Lenin Release Date: ‘ఏజెంట్’ వంటి భారీ డిజాస్టర్ ఫ్లాప్ తర్వాత , బాగా గ్యాప్ తీసుకున్న అఖిల్, ‘లెనిన్’ చిత్రం తో ఈ నెల 25 న మన ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా పై అక్కినేని ఫ్యాన్స్ లో బోలెడన్ని ఆశలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటి వరకు విడుదల చేసిన ప్రతీ కంటెంట్ చాలా ప్రామిసింగ్ గా అనిపిస్తున్నాయి. అంతే కాకుండా అఖిల్ ఈ చిత్రం లో చాలా అద్భుతంగా నటించాడని , ముఖ్యంగా సెకండ్ హాఫ్ అదిరిపోయిందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. మొత్తానికి అఖిల్ ఈ సినిమాతో మొట్టమొదటి బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకోబోతున్నాడని, ఇక్కడి నుండి ఆయన వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే ఉండదని అంటున్నారు. అలాంటి సినిమా ఇప్పటికే ఒకసారి వాయిదా పడింది. ఇప్పుడు మరోసారి వాయిదా పడింది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
ముందుగా ఈ చిత్రాన్ని మే డే సందర్భంగా ‘మే 1’ న విడుదల చేద్దామని అనుకున్నారు. కానీ ఏప్రిల్ 30 న ‘పెద్ది’ చిత్రం విడుదల కాబోతుందని అప్పటికే ఆ చిత్ర మేకర్స్ అధికారిక ప్రకటన చేయడం తో , అఖిల్ కి రామ్ చరణ్ తో ఉన్నటువంటి అనుబంధానికి విలువ ని ఇస్తూ, మా ‘లెనిన్’ చిత్రాన్ని జూన్ 25 కి వాయిదా వేస్తున్నట్టు చెప్పుకొచ్చారు నిర్మాతలు. కానీ అసలు నిజం అది కాదు, సినిమా ఇంకా పూర్తి కాకపోవడం వల్లే వాయిదా పడిందని ఇప్పుడు అర్థం అవుతోంది. ట్రేడ్ నుండి అందుతున్న సమాచారం ఏమిటంటే ఈ సినిమా జూన్ 25 న కూడా విడుదల కావడం లేదట. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ బాగా సమయం తీసుకుంటుందని , కొన్ని VFX షాట్స్ డెలివరీ అవ్వాల్సిన అవసరం ఉందని , ఇప్పటి వరకు అవి డెలివరీ అవ్వలేదని అంటున్నారు.
అంతే కాకుండా ఎడిటింగ్ వర్క్ కూడా ఇంకా పూర్తి అవ్వలేదట. కేవలం ఫస్ట్ హాఫ్ ని మాత్రమే ఇప్పటి వరకు లాక్ చేసినట్టు సమాచారం. రీ రికార్డింగ్ వర్క్ కూడా చాలా వరకు బ్యాలన్స్ ఉందట. అందుకే ఈ చిత్రాన్ని జులై కి వాయిదా వేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత నాగవంశీ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తుండగా , అక్కినేని నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్ కూడా నిర్మాణం లో భాగం పంచుకుంది. ముందుగా ఈ చిత్రంలో హీరోయిన్ పాత్ర కోసం శ్రీలీల ని తీసుకున్నారు. కానీ ఆమె తప్పుకోవడం తో , ఆమె స్థానంలోకి భాగ్యశ్రీ ని తీసుకున్నారు. ఈ చిత్రం లో అఖిల్ గుడ్డివాడిగా నటించబోతున్నాడని టాక్.




















డబ్బుకు విలువుండదు... ఎన్ని కోట్లు సంపాదించి ఏం లాభం.. ప్రపంచ కుబేరుడి జోష్యం!
Elon Musk Prediction: ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల్లో ఒకరు ఎలాన్ మస్క్. త్వరలోనే మొదటి ట్రిలియనీర్గా (సుమారు రూ. కోటి కోట్ల విలువ గల ఆస్తి) అవతరించేందుకు చాలా దగ్గరగా ఉన్నారు. టెస్లా, స్పేస్ఎక్స్, ఎక్స్ వంటి కంపెనీల ద్వారా ఆయన సంపాదించిన ఆస్తి విలువ రోజురోజుకు పెరుగుతోంది. అయితే ఈ గొప్ప సంపదను సాధించిన మస్క్, డబ్బు గురించి చాలా ఆసక్తికరమైన, భవిష్యత్తును సూచించే వ్యాఖ్యలు చేశారు.
