిసైడ్ అయ్యారు.

* కేంద్రంలో కీలక భాగస్వామి..
ప్రధానంగా ఏపీలో భాగస్వామ్య పార్టీగా ఉన్న తెలుగు దేశానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చేందుకు కేంద్ర పెద్దలు సుముఖంగా ఉన్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రయోజనాలకు పెద్ద పీట వేస్తూ పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తున్నారు. మరోవైపు రాజకీయంగాను ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి రెండు కేంద్రమంత్రి పదవులను ఇచ్చారు. గవర్నర్ గా అశోక్ గజపతి రాజును ఎంపిక చేశారు. గోవా గవర్నర్ గా నియమించారు. అయితే టిడిపికి ఇప్పుడు మరో కేంద్ర మంత్రి పదవితో పాటు గవర్నర్ పోస్ట్ కేటాయిస్తారని పొలిటికల్ వర్గాల్లో ఒక ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే సీనియర్ నేతలు చాలామంది పదవుల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. వారిలో ఒకరికి గవర్నర్ పోస్ట్ కేటాయించే ఛాన్స్ కనిపిస్తోంది. గతంలో కేంద్రంలో కీలక భాగస్వామిగా ఉండేది టిడిపి. కానీ ఆ సమయంలో గవర్నర్ పోస్ట్ కేటాయింపు అనేది జరగలేదు. ఈసారి ఎన్డీఏ వచ్చిన తర్వాత వరుసగా పదవులు వచ్చి పడుతున్నాయి.

* యనమల లేదా వర్ల..
టిడిపికి గవర్నర్ పోస్ట్ ఇస్తే ఎవరికీ కేటాయిస్తారని ప్రశ్న ఇప్పుడు ఎదురవుతోంది. ప్రధానంగా పార్టీలో సీనియర్లుగా ఉన్న యనమల రామకృష్ణుడు, వర్ల రామయ్య పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. మొన్న రాజ్యసభ ఆశావహులు ఇద్దరు. పదవులు ఆశించారు కానీ వివిధ సమీకరణలో భాగంగా వీరికి ఛాన్స్ దక్కలేదు. పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తూ వచ్చారు యనమల. ఆయన అన్ని రకాల పదవులు చేశారు కానీ ఎంపీ కాలేదు. పెద్దల సభకు ఎంపిక చేయడం ద్వారా కేంద్ర రాజకీయాలను కూడా చూడాలన్నది ఆయన ఆశ. బీసీ సామాజిక వర్గానికి చెందిన ఆయనకు గవర్నర్ పోస్ట్ కేటాయించే ఛాన్స్ కనిపిస్తోంది. మరోవైపు వర్ల రామయ్య సైతం సీనియర్ మోస్ట్ లీడర్. పలుమార్లు రాజ్యసభ పదవి కోసం ఆయన పేరు తెరపైకి వచ్చేది. అయితే ఆయన ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవారు. గవర్నర్ పోస్ట్ కేటాయించే ఛాన్స్ ఉంది. అయితే ఈ ఇద్దరిలో యనమలకు గవర్నర్, రామయ్యకు రాజ్యసభ పదవి ఇస్తారని పొలిటికల్ వర్గాల్లో టాక్ ఉంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

ట్టులో నుంచి తొలగించారు.. కళ్ల వెంట నీళ్లు వచ్చాయి.. శ్రేయస్ అయ్యర్ ఇంతటి బాధను మోశాడా

Shreyas Iyer replaces Suryakumar Yadav
Shreyas Iyer replaces Suryakumar Yadav

Shreyas Iyer captaincy : సూర్య కుమార్ యాదవ్ ను పక్కన పెట్టి, హార్ధిక్ పాండ్యాను లెక్కలోకి తీసుకోకుండా, గిల్ ను పరిగణలోకి తీసుకోకుండా మేనేజ్మెంట్ టీమిండియా టీ20 ఫార్మాట్ లోకి సారథిగా శ్రేయస్ అయ్యర్ ను ఎంపిక చేసింది. ఇంగ్లాండ్, ఐర్లాండ్ టూర్లకు అతడే సారథిగా ఉంటాడని ప్రకటించింది. మేనేజ్మెంట్ నిర్ణయం సూర్యకుమార్ యాదవ్,అతడి అభిమానులకు ఇబ్బంది కలిగించింది. శ్రేయస్ అయ్యర్ అభిమానులకు, పంజాబ్ జట్టు అభిమానులకు ఆనందాన్ని కలిగించింది.

అయ్యర్ కొంతకాలంగా స్థిరమైన ప్రదర్శన చేస్తున్నాడు. గతంలో ఐపీఎల్ లో ఢిల్లీ జట్టును ఫైనల్ దాకా తీసుకెళ్లాడు. కోల్ కతా జట్టును 2024లో విజేతగా చేశాడు. 2025 లో పంజాబ్ జట్టును ఫైనల్ దాకా తీసుకెళ్లాడు. ఈసారి సీజన్ లో పంజాబ్ జట్టును మొదట్లో పాయింట్లపట్టికలో మొదటి స్థానంలో కొనసాగేలా చేశాడు. ఆ తర్వాత పంజాబ్ జట్టు వరుస ఓటములు ఎదుర్కొని గ్రూప్ దశ నుంచే వెళ్లిపోయింది. పంజాబ్ జట్టు ఫైనల్ దాకా వెళ్లలేకపోయినప్పటికీ అయ్యర్ కు మాత్రం ఇండియా జట్టుకు సారథి అయ్యే లక్ మాత్రం దక్కింది.

అయ్యర్ కెప్టెన్ అయిన తర్వాత అతడి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అతడు గతంలో టీమండియాలో సెంట్రల్ కాంట్రాక్ట్ ను కోల్పోయాడు. ఆ సమయంలో అతడు తీవ్రమైన విమర్శలు ఎదుర్కొన్నాడు. ఒకదశలో అతడికి సరైన స్థాయిలో అవకాశాలు రాలేదు. దీంతో అతడు నిరాశ పడలేదు. పోగొట్టుకున్న చోట వెతుక్కోవాలి అనుకున్నాడు. జాతీయ టోర్నీలలో అదరగొట్టాడు. ఆటగాడిగా, సారథిగా సత్తా చూపించాడు. ఐపీఎల్ కూడా దుమ్ము రేపాడు. దీంతో మేనేజ్మెంట్ అతడికి అవకాశం కల్పించింది.

కెప్టెన్ అయిన తర్వాత అయ్యర్ ఓ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యు లో పాల్గొన్నాడు. ఈసందర్భంగా తన క్రీడా జీవితంలో చోటు చేసుకున్న పరిణామాల పై మాట్లాడాడు. ‘భారత జట్టుకు నాయకత్వ బాధ్యతను అప్పగించినందుకు సంతోషంగా ఉన్నాను. కానీ, ఈస్థాయికి చేరుకోవడానికి చాలా పోరాటం చేయాల్సి వచ్చింది. కఠోర శ్రమ కు పాల్పడాల్సి వచ్చింది. రెండు ఏళ్ల క్రితం సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తొలగించారు. నాడు నన్ను నేను నిరూపించుకోవాలని అనుకున్నాను. మొత్తానికి నిరూపించుకున్నాను. నేను కెప్టెన్ అయిన తర్వాత మొదటి సారి వీడియోకాల్ చేశాను. నా తల్లిదండ్రులు కన్నీరు పెట్టుకున్నారు. నేను కూడా భావోద్వేగానికి గురయ్యాను.ఇప్పుడు నా ముందు పెద్ద బాధ్యత ఉంది. భారత్ ను ముందువరసలో నిలపడమే నా బాధ్యత అని’ అయ్యర్ వ్యాఖ్యానించాడు.