డబ్బుకు విలువ ఉండదట..
రానున్న రోజుల్లో డబ్బుకు ఇప్పటి విలువ ఉండదని మస్క్ పేర్కొన్నారు. కారణం కృత్రిమ మేధస్సు(ఏఐ), రోబోలు అనేక రకాల వస్తువులను సులభంగా తయారు చేస్తాయని తెలిపారు. అవి మనుషులు చేసే అనేక సేవలను కూడా అందిస్తాయని వెల్లడించారు. ఫలితంగా మనుషులకు చేయడానికి పనులు తగ్గిపోతాయని పేర్కొన్నారు. ఈ పరిస్థితిలో ప్రభుత్వాలు ప్రజలకు నేరుగా డబ్బు ఇవ్వవలసి వస్తుందని జోష్యం చెప్పారు. పని చేయకుండానే ఆదాయం వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో పని, ఆదాయం, డబ్బు అనే మౌలిక భావనలు పూర్తిగా మారిపోతాయని అంచనా వేశారు.
ఏఐ, రోబోలతో ఆర్థిక విప్లవం..
మస్క్ చెప్పిన ఈ దృశ్యం ఒక కొత్త ఆర్థిక వ్యవస్థను సూచిస్తోంది. ప్రస్తుతం మనం చూస్తున్నట్లు పని చేసి డబ్బు సంపాదించడం, ఆ డబ్బుతో వస్తువులు కొనడం అనే చక్రం మారిపోతుంది. ఏఐ, రోబోలు ఉత్పత్తి చేసే వస్తువులు, సేవలు చాలా సులభంగా, తక్కువ ఖర్చుతో అందుబాటులోకి వస్తాయి. దీంతో వస్తువుల కొరత తగ్గి, సమృద్ధి పెరుగుతుంది. దీంతో డబ్బు అనే విలువ క్రమంగా తగ్గిపోతుందని మస్క్ భావిస్తున్నారు.
భవిష్యత్ ఆర్థిక వ్యవస్థ ట్రాష్..
ఎలాన్ మస్క్ ఇలా చెప్పడం ఆయన సాధారణ ఆలోచన కాదు. ప్రపంచంలో అత్యంత ధనవంతుల్లో ఒకరైన ఆయనే డబ్బుకు విలువ లేని రోజులు రానున్నాయని చెప్పడం ఆసక్తికరం. ఇది ఒక విధంగా పోస్ట్–స్కార్సిటీ ఎకానమీ (కొరత లేని ఆర్థిక వ్యవస్థ) గురించి ఆయన చేస్తున్న అంచనా. ఏఐ, ఆటోమేషన్ వల్ల మనుషులు చేసే పనులు తగ్గిపోతాయని చాలా మంది నిపుణులు అంగీకరిస్తున్నారు. ఈ పరిస్థితిలో యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ అనే భావన ప్రపంచవ్యాప్తంగా చర్చలో ఉంది. ప్రభుత్వాలు ప్రతి పౌరుడికి నెలవారీగా కొంత డబ్బు ఇవ్వడం ద్వారా ప్రజలు ఆర్థికంగా భద్రంగా ఉండేలా చూడాలని మస్క్ కూడా ఇంతకు ముందు చెప్పారు. అయితే ఇది కేవలం సానుకూల వైపు మాత్రమే కాదు. పని లేకపోతే మనుషులకు జీవితంలో ఉత్సాహం తగ్గిపోతాయని కొందరు భయపడుతున్నారు. మరోవైపు, ఏఐ వల్ల వచ్చే సమృద్ధిని సరిగ్గా పంపిణీ చేయగలిగితే మానవజాతి మరింత సుఖంగా జీవించే అవకాశం ఉంది.
మస్క్ చేసిన ఈ వ్యాఖ్యలు ఒక వైపు ఆయన టెక్నాలజీపై ఉన్న నమ్మకాన్ని చెబుతున్నాయి. మరోవైపు, భవిష్యత్తులో సంపద, విలువ, పని అనే భావనలు పూర్తిగా మారిపోతాయని సూచిస్తున్నాయి. ట్రిలియనీర్ అవ్వబోయే వ్యక్తి కూడా డబ్బు అనేది శాశ్వతం కాదని, భవిష్యత్తులో దాని ప్రాధాన్యత తగ్గిపోతుందని చెప్పడం ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం.